English | Telugu

అజిత్‌, ధ‌నుష్ కాంబో సినిమా... ప‌ట్టాలెక్క‌లేదా?

కొన్ని కాంబినేష‌న్ల గురించి విన‌డం కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి కాంబో అజిత్ అండ్ ధ‌నుష్‌. వీరిద్ద‌రితో సినిమా చేయాల‌ని సెల్వ‌రాఘ‌వ‌న్ అనుకున్నార‌ట‌. ఈ మూవీలో ఓ స్పెష‌ల్ రోల్ కోసం న‌టుడు ప్రేమిస్తే భ‌ర‌త్‌ని కూడా అడిగార‌ట‌. ఇంత‌క‌న్నా గొప్ప అవ‌కాశం ఎక్క‌డొస్తుంద‌ని వెంట‌నే ఓకే చెప్పేశార‌ట భ‌ర‌త్‌. అయితే సినిమా ప్రారంభం కావ‌డానికి ముందే ఆగిపోయిన‌ట్టు స‌మాచారం.
అజిత్‌, ధ‌నుష్ ఇద్ద‌రూ త‌మిళ‌నాడులో చాలా పాపుల‌ర్ హీరోలు. అక్క‌డ ఇద్ద‌రు హీరోలు క‌లిసి సినిమాలు చేసే సంస్కృతి ఇప్పుడైతే లేదు. అయితే అది నెర‌వేరితే బావుంటుంద‌ని అనుకున్నార‌ట సెల్వ‌రాఘ‌వ‌న్‌. దీని గురించి న‌టుడు భ‌ర‌త్ మాట్లాడారు. ``సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డ‌మంటే క్లాసుల‌కు వెళ్లిన‌ట్టే. చాలా విష‌యాలు నేర్చుకోవ‌చ్చు. అలా నేర్చుకునే అవ‌కాశం దొరికింద‌ని అనుకున్నాను. అందులో సెట్లో అజిత్‌, ధ‌నుష్ ఉంటే త‌ప్ప‌కుండా చాలా విష‌యాలు తెలుసుకోవ‌చ్చ‌ని భావించాను. కానీ ఆ సినిమా మెటీరియ‌లైజ్ కాలేదు`` అని అన్నారు.
అజిత్ తో మాత్ర‌మే కాదు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, విజ‌య్‌తోనూ చాలా స్క్రిప్టులు డిస్క‌స్ చేశారు సెల్వ‌రాఘ‌వ‌న్‌. అయితే అవేమీ మెటీరియ‌లైజ్ కాలేదు. మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ఆ మాటంటే సెల్వ‌రాఘ‌వ‌న్ ఒప్పుకోరు. ``నా దృష్టిలో సినిమాకు పూజ చేసి, మొద‌లుపెట్టి, షెడ్యూళ్లు కూడా పూర్త‌య్యాక ఆగిపోతే ఆగిపోయిన‌ట్టు. మాట‌ల్లో ఉన్న సినిమా ఆగిపోయింద‌ని ఎవ‌రైనా ఎలా అంటారు? అలా అన్నా నేను ఊరుకుంటానా? `` అని అంటారు సెల్వ‌రాఘ‌వ‌న్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .