English | Telugu

నిధి అగర్వాల్ కి అన్యాయం చేసిన మిరాయ్ టీమ్!

తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'మిరాయ్'(Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలై.. క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తేజ, మనోజ్ తో పాటు టీం అందరిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కి అన్యాయం జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. (Nidhhi Agerwal)

'మిరాయ్'లో నిధి అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అయితే కథ ఫ్లో మరియు నిడివిని దృష్టిలో పెట్టుకొని.. చివరి నిమిషంలో సినిమా నుంచి ఆ సాంగ్ ని తొలగించారు. అదే కాదు.. 'మిరాయ్' నుంచి 'వైబ్ ఉంది' అనే ఒకే ఒక్క సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ని కూడా సినిమా నుంచి తొలగించడం విశేషం. కథ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా, రన్ టైంని పెంచకుండా.. సాంగ్స్ ని తొలగించి మంచి పని చేశారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే 'మిరాయ్' సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ ఉండుంటే నిధి అగర్వాల్ కెరీర్ కి ఎంతో కొంత హెల్ప్ అయ్యుండేది. గ్లామర్ హీరోయిన్ గా తక్కువ కాలంలోనే యూత్ కి చేరువైన నిధి.. వేరే సినిమాలు కమిట్ అవ్వకుండా 'హరి హర వీరమల్లు'కోసం దాదాపు మూడేళ్లు కేటాయించింది. కానీ, ఆ మూవీ రిజల్ట్ దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం నిధి చేతిలో 'ది రాజా సాబ్' మాత్రమే ఉంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తోంది. 'రాజా సాబ్'కి ముందు 'మిరాయ్' సాంగ్ క్లిక్ అయినట్లయితే.. నిధిలో కొత్త ఉత్సాహం వచ్చి ఉండేది. కనీసం ఆ సాంగ్ ని యూట్యూబ్ లో అయినా విడుదల చేస్తారేమో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.