English | Telugu

విజయ్ ఆంటోనీ 25వ సినిమా పరాశక్తి టైటిల్ పోస్టర్ రిలీజ్

విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు తన 25వ చిత్రాన్ని ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పరాశక్తి అనే పేరుతో ఈ సినిమా రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

"అరువు", "వాజిల్" వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు, రచయిత అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో అసాధారణమైన నటన, అంకితభావాన్ని ప్రదర్శించనున్నారట. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ మరింత ఆకట్టుకోవడమే గాక, ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

పరాశక్తి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మాస్ అప్పీల్, అత్యుత్తమ యాక్షన్, హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ ఎలిమెంట్స్ కలిగి ఉంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ తదితరులు నటిస్తున్నారు.

పరాశక్తి చిత్రానికి సినిమాటోగ్రఫీ షెల్లీ కాలిస్ట్, సంగీతం విజయ్ ఆంటోనీ, ఎడిటింగ్ రేమండ్ డెరిక్ క్రస్టా, యాక్షన్ కొరియోగ్రఫీ రాజశేఖర్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025 వేసవిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.