English | Telugu

సర్జరీ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్‌!

సినిమా హీరోయిన్‌ కావాలనుకునేవారు, ఆల్రెడీ హీరోయిన్‌గా కొనసాగుతున్న వారు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడతారో మనకు తెలిసిందే. ఎందుకంటే టాలెంట్‌ కంటే ముందు అందం ఇంపార్టెంట్‌ అని వారి ఉద్దేశం. టాలెంట్‌ ఎంత ఉన్నా ఆకర్షణీయంగా కనిపించకపోతే అవకాశాలు కూడా రావు అని భావిస్తుంటారు హీరోయిన్లు. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి అందం పెరిగేందుకు సర్జరీలు చేయించుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరిని దురదృష్టం మృత్యువు రూపంలో వెంటాడుతుంది. సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోతారు. తాజాగా అలాంటి ఘటనే ఓ హీరోయిన్‌ విషయంలో జరిగింది. సర్జరీ చేస్తుండగా నాలుగు సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ అవ్వడంతో ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని సావోపాలోకు చెందిన 29 ఏళ్ల లూనా ఆడ్రెడ్‌ హాలీవుడ్‌ సినిమాల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఇంకా మంచి ఆఫర్స్‌ రావాలంటే తన అందం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భావించిన లూనా కాస్మటిక్‌ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడిరది. సర్జరీ జరుగుతున్న సమయంలో ఒకసారి కార్డియాక్‌ అరెస్ట్‌కి గురైంది. డాక్టర్లు మళ్ళీ ఆమెను మామూలు స్థితికి తీసుకొచ్చి ఊపిరి పీల్చుకున్నారు. అయినా మరి కొద్దిసేపటికి మూడుసార్లు కార్డియాక్‌కి గురైంది. ఆమెను రక్షించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, లాభం లేకపోయింది. ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. లూనా మరణ వార్త అక్కడి చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మనదేశంలోనూ అందం కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. దివంగత శ్రీదేవి, సమంత, శృతిహాసన్‌, జాన్వీ కపూర్‌.. ఇలా సర్జరీలు చేయించుకున్న వారిలో ఉన్నారు. ఇక కొందరు బరువు తగ్గేందుకు లైపోసక్షన్‌ చేయించుకుంటూ ఉంటారు. అలా లైపోసక్షన్‌ సర్జరీ జరుగుతుండగా హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌ మరణించిన విషయం తెలిసిందే. కాస్మటిక్‌ సర్జరీ కానీ, లైపో సక్షన్‌ సర్జరీ కానీ అందరికీ సక్సెస్‌ అవ్వవని, కొందరి విషయంలో వికటించి ప్రాణాల మీదకు వస్తోందని తెలిసినా సర్జరీలు చేయించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచం అలాంటిది. ఎదుటివారి కంటే తను అందంగా కనిపిస్తే అవకాశాలు పెరుగుతాయనే నమ్మకమే.. ప్రాణాంతకమైనా సర్జరీల వైపు వారిని పరుగులు తీసేలా చేస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.