English | Telugu

'సలార్'లో మరో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్.. బాక్సాఫీస్ షేకే!

అసలే పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్. దానికితోడు మరో ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు తోడైతే ఇంకేమైనా ఉందా!. ఇప్పుడు 'సలార్' విషయంలో అదే జరగబోతుంది అంటున్నారు. ఇందులో ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందట.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ ఫైర్ ఈ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 1న విడుదల కానున్న ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత చిత్రం యశ్ తో చేసిన 'కేజీఎఫ్' కాగా, తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్నాడు. అయితే ఇప్పుడు సలార్ కోసం ఈ ఇద్దరినీ రంగంలోకి దింపుతున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ లో యశ్ స్పెషల్ రోల్ లో కొద్ది నిమిషాలు మెరుస్తాడట. అలాగే ఇందులో ఎన్టీఆర్ కనిపించకుండా, వినిపిస్తాడట. ఎన్టీఆర్ ఫేస్ ని రివీల్ చేయకుండా, ఆయన వాయిస్ తో సినిమాని ముగిస్తారట.

ప్రశాంత్ నీల్, సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడని ఎప్పటినుంచో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. తాజా న్యూస్ ని బట్టి చూస్తే, అది నిజమే అనిపిస్తోంది. 'సలార్'ని 'కేజీఎఫ్'తో ముడిపెడుతూ యశ్ ని రంగంలోకి దింపడం, అలాగే ఎన్టీఆర్ పాత్రని వాయిస్ తో పరిచయం చేయడం చూస్తుంటే.. బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ కి తెరదీస్తున్నారని అర్థమవుతోంది.

'బాహుబలి'తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక 'కేజీఎఫ్'తో యశ్, 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటిది ఈ ముగ్గురు కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.