English | Telugu

స్టార్స్ కి చుక్కలు చూపిస్తున్న మహావతార్ నరసింహ!

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా రెండు వారాలు ఆడటం గగనమైపోయింది. అలాంటిది ఓ యానిమేషన్ ఫిల్మ్ నాలుగో వారంలోనూ సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'మహావతార్ నరసింహ'.

జూలై 24న 'హరి హర వీరమల్లు' విడుదల కాగా, ఆ మరుసటి రోజు జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టింది మహావతార్ నరసింహ. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ మైథలాజికల్ యానిమేషన్ ఫిల్మ్.. కేవలం మౌత్ టాక్ తోనే రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ వచ్చింది. దీంతో 'హరి హర వీరమల్లు'తో పాటు జూలై 31న విడుదలైన 'కింగ్డమ్' కూడా మహావతార్ ముందు నిలబడలేకపోయాయి. 20 రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

అయితే ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' రూపంలో రెండు భారీ సినిమాలు రావడంతో.. ఇక 'మహావతార్ నరసింహ' కలెక్షన్ల జోరుకి బ్రేకులు పడతాయని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. 'వార్-2', 'కూలీ' సినిమాల హవాలోనూ.. మహావతార్ తన జోరు చూపిస్తోంది. ఇప్పటికీ బుక్ మై షోలో గంటకు వేలల్లో టికెట్లు బుక్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో ఇంతటి రన్ ఉన్న సినిమా లేదని చెప్పాలి. ఇప్పటికే రూ.250 కోట్లు రాబట్టిన మహావతార్.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.