English | Telugu

ప్రముఖ నిర్మాత మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్ర మోహన్ గారి మరణం నుంచి చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించిన నిర్మాత మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది.

ప్రముఖ నిర్మాత మన్నం సుధాకర్ నిన్న చెన్నై లో మరణించారు. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని తన ఇంటి మెట్ల మీద నుంచి జారిపడ్డ సుధాకర్ గారు తీవ్ర అస్వస్ధతకి లోనవ్వడంతో కొన్ని రోజుల నుంచి ప్రముఖ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటు ఉన్నారు. చివరకి పరిస్థితి విషమించడంతో నిన్న పరమపదించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకి చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలియచేసారు.

శ్రీకాంత్ సౌందర్య లు హీరో హీరోయిన్లు గా వచ్చిన తారకరాముడు, నా మనసిస్తారా, అలాగే శ్రీకాంత్ ఛార్మి లు హీరోయిన్లుగా వచ్చిన సేవకుడు లాంటి సినిమాలతో పాటు తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా వచ్చిన వాలి తెలుగు డబ్బింగ్ చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు. ఇలా పలు విభిన్నమైన చిత్రాలని నిర్మించి టాలీవుడ్ లో మంచి అభిరుచి గల నిర్మాతగా సుధాకర్ గారు పేరుతెచ్చుకున్నారు. అలాగే ఆయన ఎన్నో సినిమాలకి కెమరామెన్ గా కూడా పని చేసారు. ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర ఉన్న కారుమంచి ఆయన స్వగ్రామం..ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.