English | Telugu

స‌మంత‌ను ఫాలో అవుతున్న కియారా... సోష‌ల్ మీడియాలో అలా చేశారా?

బాలీవుడ్ యాక్ట‌ర్స్ కియారా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా చేసిన ప‌నికి ఇప్పుడు నెట్టింట్లో గ‌ట్టిగా వైర‌ల్ అవుతున్నారు. వైర‌ల్ న్యూస్ అన‌గానే అదేదో చెడుగా అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. పాజిటివ్‌గానే. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్‌లో డీపీల‌ను మార్చారు. అది కూడా ఇద్ద‌రూ పెళ్లి ఫొటోల‌ను షేర్ చేశారు. ఒక‌రికొక‌రు న‌మస్కారం చేసుకుంటున్న‌ట్టు ఉన్న ఫొటోల‌ను సిద్ధార్థ్ షేర్ చేయ‌గా, త‌న బుగ్గ‌పై సిద్ ముద్దు పెడుతున్న‌ట్టున్న ఫొటోల‌ను కియారా షేర్ చేశారు. షేర్‌షా సినిమాలో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రూ ఫిబ్ర‌వ‌రి 7న జైస‌ల్మేర్‌లోని సూర్య‌ఘ‌డ్ ప్యాల‌స్‌లో మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. బాలీవుడ్ సెల‌బ్రిటీలు క‌ర‌ణ్‌జోహార్,మ‌నీష్ మ‌ల్హోత్రా, జూహీ చావ్లా, షాహిద్ క‌పూర్‌, పృథ్విరాజ్ సుకుమారన్ క‌పుల్ తో పాటు ప‌లువురు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. పెళ్లికి వెళ్ల‌లేక‌పోయినందుకు బాధ‌ప‌డుతూ సారీ చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఉపాస‌న కొణిదెల కామినేని.

పెళ్లి త‌ర్వాత సిద్ కియారా కలిసి ఢిల్లీలో పార్టీ ఇచ్చారు. ఆదివారం ముంబైలో రిసెప్ష‌న్ ఇచ్చారు. ఇద్ద‌రూ క‌లిసి కొత్త‌గా ముంబైలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యారు. సిద్ధార్థ్ ఇటీవ‌ల మిష‌న్ మ‌జ్ను సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న నాయిక‌గా నటించారు. కియారా అద్వానీ చేతిలో నార్త్ ప్రాజెక్టుల‌తో పాటు ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆల్రెడీ రామ్‌చ‌ర‌ణ్ తో క‌లిసి విన‌య‌విధేయ‌రామాలో న‌టించారు కియారా. అయితే ఆ సినిమా పెద్ద‌గా ఆడలేదు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో న‌టిస్తున్న ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వాల‌ని, శంక‌ర్ హీరోయిన్‌గా సౌత్‌లో జండా పాతాల‌ని అనుకుంటున్నారు భ‌ర‌త్ అనే నేను హీరోయిన్‌. అన్న‌ట్టు నాగ‌చైత‌న్య‌తో పెళ్లయిన వెంట‌నే స‌మంత కూడా ముందు ఇన్‌స్టాలోనే పేరు మార్చుకున్నారు. ఇప్పుడు కియారా కూడా ఇన్‌స్టా డీపీ మార్చారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.