భర్త వేధింపులు తాళలేక దారుణానికి ఒడిగట్టిన ఇల్లాలు

  పొట్టకూటి కోసం రాష్ట్రాలన్నీ దాటుకుంటూ వచ్చి హైదరాబాద్ నగరం లో స్థిరపడ్డారు ఓ దంపతులు... కూలి పనులు చేసు కుంటూ జీవనం కొనసాగించారు. ఆ తర్వాత భర్త... ప్రతి రోజు భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. అతని వేధింపులు తాళలేక భార్య కూరగాయలు కట్ చేసే కత్తితో కచకచ పొడిచి చంపేసింది. ఇంతటి దారుణ మైన ఘటన హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో చోటుచేసుకుంది.  అస్సాం కు చెందిన భారాకా బోరా, జ్యోతి బోరా దంపతులు... పొట్ట కూట్టి కోసం అస్సాం నుండి హైదరాబాదు నగరానికి వచ్చి కోకాపేట పరిధిలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి భార్య జ్యోతి ని భర్త భారాకా బోరా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయా లకే పెద్ద ఎత్తున గొడవ చేసి నానా హంగామా సృష్టిం చేవాడు.  అయినా కూడా జ్యోతి అన్ని సహిస్తూ వచ్చింది... భర్తలో మార్పు కోసం ఎదురు చూసింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ చిన్న విషయంపై ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. చిలికి చిలికి గాలివాన పెద్దదైనట్లుగా దంపతుల మధ్య ఆ గొడవ కాస్త పెద్ద దయింది. ఇప్పటికే జ్యోతి భర్త వేధిం పులు భరించలేక సహనం కోల్పోయి ఉంది. మళ్లీ గొడవ జరుగుతూ ఉండ డంతో ఓపిక నశించి పోయిన జ్యోతి ఒక్కసారిగా కిచెన్ లోకి వెళ్లి కూరగా యల కత్తి తీసుకు వచ్చి భర్త పై దాడి చేసి పొడిచింది.  దీంతో భర్త భారాకా బోరా గట్టి గట్టిగా అరవడంతో స్థానికులు ఇంటి లోపలికి వచ్చి చూడగా... భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు భర్తను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త భారాకా బోరా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భార్య జ్యోతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

  తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 19) మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతిలోని అన్ని విభాగాలతో పాటు తిరుపతి జిల్లా యంత్రాంగంతో కూడా పూర్తి సమన్వయం చేసుకుంటూ  సామాన్య  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వివరించారు.   ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు తెలిపారు.   బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకరించే ఆభరణాలు శుభ్రపచటం పూర్తయ్యిందన్నారు. అలాగే విద్యుత్ దీపాలంకరణలు, ఇంజినీరింగ్ పనులూ చేపట్టామని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు 60 టన్నుల పూతలో అలంకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో తిరుమలలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.  గరుడ గరుడ సేవ రోజు రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.  అత్యవసర వైద్య సేవల కోసం అదనంగా 50 మంది వైద్యులు, 60 మంది సేవకులను నియమిస్తున్నట్లు వివరించారు.   ఇక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సేవలందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులను నియమించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో నాలుగువేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామనీ, అంతకంటే ఎక్కువగా వాహనాలు వస్తే వాటికి తిరుపతిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.  బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పిన టీటీడీ ఈవో.. సిఫారసు లేఖలను కూడా అనుమతించబోమని చెప్పారు.     

మధ్యతరగతి కారు కలలకు రెక్కలు!

