English | Telugu

రోజురోజుకి దిగజారుతున్న టాలీవుడ్ ఫ్యాన్స్!

సినీ హీరోల అభిమానుల మధ్య గొడవలు అనేవి ఇప్పటివి కావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఈ ట్రెండ్ ఉంది. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ఆ ట్రెండ్ ను కొనసాగించారు. ప్రస్తుతం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోల ట్రెండ్ నడుస్తోంది. అయితే అభిమానుల తీరు మాత్రం.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రోజురోజుకి దిగజారుగుతోంది.

ఒకప్పుడు వేరే హీరో కంటే తమ హీరో సినిమా పెద్ద హిట్ కావాలని అభిమానులు కోరుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తమ హీరో సినిమా ఏమైనా పరవాలేదు.. వేరే హీరో సినిమా మాత్రం హిట్ కాకూడదన్న అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతోంది.

ఒక హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు.. మిగతా హీరోల అభిమానులంతా ఏకమై.. ఆ సినిమా మీద నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దాని వల్ల ఆ హీరో సినిమాకి నష్టం కలిగించామని అప్పటికి ఆనందపడుతున్నారు కానీ.. ఆ తర్వాత తమ హీరో సినిమాకి కూడా అదే పరిస్థితి వస్తుందనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

అప్పట్లో తాము అభిమానించే హీరో ఎవరైనా కానీ.. ఇతర హీరోల సినిమాలు కూడా ఎంతో కొంత చూసేవారు. ఎందుకంటే సినిమాల మీద ఇష్టం అలాంటిది. కానీ, ఇప్పుడలా లేదు. వేరే హీరోల సినిమాలు చూడటం దేవుడెరుగు.. ఆ సినిమాలను ఎలా చంపాలా అని చూస్తున్నారు. దాంతో సినిమాకి కొంచెం టాక్ అటూ ఇటూ అయినా రెండో రోజుకే కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన పలు స్టార్ హీరోల సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది.

ఇకనైనా అభిమానుల తీరు మారాలి. తమ హీరో సినిమా ఆడాలి అనుకోవాలి కానీ.. ఇతర హీరోల సినిమాలను చంపేసే ప్రయత్నం చేయకూడదు. దాని వల్ల హీరోలకు కలిగే నష్టం కంటే కూడా.. నిర్మాతలకు, పరిశ్రమకు కలిగే నష్టమే ఎక్కువ. సినీ అభిమానులు ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే టాలీవుడ్ కి అంత మంచిది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.