English | Telugu

వర్మ డిపార్ట్ మెంట్ లో హీరోగా రానా

వర్మ...రామ్ గోపాల వర్మ తాను తీయబోతున్న "డిపార్ట్ మెంట్" అనే చిత్రంలో హీరోగా దగ్గుపాటి రానాని తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ పోలీస్ డిపార్ట్ మెంటుకి సంబంధించిన కథతో త్వరలో తాను తీయబోయే "డిపార్ట్ మెంట్" సినిమాలో హీరోగా మన తెలుగు హీరో దగ్గుపాటి రానాని తీసుకున్నారట. ప్రస్తుతం రామ్ గోపాల వర్మ "బుడ్డా" అనే చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, తాను నిర్మాతగా మారి హిందీలో నిర్మిస్తున్నారు.

ఇటీవల ఆయన తెలుగులో తీసిన "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత రామ్ గోపాల వర్మ ప్రయోగాత్మకంగా కేనన్ 5డి కెమెరాతో, రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం వంటి వారితో స్వీయ దర్శకత్వంలో తీసిన "దొంగల ముఠా" చిత్రం కూడా ఢమాల్ అనటంతో మళ్ళీ తెలుగు నుంచి హిందీ వైపే మొగ్గు చూపిన వర్మ ఈ "డిపార్ట్ మెంట్" చిత్రాన్ని హిందీలో తీస్తున్నారు. రానా ఇప్పటికే హిందీలో "దమ్‍ మారో దమ్" అనే చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అందుకేనేమో వర్మ అతన్ని తన "డిపార్ట్ మెంట్" సినిమాలో హీరోగా తీసుకుంటున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.