English | Telugu

పవన్ గబ్బర్ సింగ్ డైలాగ్ అదుర్స్

పవన్ గబ్బర్ సింగ్ డైలాగ్ అదుర్స్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ క్రియెటీవ్ వర్క్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, "షాక్, మిరపకాయ్" చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం" గబ్బర్ సింగ్". బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం"దబాంగ్" సినిమాకు ఈ "గబ్బర్ సింగ్" రీమేక్ గా తీస్తున్నారు. ఈ "గబ్బర్ సింగ్" చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ మాటలు వ్రాస్తున్నారు.

ఈ "గబ్బర్ సింగ్" చిత్రంలోని ఒక డైలాగ్ తెలుగువన్ చేతికి చిక్కింది. ఆ డైలాగ్ ఇలా ఉంది. "లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నాతో మాట్లాడేటప్పుడు. రెండు నాతో పోట్లాడేటప్పుడు". ఇది ఆ డైలాగ్. ఇలాంటి మాటలకు పవన్ కళ్యాణ్ నటన తోడై, హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభతో, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కలిస్తే ఆ "గబ్బర్ సింగ్" సినిమా ఎలా ఉంటుందో ఊహించండి. ప్రస్తుతం ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల "గబ్బర్ సింగ్" చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది కానీ లేకుంటే ఈపాటికి కలకత్తాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండాల్సింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.