English | Telugu

స‌ర్దార్ సీక్వెల్ ప‌నులు షురూ చేసిన కార్తి

కార్తి స‌ర్దార్ సీక్వెల్‌కి సంబంధించిన ప‌నులు షురూ అయ్యాయి. ఈ సారి టెక్నీషియ‌న్ల‌లోనూ మేజ‌ర్ మార్పులు క‌నిపిస్తున్నాయి. కార్తి హీరోగా డైర‌క్ట‌ర్ మిత్ర‌న్ తెర‌కెక్కించిన సినిమా స‌ర్దార్‌. ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స‌ర్దార్ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2కి సంబంధించి హింట్ ఇచ్చారు. దానికి త‌గ్గ‌ట్టే ఇప్పుడు సీక్వెల్ ప‌నులు మొద‌ల‌య్యాయ‌నే ప్ర‌చారం మొద‌లైంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ ఏడాదే సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లాల‌నే ఉద్దేశంతో ప‌నిచేస్తోంది టీమ్‌. స‌ర్దార్‌కి జీవీ ప్ర‌కాష్ సంగీతం అందించారు.

ఇప్పుడు సీక్వెల్‌కి యువ‌న్ శంక‌ర్ రాజా ఆన్ బోర్డ్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే కార్తి, మిత్ర‌న్‌, యువ‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో సినిమా స‌ర్దార్‌2 అవుతుంది. ఇంతకు ముందు ఇదే కాంబినేష‌న్‌లో ఇరుంబు తిరై, హీరో సినిమాలు తెర‌కెక్కాయి. స‌ర్దార్‌లో రెండు రోల్స్ చేశారు కార్తి. అందులో ఒక‌టి స‌ర్దార్ అలియాస్ చంద్ర‌బోస్‌, రెండో కేర‌క్ట‌ర్ విజ‌య్ ప్ర‌కాష్‌. చుంకీ పాండీ, రాశీఖ‌న్నా, ర‌జీషా విజ‌య‌న్ ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించారు. సీనియ‌ర్ యాక్ట్రెస్ లైలా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో న‌టించారు. ప్ర‌స్తుతం కార్తి జ‌పాన్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. రాజా మురుగ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతోంది. దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఇందులోనూ కార్తి డ్యూయ‌ల్ రోల్ చేశారు. జీవీ ప్ర‌కాష్ సంగీతం అందించారు. ర‌వి వ‌ర్మ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఫిలోమిన్ రాజ్ జ‌పాన్‌కి ఎడిట‌ర్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.