English | Telugu

నటి జియాఖాన్ తల్లిపై 100 కోట్ల పరువు నష్టం దావా



అనుమానాస్పద రీతిలో బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లి రబియా ఖాన్ జియా ఖాన్ మృతి హత్యేనంటూ హైకోర్టులో కేసు వేసి, సిబిఐ విచారణ కావలసిందిగా కోరింది. ఇటీవలే ఈ కేసు సిబిఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో జియాఖాన్ తల్లి రబియా పై ఆదిత్య పాంచోలి 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. జియాఖాన్ కేసులో ఆదిత్య పాంచోలి కొడుకు సూరజ్ ఆలోపణలు ఎదుర్కుంటున్నారు. రబియా ట్విట్లర్లో తమపై అమర్యాద పూర్వకమైన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ లో తమ గౌరవానికి భంగం కలిగిస్తోంది పాంచోలీ కుటుంబం ఈ పిటీషన్లో ఆరోపించింది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .