English | Telugu

బ్లాక్‌లో టిక్కెట్ కొన్న మహేష్ బాబు

నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో ‘ఆగడు’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు శంకర్ ఆడియో సీడీని విడుదల చేసి శ్రీనువైట్ల, మహేష్‌కు అందజేశారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ..నేను శంకర్ అభిమానిని. చెన్నయ్‌లో వున్నప్పుడు శంకర్ సినిమా విడుదలైన తొలి రోజే బ్లాక్‌లో టిక్కెట్ కొని చూసే వాడిని. ఆయన ఈ రోజు నా సినిమా ఆడియోకు రావడం ఆనందంగా వుంది అన్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడం ఎంజాయ్ చేస్తాను. దూకుడు తరహాలోనే ఆగడు కూడా నా కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. సెప్టెంబరు 19న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.