English | Telugu

హెవీ రెయిన్స్‌లో భారీ ఓపెనింగ్స్ తో‌‘రభస’

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ‘కందిరీగ’ ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస’. ఈ చిత్రం ఆగస్ట్‌ 29న వినాయక చవితి కానుకగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించింది. ఒక్కరోజులోనే నైజాంలో 2 కోట్ల 43 లక్షల షేర్‌ కలెక్ట్‌ చేసి ఎన్టీఆర్‌ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా ‘రభస’ నిలిచిందని నైజాం డిస్ట్రిబ్యూటర్స్‌ శ్రీవెంకటేశ్వర ఫిలింస్‌ వారు తెలిపారు.

ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ‘‘హెవీ రెయిన్స్‌లో సైతం భారీ ఓపెనింగ్స్‌తో మా ‘రభస’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నైజాంలో ఒక్కరోజులోనే 2 రెండు కోట్ల 43 లక్షల షేర్‌ సాధించి ఎన్టీఆర్‌ చిత్రాల్లో హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా ‘రభస’ నిలిచినందుకు చాలా హ్యాపీగా వుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుందని, ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌గానీ, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ టేకింగ్‌గానీ, మేకింగ్‌గానీ చాలా ఎక్స్‌లెంట్‌గా వుందని రిపోర్ట్స్‌ అందుతున్నాయి. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌’’ అన్నారు.

డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్‌, మాస్‌, ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘రభస’ అందర్నీ ఆకట్టుకుంటున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఎన్టీఆర్‌తో చేసిన ఈ ఫస్ట్‌ సినిమా ఇంత పెద్ద హిట్‌ కావడం, భారీ కలెక్షన్స్‌ సాధించడం ఆనందంగా వుంది’’ అన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.