English | Telugu

‘బేబి’ నిర్మాతలకు పోలీసుల నోటీసులు...డ్రగ్స్ లింకేంటి?

కొన్నిసార్లు ఎవ‌రో చేసిన త‌ప్పుల‌కు మ‌రెవ‌రో టార్గెట్ అవుతుంటారు. ఇప్పుడు బేబి సినిమా మేక‌ర్స్ ప‌రిస్థితి అలాగే ఉంది. రీసెంట్ టైమ్‌లో విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంతా బాగుంద‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూస‌ర్స్‌కు హైద‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస‌లు ఈ సినిమాకు, హైద‌రాబాద్ పోలీసులు ఎందుకు నోటీసులు జారీ చేశారు. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే, హైద‌రాబాద్‌లో డ‌గ్ర్స్‌ను అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు నైజీరియ‌న్స్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా బేబి సినిమా నిర్మాత‌ల‌కు నోటీసుల‌ను అందించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొనటం హాట్ టాపిక్‌గా మారింది.

‘‘హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ అమ్ముతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు నైజీరియ‌న్స్ కూడా ఉన్నారు. వీరొక ఆర్గ‌నైజేషన్‌లా ఏర్ప‌డి ఈ ప‌ని చేస్తున్నారు. వీసా గ‌డువు పూర్త‌యిన‌ప్ప‌టికీ నైజీరియ‌న్స్ ఇక్క‌డే ఉండి డ్ర‌గ్స్ అమ్ముతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా ఈ లావాదేవీలు జ‌రుగుతున్నాయని తెలిసింది. మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడి కుమారుడు దేవ‌ర‌కొండ సురేష్ రావును కూడా అరెస్ట్ చేశాం. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన బేబి సినిమాలో డ్ర‌గ్స్‌ను ఏవిధంగా ఉప‌యోగించాల‌నే విష‌యాల‌ను చూపించారు. ఇలాంటి విష‌యాల‌ను చూపించ‌ద్ద‌ని సినీ ప‌రిశ్ర‌మ‌ను కోరుతున్నాను. అందువ‌ల్ల ఆ సినీ నిర్మాత‌ల‌కు నోటీసులు ఇస్తాం. ప్ర‌తీ సినిమాను ఇక‌పై పోలీసులు ప్ర‌త్యేకంగా గ‌మ‌నిస్తుంటారు. ఇలాంటి ప‌నులు చేస్తూ బెంగుళూరు 18 మంది నైజీరియ‌న్స్ ఉన్నారు’’ అని ఆయ‌న తెలిపారు.

అయితే ఈ విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత సాయి రాజేష్ స్పందించారు. సినిమా మేకింగ్ లో బాధ్యతగా ఉంటున్నామని అన్నారాయ‌న‌. యువత డ్రగ్స్ వలలో పడొద్దని, మాదక ద్రవ్యాల బారిన పడితే తిరిగి బయటకు రాలేరని ఆయన తెలిపారు. బేబి సినిమాలో కథానుసారం రెండు పాత్రల మధ్య డ్రగ్ తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిని థియేటర్ , ఓటీటీలో ప్రదర్శించినప్పుడు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .