English | Telugu

న‌య‌న‌తార గుజ‌రాతీ ప్రాజెక్ట్ శుభ్ యాత్ర‌

న‌య‌న‌తార గుజ‌రాతీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీకి శుభ్ యాత్ర అని పేరు పెట్టారు. ఈ సినిమా పోస్ట‌ర్ కూడా ఇటీవ‌ల విడుద‌ల చేశారు. మ‌ల్హ‌ర్ థాక‌ర్ హీరోగా న‌టిస్తున్నారు. అయితే న‌య‌న‌తార ఇందులో నాయిక‌గా న‌టించ‌డం లేదు. ప్రాజెక్ట్ ఆమెదే అంటూ అర్థం ఆమె నిర్మిస్తున్నార‌ని. నేష‌న‌ల్ అవార్డు అందుకున్న ద‌ర్శ‌కుడు మ‌నీష్ శైనీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగువారికి కూడా సుప‌రిచిత‌మైన మోనాల్ గ‌జ్జ‌ర్ నాయిక‌. ద‌ర్శ‌న్ జ‌రీవాలా, హేమిన్ త్రివేది, మంగ‌న్ లుహార్ కీ రోల్స్ చేస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి సెల‌బ్రిటీ క‌పుల్ గుజ‌రాత్ సినిమాను నిర్మించ‌డం ఇదే తొలిసారి. త‌మ రౌడీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఈ తొలి అడుగు వేశారు. న‌య‌న‌తార‌తో ప‌నిచేయ‌డం గురించి థాక‌ర్ మాట్లాడుతూ ``ఆమెతో ప‌నిచేయ‌డం చాలా అద్భుత‌మైన భావ‌న‌. విలువ‌లున్న అంశాల‌ను ఎంపిక చేసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. అంత అనుభ‌వం ఉన్న న‌టీమ‌ణి నిర్మిస్తున్న సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నా`` అని అన్నారు.

గ‌త చిత్రాల‌తో పోలిస్తే, ఇందులో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు మ‌ల్హ‌ర్ చెప్పారు. ఆయ‌న మాట్లాడుతూ ``నేనిప్ప‌టిదాకా చేసిన సినిమాల‌న్నిటిలోకీ ఈ సినిమా చాలా ప్ర‌త్యేకంగా అనిపిస్తుంది. నా యాక్టింగ్ స్టైల్‌కి ప‌క్కాగా సూట్ అయ్యే పాత్ర‌ను ఇందులో చేశాను. ఇందులో నా పాత్ర పేరు మోహ‌న్‌. ఎప్ప‌టిక‌ప్పుడు పాత్ర‌ల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే నాకు, ఈ కేర‌క్ట‌ర్‌ని ఆఫ‌ర్ చేసినందుకు న‌య‌న‌తార‌కు ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు. ఓ వైపు న‌టిగా, ఉయిర్‌, ఉల‌గం అనే ఇద్ద‌రు అబ్బాయిల‌కు త‌ల్లిగా త‌న క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తున్నారు న‌య‌న‌తార‌. ఈ ఏడాది జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో గుజ‌రాత్‌లో నిర్మాత‌గా అడుగుపెడుతున్నారు. 2023లోనే శుభ్ యాత్ర‌ను విడుద‌ల చేయ‌నున్నారు రౌడీ క‌పుల్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .