గుంటూరులో పానీపూరీ విక్రయాలు బంద్.. ఎందుకంటే?

గుంటూరు నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరీ విక్రయాలపై నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించినట్లు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు.  గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో పానీ పూరి విక్రయాలు, టిఫిన్ బండ్లపై నిషేధం విధించారు. డయేరియా వ్యాప్తిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరునగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డితోట, రెడ్ల బజార్, సంగడి గుంట సహా తొమ్మిది ప్రాంతాలలో డయేరియా ప్రబలినట్లు అధికారులు గుర్తించారు. డయేరియా కేసులు అధికంగా నమోదు కావడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. డయేరియా వ్యాప్తి అరికట్టేం దుకు తీసుకోవలసిన చర్యలపై గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరి విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయించారు.డయేరియా వ్యాప్తికి కలుషిత నీరు, ఆహారం ప్రధాన కారణాలనీ, అందుకే  ముందుజాగ్రత్త చర్యగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల అమ్మకాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పులి శ్రీనివాసులు తెలిపారు. 

హైదరాబాద్ సీపీగా సజ్జనార్

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదలీ చేసింది. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించింది.   అగ్నిమాపక శాఖ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా బదలీ చేసింది. ప్రస్తతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా నియమించింది. అలాగే హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేసింది. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‎గా హరిత నియమితులయ్యారు.   ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌ , జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ,  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్,  గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్,  పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,   ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్‌,  హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్,  వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్,   సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్,   నారాయణ పేట్ ఎస్పీగా వినీత్‌‌,  ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్,  మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్,  ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధలు నియమితులయ్యారు. 

సృష్టిలో ముగిసిన ఈడీ సోదాలు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఈడీ అధికారలు వేర్వేరు ప్రాంతాలలో నిర్వహించిన సోదాలు శుక్రవారం రాత్రి ముగిశాయి.   హైదరా బాద్ జోనల్ ఆఫీస్ కు చెందిన  ఈడి  అధికారులు  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్ కత్తా సహా మొత్తం తొమ్మది ప్రాంతాలలో ఈ తనఖీలు నిర్వహించారు.   డాక్టర్ నమ్రత యూని వర్సల్ సృష్టి ఫెర్టిలిటీ & రీసెర్చ్ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ దందా కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ  వ్యవ హారంలో పోలీ సులు ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  హైదరా బాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమ్రతపై మోసం, మభ్యపెట్టడం, అక్రమ సరోగసి, చైల్డ్ ట్రాఫికింగ్ మొదలగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నమోదైన  ఎఫ్ఐఆర్ ఆధారం గా  ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు సోదాలు నిర్వహింొచారు. ఈ సోదాల్లో  ఈడి అధికారులు   కీలక పత్రాల తో పాటు మోసపోయిన జంటల వివరాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకు న్నారు. డాక్టర్ నమ్రత తన సెంటర్ లో పని చేస్తున్న సిబ్బంది, ఏజెంట్ల సహాయంతో గత పది సంవత్సరాలుగా  సరోగసి రాకెట్ నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత దేశవ్యాప్తం గా ఈ అక్రమ రాకెట్ నడిపినట్లుగా తేలింది. గుట్టు చప్పుడు కాకుండా గత పది సంవత్స రాలుగా ఈ  దందా  కొనసాగిం చినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నమ్రత చేతిలో  మోసపోయిన ఓ  విదేశీ జంటకు ఇచ్చిన శిశువుకు డిఎన్ఏ టెస్టు చేయగా ఆ శిశువు వారి శిశువు కాదని తేలడంతో ఆ శిశువుకు పాస్పోర్ట్ నిరాకరించారు. ఇలా ఈడి దర్యాప్తు లో  డాక్టర్ నమ్రత మోసాలు బయట పడ్డాయి. గత రెండు రోజులుగా ఈడి చేసిన సోదాల్లో కీలక పత్రాలతో పాటు మోసపో యిన జంటల వివరాలు, నమ్రత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  

మూసీ వరద..చిగురుటాకులా వణుకుతున్న విశ్వనగరం!

తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది వరదతో ఉప్పొంగుతోంది. హైదరాబాద్ లోని జంట జలాశయాలు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ మహోగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ దాదాపుగా నీటమునిగాయి. కుసుంపూర్, పురానాపూల్, చాదర్ ఘాట్, మలక్ పేట్, మూసారాంబాగ్, నాగోల్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక మూసీకి ఆనుకుని ఉన్న అన్ని బ్రిడ్జీలపైనా రాకపోకలను నిలిపివేశారు.   జియాగూడ , కులుసంపూర , చాదర్ ఘాట్  , మూసారాంబాగ్ బ్రిడ్జిల పైనుంచి  వరద నీరు ప్రవహిస్తుండటంతో వాటిని మూసివేసి రాకపోకలను నిలిపివేశారు.   కాగా మూసీని ఆనుకుని ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోని భారీ ఎత్తున వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రయాణీకులు బస్టేషన్ లో చిక్కుకుపోయారు.  బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులను అతి కష్టం మీద తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు.  ముందస్తు హెచ్చరికలు లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో అనూహ్యంగా వరద ముంచెత్తిందని అంటున్నారు. ఇలా ఉండగా నార్సింగి, మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.   ఉస్మాన్ సాగర్  గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద నీరు పొంగి పోర్లతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించు కోకుండా ఓ డ్రైవర్ ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది  అప్రమత్తమై వాళ్ళని సురక్షితం గా కాపాడి,   ఆటో ట్రాలీ కి తాడు కట్టిబయటకు తీశారు.  

రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. అయినా ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటో నడుపుతూ  కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందినసత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు. 

జలదిగ్బంధంలో ఎంజీబీఎస్

హైదరాబాద్‌లో   గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.  శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మూసీనది వరదతో పోటెత్తింది. దీనికి తోడు జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ లోని వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బస్టాండ్ నుంచి బయటకు వచ్చే మార్గంలేక బస్టాండ్ లోనే చిక్కుకుపోయారు. తాడు సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు.  హైడ్రాతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు.  ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.  మూసీ వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా మూసీ వరద ఉధృతి ఒక్క ఎంజీబీఎస్ కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో  200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి.  ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.  మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ ప్రాం తంలో కూడా పలు పల్లపుప్రాంతాలు జలమయమయ్యాయి. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 26) శ్రీవారిని మొత్తం 75 వేల 358 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  2 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది. 

మూసీకి భారీ వరద.. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తున్నది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.   పురానాపూల్ ప్రాంతంలో మూసీ వరద రోడ్లను ముంచెత్తింది. జియాగూడ ప్రాంతంలో కూడా మూసీ ఉగ్రరూపం దాల్చింది. అక్కడ కూడా వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలను నిలిపివేశారు. స్థానికులను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.    ఇక వికారాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో టంగుటూరు మోకిల రోడ్డును మూసి వేశారు.  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (సెప్టెంబర్ 26) అందజేశారు. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో 1994 బ్యాచ్‌కి చెందిన  ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.    శివధర్‌ రెడ్డి వచ్చేనెల1వ తేదీన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.  పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన శివధర్ రెడ్డి తప కెరీర్‌లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు.  శివధర్ రెడ్డి ఐక్యరాజ్యస సమితి శాంతి పరిరక్షణ వింగ్‌లోకూడా పనిచేశారు.ప్రస్తుతం శవధర్ రెడ్డి తెలంగాణ  ఇంటలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నారు.   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలే కలాన్‌ గ్రామానికి చెందిన శివధర్‌రెడ్డి. విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేసి ఆయన కొద్ది కాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో   అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఎఎస్పీగా పని చేశారు.  అలాగే గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా  పనిచేశారు.  2014-2016 మధ్య తెలంగాణకి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.    మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్ శివధర్ రెడ్డి హయాంలోనే జరిగింది.   

ఇండియాపై ట్రంప్ మరో దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్ వార్ ను మరింత ఉధృతం చేశారు. తాజాగా భారత్ నుంచి దిగుమతి అయ్యే  ఔషధాలపై పై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.   గత ఏడాది  అమెరికా ఇండియా నుంచి దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను దిగుమతి చేసుకుంది కాగా  అమెరికాలోనే ఔషధాలను తయారు చేసే కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహా యింపు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం ఇండియన్ ఫార్మా కంపెనీలపై తీవర ప్రభావం చూపనుంది.  భారత్ నుంచి అమెరికాకు అధికంగా జెనరిక్ మెడిసెన్స్ ఎగుమతి అవుతాయి.  చాలా వరకూ ఇండియన్   ఫార్మాస్యూటికల్ కంపెనీలకు తమ మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం  అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారానే వస్తున్నది.   దీంతో ఈ కంపెనీలపై ట్రంప్ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.  

నీరుకొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం

అమరావతిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా  అమరావతి సమీపంలోని నీరుకొండపై   భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. నీరుకొండ 300 అడుగుల ఎత్తు కలిగి ఉంది. విగ్రహ నిర్మాణం కోసం 100 అడుగుల ఎత్తున్న బేస్ నిర్మించి,  ఈ బేస్ పై 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అంటే మొత్తం 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందన్న మాట.  ఇక ఈ విగ్రహం   బేస్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు, మ్యూజియం, మినీ థియేటర్,    కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం వద్దకు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహ నిర్మాణం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇలా ఉండగా  దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  స్మారకాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపొందిం చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆకాంక్షకు అనుగుణంగా..  నీరుకొండ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు ఏర్పాటు కానుంది.   10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్నిఏర్పాటు చేయనున్నారు.    

భారీ వర్షాలు.. రేవంత్ సమీక్ష

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్, ఉన్నతాధికారులతో శుక్రవారం (సెప్టెబర్ 26) సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ముసురుపట్టినట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండు రోజులూ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే   అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం  చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని ఆదేశించారు. 

జల సంరక్షణ.. దేశంలోనే తెలంగాణ టాప్

జలసంరక్షణలో  దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది.  కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల సంచాయ్ తాజాగా ప్రకటించిన ర్యాంకులలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.  2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 5,20,362 వాన నీటి సంరక్షణ పనులు చేపట్టింది.  వీటిలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ వంటి పనులు ఉన్నాయి. కాగా  జల సంచాయ్ జన భాగీదారి  ర్యాంకుల్లో భాగంగా దేశంలో 67 జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో  తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలలకు అవార్డులు లభించాయి. వీటిలో రెండు కోట్ల  రూపాయల రివార్డు విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాలు టాప్ లో ఉన్నాయి. అలాగే వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలకు కోటి రూపాయల రివార్డులు,  భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు పాతిక లక్షల రూపాయల రివార్డులు దక్కాయి.   కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు గెలుచుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతోషం హర్షం వ్యక్తం చేశారు.  జలసంరక్షణలో ఈ మూడు జిల్లాలూ దక్షిణ భారతదేశంలోనే టాప్ లో ఉన్నాయని పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామి పనుల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ నిర్మించినందువల్లే కేంద్రం అవార్డుల వచ్చాయని   పంచాయతీరాజ్   సీతక్క చెప్పారు. అవార్డులు, రివార్డులు సాధించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, నల్లోండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ,మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ,జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్ విజేంద్రబోయి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లను మంత్రి సీతక్క అభినందించారు.

తమిళనాడు విద్యావిధానమే తెలంగాణకు ప్రేరణ.. రేవంత్

దక్షిణాది రాష్ట్రాల విద్యావిధానాలకు తమిళనాడే ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  తెలంగాణలో అతి త్వరలో తమిళనాడులోలా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని అములు చేస్తామని చెప్పారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో  గురువారం (సెప్టెంబర్ 25) జరిగిన మహా విద్యా చైతన్య ఉత్సవ్‌కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన దేశ చరిత్రలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. అన్నాదురై, కామరాజ్ నాడార్,  కరుణానిధి వంటి యోధులకు జన్మస్థలమైన తమిళనాడు రాష్ట్రం మాకు అదర్శమన్నారు. క‌రుణానిధి విజ‌న్‌ను  స్టాలిన్, ఉద‌య‌నిధిలు అనుసరిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ కామ‌రాజ్ ప్లాన్‌ అమలు చేశారన్నారు.  కామ‌రాజ్ త‌మిళ‌నాడులో తీసుకువ‌చ్చిన‌ విద్యా విధానాన్నే దేశం అనుస‌రిస్తున్నదన్న రేవంత్ రెడ్డి  త‌మిళ‌నాడు పేద‌ల‌కు సీఎం స్టాలిన్ అండ‌గా ఉన్నారని ప్రశంసించారు. ఇక సామాజిక న్యాయం అమలులో తెలంగాణ, తమిళనాడుల మధ్య సారూప్యతలు న్నాయన్నారు. మాజీ సీఎం కరుణానిథిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీల‌కు 42 శాతం, ఎస్సీ, ఎస్టీల‌కు 27 శాతం ఇలా మొత్తం 69 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.   

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 25) స్వామి వారిని మొత్తం 67 వేల 388 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం కోటీ 74 లక్షల రూపాయలు వచ్చింది. 