జీఎస్టీ రేట్ల దెబ్బ‌కు కారు క‌ల‌ల‌కు రెక్క‌లొచ్చిన‌ట్టే ఉన్నాయ్.  ఏమో గుర్రం ఎగురా వ‌చ్చ‌న్న‌ట్టు.. ఏమో సాదా సీదా సామాన్యుడు కూడా ఓ పాతిక వేలు చేతిలో ఉంటే కొత్త కారు బుక్ చేయవచ్చన్నట్లుగా అన్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. అంత‌గా జ‌న‌సామాన్యానికి జీఎస్టీ 2. 0 తో ద‌స‌రా, దీపావ‌ళి, సంక్రాంతి పండుగలు ఒక్కసారే  వ‌చ్చేసిన‌ట్లైంది. ఇలాంటి బంప‌రాఫ‌ర్లు ప్ర‌కటించ‌డంలో ముందుండే మారుతీ సుజుకీ అయితే.. తన కార్ల ధరలను భారీ ఎత్తున తగ్గిస్తూ ముందుగానే ప్రకటించేసింది.  వాటిలో ల‌క్ష‌కు పైగా డిస్కౌంట్ ఇచ్చే కార్ల మోడ‌ళ్లు   అర‌డ‌జ‌ను వ‌ర‌కూ ఉన్నాయి.  ఉదాహ‌ర‌ణ‌కు ఎస్ ప్రెసో ధ‌ర ఏకంగా ల‌క్షా ముప్పై వేల వ‌ర‌కూ త‌గ్గుతోందంటే ప‌రిస్థితి  అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఇదే కోవ‌లోకి వ‌చ్చే కార్ల వివ‌రాలేంటో చూస్తే..  ఆల్టో కే 10, గ్రాండ్ విటారా-  ల‌క్షా 7 వేలు,  ఫ్రాంక్స్, బ్రెజ్జా- ల‌క్షా 12 వేలు.. ఇక సెలేరియో 97 వేలు, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, వంటివి 80 వేల నుంచి 90 వేల మ‌ధ్య‌.. వ్యాగ‌నార్, ఇగ్నిస్ ధ‌ర‌లు 70 వేలు- 80 వేల మ‌ధ్య త‌గ్గ‌నున్నాయి. టూర్ ఎస్, జిమ్నీ, ఎక్స్ ఎల్ 6, ఇన్విక్టో, ఎకో, క్యారీ ఎల్పీజీ వంటివి   50 వేల నుంచి 70 వేల రూపాయ‌ల వరకూ తక్కువ ధరలకు లభించనున్నాయి. ఒక్క ఎర్టిగా మాత్ర‌మే కేవ‌లం 46 వేలు మాత్ర‌మే త‌గ్గే వేరియంట్. మిగిలిన మోడ‌ళ్ల‌న్నీ యాభై వేల నుంచి ల‌క్షా ముప్పై వేల మ‌ధ్య  ధ‌ర‌లు తగ్గనున్నాయి.  ఇందులో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత లాభ‌దాయ‌క‌మైన విష‌య‌మేంటంటే బేసిగ్గానే మారుతీ.. డిస్కౌంట్లు ఎక్కువ‌, డౌన్ పేమెంట్లు త‌క్కువ‌గా ఇచ్చే కంపెనీ.. ఒక వేళ జీఎస్టీ త‌గ్గుద‌ల ద్వారా కూడా క‌స్ట‌మ‌ర్లు క్యూ క‌ట్ట‌కుంటే మ‌రింత డిస్కౌంట్లు ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు. కాబ‌ట్టి మ‌ధ్య త‌ర‌గ‌తి వారి కారు క‌ల‌కు ఇక రెక్క‌లొచ్చిన‌ట్టే.. అన్న‌ది మార్కెట్లో గ‌ట్టిగా వినిపిస్తోన్న మాట‌! మ‌రి మీ కారు బుక్ చేస్కోడానికి మీరు రెడీయేనా?

ఏపీలో దసరా సెలవులు రెండు రోజులు అదనం

ఆంధ్రప్రదేశ్ లో  స్కూళ్లకు ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. అంటే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు నుంచే ఏపీలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన చేసిన ఓ పోస్టులో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రంలో దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.  వాస్తవానికి విద్యాశాఖ ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ మేరకు రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా సెలవులు ఉండాలి. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దసరా సెలవురు రెండు రోజులు పెరిగాయి.  అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలుహర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్!

తిరుమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభమైది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు సీఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ను పరిశీలించారు. రిక్లైమ్ ఏస్ యంత్రం పనితీరును పరిశీలించారు. ఈ యూనిట్ ప్రారంభంతో ఇకపై కొండ మీద ట్రెట్రా ప్యాక్స్, స్నాక్ ప్యాకెట్ల వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదని అంటున్నారు. ప్లాస్టిక్ కంటెంట్ ను భక్తులు ఈ యూనిట్ లో వేసేయవచ్చు. ఇందు కోసం యూపీఐ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయల్సి ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ వేసిన వారికి ఐదు రూపాయలు ఇస్తారు.  

