English | Telugu

సత్యసాయి మహా నిర్యాణం

పుట్టపర్తిలో పవిత్ర ప్రశాంతి నిలయంలో శాంతి కరువైంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏప్రెల్ 24 వ తేదీన ఉదయం 7.40 నిమిషాలకు మహా నిర్యాణం చెందారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తుల గుండెలు అంతులేని శూన్యంతో బరువెక్కాయి. వారి దైవం ఇక కనపడరు అని తెలిసిన చేదు నిజం వారిని అయోమయానికి గురి చేసింది. సత్యసాయిని భగవంతుడిగా నమ్మే భక్తులు దేశవిదేశాల్లో కోట్లల్లో ఉన్నారు.

మనదేశంలో క్రికెట్ గాడ్ గా పిలువబడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సతీ సమేతంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరి, సత్యసాయి బాబా పార్దివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అదే సమయంలో ప్రముఖ గాయని, తెల్ల కోయిలగా పిలువబడే పద్మశ్రీ పి.సుశీల కూడా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఉంచిన బాబా పార్దివ దేహానికి సుదీర్ఘ శోకంతో నివాళులర్పించారు. ఏప్రెల్ 25 వ తేదీ ఉదయం 10.30 గంటలకు దాదాపు లక్షమంది బాబా భక్తులు పార్దివ దేహాన్ని సందర్శించుకున్నారు.

బాబా గత కొన్నాళ్ళుగా అస్వస్తులుగా ఉన్నారు. ఆయన ఆరోగ్య విషయంలో గత కొన్ని రోజులుగా భక్తుల్లో అయోమయం నేలకొని ఉంది. కాసేపు బాబా కోలుకుంటున్నారనీ, కాసేపు బాబాగారి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందనీ ఇలా రకరకాల వార్తలతో భక్తులను అయోమయంలో పడేశారు. బాబా ట్రస్ట్ ఆస్తులను కొందరు స్వార్థపరులు తమ చేతుల్లోకి తీసుకునేందుకే, బాబా ఆరోగ్యంపై ఈ నాటకాలాడి ఉండవచ్చని కొందరు భక్తులు అనుమానిస్తున్నారు. ప్రేమ-సేవ తత్వాలని ప్రపంచానికి చాటిచెప్పిన సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు రూపంలో ఆయన జీవించే ఉంటారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.