English | Telugu

పీయ‌స్‌2.. ఓపెనింగే క్లైమాక్స్‌లా ఉంటుందా?

పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ ఒన్ చూసిన చాలా మంది అర్థం కాలేద‌న్నారు. కొంద‌రు చ‌రిత్ర‌ను ఇంత‌కన్నా గొప్ప‌గా ఎలా చెబుతారంటూ మ‌ణిర‌త్నం వైపు నిలుచున్నారు. ఫైన‌ల్‌గా బాక్సాఫీస్ మాత్రం 500 కోట్ల వ‌సూళ్ల‌తో శ‌భాష్ అంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోనే సెకండ్ పార్టుకు అంత‌క‌న్నా ఎక్కువ పెట్టుబ‌డి పెట్టి, అంత‌కు మించి ఉండేలా తెర‌కెక్కించారు. విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష‌, శోభిత ధూళిపాళ‌, నాజ‌ర్‌, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌రామ్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి అంటూ తెర‌నిండుగా తారాగ‌ణంతో తెర‌కెక్కింది పొన్నియిన్ సెల్వ‌న్‌2. పార్ట్ ఒన్‌లో ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసుకుంటూ, మెట్టుకు మెట్టు అర్థ‌మ‌య్యేలా చెప్పారు మ‌ణిర‌త్నం. పాత్ర‌ల ప‌రిచ‌యాలు, వాటి ఉద్దేశాలు, ల‌క్ష్యాలు ఇప్పుడు జ‌నాల‌కు తెలుసు కాబ‌ట్టి, సెకండ్ పార్టులో అన్నీ విష‌యాల‌ను అద్భుతంగా చెప్పాల‌న్న‌ది డైర‌క్ట‌ర్ సంక‌ల్పం.

అందుకే సెకండ్ పార్ట్ ఓపెనింగ్ సీన్‌నే క్లైమాక్స్ లా ఉండేలా తెర‌కెక్కించార‌ట‌. ప్రేక్ష‌కులు శ్వాస తీసుకోవ‌డానికి కూడా వీలులేనంత స్ట‌ఫ్డ్ గా సెకండ్ పార్ట్ ఉంటుంద‌ట‌. ఎక్క‌డా క‌నురెప్ప వేయ‌డానికి వీలులేనంత టైట్ స్క్రీన్‌ప్లేతో సెకండ్ పార్టుని ద‌ట్టించార‌ట‌. చోళ సామ్రాజ్యంలో త‌లెత్తిన రాజ‌కీయాలు, వాటికి ఆదిత్య చోళుడు ఎలా అధిగ‌మించాడు? పొన్నియిన్ సెల్వ‌న్ క‌న్నుమూశాడా? త‌న రాజ్యానికి తిరిగి వ‌చ్చాడా? అత‌ని కోసం ఎదురుచూసిన అతివ మ‌న‌సు ఏమ‌యింది? వందియ‌దేవ‌న్ వ‌ల్ల‌వ‌రాయ‌న్‌కి కుంద‌వై శ‌ర‌ణు ప‌లికిందా? పాండ్యరాజుల ప్ర‌తాపం ఏమైంది? ఇలా ఎన్నో వంద‌ల ప్రశ్న‌ల‌కు సెకండ్ పార్టులో స‌మాధానం ఉంద‌ట‌. ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది పీయ‌స్‌2. ఇటీవ‌ల ట్రైల‌ర్‌ని వైభ‌వంగా విడుద‌ల చేశారు. చోళ‌రాజుల చ‌రిత్ర‌, త‌మిళ మ‌న్నుకు సంబంధించిన చ‌రిత్ర అంటూ పీయ‌స్‌2 కోసం వెయిట్ చేస్తున్న విధానం గురించి నెట్టింట్లో ప‌రిప‌రివిధాలా త‌మ సందేశాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.