చినుకు పడితే.. విశ్వనగరం విశ్వనరకం

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి విశ్వనగరం చిగురుటాకులా వణికింది.  నగరం మొత్తం అతలాకుతలం అయ్యింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో తండ్రీ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.  పోలీసుల ప్రాధమిక దర్యాప్తు లో మృతులను బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన అశోక్ (50)  అతని కుమార్తె దివ్య (5) గా గుర్తించారు.  భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా   హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మశాన వాటిక గోడ కూలిపోయి మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.  ఇక వర్షం పడితే డేంజర్ జోన్ గా మారిపోయే  అసిఫ్ నగర్ లో పెద్ద ఎత్తున వరద నీరు పొంగిపొర్లతో పరిస ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి చేరుకున్నాయి.  గత రెండు రోజులుగా దోమల్ గూడ ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయి ఉంది.  ఏవీ కాలేజ్ ,గగన్ మహల్  ఎగువ ప్రాంతం నుండి దిగువన ఉన్న దోమల గూడ, సూరజ్ నగర్ కాలనీ, రాజ్ మహల్ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ ద్వారా స్టాగింగ్ అయిన  వరద నీరు  పంపించేటట్లు చూస్తామని అధికారులు చెబుతున్నారు.   ఇక భారీ వర్షానికి రెండు రోజులుగా హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇది విశ్వనగరం కాదు విశ్వ నరకం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చినుకు పడితే హైదరాబాద్ వాసులకు యమయాతన తప్పడం లేదని అంటున్నారు. వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఇక నగరంలో ఎక్కడ చూసినా గంటలతరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం మామూలైపోయిందని అంటున్నారు. 

అమెరికాలో పోలీసు కాల్పులు.. పాలమూరు యువకుడి మృతి

అమెరికాలో మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు పోలీసు కాల్పులలో మరణించాడు. మహబూబ్ నగర్  రామయ్యబౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ తొమ్మిదేళ్ల కిందట అంటే 2016లో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాంటాకార్లలో ఉంటున్నాడు.   ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, నిజాముద్దీన్  ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత, పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ ఈ నెల 3వ తేదీన తన రూమ్ మేట్ తో గొడవపడిన నిజాముద్దీన్ ను అదే రోజు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అక్కడి పోలీసుల కథనం ప్రకారం సెప్టెంబర్ 3 తెల్లవారుజామున ఇరుగుపోరుగు వారి నుంచి ఫోన్ లో అందిన ఫిర్యాదు మేరకు శాంతాక్లారా పోలీసులు నిజాముద్దీన్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంట్లో గొడవపడుతున్న శబ్దాలు వినిపించడంతో పోలీసులు లోనికి వెళ్లారు. అక్కడ నిజాముద్దీన్ అతడి రూమ్మేట్ పై కత్తితో దాడి చేస్తుండటం గమనించిన పోలీసులు వారించారు. అయినా వినకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ మరణించాడు.   ఇక నిజాముద్దీన్ తల్లిదండ్రులైతే  తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ ను  పోలీసులు కాల్చి చంపారని, ఆ విషయం నిజాముద్దీన్ రూమ్మేట్ ద్వారా తమకు తెలిసిందని అంటున్నారు.  ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా తమ కొడుకు మృతదే హాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరిం చాలని కోరారు. 

కాటేసిన పామును కొరికి చంపేశాడు!

ఎవరైనా పాము కాటేస్తే.. ప్రాణభయంతో వణికి పోతారు. వెంటనే వైద్య సాయం కోసం పరుగులు తీస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం నన్నే కరుస్తావా అంటూ పాముపై పగబట్టి దానినే కొరికి చంపేశారు. ఆ తరువాత విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయమేంటంటే.. తొట్టంబేడు మండలం చియ్యవరంకు చెందిన వెంకటేష్ బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వెడుతుండగా అతడిని ఓ  తాచుపాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ కు తనను కాటేసిన పాముపై పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ పామును పట్టుకుని దాని తల కొరికి చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆ చచ్చిన పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పక్కన పెట్టుకుని పడుకున్నాడు. గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం ఇంట్లో వారు గమనించారు. విషం తలకెక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకటేష్ ను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారు అతడిని తిరుపతి రుయాఆస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు అతడిని రుయాకు తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో రుయా ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు.  

