English | Telugu

నెక్స్ట్ రౌండ్‌కి రెడీ అవుతున్న ‘సార్ప‌ట్ట‌’

ఆర్య హీరోగా న‌టించిన సినిమా సార్ప‌ట్ట ప‌రంప‌ర‌. ఆ మ‌ధ్య ఓటీటీలో విడుద‌లై విశేష‌మైన ప్ర‌జాద‌ర‌ణ‌ పొందింది. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. ఇందులోనూ ఆర్య హీరోగా న‌టించ‌డం క‌న్‌ఫ‌ర్మ్ అయింది. 2021లో విడుద‌లైంది సార్ప‌ట్ట ప‌రంప‌ర‌. బాక్సింగ్ అంటే ఇంట్ర‌స్ట్ ఉన్న క‌పిల‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన క‌థ ఇది. నార్త్ చెన్నై ప్రాంతంలో 1970లో జ‌రిగిన బాక్సింగ్‌ను ప్ర‌ధానంగా ఇందులో చూపించారు. ఆర్య‌, ప‌శుప‌తి, తుషారా విజ‌య‌న్‌, జాన్ విజ‌య్‌, క‌లైయ‌ర‌స‌న్‌, కాళి వెంక‌ట్ ఈ సినిమాలో కీ రోల్ చేశారు. మాట‌లు, పాత్ర‌ల తీరుతెన్నులకు మంచి పేరొచ్చింది.

ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుంద‌ని చాలా వార్త‌లొచ్చాయి. అయితే దీని గురించి ఇటీవ‌ల కాలంలో చ‌డీచ‌ప్పుడు లేదు. ఈ నేప‌థ్యంలో సార్ప‌ట్ట‌2 గురించి హింట్ ఇచ్చారు హీరో ఆర్య‌. ఈ సినిమా సెకండ్ పార్ట్ త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని అన్నారు ఆర్య‌. ఈ సారి సీక్వెల్‌ని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని నెట్టింట్లో పా. రంజిత్‌కి రిక్వెస్ట్ లు అందుతున్నాయి. ``మ్యాచ్ చూడటానికి మీరు రెడీయేనా? రోషంతో కూడిన ఆంగ్ల బాక్సింగ్ రౌండ్ 2`` అంటూ ఆర్య ఈ సినిమాకు సంబంధించిన డీటైల్స్ సోష‌ల్ మీడియాలో లీక్ చేశారు హీరో ఆర్య‌. దీన్ని బ‌ట్టి త్వ‌ర‌లోనే సార్ప‌ట్ట సీక్వెల్ ఓపెనింగ్ ఉంటుంద‌నే న్యూస్ వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఆర్య ఓ సినిమాకు సైన్ చేస్తార‌నే టాక్స్ ఉన్నాయి. పా.రంజిత్ ప్ర‌స్తుతం విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్న తంగ‌లాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.