English | Telugu

బాహుబలి ఖాతాలో కొత్త రికార్డు


రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి' చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తునే వుంది. ఇప్పుడు ఈ చిత్రనికి సంబంధించిన తాజా కబురు టాలీవుడ్ అంతట సంచలనంగా మారింది. 'బాహుబలి చిత్రం ఒకటవ భాగం పంపిణీ హక్కులు అత్యధిక రేటుకు దిల్ రాజు సొంతం చేసుకున్నారని వినికిడి. కేవలం నైజాం హక్కుల్ని సుమారు 25 కోట్ల రూపాయలు చెల్లించి ఆయన సొంతం చేసుకున్నారట. ఇలా ఒక ప్రాంతం హక్కులకు ఇంత భారీ మొత్తం చెల్లించడం టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి అంటున్నారు.

హాలీవుడ్, బాలీవుడు, కాలీవుడ్ ఇలా ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్న బాహుబలి ప్రాజెక్టు గురించి భారీ అంచనాలున్నాయనే విషయం చెప్పవలసిన పనిలేదు. ఆ అంచనాలకు తగిన విధంగా స్పందన కూడా వుంటుందని ధీమగా వున్నారట దిల్ రాజు. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి చిత్రం మొదటి భాగం 2015లో విడుదలకు సిద్దమవుతోంది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా లాంటి తారాగణంతో, భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ తో రూపొందుతోంది ఈ చిత్రం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.