English | Telugu

ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను!

'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'కేజీఎఫ్' వంటి భారీ చిత్రాలపై విమర్శలు చేయడమే దానికి కారణం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారీ వసూళ్ళు రాబడుతున్న కమర్షియల్ సినిమాలను పాప్ కార్న్ సినిమాలని అన్నారు. వాటిని పాప్ కార్న్ తింటూ చూడొచ్చని, మధ్యలో సీన్ మిస్ అయినా పరవాలేదని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాని ఆయన టార్గెట్ చేశారు. కథ, హీరో పాత్ర, హీరో తల్లి పాత్రపై దారుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేజీఎఫ్ సినిమాని, కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారు వెంకటేష్ మహాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ చులకన వ్యాఖ్యలు చేయకూడదని మండిపడుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమా గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ మహా స్పందించారు.

తనపై వస్తున్న విమర్శలకు ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వెంకటేష్ మహా. "ఇప్పటికీ నేను నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. అయితే ఆ సమయంలో నేను ఉపయోగించిన భాష సరైనదని కాదని అంగీకరిస్తున్నాను. ఒక బాధ్యతగల దర్శకుడిగా నేను ఆ భాష వాడి ఉండకూడదు. నేను వాడిన భాష విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. ఏదైనా ఒక సినిమానో, ఒక భాషకు చెందిన పరిశ్రమనో కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి.. ప్రేక్షకులు వాటిని కూడా ఆదరిస్తే బాగుంటుంది అని చెప్పదలుచుకున్నాను" అని వెంకటేష్ మహా చెప్పుకొచ్చారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.