English | Telugu

మంచు మనోజ్ విశ్వరూపం.. న్యూ పాన్ ఇండియా విలన్ వచ్చేశాడు!

ఈ జనరేషన్ టాలెంటెడ్ యాక్టర్స్ లో మంచు మనోజ్ (Manchu Manoj) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనోజ్.. ఏవో వ్యక్తిగత కారణాల వల్ల 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత దాదాపు ఎనిమిదేళ్లు నటనకు దూరమయ్యాడు. దీంతో మనోజ్ కమ్ బ్యాక్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ ఏడాది 'భైరవం'తో రీ-ఎంట్రీ ఇచ్చాడు మనోజ్. అయితే ఆయన కమ్ బ్యాక్ రేంజ్ కి తగ్గ సౌండ్ ఆ సినిమా చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా 'మిరాయ్' వచ్చింది. (Mirai Movie)

తేజ్జ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మూవీ 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ లో మంచు మనోజ్ విలన్ గా నటించడం విశేషం. మంచి అంచనాలతో తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ లభించింది. అయితే 'మిరాయ్' చూసిన ప్రతి ఒక్కరూ.. సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారో, మంచు మనోజ్ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. మనోజ్ స్క్రీన్ ప్రజెన్స్ కి, యాక్టింగ్ కి, డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనోజ్ నటవిశ్వరూపం చూపించాడని అంటున్నారు. 'మిరాయ్'లోని తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో.. మనోజ్ కి పాన్ ఇండియా ఆఫర్స్ క్యూ కట్టే అవకాశముంది. ఒక్క తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల స్టార్స్ నటించే పాన్ ఇండియా సినిమాల్లోనూ పవర్ ఫుల్ రోల్స్ కి మనోజ్ మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.