English | Telugu

కీర్తీ సురేష్‌కి వంట చేయ‌డం తెలుసా?

హీరో, హీరోయిన్ల‌కు వంట చేయ‌డం వ‌చ్చా? రాదా? అనే ప్ర‌శ్న చాలా మందిని ఊరిస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా న‌య‌న‌తార కూడా త‌న వంట గురించి మాట్లాడారు. ఎవ‌రైనా ఇంటికి వ‌స్తే, వాళ్ల‌కు ఏం కావాల‌న్నా శుభ్రంగా వండిపెడ‌తాన‌ని అన్నారు. త‌న‌కు అన్ని ర‌కాల వంట‌ల మీద ప‌ట్టు ఉంద‌ని చెప్పారు న‌య‌న‌తార‌. ఎప్పుడూ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసే న‌య‌న‌తార‌, మంచి మ‌సాలా బిర్యానీ వండుతార‌న్న విష‌యం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇప్పుడు కీర్తీ సురేష్ కూడా అలాంటి విష‌యాన్నే షేర్ చేసుకున్నారు. ఎప్పుడూ వంట కోసం ఇత‌రుల మీద ఆధార‌ప‌డ‌టం కాదు, న‌చ్చిన‌వి వండుకుని తిన‌డం కూడా క‌ళేన‌ని అంటున్నారు న‌టి కీర్తీ సురేష్‌. అంత‌కు ముందు త‌న‌కు వంట పెద్ద‌గా తెలియ‌ద‌ని, కోవిడ్ స‌మ‌యంలో తాను చాలా విషయాలు నేర్చుకున్నాన‌ని అన్నారు కీర్తీ సురేష్‌. అంతే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌కీ, భోజ‌నానికి మ‌ధ్య పెద్ద‌గా గ్యాప్ లేన‌ప్పుడు తాను ట‌ర్కిష్ రెసిపీల‌ను ప్రిఫ‌ర్ చేస్తాన‌ని చెప్పారు. అందులో పోచ్డ్ ఎగ్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని అన్నారు. పెరుగులో ఉప్పు, వెల్లుల్లిపాయ మిక్స‌ర్ వేసి గిల‌క్కొట్టుకుని ప్లేట్‌లో ప‌క్క‌న‌పెట్టుకోవాలి. మ‌రో బౌల్‌లో నీళ్లు వేడి చేసుకుని అందులో కాస్త వెనిగ‌ర్ వేసి, గుడ్డుకొట్టుపోసి, ఉడికిన గుడ్డును దీని మీద వేసుకుని పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే రెడీ అయిన‌ట్టే అంటున్నారు కీర్తీ సురేష్‌. పోష‌కాలు పుష్క‌లంగా ఉండే ఇలాంటి వంట‌ల‌ను తాను త‌ర‌చూ చేయ‌డానికి ప్రిఫ‌ర్ చేస్తాన‌ని అన్నారు కీర్తీ సురేష్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.