English | Telugu

హీరోగా మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయమై తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూర్య ఎంట్రీకి సంబంధించిన సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ సినిమా పేరు ‘ఫీనిక్స్‌’. ఈ సినిమా తమిళ్‌లో తెరకెక్కనుంది. ఎన్నో సినిమాలో తన యాక్షన్‌ సీక్వెన్స్‌లతో థ్రిల్‌ చేసిన యాక్షన్‌ డైరెక్టర్‌ అనల్‌ అరసు ఈ చిత్రానికి దర్శకుడు. సూర్య ఛైల్డ్‌ ఆర్టిస్టుగా ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’, ’సింధుబాద్‌’ చిత్రాల్లో విజయ్‌ సేతుపతితో కలిసి నటించాడు.

విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించిన ‘జవాన్‌’ చిత్రానికి సంబంధించి జరుగుతున్న షూటింగ్‌కు సూర్య వచ్చాడు. అతన్ని చూసిన అనల్‌ అరసు తన సినిమాలో హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ‘ఫీనిక్స్‌’ అనే సినిమా పూర్తిగా యాక్షన్‌ జోనర్‌లో ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం సూర్య గత ఆరు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాడు. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసి షూటింగ్‌కి రెడీ అయిపోయాడు. ఎకె బ్రేవ్‌మన్‌ పిక్చర్స్‌ పతాకంపౖౖె రాజలక్ష్మి అరసకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.