ఈడీ విచారణకు నటుడు జగపతి బాబు

సాహితీ ఇన్ ఫ్రా కేసులో  నటుడు జగపతిబాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.   గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను నాలుగు గంటలకు పైగా విచారించారు. ఇంతకీ విషయమేంటంటే.. సాహితీ ఇన్ ఫ్రా తరపున హీరో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో జగపతిబాబు, సాహితీ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు   ప్రశ్నించారు.   సాహితీ ఇన్ ఫ్రాపై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట   కొనుగోలుదారుల నుంచి  భారీ మొత్తం వసూలు చేసి చేసి మోసాలకు పాల్పడిందనీ, ఆ డబ్బులను అక్రమంగా తరలించిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది.  ఈ దర్యాప్తులో సాహితీ ఇన్ ఫ్రా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో  పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీస్ తో పాటు  తన దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.   ఫ్రీలాంచ్ విల్లా, ఫ్లాట్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా దాదాపు 700 మంది కస్టమర్ల నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.  ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా ఎండి లక్ష్మీ నారాయణ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.   ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడి అధికారులు ఈ కంపెనీ తరఫున పలు ప్రకటనలు ఇచ్చిన నటుడు జగపతి బాబుకు నోటీసులు ఇచ్చి గురువారం (సెప్టెంబర్ 25) విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే   జగపతిబాబు ఈడీ ఎదుట హాజయర్యారు. సాహితీ ఇన్ ఫ్రా ప్రకటనలలో నటించినందుకు జగపతి బాబు తీసుకున్న సోమ్ము ఎంత, ఆ సొమ్ము చెల్లింపు ఎలా జరిగింది అన్న విషయాలపై జగపతిబాబును ఈడీ విచారించినట్లు సమాచారం.  

ఆసియా కప్ ఫైనల్ లో దాయాదుల ఢీ

ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ భారత్ తలపడనున్నాయి. గురువారం (సెప్టెంబర్ 26) సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై 11 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది.  ఇప్పటి వరకూ పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్థాన్ ఫైనల్ కు చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై చెమటోడ్చి గెలిచింది.  ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 11 పరుగుల ఆధిక్యతతో పాకిస్థాన్ గెలిచి.. ఫైనల్ కు చేరుకుంది.  ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ లో భారత్ తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 28) జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇది మూడో సారి అవుతుంది. గ్రూప్ స్టేజిలో ఒకసారి, సూపర్ ఫోర్ స్టేజిలో రెండో సారి ఇరు జట్లూ తలపడ్డాయి. ఆ రెండు సార్లూ కూడా భారత్ సునాయాస విజయాలను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.    ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి ఓడించాలని చూస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ గత ఓటములకు ప్రతీకారం తీర్చుకుని ఆసియా కప్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.   టీమిండియా ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా, పాకిస్థాన్   2 సార్లు   ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది      ఆసియా కప్ 2025లో టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ సాధికార విజయాలతో జోరుమీద ఉంది.  పాకిస్థాన్ అయితే మూడు మ్యాచ్ లలో విజయం సాధించి రెండింటిలో పరాజయం పాలయ్యింది.  

సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు ఊరట

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో  భారీ ఊరట లభించింది.   కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలో  ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై స్మితా సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం (సెప్టెంబర్ 25)న సభా సభర్వాల్ పై నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యా తీసుకోవద్దంటూ ఆదేశాలుజారీ చేసింది.  ఇదేవిషయమై ఇప్పటికే  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వంటి నాయకులకు కూడా హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ ఆవిర్భావం తరువాత అధికారం చేపట్టిన   కేసీఆర్    అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి. రేవంత్ రెడ్డి   నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అక్రమాలపై విచారణకోసం జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్   ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచి చర్చించింది. ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, ఆర్థిక అవినీతి, టెక్నికల్ లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వంటి అనేక అంశాలని కమిషన్ నివేదికలో పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ  మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ సీ మురళీధర్ రావు వంటి అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులని పేర్కొంది. బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్యాబినెట్ ముందు పెట్టకపోవడం, బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడం వంటి  విషయాలలో స్మితా సభర్వాల్ ను కూడా కమిషన్ నివేదికలో తప్పుపట్టింది.   ఈ నివేదికలో తన పేరు ప్రస్తావించబడటానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ ఈ నెల 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   నివేదికలో తన పేరును తొలగించాలని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించి,  ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దనీ,  ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో కలిపి స్మితా సభర్వాల్ పిటిషన్ ను కూడా విచారి స్తామనీపేర్కొంది.