English | Telugu

ఎన్టీఆర్ బర్త్ డేకి సర్ ప్రైజ్ ఇచ్చిన హృతిక్ రోషన్!

నేడు(మే 20) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందరిలోనూ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా' అంటూ తెలుగులో విష్ చేసిన హృతిక్.. 'వార్-2' గురించి హింట్ కూడా ఇవ్వడం విశేషం.

ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు ఫ్యాన్స్ కి మరింత ప్రత్యేకంగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'దేవర' మూవీ ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో 'సింహాద్రి' సినిమా రీరిలీజ్ కావడంతో అభిమానుల హంగామాతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా తాజాగా హృతిక్ ఓ ట్వీట్ చేశాడు.

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న 'వార్-2'లో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ పంచుకోనున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రానప్పటికీ 'వార్-2'లో ఎన్టీఆర్ నటించడమైతే ఖరారైంది. తాజాగా హృతిక్ సైతం ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా" అంటూ 'వార్-2' గురించి హింట్ ఇచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం హృతిక్ ట్వీట్ వైరల్ గా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.