16 నెలల చిన్నారికి టెలీ సర్జరీ

భారత వైద్య చరిత్రలోనే ప్రప్రథమంగా ఓ 16 నెలల చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన వైద్యడు హైదరాబాద్ వాసి కావడం మనకందరికీ గర్వకారణం.  హైదరాబాద్ నుంచి డాక్టర్ వి. చంద్రమోహన్ గుర్గావ్ లోని చిన్నారికి విజయవంతంగా టెలీ సర్జరీ చేశారు. పుట్టుకతోనే మూత్రనాళంలో సమస్య ఉన్నగుర్గావ్ కు చెందిన బాలికకు డాక్టర్ చంద్రమోహన్ హైదరాబాద్ లోనే ఉండి ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబో సిస్టమ్ సహాయంతో దాదాపు గంట పాటు శస్త్రచికిత్స చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతమైంది. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజునే ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యింది. అంతే కాదు అతి చిన్న వయస్సులోనే టెలీ సర్జరీ చేయించుకున్న బాలికగా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.  కాగా ఈ టెలీ సర్జరీ భారత్ లో వైద్య సేవల విస్తరణకు, అందరికీ అత్యధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని అంటున్నారు.    మారుమూల ప్రాంతాలకు కూడా కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదనడానికి ఈ టెలీ సర్జరీని ఉదాహరణగా చూపుతున్నారు వైద్య నిపుణులు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ శిలా తోరణం వరకూ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  20 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం(సెప్టెంబర్ 18) శ్రీవారిని మొత్తం 68 వేల 95మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 032 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70 లక్షల  రూపాయలు వచ్చింది.

జ్యుస్ తాగుతుండగా హార్ట్ ఎటాక్‌తో యువకుడి మృతి

  కరోనా అనంతరం చాలామంది యువ కులు ఉన్నట్లుండి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ కు గురవు తున్నారు. గతంలో ఓ యువకుడు జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ.... మరొకరు కాలేజీలో... ఇంకొకరు బస్ స్టాప్ లో ఇలా పలువురు  యువకులు మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరొకటి చోటు చేసుకుంది. జ్యుస్ తాగుతూ హార్ట్ ఏటాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా లోని పల్లి పాడు గ్రామానికి చెందిన మేడ ఏకలవ్య(30) అనే యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాదు నగరానికి వచ్చి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఒక రూమ్ లో ఉంటూ ... ఉద్యోగం కోసం వేట కొనసాగించాడు. అయితే ఏకలవ్య బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ ముందు జ్యుస్ పాయింట్ వద్ద జ్యుస్ త్రాగుతూ.. అకస్మాత్తుగా కిందపడిపోయాడు.  అది గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి అతనికి  సిపిఆర్ చేశారు... కానీ అప్పటికే అతను మృతి చెందాడు.  దింతో  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని  మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంప ట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు  

అదానీకి సెబీ క్లీన్‌చిట్

  సెబీ తాజాగా గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2023లో వచ్చిన హిండెన్‌బర్గ్‌ నివేదికలో స్టాక్‌ అవకతవకలు, నిధుల మళ్లింపులు, అకౌంటింగ్‌ మోసాలు జరిగాయంటూ ఆరోపించినా, విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ కూడా ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నిర్ణయంతో అదానీ షేర్లకు ఊరట లభించింది. హిండెన్‌బర్గ్‌ తప్పుదోవ పట్టించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని గౌతమ్‌ అదానీ డిమాండ్‌ చేశారు. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెలువడిన తర్వాత అదానీ షేర్లు క్షీణించి, 150 బిలియన్‌ డాలర్ల విలువ చెరిపేశాయి. తరువాత సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పుడు సెబీ క్లీన్‌చిట్‌తో గ్రూప్‌ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ పరిణామంపై గౌతమ్‌ అదానీ స్పందిస్తూ, తమపై వేసిన తప్పుడు ఆరోపణలు పెట్టుబడిదారులను నష్టపరిచాయని, దేశానికి క్షమాపణ చెప్పాలని హిండెన్‌బర్గ్‌ను డిమాండ్‌ చేశారు. “సత్యమేవ జయతే… జైహింద్!” అంటూ ఆయన పోస్ట్‌ ముగించారు.  

