English | Telugu

పెళ్ళికి ముందే బిగ్ బాస్ విన్నర్‌తో లావణ్య త్రిపాఠి!

ఈ ఏడాదో వచ్చే ఏడాదిలోనో హీరో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆమె సినిమాలతో పాటు ఓటీటీల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఓటీటీలో లావణ్య నటించటం కొత్తేమీ కాదు. ఇది వరకే జీ 5 నిర్మించిన పులి మేక వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా మెప్పించింది. దీనికి సీక్వెల్‌ను కూడా వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా మరో వెబ్ సిరీస్‌లోనూ ఆమె నటించటానికి రెడీ అయ్యిందని సినీ సర్కిల్స్‌లో వినిపిసోన్న సమాచారం. వార్తల మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లావణ్యతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయి.

మీడియా వర్గాల్లో వస్తోన్న టాక్ మేరకు ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య జతగా బిగ్ బాస్ విన్నర్ కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్‌లో ఆరు సీజన్స్ ముగిశాయి. అన్నింట జెంట్స్ విన్నర్స్‌గా నిలిచారు. మరి వీరిలో లావణ్యతో కలిసి నటించేదెవరా? అనే అనుకోవచ్చు.. అదెవరంటే అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో హీరోగా కనిపించిన అభిజీత్‌కు తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు లేవు. సాధారణంగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రధానంగానే వెబ్ సిరీస్‌లను మన మేకర్స్ రూపొందిస్తున్నారు. అయితే అభిజీత్, లావణ్య త్రిపాఠి కలిసి నటించబోతున్న ఈ సిరీస్ రొమాంటిక్ కామెడీ అని సమాచారం. కాగా ఈ సిరీస్‌ షూటింగ్‌ను పెళ్ళికి ముందే ముగించేయాలనే ప్లాన్‌లో వుందట లావణ్య.

స్కైలాబ్ అనే తెలుగు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విశ్వఖండే రావు ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే డిస్నీ యాజమాన్యం ప్రకటనను వెలువరిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అభిజీత్ విషయానికి వస్తే.. సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినప్పటికీ తను బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేశారు. అందులో విజేతగానూ నిలిచారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.