English | Telugu

డ్రగ్స్ కేసులో దేవరకొండ అరెస్ట్.. పరారీలో నవదీప్!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తోంది. అప్పట్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది.

ఇటీవల హైదరాబాద్ లోని మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో సినీ ఫైనాన్షియర్ వెంకట్ సహా పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో హీరో నవదీప్ కి సంబంధముందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కస్టమర్ గా ఉన్నట్టు గుర్తించామని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ని అరెస్ట్ చేశామని చెప్పారు.

కాగా, ఈ అంశంపై నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని, డ్రగ్స్ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.