English | Telugu

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న న‌టి రోహిణి

ప్ర‌స్తుతం తెలుగు సినిమాల్లో అమ్మ‌, అత్త వంటి క్యారెక్ట‌ర్స్‌తో న‌టిగా ఆక‌ట్టుకుంటోన్న సీనియ‌ర్ యాక్ట్రెస్‌ల్లో రోహిణి ఒక‌రు. అంతే కాదండోయ్ ఆమె మంచి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే మ‌రో వైపు రోహిణిలో మంచి ద‌ర్శ‌కురాలు కూడా ఉంది. 18 ఏళ్ల ముందు అంటే 2005లో చిన్ని చిన్ని ఆశై అనే మూవీని రోహిణి డైరెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఓ డాక్యుమెంట‌రీ చిత్రాన్ని కూడా ఆమె తెర‌కెక్కించారు. త‌ర్వాత ఎందుక‌నో మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత రోహిణి మ‌రోసారి యాక్ష‌న్, క‌ట్ చెప్ప‌టానికి రెడీ అవుతున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం.

మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌లు మేర‌కు రోహిణి కొన్ని యథార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. రీసెంట్ టైమ్‌లో ఇలా రియ‌ల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించ‌టం అనేది మ‌నం చూస్తూనే ఉన్నాం. రియల్ ఇన్సిడెంట్స్‌కు కాస్త క‌ల్పితాల‌ను జోడించి సినిమాల‌ను తెర‌కెక్కించ‌టం మ‌న మేక‌ర్స్‌కు అల‌వాటే. జై భీమ్‌, శూర‌రై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవ‌లోకే వ‌స్తాయి. ఇప్పుడ‌లాగే రోహిణి సైతం నిజ ఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని సినిమా చేయ‌బోతున్నారు. రోహిణి డైరెక్ష‌న్ చేయ‌బోయే సినిమాకు రైట‌ర్ ఆద‌వ‌న్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. జై భీమ్ ఫేమ్ లిజో మోల్ జోస్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

అలా మొద‌లైంది స‌హా ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌ర్ న‌టిగా రోహిణి త‌న‌దైన న‌టన‌తో అల‌రించింది. సీనియ‌ర్ దివంగ‌త న‌టుడు ర‌ఘ‌వ‌ర‌న్‌ను వివాహం చేసుకున్న రోహిణి ఇప్ప‌టికీ త‌న భ‌ర్త‌ను త‌లుచుకుని ఆయ‌న ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తుంటుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.