బాబు కోసం జాబ్‌ వదిలెయ్యండి : ఐటి ఉద్యోగులకు బండ్ల గణేష్‌ పిలుపు

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్‌ వ్యవహారం రోజురోజుకీ సంచలనంగా మారుతోంది. ఆయన అరెస్ట్‌ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని నినదిస్తూ రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. అన్ని రంగాలు, వర్గాల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగురాష్ట్రాలలోనే కాకుండా, దేశ, విదేశాలలో చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంటులో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయం ప్రస్తావనకు వచ్చింది. సినీ పరిశ్రమ నుంచి కూడా ఒక్కరొక్కరుగా చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో మొదలై, నిర్మాత  కేఎస్ రామారావు ఇలా పరిశ్రమ ప్రముఖులు ఒక్కరొక్కుగా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చంద్రబాబు అరెస్టును ఖండించారు.   చంద్రబాబు జాతీయ సంపద, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎంతో మంది బాగుపడ్డారనీ, ఆయన అక్రమ అరెస్ట్‌ తననెంతగానో బాధించిందనీ పేర్కొన్నారు.   ఆ బాధతో తాను ఇంట్లో  వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదన్నారు.  ఐటి రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి మామూలుది కాదని పేర్కొంటూ, పార్కుల ముందు, రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు. ఐటి ఉద్యోగులు ఒక నెల రోజులు ఉద్యోగాలు మానేసి సొంత ఊళ్ళకు వెళ్ళి బొడ్రాయి ముందు కూర్చొని ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం ఘనవిజయం సాధిస్తుదనీ, . మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారనీ ధీమా వ్యక్తం చేశారు. 

ఆర్ధిక ఉగ్రవాది శ్రీరంగ నీతులు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ పేరుతో ఏపీ సీఐడీ అక్రమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జాతీయ పార్టీల నుండి ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి అమెరికా వరకూ తెలుగు వారు ఎక్కడ ఉన్నా చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలియజేస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో స్పందించిన మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఇది కేవలం కక్షపూరిత చర్యగానే తేల్చేయగా.. రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో జగన్ ప్రభుత్వం, సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఇప్పటికే తేల్చేశారు. చంద్రబాబు  హోదా, వయసుకు గౌరవం ఇవ్వలేదు. పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను తుంగలో తొక్కడం ప్రభుత్వ నియంత, కక్ష సాధింపు వైఖరికి నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ సమయంలో అసలు దేశంలో లేని సీఎం జగన్.. తిరిగి రాష్ట్రానికి వచ్చిన అనంతరం కూడా చంద్రబాబు అరెస్టుపై సూటిగా సమాధానాలు చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే జైలుకు వెళ్లారని బట్ట కాల్చి మోహన విసిరిన చందంగా చెప్పిన జగన్.. అక్రమ అరెస్టు, అక్రమ కేసులపై వివరణ ఇవ్వలేదు. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోవడం, అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవనే ఆరోపణలపై కూడా సమాధానం ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలకే జగన్ పరిమితమయ్యారు. దీంతో జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసుల వివరాలను మరోసారి వెలికి తీస్తున్న పరిశీలకులు.. 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి మరొకరు అవినీతి చేశారని న్యాయస్థానాల కంటే ముందే స్టేట్మెంట్లు ఇవ్వడంపై విస్తుపోతున్నారు. అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టులు తేల్చకుండానే ఓ ఆర్ధిక ఉగ్రవాది సమాజానికి శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటంటూ విస్తుపోతున్నారు. సీఎం జగన్ రెడ్డి మొత్తం 11 సీబీఐ, 7 ఈడీ కేసుల్లోప్రధాన ముద్దాయి కాగా.. 13 ఏళ్లుగా ఈ కేసులు విచారణలో ఉన్నాయి. ఇందులో కొన్నిటిలో ఈడీ ఆస్తులను అటాచ్ కూడా చేసింది. ఈ కేసుల్లోనే జగన్ 16 నెలలు జైల్లో గడిపారు. సీబీఐ అఫిడ విట్ లో పేర్కొన్న రూ.43 వేల కోట్ల అవినీతి సంపదలో ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల ఆస్తులను జప్తు చేయగా.. మిగిలిన అవినీతి సంపదను కూడా జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.  మనీలాండరింగ్, నేరపూరితమైన కుట్ర, మోసం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లంచాలు  తీసుకోవడం వంటి హేయమైన అభియోగాలున్న  జగన్ ఇప్పుడు చంద్రబాబు విషయంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రవచించడం చూస్తే  దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విశ్లేషకుల అంటున్నారు. ఆర్ధిక ఉగ్రవాదులు ఇలా శ్రీరంగ నీతులు బోధించడం మన ప్రజాస్వామ్య  దుస్థితికి అద్దం పడుతోందంటున్నారు. జగన్ అవినీతి కేసులలో ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతున్నది. ఇలా సాగడం వెనక లాబీయింగ్ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నీతి, నిజాయతీ గురించి ప్రవచనాలు చెప్తున్న జగన్ ముందుగా తనపై కేఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి అయ్యేలా సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, అప్పుడే ఆయనకు నీతి, నిజాయతీల గురించి మాట్లాడే అర్హత వస్తుందని అంటున్నారు.  తనపై కేసుల విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులతో తప్పించుకుంటే.. ప్రత్యర్థుల అక్రమ అరెస్టులకు స్క్రిప్ట్ రచించడం ఏమిటని నిలదీస్తున్నారు.  త విదేశాలకు విహారయాత్రలకు వెళ్లిన సీఎంకు పక్కనే ఉన్న హైదరాబాద్ కోర్టుకు వెళ్లే సమయం లేదా అని ప్రత్యర్ధులు ఏకిపారేస్తున్నా మౌనాన్ని ఆశ్రయిస్తున్న జగన్  చట్టం, న్యాయం, నేరాలు, మోసాల గురించి చెప్పడం  ఏమిటని రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. నిజానికి మన దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్ధిక కుంభకోణాలలో జగన్ అక్రమ ఆస్తుల కేసు కూడా ఒకటి. స్వతంత్ర భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడి పైనా లేనన్ని  అవినీతి కేసులు జగన్ పై ఉన్నాయి. అలాంటి వ్యక్తి అధికారంలో ఉండగా.. ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం పెద్ద లెక్కేమీ కాదు. తనతో పాటు అందరినీ దొంగలనే ముద్రవేయాలనుకోవడం విడ్డూరంగా అనిపించకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా జగన్ అదే చేస్తున్నారన్నది పరిశీలకుల వాదన.

బీఆర్ఎస్ కు చంద్రబాబు అరెస్టు సెగ!?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సర్కార్ అక్రమ అరెస్టు సెగ తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ కు గట్టిగా తగులుతోంది. ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలతో సంఘీభావం ప్రకటిస్తున్నారు. పోలీసు ఆంక్షలను సైతం ధిక్కరించి కదం తొక్కుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్ల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించినా, ఐటీ ఉద్యోగులు వెనక్కు తగ్గలేదు. కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనలలో జనం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలకు, ఆందోళనలకు అనుమతులు లేవని పోలీసులు ఆంక్షలు విధించినా జనం ఎక్కడా తగ్గడం లేదు. ఈ పరిస్థితి నిస్సందేహంగా అధికార బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన, నిరసన తెలుపుతుంటే.. అది కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా కాదు.. ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సంఘీభావంగా స్వచ్ఛందంగా శాంతియుతంగా నిరసనలకు దిగితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధించాలన్న ప్రశ్నకు ప్రభుత్వ వర్గాల నుంచి కానీ, అధికార పార్టీ శ్రేణుల నుంచి కానీ సమాధానం రావడం లేదు.  ఏపీలో జగన్ సర్కార్ కు, బీఆర్ఎస్ కు రహస్య మైత్రి ఉందన్న భావన రోజురోజుకూ బలపడేలా చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను బీఆర్ఎస్ సర్కార్ అణచివేత చర్యలు ఉంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు.. తెలంగాణలో తెలుగుదేశం నెత్తిన పాలు పోసిన చందంగా ఉందని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడలేదనీ, నాయకత్వ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ క్రియాశీలంగా లేదని ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర నియోజకవర్గాలలో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్స్ సంఖ్య చాలా అధికం. ఆ సెటిలర్ల మద్దతుతోనే బీఆర్ఎస్ ఇంత కాలం గెలుస్తూ వస్తున్నది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మలక్‌పేట, రాజేందర్‌నగర్ వంటి నియోజకవర్గాల్లో సెటిలర్ల  ఓట్లే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అలాగే  ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో కూడా  సెటిలర్ల ప్రభావం గణణీయంగానే ఉంటుంది. మొత్తంగా పాతిక నుంచి ముఫ్ఫై నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో తెలుగుదేశం చాలా బలంగా ఉందన్నది పరిశీలకుల అంచనా.  ఇంత కాలం రాష్ట్రంలో సెటిలర్ల మద్దతుతోనే బీఆర్ఎస్ గత రెండు ఎన్నికలలో విజయం సాధించగలిగిందన్న సంగతిని బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తుంది. అందుకే సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ పలు సందర్బాలలో చెప్పారు.  అయితే చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా  అరెస్టు చేయడంతో తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనలను కేసీఆర్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేయాలని చూడటంపై సెటిలర్స్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఆగ్రహం వచ్చే ఎన్నికలలో  అధికార పార్టీపై తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలను పోలీసులను ప్రయోగించి అణచివేస్తుంటే కూకట్‌పల్లి  ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారావు  బాబు అరెస్టును ఖండించారు. అలాగే  ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా  బాబు అరెస్టును ఖండిస్తూ వనస్థలిపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, బాబుకు సంఘీభావం ప్రకటించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ అధినేత బాబు అరెస్టుపై ఒక్క ముక్క మాట్లాడకపోవడం.. మరో వైపు ఆందోళనలకు అనుమతులు ఇవ్వకుండా.. పోలీసులను ఉపయోగించడం ద్వార అణచివేస్తున్న క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు బాబుకు సంఘీభావం ప్రకటించే అవకాశాలు లేవు. కానీ కూకట్ పల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు బాబుకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారికి అలా పొల్గొనడం అనివార్యమైంది. బాబుకు మద్దతుగా నిలబడకపోతే వారి వారి నియోజకవర్గాలలో విజయంపై వారు ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితి ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. వాళ్లు వ్యక్తిగత స్థాయిలో బాబుకు మద్దతు పలికినా, బీఆర్ఎస్ ప్రభుత్వం బాబు అరెస్టుపై స్పందించని తీరు మాత్రం బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో తీరని నష్టం చేసే అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ.  ఇక బీజేపీ బహిష్కృత నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బాబు అరెస్టును ఖండించారు. అక్కడితో ఆగకుండా ఏపీలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని కూడా అన్నారు. దీనిపై కూడా పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. రాజాసింగ్ ను బీజేపీ దూరం పెట్టేసిందన్నది సుస్పష్టం. మినీ భారత దేశం అని చెప్పడానికి వీలైన గోషా మహల్ నియోజకవర్గంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం ద్వారా రాజీ సింగ్ కు మంచి మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గోషామహల్ నుంచి పోటీలో దిగడం కంటే ఆయన సైకిలెక్కి తన సొంత నియోజకవర్గంలో నిలబడాలన్న ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చని అంటున్నారు.  మొత్తం మీద ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టు సెగ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు గట్టిగానే తగులుతోందని చెప్పవచ్చు. 

