English | Telugu

'దేవర'గా ఎన్టీఆర్.. దిమ్మతిరిగే షాకిచ్చిన కొరటాల!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 30 సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు(మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఈ మూవీ టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు గానే ఈ సినిమాకి 'దేవర' అనే టైటిల్ ని నిర్ణయించారు. పాన్ ఇండియా ఫిల్మ్ కి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ దిమ్మతిరిగేలా ఉంది. అసలిది కొరటాల సినిమానేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా కొరటాల తన సినిమాలలో హీరోలను స్టైలిష్ గా చూపిస్తుంటాడు. కానీ 'దేవర'లో ఎన్టీఆర్ ని ఊర మాస్ అవతార్ లో చూపిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ నెవెర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. సముద్ర తీరంలో శవాలు పడుండగా.. ఆ మారణకాండకు కారణమైన వ్యక్తిగా ఎన్టీఆర్ నల్లదుస్తుల్లో చేతిలో నెత్తురంటిన కత్తితో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది. ఆయనను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో, అంతకు మించిన మాస్ లుక్ లో కొరటాల చూపించాడు. ఫస్ట్ లుక్కే ఈ రేంజ్ లో ఉంటే, ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.