హైదరాబాద్‌లో భారీ వర్షానికి కూలిన గోడ... కార్ల ధ్వంసం

  హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లుతుండగా, లోతట్టు కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి.   * మైసమ్మగూడ చెరువులో దుర్ఘటన ఈ ఉదయం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు తేలియాడుతున్నాయని స్థానికులు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. ప్రాధమిక దర్యాప్తులో అవి బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన అశోక్‌ (50), అతని కుమార్తె దివ్య (5)గా గుర్తించారు. ఈ ఘటనపై అశోక్ భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   * హబీబ్‌నగర్‌లో గోడ కూలి కార్లు ధ్వంసం మరోవైపు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడకు ఆనుకొని పార్క్ చేసిన మూడు కార్లపై అది పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కూలిన గోడను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. * అసిఫ్‌నగర్ – తల్లగడ్డ ప్రాంతాల్లో వరద ఉధృతి అసిఫ్‌నగర్, తల్లగడ్డ ప్రాంతాల్లో వరదనీరు రోడ్లమీద పొంగిపొర్లుతోంది. లోతట్టు ఇళ్లలోకి కూడా నీరు చొచ్చుకెళ్తోంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించకుండా వరద మధ్యలో ప్రయాణించడంతో వాహనాలు నీటిలో ఇరుక్కుంటున్నాయి. ఒక బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వరద గల్లీలో చిక్కుకుపోగా, గోడపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. హైడ్రా, ఫైర్ శాఖ సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.   * దోమలగూడలో నీటిముగ్గు నిన్నటి నుండి దోమలగూడ స్ట్రీట్ నంబర్ 7 ప్రాంతంలో వరద నీరు అలాగే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా & హైదరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి నారాయణ అక్కడికి చేరుకొని పరిసరాలను పర్యవేక్షించారు. ఏవీ కాలేజ్, గగన్‌మహల్ ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వర్షపు నీరు దోమలగూడ, సూరజ్‌నగర్ కాలనీ, రాజ్‌మహల్ ప్రాంతాల్లో చేరి నిల్వ అయింది. మోటార్ పంపుల సహాయంతో నీటిని తరలించేందుకు టీములు రంగంలోకి దిగాయి. వాటర్ లాగింగ్ తొలగించే వరకు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.   * అధికారులు జాగ్రత్త సూచనలు హైడ్రా, ఫైర్ శాఖ, మున్సిపల్ అధికారుల బృందాలు నగరంలోని కీలక ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ప్రజలు వరద ప్రాంతాల్లోకి వెళ్లరాదని, అవసరమైతే సహాయక బృందాలను సంప్రదించాలని సూచించారు.

ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం

  ఏపీలో  నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నడిచే వివిధ నగరాల్లోని స్థానిక సలహా కమిటీలకు లోకల్ అడ్వైజరీ కమిటీ కూడా కొత్త అధ్యక్షులను నియమించింది. శ్రీశైలం మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రమేష్‌ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఛైర్మన్‌గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్‌, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా రాధాకృష్ణ నియమితులయ్యారు.   టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షులు 1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి 2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్ 3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు 4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఏడుగుండ్ల సుమంత్ రెడ్డి 5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింఘానియా 6. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే  

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్

  ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమానికి ఆలస్యంగా హాజరై, ముఖ్య అతిథి విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకలేదని ఆరోపణలు వచ్చాయి.  దీనిపై సీఎంవోకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇక, మిడ్ మానేరు నిర్వాసితుడికి పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చూపినందుకు తెలంగాణ హైకోర్టు కూడా కలెక్టర్‌పై వారెంట్ జారీ చేసింది. నోటీసులు, వారెంట్‌లు వరుసగా రావడంతో ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా తీరు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బ్రిటన్ హైకమిషనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్‌షిప్స్ను రాష్ట్ర ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  కో-ఫండింగ్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్స్ అందించేందుకు హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. సమావేశంలో నూతన విద్యా విధానం, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ రంగాలపై చర్చించారు. రేవంత్ ప్రతిపాదనలపై లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించగా, ఈ చర్చలు తెలంగాణ–బ్రిటన్ సంబంధాలకు కొత్త ఊపు ఇస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మూసీ నది అభివృద్ధి, ఇతర రంగాల్లో పెట్టుబడుల కోసం బ్రిటిష్ కంపెనీలను భాగస్వాములుగా చేయాలని సీఎం కోరారు. విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు సహకారం మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు.   

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, బోరబండ, చార్మినార్‌, కుషాయిగూడ, సైనిక్‌పురి వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. వర్షంతో రహదారులు జలమయమై, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.  

శశికళ సంస్థల్లో ఈడీ సోదాలు

  తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్త్నె, హైదరాబాద్‌లోని 10 చోట్ల తనిఖీలు నిర్వహించింది. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. జీఆర్‌కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులను రూ.200 కోట్లకు మోసం చేశారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. కనీసం పది స్థలాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్‌ఎ నిబంధనల కింద దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ దర్యాప్తు రూ.200 కోట్ల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించినదని, దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు కీలక నగరాల్లో ఈడీ చేసిన సోదాలపై మాత్రం అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ కేసు ఆధారంగా, నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో శశికళతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.