బ్రాహ్మణి.. తెలుగుదేశం అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం!

నారా బ్రాహ్మణి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కోడలు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె. ఇప్పటి వరకూ ఆమె  రాజకీయ యవనికపై కనిపించలేదు. వినిపించలేదు. కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నారు. అయితే  తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక నాయకురాలిగా ఆవిర్భవించారు. సంక్షోభం నుంచి నేతలు పుట్టుకొస్తారు అన్న నానుడికి నిలువెత్తు సాక్ష్యంగా ఇప్పుడు నారా బ్రాహ్మణి తెలుగుదేశం నాయకురాలిగా ఆవిష్కృతమయ్యారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ స్కిల్ స్కాం పేర నిబంధనలను తుంగలో తొక్కి అరెస్టు చేసిన సమయంలో అప్పటి వరకూ ప్రణాళికా బద్ధంగా ఎన్నికలకు సమాయత్తమౌతున్న తెలుగుదేశం పార్టీలో ఒక కుదుపు ఏర్పడింది. జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చి.. తండ్రి అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిలో హస్తినలో ఉన్నారు. మిగిలిన నేతలంతా.. చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తని నారా బ్రహ్మణి ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. భర్త  ఢిల్లీలో ఉంటే.. తాను జనంలోకి వస్తానంటూ ముందుకు వచ్చారు. ఒక్క మీడియా సమావేశంతో ఆమె రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అందరి అట్రాక్షన్ ను తన వైపునకు తిప్పుకున్నారు. మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు నదురూబెదురూ లేకుండా ఆమె ఇచ్చిన సమాధానాలు అందరికీ ఆకట్టుకున్నాయి. స్పష్టమైన అవగాహనతో  జగన్ సర్కార్ తీరును ఎండగట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకత్వ పటిమను ఎత్తి చూపింది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని ఆమె  ప్రశ్నించిన తీరు మహామహా  రాజకీయ నాయకులనే అబ్బురపరిచింది. భర్త అరెస్టుతో దిగాలు పడిన అత్తగారు భువనేశ్వరికి  ఒక పక్క ధైర్యం చెబుతూనే..  మొత్తం పార్టీ శ్రేణులకు కూడా ఆందోళన వద్దు నేనున్నానన్న భరోసా ఇచ్చారు.  తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.హస్తిన నుంచి రాజమహేంద్రవరం చేరుకోగానే లోకేష్‌ను కూడా అరెస్టు చేసి.. తెలుగుదేశం ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నిర్వీర్యం చేసే లక్ష్యంతో జగన్ సర్కార్ పావులు కదుపుతోందన్న వార్తల నేపథ్యంలో  నారా బ్రాహ్మణి ముందుకు వచ్చారు. తన భర్తనూ అరెస్టు చేయవచ్చు.. ఇంకా ఇతర నాయకులను కూడా అరెస్టు చేసినా చేస్తారు. అయినా తెలుగుదేశం బెదరదు, అదరదు అంటూ నినదించారు. ఒక వైపు  లోకేష్ ఢిల్లీలో న్యాయకోవిదులతోపాటు, జాతీయ మీడియా ప్రతినిధులుతో వరస భేటీలు అవుతున్నారు.  జాతీయ మీడియాలో లోకేష్ లైవ్ టాక్ షోలు, ఇంటర్వ్యూలు  అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, జాతీయ మీడియాలో జగన్ సర్కార్ అడ్డగోలు, అరాచక విధానాలను లోకేష్ ఎండగడుతున్న తీరు కేంద్రంపై కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించక తప్పని ఒత్తిడిని రోజురోజుకూ పెంచుతోంది.  ఇక మరో వైపు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే  చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దేశం మొత్తం నిరసన గళం వినిపిస్తున్నది. ఇదంతా ఒకెత్తు అయితే.. నారా బ్రాహ్మణి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. పార్టీ శ్రేణులకు ధైర్యాన్నిస్తూ రాజకీయ యవనికపై అడుగుపెట్టడం తెలుగుదేశం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.  తెలుగుదేశం పార్టీకి గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వార్తలు.. ఎంత కాదనుకున్నా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా పరిణమించాయి. జూనియర్ ఎన్టీఆర్ వినా మొత్తం నందమూరి కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నప్పటికీ.. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు అది వేరే సంగతి. కానీ జూనియర్ ఎన్టీఆర్ దూరం మాత్రం ఎలా చూసినా తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పుకోవలసిన అంశంగా ఇంత కాలం.. అంటే నారా బ్రాహ్మణి  మీడియా ముందుకు వచ్చే వరకూ ఉంటూ వచ్చింది. ఆమె రాజకీయ అరంగేట్రం.. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంతో ఘనంగా చేశారు. ఎన్టీఆర్ వారసత్వం మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆమె వైఫ్ ఆఫ్ లోకేష్ మాత్రమే కాదు.. డాటరాఫ్ నందమూరి బాలకృష్ణ.    ఇంత కాలం హెరిటేజ్ వ్యవహారాలు చూసుకునే యువ వ్యాపార వేత్తగా మాత్రమే అందరికీ తెలిసిన బ్రాహ్మణి.. రాజమహేంద్రవరంలో మీడియా ఎదుట స్కిల్ స్కామ్ పేరుతో జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా, ఎంత అప్రజాస్వామికంగా తన మామ, పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిందో వివరించిన తీరు.. పొలిటికల్ గా ఆమె పరిణితికి అద్దం పట్టాయి. తన మీడియా సమావేశంలో ఆమె ఎక్కడా ఏపీ సీఎం జగన్ పేరెత్తలేదు. పూర్తిగా చంద్రబాబుపై బనాయించిన కేసులు, వాటి డొల్ల తనం, అరెస్టు వెనుక ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వంటి అంశాలకే పరిమితమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకురాలిని ప్రపంచానికి చాటింది. ఉన్నత విద్యావంతురాలైన బ్రహ్మణి  విద్యాభ్యాసం మొత్తం ఇంగ్లీషు మీడియం అయినా ఆమె తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉంది. మీడియా ప్రశ్నలకు బదులీయడంలో ఎక్కడా తడబాటు కనిపించలేదు. తొట్రుపాటు కనిపించలేదు.  తన భర్త లోకేష్‌ను కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయనీ, అయినా తామేమీ భయపడేది లేదనీ చాటిన బ్రహ్మణి.. ఒక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి తెలుగుప్రజలంతా  అండగా ఉండాలంటూ ఇచ్చిన పిలుపు నేరుగా ప్రజల మనస్సులలో నాటుకుంది. ఆమె ఒక్క పిలుపుతో రా ష్ట్రంలో మహిళాలోకం ఒక ప్రభంజనంలా కదిలారనడానికి రాజమహేంద్రవరంలో బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొన్న కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలే సారథులుగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.  అన్ని వర్గాల ప్రజలూ భయం వీడి రోడ్లెక్కి బాబుకు మద్దతుగా ఆందోళన బాట పట్టారు.   ఇక  నెటిజన్లు అయితే   నందమూరి తారకరామారావు నిజమైన వారసురాలు బ్రాహ్మణియే అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.  మొత్తం మీద నారా బ్రాహ్మణి నందమూరి, నారా కుటుంబాల నుంచి వచ్చిన మరో సమర్ధవంతమైన, ప్రతిభామంతమైన నాయకురాలిగా జనం మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో పాతలొల్లి.. ఎన్నికల వేళ ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముంగిటకు వచ్చిన వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఒక పాత పంచాయతీ సరికొత్తగా తెరమీదకు వచ్చింది. తెలంగాణ ఆవిర్భావానికి కారణం మేమంటే మేమంటూ మూడు పార్టీలూ  తెలంగాణ క్రెడిట్ ను, సెంటిమెంటును తమ ఖాతాలో వేసుకోవాలన్న విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే 2014లో తెలంగాణ ఆవిర్భావానికి అప్పటి తెరాస, ఇప్పటి బీఆర్ఎస్ ఉద్యమమే కాకుండా, తెలంగాణ ఇవ్వాలన్న అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం, ఆ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీజేపీ మూడూ కారణమేనని పరిశీలకులు చెబుతున్నారు. అన్నిటికీ మించి తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిన ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్, పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంతా రాజకీయ నాయకులంతా తెలంగాణ కోసం నిలబడటం కారణంగానే కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) అయినా, బీజేపీ అయినా మరెవరైనా సరే తెలంగాణ నినాదం ఎత్తుకోకుంటే రాజకీయంగా ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కనుకనే తెలంగాణ సాకారమైందన్నది మాత్రం వాస్తవం. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలో  తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత నాలుగేళ్లకు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఆ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్  విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన జాతీయ రాజకీయాలంటూ ఒక విధంగా నేల విడిచి సాము చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ పార్టీ చేసేశారు. దీంతో ఆయన   తెలంగాణ సాధించాను అని చెప్పుకునే అవకాశాన్ని ఈ ఎన్నికలలో చేజేతులా జారవిడుచుకున్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి జన్మదిన కానుకగా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాలంటూ తెలంగాణ సెంటిమెంటును అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో అప్పట్లో పెద్దమ్మనే కాదు చిన్నమ్మనూ గుర్తుంచుకోండి అంటే కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా చేసిన వినతిని గుర్తు చేస్తూ అప్పటి విపక్షం బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లనే తెలంగాణ సాకారమైందనీ, తెరాస ఆవిర్భావానికి ముందే బీజేపీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిందనీ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. దీంతో ఇప్పుడు మూడు పార్టీలూ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మూడూ కూడా తెలంగాణ ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? సాకారం చేసిందెవరు? అన్న ప్రచారంతో ప్రజల ముందుకు వస్తున్నారు.   ఈ ప్రచారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఒకింత దూకుడు ప్రదర్శిస్తోంది. 1998 నుంచి  తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోందని కిషన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. అలాగే అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్  సమైక్యత దినం అంటూ మాట మార్చారని విమర్శిస్తున్నారు.  ఏరకంగానైతే.. 15 ఆగస్టు, 26 జనవరి నిర్వహిస్తామో.. అలాగే సెప్టెంబర్ 17ను కూడా రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా జరపాల్సిన అవసరం ఉంది.   కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా  తెలంగాణ ఉత్సవాలు నిర్వహించామని కిషన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అంటున్నారు.  మొత్తం మీద రాష్ట్రంలో మూడు పార్టీలూ తెలంగాణ తెచ్చింది? ఇచ్చింది, సాకారం చేసింది మేమేనంటున్నారు. అయితే ప్రజలు ఏ పార్టీని విశ్వసిస్తున్నారు? తెలంగా ఆవిర్భావమై పదేళ్ల తరువాత అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షల గురించి కాకుండా ఇంకా సెంటిమెంటునే పట్టుకు వేళాడటాన్ని ప్రజలు ఎలా తీసుకుంటున్నారు అన్నది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం(సెప్టెంబర్ 18)  శ్రీవారిని 62వేల 745 మంది దర్శించుకున్నారు. వారిలో 24వేల 451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల పది లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (సెప్టెంంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇలా ఉండగా  ఏపీ సీఎం జగన్ మంగళవారం (సెప్టెంబర్ 19) తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు, అర్చకును సంప్రదాయబద్ధంగా మంగళవాద్యాలు, వేద మంత్రాల నడుమ ఇస్తికాపాల్ స్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు.   శ్రీవారి దర్శనం అనంతరం జగన్ కు రంగనాయకుల మండపం వద్ద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. తరువాత టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జగన్ కు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.  ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు జగన్ వెంట ఉన్నారు.  

