English | Telugu

మిరాయ్ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

'హనుమాన్'(Hanuman)తర్వాత 'తేజ సజ్జా'(Teja Sajja)నిన్న వరల్డ్ వైడ్ గా 'మిరాయ్'(Mirai)తో మరో సారి థియేటర్స్ లో అడుగుపెట్టాడు. శ్రీరాముని(Sriramudu) ఆయుధమైన 'మిరాయ్' కి , మౌర్య రాజ చక్రవర్తి అశోకుడు(Ahokudu)శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తో 'మిరాయ్' తెరకెక్కింది. దీంతో సెల్యులాయిడ్ పై ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమవ్వడంతో పాటు, రాజీపడని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)నిర్మాణ విలువలు, కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకత్వ ప్రతిభ థియేటర్స్ కి ప్రేక్షకులని పరుగులు పెట్టేలా చేస్తుంది.

ఈ మూవీ తొలిరోజు ఇండియా వ్యాప్తంగా 12 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఓవర్ సీస్ కి సంబంధిన కలెక్షన్స్ వివరాలు తెలియాలి. కెరీర్ పరంగా తేజ సజ్జ 'హనుమాన్' తో 15 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. దీంతో తొలి రోజు కల్లెక్షన్స్ కి సంబంధించి 'మిరాయ్' రెండవ చిత్రంగా నిలిచింది. ఇక మూవీ బాగుందనే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుండంతో, వీకెండ్ లో మరిన్ని భారీ కలెక్షన్స్ సాధించే సాధించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇండియా వ్యాప్తంగా ఐదు షో లు ప్రదర్శిస్తుండటం, అడ్వాన్స్ బుకింగ్ కూడా అన్నిఏరియాల్లో ఫుల్ అవ్వడమే ఇందుకు నిదర్శనమని సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

వేద గా తేజ సజ్జ ,మహావీర్ గా మంచు మనోజ్(Manchu Manoj)పోటాపోటీగా నటించారు. శ్రీయ,రితిక నాయక్, జగపతి బాబు లు తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో బాగస్వామ్యమయ్యారు. సుమారు 60 కోట్ల బడ్జెట్ తో మిరాయ్ తెరకెక్కినట్టుగా తెలుస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.