English | Telugu

హీరోల క్రేజ్‌కు ఆహా సర్వర్లు క్రాష్!

తాజాగా ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంద‌ర్బంగా ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ప్రభాస్ ఎపిసోడ్ కు ఆహా స‌ర్వ‌ర్లు క్రాష్ అయ్యాయి. మరి పవన్ ఎపిసోడ్‌కు సర్వర్లు క్రాష్ అవుతాయా లేదా అని అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కు యాప్ క్రాష్ కావడం కొలమానంగా మారింది. ఆహా మ‌రోసారి స‌ర్వ‌ర్ క్రాష్ అయితే ప్రభాస్ కన్నా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని లేదంటే కాదని కొంద‌రు ట్వీట్లు పోస్ట్ చేశారు. కానీ ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ కూడా సర్వర్లు క్రాష్‌ అయ్యాయి. మరోవైపు ఇంకొంతమంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఈ ర‌చ్చ‌లోకి మ‌హేష్ బాబును కూడా లాగారు. మొద‌టి సీజ‌న్లో మ‌హేష్ ఎపిసోడ్ సంద‌ర్బంగా సర్వ‌ర్లు క్రాష్ కాలేద‌ని కామెంట్లు పెట్టారు. తొలి సీజన్‌లో ఆయన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయినప్పుడు సర్వర్లు అసలు క్రాషే కాలేదు అంతా సాఫీగా సాగింది. దీంతో మహేష్ అభిమానుల సంఖ్య తక్కువ అని కామెంట్ పెట్టారు.

మొత్తానికి మహేష్ కన్నా ప్రభాస్, పవన్ అభిమానులు ఎక్కువ అంటూ ప్రచారం చేశారు. ఆహా టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మళ్లీ అదే జరిగింది. సర్వర్లు క్రాష్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆహా లోకి అందుబాటులోకి రావడమే ఆలస్యం ఒక్కసారిగా ఫ్యాన్స్ పైరసీ రాయిడ్లు ఆహా లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆహాకు సంబంధించిన పది స‌ర్వ‌ర్లు క్రాష్ అయ్యాయి. ఆహా ఈ సమస్యను మొదటగా ప్రభాస్ ఎపిసోడ్ స్క్రీనింగ్ సమయంలో ఎదుర్కొంది. ఎపిసోడ్ స్క్రీనింగ్ మొదలైనప్పుడు ప్రభాస్ అభిమానుల తాకిడికి ఆహా యాప్ కొన్ని గంటలపాటు క్రాష్ అయింది. సర్వర్లు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపిసోడ్ కోసం తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఎగబడి ఎదురు చూస్తారన్న సంగతి తెలిసిందే.

దీంతో ఆహా టీం సర్వర్ క్రాష్ భయం మరోసారి వెంటాడింది. దీంతో ముందు జాగ్రత్తగా మళ్ళీ క్రాష్ సమస్య త‌లెత్త‌కుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. బ్యాక్అప్ సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేసింది. అయితే ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత పవన్ ఫ్యాన్ ముందు ఇవేమీ పనిచేయలేదు. అభిమానులు తాకిడికి సర్వర్లు క్రాష్ అయ్యాయి. కానీ అంతకుముందుతో పోలిస్తే జాగ్రత్త చ‌ర్య‌లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈసారి అది అంత‌గా ప్రభావం చూపలేదు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.