డామిట్ కథ అడ్డం తిరగింది! ఆందోళనలో వైసేపీ నేతలు

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జరగని అవినీతిని జరిగినట్లు చూపిస్తూ, , వైసీపీ ప్రభుత్వం  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని  అక్రమంగా అరెస్ట్ చేసింది. గత వారం రోజులగా కేసు పూర్వాపరాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది.  అందుకే  అనకాపల్లి నుంచి అమెరికా వరకు చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే, వైసీపీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఎటూ మళ్ళీ గెలిచేది లేదని నిర్ణయానికి వచ్చిన కొందరు మంత్రులు, మరి కొంత మంది నాయకులు మినహా, మిగిలిన నాయకులు, శ్రేణులు లోలోపల కుతకుతలాడి పోతున్నారని అంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు అయితే మరింతగా  కలవర పడుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి, ముఖ్యమంత్రి జగన్ పెద్ద తప్పు చేసారని,ఆయన నిర్ణయం పిలిచి మరీ తన్నించు కున్నట్లు ఉందని అంటున్నారు.    అంతే కాదు,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టాలను కొని తెచ్చుకున్నారా? చంద్రబాబు అరెస్ట్  విషయంలో జగన్ రెడ్డి లెక్క తప్పిందా? అంటే అవుననే అంటున్నారు  వైసీపే నాయకులు, అభిమానులు. చంద్రబాబును జైలుకు పంపిస్తే తమకు ఎదురుండదని, తద్వారా రేపటి ఎన్నికల్లో తమకు తిరుగుందందని జగన్ రెడ్డి ఉహించారు. అయితే, ఆయన  రచించిన, వ్యూహం బెడిసి కొట్టింది. స్వయంగా జగన్  రెడ్డే ఇప్పడు   డామిట్ ..కథ అద్దం తిరిగిందని, తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అరెస్ట్తో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్   వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సైతం, చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ రెడ్డిని   తప్పు చేస్తున్నావ్  జగన్ అని హెచ్చరించిట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  చంద్రబాబు  రిమాండ్  కొనసాగినా, ఆయన జైల్లోనే ఉన్నా  తెలుగు దేశం పార్టీదే గెలుపని తాజా సర్వేలు సూచిస్తున్నాయని అంటున్నారు.  మరో వంక  చంద్రబాబు అక్రమ అరెస్ట్  ని వ్యతిరేకిస్తూ వేర్వేరు రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు.తెలుగు సినిమా రంగ ప్రముఖులే కాకుండా, తమిళ సినిమా రంగ ప్రముఖులు సైతం చంద్రబాబుకు అండగా నిలిచేందుకు ముందు కొస్తున్నారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, ఓపెన్ గా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడమే కాకుండా,  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్ర బాబును పరామర్శించేందుకు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును పరామర్శించేందుకు రజనీ కాంత్ వస్తున్నారని ప్రచారం జరిగింది. నిజానికి అది ప్రచారం కాదు, నిజం. అదే విషయాన్ని రజనీకాంట్ స్వయంగా  చెప్పారు. కుటుంబ  సభ్యులతో కలిసి కోయంబత్తూరు వచ్చిన రజనీకాంత్ ను ఈ విషయమై మీడియా ప్రశ్నించింది. అందుకు.. రజనీకాంత్,  అవును  చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఈ రోజు (ఆదివారం) వెళ్లాలనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదు  అని చెప్పారు. అంటే  ప్రస్తుతానికి స్వయంగా ఆయన వచ్చినా, రాకున్నా చంద్రబాబుకు ఆయన సంపూర్ణ మద్దతు ఉండనే విషయం మరో మారు స్పష్టమైంది. దీంతో  నెల్లూరు, చిత్తూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజనీ ఫాన్స్   చంద్రబాబు కు మద్దతు తెలుపుతున్నారు.  నిజానికి,చంద్రబాబు అరెస్ట్ జరిగిన వెంటనే రజనీకాంత్ ఫోన్ చేసి నారాలోకేష్ ను పరామర్శించారు. నిజానికి, ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు  ఇంకా చాల మంది తెలుగు  తమిళ సినిమా ప్రముఖులు, చంద్రబాబు అరెస్టును తప్పు పడుతున్నారు. అయితే, తొందరపడకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని  అనేక మంది సినిమా ప్రముఖులు  ఎదురు చూస్తున్నారు.దీంతో, ముందు ముందు, మరిన్ని కష్టాలు తప్పవని వైసేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోదీజీ మాట్లాడరేం?

