English | Telugu

‘అర్జున్ రెడ్డి’ కాంబోపై కన్నేసిన నిర్మాతలు!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా సాధించిన సంచ‌ల‌న విజ‌యాన్ని ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన స‌ద‌రు సినిమాతో సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తాను చాటారు. అదే సినిమాను ఆయ‌నే బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. ఈ మూవీ త‌ర్వాత మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా క‌లిసి ప‌ని చేయ‌లేదు. అయితే ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందా? అని అభిమానులు, ప్రేక్ష‌కులు, సినీ సర్కిల్స్ అనుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైరల్ అవుతోంది.

అదేంటంటే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో భారీ చిత్రాల‌ను నిర్మిస్తోన్న సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. వీరు మాత్రం ‘అర్జున్ రెడ్డి’ కాంబోని సెట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అన్ని కుదిరితే వీరి క‌ల‌యిక‌లో తామే ఓ సినిమాను నిర్మిస్తామ‌ని, వీరిద్ద‌రూ సాఫ్ట్ జోన‌ర్ మూవీ మాత్రం చేయ‌ర‌ని వారు చెబుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ డేట్స్ అయినా ఇప్పుడు దొర‌క‌వ‌చ్చునేమో కానీ సందీప్ రెడ్డి వంగా డేట్స్ దొర‌క‌టం క‌ష్టంగా ఉంద‌నే చెప్పాలి. ఎందుకంటే ప్ర‌స్తుతం ర‌ణ్‌భీర్ క‌పూర్‌తోయానిమ‌ల్ సినిమా చేస్తోన్న ఆయ‌న త‌ర్వాత ప్ర‌భాస్‌తో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది. అది పూర్త‌వ‌గానే అల్లు అర్జున్‌తో ఓ సినిమాను తెర‌కెక్కించాల్సి ఉంది. ఇవి పూర్తి కావాలంటే క‌నీసం రెండేళ్లు అయినా ప‌డుతుంది మ‌రి.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే లైగ‌ర్ ఫ్లాప్ త‌ర్వాత ఆయ‌న ఖుషి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్‌గా న‌టించింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.