English | Telugu

ట్రెండింగ్ లో వితిక షేరు వ్లాగ్.. ఏం ఉందంటే!

వితిక షేరు.. ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న, సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. చాలా మందికి తెలియని నటి. బిగ్ బాస్ సీజన్-3 లో తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చి అందరిచూపు తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత వితిక మంచి క్రేజ్ సంపాదించుకొని బిజీ జీవితాన్ని గడుపుతుంది.

వితిక షేరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒక సిరీస్ తో మొదలైంది తన కెరీర్. అలాగే చాలా సినిమాలలో నటించింది. వితిక తెలుగు, కన్నడ, తమిళ్ లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఝమ్మంది నాదం, భీమీలి కబడ్డి జట్టు, పడ్డానండి ప్రేమలో, పెళ్లి సందడిలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత 'వితిక షేరు' అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. వితిక, హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది. వితిక, వరుణ్ ఇద్దరు రియల్ కపుల్ గా బిగ్ బాస్ 3 లో అడుగుపెట్టి, తమలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. హౌస్ లో వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ తో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. భార్యభర్తల గిల్లికజ్జల సీజన్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గా సాగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇద్దరు చాలా యాడ్స్ లో కలిసి నటించారు.

వితిక అందరికంటే కాస్త భిన్నంగా, ఎప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తుంటుంది. అలాగే ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏదైనా విషయం చెప్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే విషయం పక్కన పెట్టి, ఎలా తీసుకున్నా మంచి విషయం షేర్ చెయ్యాలనే ఆలోచిస్తుంటుంది. అందుకే ఎప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో భిన్నమైన టాపిక్స్ తో వ్లాగ్ లు, వీడియోలు చేస్తుంది. ' మా ఊరిలో' అంటూ తన ఊళ్ళో ఎలా ఉండేదో చెప్తూ ఒక వ్లాగ్, ' స్కూల్.. టీచ్ ఫర్ చేంజ్ ' అంటూ మరొక వ్లాగ్.. ఇలా కొత్తదనంతో కంటెంట్ చేస్తూ యూట్యూబ్ లో టాక్ ఆఫ్ ది ట్రెండింగ్ గా మారింది. కొన్ని రోజుల క్రితం ' ఫీమేల్ హైజీన్.. మోస్ట్ ఇంపార్టెంట్' అంటూ చేసిన వ్లాగ్ వైరల్ గా మారిన విషయం తెలిసదే. తాజాగా 'వరలక్ష్మి వ్రతం అలంకరణ' అనే టైటిల్ తో వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందుతుంది. ఇందులో డెకరేషన్ ఎలా చేయాలి. ఏమేం కావాలంటూ అన్నింటిని స్పష్టంగా వివరించింది వితిక షేరు. అయితే ఈ వీడీయోకి.. " డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ఈ టైటిల్ మీకు సరిగ్గా సరిపోతుంది" అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు నెటిజన్లు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.