ఆంధ్ర ప్రదేశ్ లో మత్స్యకారులకు మహర్ధశ
* రాష్ట్రవ్యాప్తంగా 8 ఫిషింగ్ హార్బర్లు, 1చోట ఫిష్ ల్యాండ్ నిర్మాణం
* 9 చోట్ల చేపలవేటకు చక్కటి మౌలిక సదుపాయాలు
* రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మాణం
* దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
* రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై సీఎం జగన్ సమీక్ష
శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నంలో 1, తూ.గో.లో 1, ప.గో.లో 1, కృష్ణాజిల్లాలో 1, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరులో 1 చొప్పున ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో బడగట్లపాలెం– మేజర్ ఫిషింగ్ హార్బర్, శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో– ఫిష్ ల్యాండ్ నిర్మాణం, విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్ ఫిషింగ్ హార్బర్, తూ.గో.జిల్లా ఉప్పాడలో – మేజర్ ఫిషింగ్ హార్బర్ , ప.గో.జిల్లా నర్సాపురంలో – మేజర్ ఫిషింగ్ హార్బర్ , కృష్ణాజిల్లా మచిలీపట్నంలో – మేజర్ ఫిషింగ్ హార్బర్, గుంటూరుజిల్లా నిజాంపట్నంలో– మేజర్ ఫిషింగ్ హార్బర్, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో– మేజర్ షిఫింగ్ హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో– మేజర్ ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోకూడదని, రెండున్నర మూడు సంవత్సరాల వ్యవధిలో వీటిని పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలని, గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ చెప్పారు.
గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్టు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఇప్పుడు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ కట్టబోతున్నామని కూడా మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.