విషయం, సందర్భం వేరు కావచ్చు, కానీ, సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు,  ఆంధ్ర ప్రదేశ్లో ఏమి జరుగుతోందో మాకు తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన , సాగుతున్న కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులకు అద్దం పడుతున్నాయి. అవును, ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీకోర్టు న్యాయమూర్తులు ఏపీలో ఏం జరుగుతోందో మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.   అంటే, ఏపీలో ఏమి జరుగుతోందో సుప్రీం కోర్టులు తెలుసు. అయినా  నాలుగున్నరేళ్ళ వైసీపీ అరాచక పాలనకు పరాకాష్టగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వ్యవహరం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం గీత దాటి ప్రవర్తిస్తున్నప్పుడు  కేంద్ర ప్రభుత్వం  జోక్యం చేసుకోవలసిన అవసరం లేదా? చంద్రబాబు అక్రమ అరెస్టు  విషయంలో, ముఖ్యంగా అరెస్ట్ తీరును, ఉభయ తెలుగు రాష్ర్టాల బీజేపీ  నాయకులు సహా పలువురు రాజకీయేతర రంగాల   ప్రముఖులు, ఖండించారు. ఖండిస్తున్నారు. కేవలం ఖండించడమే కాకుండా, దేశ,విదేశాల్లో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా యువత, ఐటీ ఉద్యోగులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు. ఎందుకు కళ్ళు తెరవదు? ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న ప్రశ్న. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు ...  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా తెలుగు దేశం ముఖ్య నేతలు అందరినీ అరెస్ట్ చేస్తామని మంత్రులు బహిరంగంగానే బెదిరింపులకు దిగడం ఏమిటని? ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా   కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని  నిలదీస్తున్నారు. మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు అందరి వేదనకు అద్దం పడుతూ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. మీకు తెలియకుండానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో..  మీరు జీ20 శిఖరాగ్ర సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా.. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది  అని కేఎస్ రామారావు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. కానీ  రాష్ట్ర పౌరుడిగా, భారత పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక  భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు ప్రధాని హోదాలో మీరూ వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు విజన్ ను పొగిడారు. అమరావతి ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజధాని అవుతుందని అన్నారని కేఎస్ రామారావు ఆ లేఖలో గుర్తు చేశారు.   ఆ తర్వాత 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా  ప్రజావేదిక కూల్చివేతతో   విధ్వంసక పాలన ఆరంభించారు,  అమరావతిని రాజధానిగా ఉండనివ్వకూడదని ప్రకటించి.. మూడు రాజధానులంటూ ఒక పల్లవి ఎత్తుకుని.. అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ప్రధానిగా మీరు  (మోడీ) శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో జగన్ తీరును మీరు ఇప్పటికీ ఖండించలేదు.  మౌనాన్ని ఆశ్రయించారు. అలాగే దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కుదిపేసింది. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధానమంత్రిగా మీరు గమనించలేదా అని ప్రశ్నించారు. నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన కృషి ఏమిటో మీకు తెలియదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న బడబాగ్నిని మీరెందుకు గమనించలేకపోతున్నారు. లేక రాజకీయ లబ్ధి వినా ప్రధానిగా మీరింకే విషయాన్నీ పట్టించుకోరా అని నిలదీశారు.  ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని కేఎస్ రామారావు తన లేఖలో  ప్రధానిని కోరారు. అంతేగాక, ప్రధానమంత్రిగా మీకున్న అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండి. ఆ చర్యతో తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. తక్షణం స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అని తన లేఖలో ప్రధాని మోడీని కేఎస్ రామారావు కోరారు.   నిజానికి, సినీ నిర్మాత కేఎస్ రామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై ఆయన సంతకం ఒక్కటే ఉన్నా ..  అది ఐదు కోట్ల ఆంధ్రుల సంతకమేనని చెప్పాలి. ఐదు కోట్ల ఆంధ్రుల హృదయస్పందనకు కేఎస్ రామారావు లేఖను దర్పణంగా చూడాలి. నిజానికి కేఎస్ రామారావు సంతకం చేసిన లేఖ ఆంధ్రులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల తెలుగు వారిదే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి  హస్తాక్షరి ... ఆ ఒక్క సంతకం.  అందుకే  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో  జోక్యం చేసుకోవలసిన అవసరం వుంది , ప్రాజస్వామ్యం మరింత పలచనై, ప్రజల విశ్వాసాన్ని మరింతగా కోల్పోతుందని, ప్రజస్వామ్య పరిరక్షణ వేదికలు హెచ్చరిస్తున్నాయి. 

చంద్రబాబు అక్రమ అరెస్టు.. తెలుగుదేశంకు సంక్షోభంలోనూ సానుకూలం!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య అంటే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   పేద విద్యార్థులలో  నైపుణ్యం పెంపుకోసం చేపట్టిన ప్రాజెక్టులో తప్పులు వెతికి.. తీవ్రమైన సెక్షన్లను ఆపాదించి చంద్రబాబును అరెస్ట్ చేయడంపై సామాన్య జనం కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేధావుల నుండి విశ్లేషకుల వరకూ.. మాజీ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుని విడుదల చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ల, చెన్నై... ఇలా దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారు.  అమెరికాలోని ప్రధాన నగరాలలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ తెలుగు వారు నిరసనలు తెలుపుతున్నారంటే చంద్రబాబుకు మద్దతు ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.  అయితే, చంద్రబాబు జైలు నుండి బయటకి వస్తారా? వస్తే ఎప్పుడు వస్తారు?  హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఏ విధంగా ఉంటుంది?   భవిష్యత్ పరిణామాలేంటి? చంద్రబాబు మరి కొంత కాలం జైలులోనే ఉండాల్సి వస్తే.. తెలుగుదేశంను ముందుకు నడిపించేది ఎవరు? ఇలా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది  ఈ పరిస్థితిని   ఒక సంక్షోభంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరికొందరైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంక్షోభంలోనూ సానుకూలమేనని భావించాలంటున్నారు. ఎటూ ఇది అక్రమ అరెస్టు అనేది ప్రజలలోకి బలంగా వెళ్లిందనీ, తెలుగుదేశంకు, చంద్రబాబుకు ప్రజా మద్దతు దండిగా ఉందని, నాలుగేళ్ళ జగన్ కక్షపూరిత పాలన, వైసీపీ నేతల వ్యాఖ్యలు విన్న ప్రజలు ఇది కూడా జగన్ సర్కార్ కక్షపూరితంగా, అక్రమంగా వ్యవహరిస్తున్నదని బలంగా నమ్ముతున్నారు. అన్ని వైపుల నుంచీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా, చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కనుక ఇది టీడీపీకి అనుకూల అంశమని వాదిస్తున్నారు.   భారీ సంక్షోభాలను చూసిన చంద్రబాబుకు ఈ కేసులు పెద్ద లెక్కేమీ కాదు. కేంద్రంలో చక్రం తిప్పి దేశాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆ నాయకుడు ఇప్పుడు ఈ అక్రమ కేసులకు ఉలిక్కిపడతారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో వైసీపీకి తీరని డ్యామేజీ జరిగింది. ఇంకా ఇంకా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి   అమెరికా వరకూ ఎక్కడ చూసినా చంద్రబాబు అక్రమ అరెస్టుపైనే చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టే ప్రధాన వార్తగా హైలైట్ చేస్తున్నది.  జగన్ మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు జాతీయ మీడియాకు బాగా తెలిసిన పొలిటీషియన్. దీంతో జాతీయస్థాయి మీడియా ఏపీ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఢిల్లీకి వెళ్లి అక్రమ అరెస్టును చర్చకు పెట్టారు. నేషనల్ మీడియా ఛానెళ్లలో కూర్చొని సీఎం జగన్ మోహన్ రెడ్డికి లైవ్ లో సవాళ్లు విసురుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నేతల నుండి కూడా చంద్రబాబుకు భారీ మద్దతు లభిస్తుంది.  ఏపీలో తెలుగుదేశం, జనసేన క్యాడర్ కలిసి సమష్టిగా  నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అమెరికాలో చేపట్టిన నిరసనలలో కూడా జనసేన మద్దతు దారులు కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలనే కాదు   సామాన్య జనాన్ని కూడా కదిలించింది. జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి.. పోలీసు నిర్బంధాలను కూడా లేక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు. ఇక రేపు చంద్రబాబు స్వచ్ఛంగా పులు కడిగిన ముత్యంలా బయటకు రాగానే  తెలుగుదేశం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఒక రోజు అటూ ఇటూగా చంద్రబాబుకు ఈ కేసులు బెయిలు రావడం తథ్యమని, ఆయనపై వైసీపీ అక్రమంగా బనాయించిన ఈ కేసు నిలవదని న్యాయనిపులు మీడియా చర్చలలో సోదాహరంగా వివరిస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా తన ఓటమిని, తన పతనాన్ని తానే లిఖించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జైళ్ల శాఖ డీఐజీగా బుగ్గన బంధువు.. టార్గెట్ బాబేనా?!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు కేటాయించిన నిధులలో స్కాం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి.. అర్ధరాత్రి అక్రమ అరెస్టుతో ఆయనను జైలుకు పంపింది. చంద్రబాబుపై బనాయించిన కేసులు అక్రమమని.. కనీస ఆధారాలు కూడా లేకుండా ఆయనను అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా.. కనీసం చంద్రబాబును సీఐడీ రిమాండ్ కు కూడా ఇవ్వలేదు. అయితే, చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసు వివరాలు, నేరం జరిగిందా లేదా అన్నది ఎలా ఉన్నా ఎన్ఎస్జీ జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తి భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి సారించాలి. కానీ, ఇప్పుడు ప్రభుత్వంపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కక్ష్ పూరితంగానే ఈ కేసు పెట్టారని ఇప్పటికే స్పష్టమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక్కటే కాదు.. మరో మూడు కేసులు సిద్ధంగా ఉన్నాయని.. చంద్రబాబును జైలుకు పరిమితం చేస్తామని.. ఇక ఆయనను బయటకి రానివ్వమని వైసీపీ నేతలు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు జైల్లో విశ్రాంతి లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయంలో జైలు బ్యారక్స్ వద్ద పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆయనను నిద్రపోనివ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పెళ్లి రోజున ఆయన భార్య భువనేశ్వరిని ములాఖత్ కు అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైల్లో ఆయనను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని   తీవ్ర విమర్శలకు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చంద్రబాబును హింస పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు ఈ అంశంలో మరో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి జైలుకు సూపరిండెంట్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లగా.. ఆయన స్థానంలో జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీగా ఎం.ఆర్.రవికిరణ్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ సమీప బంధువు కాగా.. ఇప్పుడు ఆయనకు ఈ రాజమండ్రి జైలు బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు రవి కిరణ్ కడపలో పనిచేయగా.. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు చూశారు. ఆ సమయంలో వివేకా హత్యకేసు నిందితులను కోర్టు అనుమతి లేకుండా ఖైదీల్ని బయటకి వదిలి జైలు కాదు గెస్ట్ హౌస్ అనేలా చేశారని విమర్శలున్నాయి. అప్పట్లో ఆయన తీరును సీబీఐ కూడా కోర్టులో తప్పు పట్టింది.  అయితే, ఇప్పటికిప్పుడు ఆయన్ను హఠాత్తుగా కోస్తాంధ్రకు తీసుకురావడం, రాజమండ్రి జైలు సూపరిండెంట్ సుదీర్ఘ సెలవుపై వెళ్లడం.. జైలు బాధ్యతలను రవి కిరణ్ చూసుకోవడం అంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.   జైల్లో చంద్రబాబును ఏం చేయబోతున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన డీజీపీ రవి కిరణ్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తాను బంధువునేనని.. అంత మాత్రాన తాను ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్నంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తానన్న ఆలోచన సరికాదని చెప్పుకొచ్చారు. కానీ, వివేకా హత్యకేసు నిందితుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. సీబీఐ కోర్టులోనే ఆయనపై ఆరోపణలు చేయడం రావడం వంటి ఘటనలతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు బలపడుతున్నాయి.   మరి ప్రభుత్వ పెద్దల వ్యూహమేంటో.. ఏ ఉద్దేశంతో జైలు బాధ్యతను రవికిరణ్ కు అప్పగించారో చూడాల్సి ఉంది.

