English | Telugu

అజిత్‌... మండు వేస‌విలో మొద‌లుపెడ‌తారా?

త‌మిళ ఇండ‌స్ట్రీ త‌ల అజిత్‌. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగి ఉంటే ఈ దీపావ‌ళికి ఆయ‌న సినిమా విడుద‌ల కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు అజిత్‌. అదే సీజ‌న్‌లో వార‌సుడు సినిమాతో అభిమానుల‌ను ప‌ల‌క‌రించారు విజ‌య్‌. వీరిద్ద‌రూ మ‌ళ్లీ దీపావ‌ళి సీజ‌న్‌లో పోటీప‌డ‌టం ఖాయం అని అప్ప‌ట్లో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తునివు త‌ర్వాత వ‌ర‌ల్డ్ టూర్ వెళ్లారు అజిత్. భార్యాపిల్ల‌ల‌తో వెకేష‌న్‌కి వెళ్లారు. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా కేన్సిల్ అయింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేద‌న్న‌ది కోలీవుడ్ న్యూస్‌.
అంత‌లోనే మ‌గిళ్ తిరుమేని అనే డైర‌క్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చింద‌ని అన్నారు.

అయితే పాయింట్‌గా దానికి ఓకే చెప్పిన అజిత్‌, నెరేష‌న్ విషయంలో మాత్రం నో చెప్పార‌ట‌. అందుకే స‌రికొత్త సీన్లు రాసుకోవ‌డానికి మ‌గిళ్ తిరుమేనికి టైమ్ ప‌ట్టింది. ఇంత‌లో అజిత్ తండ్రి సుబ్ర‌మ‌ణ్యం క‌న్నుమూశారు. అజిత్ ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు అంద‌రూ అజిత్‌కి సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో అజిత్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే ఏకే 62 సినిమా ఏప్రిల్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముహూర్తం జ‌రుపుకోవాలి. కానీ, ఇప్పుడు అజిత్ తండ్రి మ‌ర‌ణించ‌డంతో ఈ సినిమా ఓపెనింగ్ వాయిదా ప‌డింది. మేలో ఈ సినిమాకు సంబంధించి కంటిన్యూస్ షెడ్యూల్ పెట్టుకుందామ‌ని అన్నార‌ట అజిత్‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సీఈఓ జీకేఎం త‌మిళ్ కుమర‌న్ ఈ విష‌యం గురించి హింట్ ఇచ్చారు. అజిత్ కుమార్ తండ్రి మ‌ర‌ణానంత‌రంవాళ్ల ఇంటికి వెళ్లారు త‌మిళ్ కుమ‌ర‌న్‌.

అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ అజిత్ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే విష‌యం మీద క్లారిటీ రావాల్సి ఉంది. త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు. ఆల్రెడీ ఫిబ్ర‌వ‌రిలో అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఏకే62 పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. మగిళ్ తిరుమేని ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ట్యూన్లు క‌డుతున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.