English | Telugu

తెలుగు చిత్ర‌సీమ‌పై ప్ర‌కాష్ రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

69వ జాతీయ అవార్డుల వేడుక‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. 69వ ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో ఇంత‌కు ముందు ఎవ‌రూ సాధించ‌ని ఘ‌న‌త‌ను బ‌న్ని సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా ఢిల్లీలో అల్లు అర్జున్ వెళ్లి రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీక‌రించారు. హైద‌రాబాద్ చేరుకున్న ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. పుష్ప ది రైజ్ సినిమాలో బ‌న్ని న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ‌న‌టుడుగా అవార్డు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఘ‌నంగా సెలబ్రేష‌న్స్‌ను నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఈ సెల‌బ్రేష‌న్స్‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సైతం పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలను చేశారు. ఇంతకీ ఆయనేమన్నారంటే ‘‘అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకోవ‌టం అనేది చిత్ర ప‌రిశ్ర‌మ ఎంతో గ‌ర్వించాలి. పాతికేళ్ల ముందు అంతఃపురం చిత్రానికి నాకు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ద‌క్కింది. మ‌ళ్లీ ఇప్పుడు అవార్డు రావ‌టం ఆనందించాల్సిన విష‌యం. అయితే ఇంత పెద్ద సాధన సాధించిన త‌ర్వాత తెలుగు చిత్ర సీమ ఎందుకు క‌లిసి రావ‌టం లేదు. బ‌న్నికి అవార్డ్ రావ‌టం అంటే తెలుగు న‌టీన‌టులంద‌రూ గ‌ర్వించాల్సిన విషయం. అలాగే రాజ‌మౌళి తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు. అందులో ప‌ని చేసినా, చేయ‌క‌పోయినా మ‌నం గ‌ర్వ‌ప‌డాల్సిన విషయం.

అలాగే దేవిశ్రీ ప్ర‌సాద్‌కు అవార్డ్ గ‌ర్వించాల్సిన విష‌యం. కానీ ఎందుక‌నో మ‌నం శ్లాఘించ‌టం అనే విష‌యాన్ని మ‌ర‌చిపోయాం. బ‌న్నీతో గంగోత్రి చేస్తున్న‌ప్పుడు త‌ను గొప్ప న‌టుడ‌వుతాడ‌నే విష‌యాన్ని నేను అర‌వింద్‌గారికి చెప్పాను. త‌ను ఊర‌క‌నే గొప్ప స్థాయికి రాలేదు. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న‌కు అవార్డు రావ‌టం చూస్తుంటే నా కొడుక్కి వ‌చ్చిన‌ట్లు అనిపించింది. ఈరోజు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇది మ‌నమంద‌రం గ‌ర్వ‌ప‌డాల్సిన క్ష‌ణాలు. స‌రిహ‌ద్దులు దాటేస్తున్నప్పుడు మ‌న ఇంట్లో వాళ్ల‌ను మ‌న‌మే గౌర‌వించుకోవాలి. దాన్ని అంద‌రం సెల‌బ్రేట్ చేసుకోవాలి’’ అన్నారు ప్రకాష్ రాజ్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.