రెండేళ్లుగా నరకం చూపించారు..సీమెన్స్ మాజీ ఎండీ సంచలన వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి విదితమే. ఆయన అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలలోనూ, దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ రాజకీయనాయకులు, మేధావులూ, న్యాయనిపుణులు గొంతెత్తుతున్నారు. చంద్రబాబుకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ప్రభుత్వం కక్షపూరిత చర్యలలో భాగంగానే ఈ అక్రమ కేసులు పెట్టినట్లు అన్ని వైపుల నుండి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఉద్యోగ, ఉపాధి కల్పనలో  యువతకు అవకాశాల కోసం మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది. 3 వేల కోట్ల రూపాయల్లో 10 శాతం  ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ పది శాతం సొమ్ము ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీనిపై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ సంస్థలో స్కాం జరిగేందుకు అవకాశమే లేదన్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్.. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని కుండబద్దలు కొట్టారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించిన ఆయన.. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అసలు అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ చేస్తున్న ఆరోపణలకు అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రభుత్వ సంస్థ కాదా అని ప్రశ్నించిన సుమన్ బోస్.. తప్పుడు ఆరోపణలు చేయడం సులువని, నిరూపించడం సాధ్యం కాదన్నారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని.. కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని ఆయన వెల్లడించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే..  ‘2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చింది. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.. వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉంది. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని తేల్చేశారు. ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందంటే.. 'విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు.. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించింది. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం. కియా మోటర్స్ సంస్థ కోసం మానవ వనరులకు గొప్పగా శిక్షణ ఇవ్వడంపై ఆ సంస్థ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. రెండున్నరేళ్లుగా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో ఏర్పాటు చేసిన   ల్యాబ్‌లు కనిపిస్తున్నా.. అగ్రిమెంట్ జరగలేదని ఆరోపించడం దారుణం. ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది స్కాంగా కనిపించడం విస్తుగొలుపుతోంది. విస్మయపరుస్తోంది. కోర్టులకు అన్ని వివరాలు చెబుతాం. సీమెన్స్ మాజీ ఎండీ మీడియా ముందుకు వచ్చి చెప్పిన వివరాలతో జగన్ సర్కార్ చంద్రబాబుపై బనాయించిన కేసు పూర్తిగా నిరాధారమైనదని తేటతెల్లమైపోయింది.  చంద్రబాబుపై కక్ష పూరితంగానే, వేధింపు చర్యలలో భాగంగానే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని మేధావులూ, ప్రజలూ చేస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలని రుజువైపోయింది. 

అక్రమ కేసులకీ అసెంబ్లీని వాడుకుంటారా?

ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు 21వ తేదీన మొదలైతే ఎన్నిరోజులు జరగాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ అవుతుంది. కాకపోతే, వర్షాకాల సమావేశాలు కాబట్టి సుమారు ఐదారు రోజులు నిర్వహించే అవకాశం ఉందన్నది అంచనా.  మరి ఈ సమావేశాలలో ప్రభుత్వం ఏం ప్రతిపాదనలు చేయనుంది? ఎలాంటి నిర్ణయాలను తీసుకోనుంది? ఏపీ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఏం చెప్పనుంది? ప్రతిపక్ష పార్టీ ఈ సమావేశాలలో పాల్గొంటుందా? పాల్గొంటే ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలనుకుంటుంది? సహజంగానే ఇలాంటి చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. ఇది ఎన్నికల ఏడాది కనుక ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఏ స్థాయి హీట్ పెంచనున్నాయన్న ఉత్కంఠ కూడా నెలకొంది. అధికార పార్టీ ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి తాయిలాలు సిద్ధం చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఏపీలో ఇప్పుడు  మాత్రం పైన చెప్పుకున్న అంశాల కన్నా టీడీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సెషన్ ను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు పరిశీలకులు విశ్లేషించింది. తమ ప్రభుత్వం అంత చేసింది.. ఇంత చేసింది అని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకుంటూనే చంద్రబాబును ఒక అవినీతి పరుడిగా చిత్రీకరించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, అస్సైన్డ్ భూములు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలకు ఇచ్చిన రాయతీలు ఇలా అన్నిటిలో తెలుగుదేశం పార్టీని కుట్రదారుగా చూపించాలని.. చంద్రబాబును దోపిడీ దారుగా చూపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నార చెబుతున్నారు. తెలుగుదేశం సభ్యులు  అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు తక్కువ గా ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన బాటలో ఉన్న తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఈ సమావేశాలను పూర్తిగా తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకే వినియోగించుకోవాలని వైసీపీ పన్నాగం పన్నుతున్నదంటున్నారు. నిజానికి అసెంబ్లీ వేదికగా అవినీతి ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. చంద్రబాబు కేసు కోర్టు మెట్లెక్కేసింది. కాకపోతే ఇంకా ట్రయల్ మొదలు కాలేదు. సీఐడీ కస్టడీకి కోరినా అక్రమ అరెస్టుతో కోర్టు ముందు వివరాలు కావాలని కోరింది. మరోవైపు చంద్రబాబు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా బెయిల్ దరఖాస్తు చేసున్నారు. రెండు చోట్లా కేసుపై విచారణలు మొదలైతే   ఈ కేసు బండారం బయట పడిపోతుంది.  అసలు ఈ కేసు నిలబడుతుందా? అన్న అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ నిలబడితే దర్యాప్తు జరిపి అప్పుడు అవినీతి జరిగిందా? లేదా అన్నది కోర్టు తేలుస్తుంది.   కానీ, జరిగిన,  జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఇందులో కుట్ర ఉందన్నది విశ్లేషకుల వివరిస్తున్నారు. మేధావులు, మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులూ కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, కక్షపూరిత రాజకీయంలో భాగమే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు అక్రమ అరెస్టు వల్ల ఇప్పటికే వైసీపీకి భారీ నష్టం వాటిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది    ప్రభుత్వం  ప్రతిపక్షంపై ఇలా తప్పుడు కేసులు పెట్టి వాటిని తిరిగి అసెంబ్లీలో చర్చ పెట్టి చర్చిస్తామని చెప్పడం.. కోర్టులు కేసును తేల్చక ముందే చట్టసభలలో దోషులుగా ముద్ర వేయాలని ప్రయత్నించడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఎక్కడైనా కేసులు పెడితే దర్యాప్తు చేసి కోర్టులో పెట్టి శిక్షలు వేస్తారు. దీనికి పక్కా ఆధారాలు కావాలి. కానీ, ఇక్కడ అవే లేకపోవడంతో బట్ట కాల్చి మీద వేయడమే ప్రభుత్వ వ్యవహారశైలిగా భావించాల్సి వస్తున్నదంటున్నారు.   అందుకు అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని ప్రయత్నించడం ప్రభుత్వ దుర్మార్గం వినా మరొకటి కాదని చెబుతున్నారు.  అదే జరిగితే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ చివరికి రాజకీయ కక్షల కేసుల కోసం చేసే దుష్ప్రచారానికి వేదిక కావడం ఏపీ ప్రజల దురదృష్టంగానే భావించాలి.

స్కిల్ స్కాంలో ఉన్నది కుంభకోణం కాదు.. జగన్ కక్షకోణమే!

