English | Telugu

నన్ను పెళ్లి చేసుకుంటావా అష్షు...

జూనియర్ సమంత అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక స్మాల్ స్క్రీన్ పై వరుసగా ఆఫర్లు సంపాదించుకుంది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల ఆరబోత ఫోటోషూట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అయ్యింది. త్వరలో ఒక మూవీలో కూడా కనిపించబోతోంది. ఐతే ఇప్పుడు అష్షుని ఒక నెటిజన్ కొంటె ప్రశ్న ఒకటి వేసాడు "నన్ను పెళ్లిచేసుకుంటావా" అని అడిగాడు "అబ్బా సిగ్గేస్తోంది నాకు..డైరెక్ట్ గా మెస్సేజ్ చెయ్యి అని" నవ్వే ఎమోజిస్ పెట్టి సిగ్గుపడుతూ మరీ రిప్లై ఇచ్చింది.

"నిజమైన ఫ్రెండ్ షిప్ గురించి ఒక్క మాటలో చెప్పు" అని అడిగేసరికి "భరించటం" అని బాధగా చెప్పింది. "నీ అంత అందంగా అవ్వాలంటే ఏం చేయాలక్కా" అని అడిగేసరికి " తిడుతున్నావా, పొగుడుతున్నావా" అంటూ అనుమానంగా ముఖం పెట్టింది అష్షు. "లవ్ మీద మీ ఒపీనియన్" అని అడిగేసరికి "ఒద్దు బాబోయ్" అని చెప్పింది. "మీకు ఎవరైనా ప్రొపోజ్ చేశారా" అని అడిగేసరికి "లేదు బ్రదర్ ఎవరూ చేయలేదు" అని చెప్పింది. "నీ లక్ష్యం ఏమిటి" అని అడిగారు "నేను బాగుండాలి...నా పక్కన ఉన్నవాళ్లను బాగా చూసుకోవాలి" అని చెప్పింది. "పవన్ కళ్యాణ్ టాటూ చూపించవా" అని అడిగేసరికి ఆ ఇమేజ్ ఒకటి పోస్ట్ చేసింది. "థ్యాంక్యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్స్...త్వరలో లైవ్ సెషన్ లో మిమ్మల్నందరినీ కలుస్తాను" అని చెప్పింది. "ఏ మాస్టర్ పీస్" పేరుతో ఒక కొత్త మూవీ రాబోతోంది. అందులో ఆద్య అనే పాత్రలో కనిపించబోతోంది అష్షు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.