English | Telugu

పద్మాలయాలో మహేష్ బాబు, సమంతల దూకుడు

పద్మాలయాలో మహేష్ బాబు, సమంతల "దూకుడు" చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏమాయ చేసావే, బృందావనం" చిత్రాల ఫేం సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం"దూకుడు". మహేష్ బాబు సమంతల "దూకుడు" సినిమా ఏప్రెల్ 23 నుంచి పద్మాలయా స్టుడియోలో షూటింగ్ జరుపుకోనుందని తెలిసింది. అది కూడా ఫెడరేషన్ వాళ్ళు స్ట్రైక్ విరమిస్తేనే, మహేష్ బాబు సమంతల "దూకుడు" మూవీ షూటింగ్ పద్మాలయా స్టుడియోలో జరిగే అవకాశాలున్నాయి.

అంతే కానీ ఫెడరేషన్ వారు గనక సమ్మె కొనసాగిస్తే మాత్రం మహేష్ బాబు సమంతల "దూకుడు" మూవీ షూటింగ్ పద్మాలయా స్టుడియోలో జరిగే అవకాశాలు లేనట్లే. ఫెడరేషన్ కూ, తెలుగు సినీ నిర్మాతలకూ మధ్య సయోధ్య కుదిరినట్లేననీ, నిన్న శుక్రవారం అంటే ఏప్రెల్ 22 వ తేదీకల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతాయనీ, సమ్మె విరమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పెద్దలంటున్నారు. కానీ ఆలక్షణాలేవీ ఇప్పటివరకూ కనిపించటం లేదు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.