అంతా మీరే చేశారు.. అవును నాన్నా అంతా మీరే చేశారు. బొమ్మరిల్లు సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కాస్త స్ట్రిక్ట్ గా ఉండే నాన్నలను బొమ్మరిల్లు ఫాదర్ అని పిలుచుకొనేంత ఫేమస్ అయ్యిందీ డైలాగ్. ఇదే డైలాగ్ ను కనుక ఏపీ రాజకీయాల కోణంలో చూస్తే అంతా జగనే చేశారని చెప్పుకోవాలి. ఎంతలా అంటే ఇప్పుడు ఏకంగా తన చేతిలో ఉన్న అధికారాన్ని  వెండిపళ్లెంలో పెట్టి మరీ తెలుగుదేశంకు అప్పగించేంతగా అంతా జగనే చేస్తున్నారు. అవును ఇక్కడ చెప్పుకుంటున్నది చంద్రబాబు అరెస్ట్ గురించే. స్కిల్ డెవలప్మెంట్ కేసేంటి.. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన నేరం ఏంటి? అసలు కుంభకోణం జరిగిందా? జరిగితే ఎంత మొత్తంలో ఇది జరిగింది లాంటి అంశాలన్నీ కోర్టులే తేల్చాలి. అయితే  ఇప్పుడు ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు మాత్రం అక్రమమేనని స్పష్టంగా తేలిపోయింది. రిటైర్డ్ అధికారుల నుండి న్యాయమూర్తుల వరకూ అందరూ ముక్తకంఠంతో ఈ అరెస్టును ఖండిస్తున్నారు.  కేసు పరిధి ఏంటి.. స్థాయి ఏంటి.. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి అనే అంశాలు కాస్తా ప్రజలకు తెలిసిన అనంతరం అసలు ఈ కేసు కూడా కుట్ర పూరితమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక వైపేమో అక్రమ అరెస్ట్.. మరోవైపేమో కుట్ర  అనుమానాలతో ఇప్పుడు చంద్రబాబు పట్ల అభిమానం, సానుభూతి గతం కంటే చాలా చాలా ఎక్కువగా  జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలలో ఆయనకి దక్కుతున్న మద్దతు చూస్తున్న ఏపీ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్లుకోకుండా ఉండలేకపోతున్నారు. జగన్ తన చేతులతో టీడీపీలో కదలిక తెచ్చాడని.. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ అభిమానులందరినీ జగనే ఏకతాటి పైకి వచ్చేలా చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఈ అరెస్టుతో జనసేన-తెలుగుదేశం ఒక్కటయ్యాయి. దీంతో రాష్ట్రంలో రెండు పార్టీల కార్యకర్తల కలయిక ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కలిసి కట్టుగా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు.  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ అంశమే వినిపిస్తున్నది. పల్లెల్లో రచ్చ బండల దగ్గర నుండి నగరాల్లో పార్కుల వరకూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సానుభూతి వ్యక్తం అవుతోంది. పేద విద్యార్థులలో నైపుణ్యం పెంచేందుకు చంద్రబాబు సంస్థ ఏర్పాటు చేస్తే అందులో జగన్ తప్పులు వెతికి అరెస్ట్ చేయించాడని.. అది కూడా కనీస ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేయించారన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.  జగన్ తండ్రి అధికారంలో ఉండగా అక్రమ ఆస్తుల విలువతో ఈ కేసును పోలుస్తున్న మరికొందరు.. ఎవరికీ ఉపయోగం లేని సంస్థలను ఏర్పాటు చేసి వేల కోట్లు వెనకేసుకున్న వ్యక్తికి.. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంస్థలో తప్పులు కనిపించడం పెద్ద వింతేమీ కాదని చర్చించుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుపై స్పందించి చంద్రబాబు అడ్డంగా దొరికారని చెప్పినా.. అది  గుడ్డ కాల్చి మోహన వేసే ప్రయత్నం చేయడమే తప్ప మరోటి కాదని జనం భావిస్తున్నారు. ఇదిగో ఆయన చేసిన నేరం ఇదీ అని నాలుగు మాటలు మాట్లాడలేని జగన్ అడ్డగోలుగా చంద్రబాబు తప్పు చేశాడని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అర్ధమైపోయింది.   ఒకవైపు రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన రాజకీయాలు.. మరోవైపు దేశవ్యాప్తంగా చంద్రబాబుకు పెరిగిన మద్దతు.. ఈ కేసుపై వైసీపీ నేతలు పదే పదే దోపిడీ గురించి మాట్లాడడం.. చంద్రబాబు కుటుంబం ఆయన కోసం జైలు వద్ద పడిగాపులు కాయడం.. కోర్టుల చుట్టూ తిరగడం అన్నీ టీడీపీకి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   స్కిల్ కేసులో చంద్రబాబు బయటపడినా.. మరో మూడు నాలుగు కేసులు సిద్ధంగా ఉన్నాయని వైసీపీ నేతలు ముందే చెప్పడం చూస్తున్న ప్రజలు.. ఇది కుంభకోణం కాదని కక్ష కోణం అని నిర్ధారణకు వచ్చేశారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఏ మాత్రం పట్టించుకోకుండా.. సీఎం జగన్ తెలుగుదేశం నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఈసారి జగనే తన చేతులతో తానే స్వయంగా తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

బ్రింగ్ ఇట్ ఆన్.. లోకేష్ చాలెంజ్ కు జగన్ మైండ్ బ్లాక్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఔను.. జాతీయ మీడియాతో  లోకేష్ వరుస భేటీలు జరుపుతున్నారు.  ఇంటర్వ్యూలలో, లైవ్ డిబెట్లతో అదరగొడుతున్నారు. సూటిగా, సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా లోకేష్ మాట్లాడుతున్న తీరు.. ఆర్.టివిఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ తో లైవ్ డిబేట్ లో,  ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు.. జాతీయ స్థాయిలో ఆయన స్థాయిని పెంచింది.  ఇంత కాలం చంద్రబాబు నాయుడి తనయుడిగా మాత్రమే చూసిన జాతీయ నాయకత్వం ఇప్పుడు ఆయనను పరిణతి చెందిన నేతగా గుర్తించక తప్పదని చెబుతున్నారు. తన యువగళం పాదయాత్ర ద్వారా ఇప్పటికే ఆయన తానేమిటో, తన సమర్ధత, సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు చాటారు. రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే నారా లోకేష్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీ ఆయనను టార్గెట్ చేసి ట్రోల్ చేసింది. బాడీ షేమింగ్ చేసింది. ఆయన అలవాట్లను కూడా ఎగతాళి చేసింది. పప్పు అంటూ హేళన చేసింది. అయితే వాటన్నిటినీ అధిగమించి నాడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆయన నాయకత్వ పటిమను ప్రశంసించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ తెలుగుదేశం భవిష్యత్ నేత.. ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన యువనాయకుడు. యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమౌతున్న తీరు మేధావుల నుంచీ సామాన్యల వరకూ అందరి ప్రశంసలూ అందుకుంది.  అదంతా ఒకెత్తయితే.. పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్టు చేసిన నాటి నుంచీ ఆయనలోని నాయకత్వ పటిమను, సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కొని.. వాటిని అధిగమించడమే కాకుండా సానుకూలంగా మార్చుకోవడంలో చూపిన నైపుణ్యం పరిణతిని బయటకు తీసుకువచ్చింది.   ప్రతి విషయంపైనా ఆయనకు ఉన్న సాధికారతను ప్రపంచం కళ్లకు కట్టింది. జాతీయ స్థాయి మీడియా ఆయన ఇంటర్వ్యూల కోసం, ఆయనతో లైవ్ డిబేట్ల కోసం క్యూకట్టేలా చేసింది. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు హస్తిన చేరుకున్న ఆయన ఇప్పుడు నేషనల్ మీడియాకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. దీంతో జాతీయ మీడియాలో ఆయనను ఇంటర్వ్యూ చేయకపోతే వెనుకబడిపోతామన్న భావన  వ్యక్తం అవుతోంది. అందుకే ఆర్టీవీ, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా సంస్థలు ఆయనతో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహించింది.  కేవలం రెండు రోజులలోనే  జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థలన్నీ లోకేష్ తో లైవ్ డిబేట్లు, ఇంటర్వ్యూలూ ప్రసారం చేశాయి.  ఇలా  మీడియా ఇంటర్వ్యూలలో బిజీబిజీగా ఉంటూనే మరో వైపు త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశా నిర్ధేశం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే జాతీయ స్థాయిలో అన్న రాజకీయ పార్టీల మద్దతూ కూడగడుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో  చంద్రబాబుు అక్రమ అరెస్టును ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలూ గళమెత్తేలా  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.  ఇంతటి బిజీ షెడ్యూల్ లోనూ.. ఎక్కడా ఆయన ముఖంలో అలసట అనేదే కనిపించడం లేదు. ఆర్.టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ తో లైవ్ డిబేట్ అంటే మహా మహా సీనియర్ నేతలే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.  తన ప్రశ్నలతో నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసి వారిని ఇబ్బందుల్లోకి నెట్టే లక్ష్యంతోనే ఆయన లైవ్ షోలు ఉంటాయని ప్రతీతి. సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా తన అరుపులు, ప్రశ్నల మీద ప్రశ్నలతో ఎటువంటి నేతనైనా డిఫెన్స్ లో పడేయడం అర్నాబ్ స్టైల్ అని పరిశీలకులు సైతం చెబుతుంటారు. అటువంటి అర్నాబ్ లైవ్ షోలో లోకేష్ ఎక్కడా తడబడకుండా,  ఆర్నాబ్ సంధించిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పిన తీరు  రాజకీయ పరిశీలకులనూ, రాజకీయ పండితులనూ మెప్పించింది.  తండ్రి చంద్రబాబు ను మించిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.    ముఖ్యంగా వైసీపీ నేతలతో చర్చ విషయంపై అర్నాబ్ అడిగిన ప్రశ్నకు లోకేష్ బదులిచ్చిన విధానం ఆయనలోని ఆత్మ విశ్వాసానికీ, తన తండ్రి తప్పు చేయడన్న ధీమాకూ దర్పణం పట్టింది.  అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లు నటించే దద్మమ్మలతో తాను మాట్లాడనన్న లోకేష్.. జగన్ తో డిబేట్ కు సిద్ధమా అన్న అర్నాబ్ ప్రశ్నకు బ్రింగ్ ఇట్ ఆన్ అని ఒక్క ముక్కతో బదులిచ్చారు. నేరుగా జగన్ కే సవాల్ విసిరారు. ఇప్పుడు లోకేష్ అన్న బ్రింగ్ ఇట్ ఆన్ అన్న మాట నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో లోకేష్ తో ఓపెన్ డిబేట్ కు జగన్ సిద్ధమా అంటూ నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.  మాట తప్పడం..మడమ తిప్పడం మాత్రమే తెలిసిన జగన్ ఈ సవాల్ ను స్వీకరించే ధైర్యం చేయరని ముక్తాయిస్తున్నారు.  

సైబరాబాద్ సృష్టికర్త అక్రమ అరెస్టును ఖండించవా కేటీఆర్!

ఏపి స్కిల్డ్ డెవలప్‌మెంట్ స్కీంలో స్కాం   ఆరోపణలతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏమో కానీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలతో కదం తొక్కారు..  తొక్కుతున్నారు.  ఇటీవల విప్రో సర్కిల్ వద్ద సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళన చేయడమే కాకుండా.. తమ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామంటూ క్లియర్ కట్‌గా జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఐ యామ్ విత్  బాబు అంటూ చంద్రబాబుకు మద్దతుగా   ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా   ఆందోళనలు, కార్ల ర్యాలీలు సైతం చేపట్టారు.  అయితే చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్   ఆందోళనలు, ధర్నాలకు దిగడంపై  పోలీసులు గరం గరం అవుతున్నారు. ఆ క్రమంలో సదరు ఈ ఆందోళనల్లో పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతులు లేకుండా ధర్నాలు ఆందోళనలకు దిగితే.. కఠిన చర్యలు తప్పవని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను హెచ్చరించారు.  ఓ వేళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగితే... వారు విధులు నిర్వహిస్తున్న ఆయా కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.   అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ నగరం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే..   నాడు చంద్రబాబు నాయుడు దార్శనికతతో చేపట్టిన కార్యక్రమాల వల్లేనని వారు  అంటున్నారు. అటువంటి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఖండిచాలనీ, అది పోయి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై జులుం ఎమిటనీ నిలదీస్తున్నారు.  హైదరాబాద్‌లో ఐటీ అభివృధికి బాటలు వేసింది నారా చంద్రబాబు నాయుడు అంటూ ఇప్పటికే పలు వేదికల మీద నుంచి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  స్వయంగా ప్రకటించిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. తెలంగాణలో ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయిల మార్క్ దాటిందంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో మీడియా సమావేశాలలో చెప్పారనీ, తెలంగాణ ఆ ఘనత  సాధించడానికి   పునాది వేసింది చంద్రబాబేననీ నెటిజన్లు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిలదీస్తున్న, ఆందోళనలు చేస్తున్న వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలకాలనీ, స్వయంగా కేటీఆర్ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బహిరంగ ప్రకటన చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆందోళనలో  ప్రత్యక్షంగా పాల్గొనాలనీ, తద్వారా హైదరాబాద్ నేటి ఈ స్థితికి కారణమైన చద్రబాబుకు థాంక్స్ చెప్పాలనీ సూచిస్తున్నారు.  అయినా.. హైదరాబాద్ నగరం ట్విన్ సిటీస్ స్థాయి నుంచి ట్రిపుల్ సిటీ స్థాయికి ఎదిగిందంటే.. అదంతా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని నెటిజన్లు ఈ సందర్బంగా సోదాహరణగా వివరిస్తున్నారు.     అయితే.. తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనలకు దిగితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి.. సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు.. గతంలో చంద్రబాబు వల్లే.. ఇక్కడ ఇంత అభివృద్ధి జరిగిందనే ఓ ప్రచారం అయితే ప్రస్తుతం ఊపందుకొందని.. ఆ నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయాలు.. రంగంలోకి దిగి సైబరాబాద్‌లో ఆందోళనలు, ధర్నాలు చేపట్ట వద్దంటూ.. పోలీసు ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని.. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేరు ఉద్యోగులు చేపడుతోన్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాబోయ్ చంద్రబాబు.. బీఆర్ఎస్ లో వణుకు!?

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఆందోళనలకు దిగడంతో అధికార బీఆర్ఎస్ కు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం నామమాత్రమేనని అధికార బీఆర్ఎస్ ఇంత కాలం అనుకుంటూ వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం నేతలందరినీ ఏదో రకంగా బీఆర్ఎస్ గూటికి చేర్చుకున్న కేసీఆర్.. తదుపరి లక్ష్యం కాంగ్రెస్ అన్నట్లుగా అడుగులు వేశారు. కర్నాటక  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేంత  వరకూ బీఆర్ఎస్ అధినేత తాను లక్ష్యం సాధించేశాననే భావించారు. ఇక రాష్ట్రంలో  తెలుగుదేశం, కాంగ్రెస్ లు పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాత బీజేపీ టార్గెట్ గా పావులు కదపడం ప్రారంభించారు. బీజేపీ నిర్ణయాలన్నిటికీ బేషరతుగా సమర్ధిస్తూ వచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యం కావాలంటే బీజేపీ బలం పుంజుకోవాలన్నట్లుగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ పనైపోయింది అనుకున్న తరువాత ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని.. కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అన్నీ ముహూర్తం చూసుకుని చేసే కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ఎంచుకున్న ముహూర్తం బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో తిరుగే లేదనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఉనికి మాత్రంగా ఉందనుకున్న కాంగ్రెస్ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంది. అధికారమే తరువాయి అన్నంతగా చెలరేగిన బీజేపీ ఒక్క సారిగా బలహీనపడిపోయింది. అయినా కూడా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్ల చీలికతో మరోసారి అధికారం తమదే అన్న భావనలో ఉన్న బీఆర్ఎస్ కు ఏపీలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆందోళనలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎలాంటి ఆర్గనైజేషన్ లేకుండా స్వచ్ఛందంగా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు I am with Babu అంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడం బీఆర్ఎస్ కు దిగ్ర్భమకు గురి చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పునాదులు కదలలేదనీ, నాయకులు లేకపోయినా క్యాడర్, జనం తెలుగుదేశంతోనే ఉన్నారనీ బాబుకు మద్దతుగా హైదరాబాద్ లో వెల్లువెత్తిన నిరసనలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. నిజమే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని కోల్పోయింది.  తెలంగాణ సెంటిమెంట్ ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమ సమయంలో తెలుగుదేశం అంటే టీడీపీ అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది.   తెలంగాణ సెంటిమెంట్’ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాద్ధాటితో  తెలుగుదేశం ఆంధ్రపార్టీ అనే ముద్ర పడేలా చేయగలిగారు.  అదే సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని  రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట   తెలుగు దేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు పావులు కదిపారు. నేతలు ఒకరొకరుగా బీఆర్ఎస్ గూటికి చేరిపోవడంతో అనుకున్నది సాధిచేశానని భావించారు.  రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను,ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని 14.7 శాతం ఓట్లతో  15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత  టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు. గులాబీ గూటికి చేరారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు.  2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంది. అయితే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి కండువా కప్పుకున్నారు.అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా దాదాపు సీనియర్ నాయకులంతా బీఆర్ఎస్ పంచన చేరిపోయారు. మిగిలిన వారు బీజేపీలోకి జంపయ్యారు.  అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.ఎదరు లేదు,తిరుగు లేదనుకున్న పార్టీ, నాయకుడు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం లేదా అహంకారం తప్ప మరొకటి కాదు.   తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్  అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్  పెట్టే స్ధాయికి చేరిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  తెలంగాణ సెంటిమెంట్ అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను తన చేతులతో తానే తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు.  రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్  సహా ముఖ్యనేతలు అందరిని  దూరం పెట్టారు.  అదే  సమయంలో  ఉద్యమ సమయంలో    తెలంగాణ ద్రోహులుగా తానే ముద్రవేసిన  తలసాని,  సబితా ఇంద్రారెడ్డి వంటి వారిని  చేర్చుకుని మంత్రి పదవులతో సత్కరించారు. పార్టీని  కుటుంబ పార్టీగా, రాష్ట్రాన్ని కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు.  అయితే, తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ఆకాంక్ష మొదటికే మోసం తీసుకువచ్చింది.  ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల  నాటికి పుంజుకుందన్నా,   కాంగ్రెస్ పార్టీ  అధికార పార్టీని దీటుగా ఎదుర్కోనేందుకు సన్నద్ధమైందన్నా.. కేసీఆర్ జాతీయ ఆకాంక్షల పేరుతో తెలంగాణ సెంటిమెంటును పక్కన పెట్టేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక సారి రాష్ట్రంలో ఆ సెంటిమెంటు పక్కకు జరిగాక.. తెలుగుదేశం పార్టీకి కూడా రాష్ట్రంలో స్పెస్ పెరిగింది. ఆ విషయం గతంలో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుఏడెనిమిది నెలల కిందట ఖమ్మం సభతో పూరించి శంఖా రావం సక్సెస్ రుజువు చేసింది. కారణాలేమైతేనేం.. తెలుగుదేశం శంఖారావం పేరుతో ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ ఇచ్చిన ఊపును, జోరునూ ఆ తరువాత తెలుగుదేశం కొనసాగించలేదు. మరిన్ని సభలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించినా ఆ దిశగా అడుగులు వేయలేదు. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. తెలుగుదేశం పార్టీని పరిశీలకులు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరులో మూడో సారి తెలంగాణలో విజయం సాధించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని కేసీఆర్ తలపోశారు. కానీ ఏపీలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో నివురుగప్పిన  రాష్ట్రంలో తెలుగుదేశం పునాదులు చెక్కు చెదరలేదన్న సంగతి బయటపడింది. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను భయపెడుతోంది. ఏపీలో అరెస్టుకు వ్యతిరేకంగానే కదా.. ఆందోళనలు అని వదిలేద్దామంటే.. ఐటీ ఉద్యోగులు ఈ  తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్ ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధికి పునాదులు వేసింది చంద్రబాబే అని బలంగా  చాటుతున్నారు. దాంతో తెలంగాణలో స్థిరపడిన సెటిలర్కు  మాత్రమే  కాదు.. సామాన్య జనం కూడా  ఇప్పుడు తెలుగుదేశం కేసే చూసే పరిస్థితి ఏర్పడుతుందన్నది బీఆర్ఎస్, కేసీఆర్ భయం. అందుకే ఒకింత నష్టం జరుగుతుందని తెలిసినా.. ఆ ఆందోళనలను పోలీసు బలంతో అణచివేయడానికే నిర్ణయించుకుంది. అలాగే చేస్తోంది కూడా.   అయితే స్వచ్ఛందంగా ప్రారంభమైన ఆందోళనలు అణిచివేస్తే ఆగిపోతాయనుకోవడం భ్రమే అవుతుంది. అయినా తమిళనాడు, బెంగళూరు.. ఇలా ఒక చోటని కాకుండా దేశ వ్యాప్తంగా ఐటీ నిపుణులు రోడ్లపైకి వచ్చి ఐయామ్ విత్ బాబు అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అణచివేతకు ప్రయత్నించిన కొద్దీ  చంద్రబాబుపై సానుభూతి మరింత పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ ప్రభావం కచ్చితంగా ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనీ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని స్థానాలలోనూ ఒంటరి పోరుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. కచ్చితంగా తెలుగుదేశం చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధిస్తుందనీ, ఒక వేళ రాష్ట్రంలో హంగ్ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీదే కీలక పాత్ర అవుతుందనీ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా అదే కారణంతో చంద్రబాబుకు మద్దతుగా  జరుగుతున్న ఆందోళనలతో భయ పడుతోంది.

ఎందుకీ మౌనం.. ఏమిటా భయం.. జగన్ తీరుపై వైసీపీలో ఆందోళన

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించడంతో వైసీపీ నేతలు, ముఖ్యంగా  గత ఎన్నికలలో వెయ్యి ఓట్లు అంత కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో తమ ఓటమి ఖాయమని ఖరారు చేసుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. గత ఏన్నికలలో ఇలా వెయ్యి అంతకంటే కొంచం తక్కువ, లేదా ఎక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఉన్నాయి.   2019లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో  విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాటిలో  42 చోట్ల గెలిచిన అభ్యర్థుల మెజారిటీ వెయ్యి లోపు ఓట్లు మాత్రమే.  విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ కేవలం25 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఉభయ గోదావరిజిల్లాల నుంచి శ్రీకాకుళం,విజయనగరం,కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో  పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో స్వల్ప మెజారిటీలతోనే విజయం సాధించారు. ముఖ్యంగా వెయ్యి మెజారిటీ విజేతలలో అత్యధికులకు వచ్చిన మెజారిటీ 500 ఓట్లు మాత్రమే. మిగిలిన వారి మెజారిటీ కూడా 500 నుంచి 1000 ఓట్ల మధ్యనే ఉంది. 2019లో వైసీపీ,జనసేన,టీడీపీ మధ్య ముక్కోణపు పోర జరగడంతో  తెలుగుదేశం, జనసేన మధ్య భారీగా ఓట్లు చీలిపోవడంతో వైసీపీ గట్టెక్కిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించిన సంగతి విదితమే. ఇప్పుడు, టీడీపీ, జనసేన  మధ్య పొత్తు ఖరారు కావడంతో  గతంలోలా ఓట్లు చీలి వైసీపీ లబ్ధి పొందే అవకాశాలు మృగ్యమని రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  ఓట్లు చీలకపోవడం, రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వైసీపీకి గెలుపు ఆశలను దాదాపు దూరం చేసేసినట్లేనని అంటున్నారు.   గతంలోనే పవన్ కల్యాణ్ పొత్తుల ప్రస్తావన చేసిన సందర్భంలో వైసీపీ ఓటమి భయంతో వణికిపోయిందనీ, ప్రత్యర్థి పార్టీల పొత్తును వ్యతిరేకిస్తూ దమ్ముంటే ఒంటరి పోరు అంటూ సవాళ్లు విసిరిందనీ గుర్తు చేస్తున్నారు.  జగన్ వేవ్ అను ఆ పార్టీ చెప్పుకుంటున్న 2019 ఎన్నికలలోనే 42 నియోజకవర్గాలలో స్వల్ప మెజారిటీతో గట్టుక్కిన వైసీపీ.. ఇప్పుడు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో విపక్షాలు కలిసి పోటీ చేస్తుండటంతో. విజయంపై ఆశలు గల్లంతై.. ఒక జనాలను భయభ్రాంతులకు గురి చేసేలా విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగించైనా లబ్ధి పొందే వ్యూహంతో ముందుకు సాగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే విపక్ష నేత అక్రమ అరెస్టు, సీఐడీ చీఫ్ చంద్రబాబుతో అరెస్టులు ఆగవు.. లోకేష్ సహా మరింత మంది నేతలను అరెస్టు చేస్తామని మీడియా సమావేశాలలోనే చెప్పడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.  జగన్ లో కూడా ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోందనీ, అందుకే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, యావద్దేశంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అన్న వర్గాల వారూ రోడ్లపైకి రావడమే కాకుండా బాబుకు సంఘీభావంగా ఆందోళనలకు దిగుతున్నా.. జగన్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని రాగానే హస్తిన పర్యటనకు బయలుదేరనున్నట్లు ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆయన హస్తినకు వెళ్లలేదు. కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడమే ఇందుకు కారణమని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హస్తిన వెళ్లి జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ అరాచకత్వాన్ని వివరిస్తున్నారు. అలాగే జాతీయ నేతల మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వివిధ పార్టీల నేతలు గళమెత్తేలా వారి మద్దతు కూడగడుతున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రులు కూడా  చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (సెప్టెంబర్ 15)న రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ ప్రసంగంలో చంద్రబాబు అరెస్టు, అందుకు నిరసనగా తన ప్రభుత్వంపై  వెల్లువెత్తుతున్న నిరసనలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. తెలుగుదేశం, జనసేన పొత్తుపై కూడా పన్నెత్తు మాట మాట్లాడలేదు.  అసలు ప్రభుత్వ కార్యక్రమానికీ, పార్టీ కార్యక్రమానికీ తేడా లేకుండా చంద్రబాబు, తెలుగుదేశంపై విమర్శలు తప్ప మరో మాట రాని జగన్ నోటి వెంట రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా బహిరంగ సభలో అందుకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాబు అరెస్టు, తదననంతర పరిణామాలతో జగన్ భయపడుతున్నారనీ, ఈ పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించడమే మేలనీ ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ జగన్ ఏమైనా మాట్లాడితే ఆ మాటలు బూమరాంగ్ అవుతాయంటున్నారు. ఏళ్ల తరబడి బెయిలుపై బయటకు తిరుగుతూ, అక్రమాస్తుల కేసు, కోడికత్తి కేసులలో కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా మినహాయింపు కోరుకుంటూ తిరుగుతున్న వ్యక్తి నాలుగుదశాబ్దాలకు పైగా మచ్చ లేని నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దార్శనికుడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనీ అందుకే అరెస్టు అయ్యారనీ ఎలా చెప్పగలుగుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  ఆ కారణంగానే జగన్ మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు.   అయితే చంద్రబాబు అరెస్టుపై జగన్ మౌనం వైసీపీ నేతలను, శ్రేణులను భయాందోళనలకు గురి చేస్తున్నది. అధినేతే మౌనం వహిస్తున్నప్పుడు తాము మాత్రం బాబు అరెస్టును సమర్ధిస్తూ మీడియాకు ఎక్కడం ఎందుకని నేతలు సైతం వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.   ప్రభుత్వాధినేతగా, అధికార పార్టీ అధినేతగా జగన్ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై స్పందించక పోవడం ఏమిటని వైసీపీ నేతలే అంతర్గత సమావేశాల్లో ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. జగన్ మౌనం చంద్రబాబును వైసీపీ సర్కార్ అక్రమంగా, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అరెస్టు చేసిందని వెల్లువెత్తుతున్న విమర్శలకు బలం చేకూరుస్తోందని వారు అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్టుపై జగన్ మౌనం.. వైసీపీ నేతలలో ఆందోళనను పెంచడమే కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీకి తీరని నష్టం జరగడం తథ్యమన్న భావనకు వచ్చేలా చేసింది. 

పెళ్లి రోజున అరెస్ట్.. భార్య ములాఖత్’కు నో .. భగ్గుమంటున్న మహిళలు

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు అరెస్ట్ సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓ వంక రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కడి కక్కడ  నిరసనలకు దిగుతుంటే, దేశ విదేశాల్లో ఐటీ, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు  చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు పై  మండి పడుతున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు. మరో వంక  ఢిల్లీ వెళ్ళిన తెలుగు దేశం పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్  దేశ రాజధాని నుంచి  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్  చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అవినీతి, అక్రమాలను మీడియా ముందు ఉంచడంతో జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు  వివిధ కారణాల వలన చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కొంత మౌనంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు, గళం విప్పుతున్నారు. జగన్ రెడ్డి దుర్మార్గాలను తెలుసుకుని, విస్తుపోతున్నారు.  ఇప్పటికే కేంద్ర మంత్రులు సహా జాతీయ స్థాయి నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించగా ఇప్పడు తాజగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్   దురదృష్టకరమంటూ ట్వీట్టర్ (x)వేదికగా వ్యాఖ్యానించారు. అంతే కాదు ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబును స్వేచ్ఛను దూరం చేసిన తీరు అంతకంటే బాధాకరం. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు  వంటి స్థాయి ఉన్న నాయకునితో వ్యవహరించే టప్పుడు ఆయన స్థాయితో పాటు,  వయసును కూడా పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ,  వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒకరికీ  ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవంక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి మాజీ  సుజనాచౌదరి,మరో కేంద్ర మాజీ మంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా వివిధ పార్టీలకు చెందిన  నాయకులు, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపడుతున్నారు. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే ముహూర్తం పెట్టి మరీ మానసిక, శారీరక క్షోభకు గురిచేయడం,అదే విధంగా జైల్లో చంద్రబాబుతో ములాఖత్’కు అయన సతీమణి  భువనేశ్వరికి అనుమతించక పోవడం ఏమిటని పార్టీలతో సంబంధం లేకుండా మహిళా నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక మహిళను అది కూడా రాజకీయాలకు దూరంగా  ఉన్న మహిళను వేధింపులకు గురిచేసినందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించ వలసి ఉటుందని హెచ్చరిస్తున్నారు.  మరో వంక చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రంలో  టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న  ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటున్న మహిళలు, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన సతీమణి భువనేశ్వరి,ఇతర కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగా చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం అగ్నిజ్వాలలా ఎగసి పడుతోంది. ఆయనను గద్దె దించడమే లక్ష్యమని సామాన్య జనం సైతం రోడ్ల మీదకు వచ్చి నినదిస్తున్నారు.