రేవంత్ రెడ్డికి పీకే ఫుల్ సపోర్ట్.. కేసీఆర్ కు ఇక తీన్మారేనా? 

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు దూసుకు పెంచడంతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీ హుజురాబాద్ పై ఫోకస్ చేస్తూనే... ఆ పార్టీ సీనియర్ నేతలు యాత్రలతో జనంలో వెళ్లేలా ప్లాన్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. దళిత గిరిజన దండోరా పేరుతో గర్జిస్తున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేసి రాజకీయ వేడి రాజేశారు. ఇదిలా ఉండగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు. మల్లారెడ్డి లక్ష్యంగా హస్తం నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇటీవలే బీఎస్పీలో చేరిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పీకే.. మంత్రి మల్లారెడ్డి తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గురించి.. మంత్రి మల్లారెడ్డి వాడే భాష ఏంటని ఆయన నిలదీశారు. గౌరవ స్థానంలో ఉండే మంత్రి తొడగొట్టి మాట్లాడుతారా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నోటితో చెప్పలేనంత భాషను మీడియా సాక్షిగా మాట్లాడుతున్న మల్లారెడ్డి.. తన డీమ్డ్ యూనివర్శిటీలో ఇదే భాష నేర్పుతారా? అంటూ విరుచుకుపడ్డారు ప్రవీణ్ కుమార్. దళిత ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు.. మల్లారెడ్డిని బహిష్కరించాలని పిలుపిచ్చారు. మీకు ఈ దుర్గార్మమైన భాష ఎవరు నేర్పించారు. ఎవరి ధైర్యంతో ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు పీకే.  బండి సంజయ్ భాష కూడా సరిగ్గా లేదన్నారు ప్రవీణ్ కుమార్. ఆయనను దూషించిన నేత భాష కూడా సరిగ్గా లేదన్నారు. బూతులు మాట్లాడేవాళ్లకు యూనివర్శిటీలు సాంక్షన్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలో అధికార పార్టీ ఓడినా, గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేదేమీలేదు. పోయేదేమీ లేదని చెప్పారు. రేపటికి రేపు మంత్రి వర్గాన్ని సీఎం రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్నారు ప్రవీణ్ కుమార్. వేల కోట్లు హుజురాబాద్ లో కుమ్మరించి ఈటలను ఓడించి..ఎవరికి పాఠం చెప్పాలనుకుంటున్నారని అన్నారు.  ఈ డబ్బులన్నీ ఎవరివి? మా బిడ్డలు చెల్లించిన డబ్బులవి..  మీ పార్టీలో ఎవరైనా తోక  జాడిస్తే వారిని బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం చేసిన అవినీతిని బయటపెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దుబ్బాకలో లాగే.. హుజురాబాద్ లో కూడా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు.  బీఎస్పీ  మీటింగ్ కు కరెంట్ కట్ చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక మీ ఫామ్ హౌస్ కు కరెంట్ కట్ చేస్తామంటూ ఘాటుగా మాట్లాడారు ప్రవీణ్ కుమార్.ఉద్యోగం రాలేదని హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసేడులో నిరుద్యోగి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దని, బహుజన రాజ్యంలో భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ముడేళ్లుగా ఏ జిల్లా ఏ జోన్ లోకి వెళ్లాలో తేల్చలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇలాంటి కాలయాపనే చేస్తారా? అన్నారు. 2022 దాకా నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం లేదన్నారు ప్రవీణ్ కుమార్.  కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల సమస్యలు తీరలేదన్నారు ప్రవీణ్ కుమార్. కోటి ఎకరాల సాగులోకి వస్తాయన్నారు.. కానీ భూములు కోల్పోయిన వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం బడా కాంట్రాక్టర్లకే లాభం జరిగింది. వేల కోట్ల రూపాయల అవినీతి, దోపిడి జరిగిందని ఆరోపించారు.అవినీతి పాలవుతున్న సొమ్మునంతా చదువుల కోసం ఖర్చు చేసి.. ప్రపంచంలోనే అత్యున్నత అవకాశాలు పొందేలా యువతను తీర్చిదిద్దుతామని పీకే చెప్పారు. ఏనుగు గుర్తుకే ఓటేస్తామని అందరూ కుటుంబసభ్యులతో, బంధువులతో ప్రమాణం చేయించాలన్నారు ప్రవీణ్ కుమార్. ప్రతి ఇంటి గోడపై ఏనుగు గుర్తు గీయించుకోవాలన్నారు.  కారు కింద పడుతారా? ఏనుగు ఎక్కిపోతారా? తేల్చుకోవాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 

కొమ్ముకాసే ఖాకీల‌పై సీజేఐ సంచలన కామెంట్లు.. జ‌గ‌న్ స‌ర్కారుకూ వ‌ర్తిస్తుందా?

పోలీసులంటే అధికార పార్టీకి దాసులు అన్న‌ట్టుగా మారిపోయాయి ప‌రిస్థితులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. కొంద‌రు ఖాకీలు ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటారు. మ‌రికొంద‌రు కొన్ని పార్టీల మ‌నుషులుగా ముద్ర‌ప‌డి పోయారు. అంద‌ల‌మెక్క‌గానే  త‌మ వారిని మంచి పొజిష‌న్ల‌లో నియ‌మిస్తుంటారు పాల‌కులు. గ‌త ప్ర‌భుత్వ అధికారుల‌ను అధఃపాతాళానికి తొక్కేస్తుంటారు. ఇలా పోలీస్ వ్య‌వ‌స్థ‌ను త‌మ గుప్పిట్లో పెట్టుకొని.. ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లకు దిగుతుంటారు. ఏపీలో ఈ ధోర‌ణి మ‌రింత తీవ్రంగా ఉందనే ఆరోప‌ణ ఉంది. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాగానే.. చంద్ర‌బాబు మ‌నిషంటూ అప్ప‌టి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును ఎలా వేధిస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. ఇక సీఐడీ చీఫ్‌గా త‌న మ‌నిషి సునీల్‌కుమార్‌ను నియ‌మించుకొని.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై కేసులు, కుట్ర‌ల‌కు తెగ‌బ‌డుతున్నారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. సొంత‌పార్టీ ఎంపీ ర‌ఘురామ అరెస్ట్‌, క‌స్ట‌డీలో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారంటూ పోలీసుల తీరు బాగా వివాదాస్ప‌ద‌మైంది. ఇప్ప‌టికే ఏపీ పోలీసులు డ‌జ‌నుకుపైగా టీడీపీ నేత‌ల‌పై కేసులు పెట్ట‌డం.. ప‌లువురిని అరెస్ట్ చేసి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు దిగ‌డం లాంటి చ‌ర్య‌లపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ప‌సుపు చొక్కా వేసుకున్నా.. సైకిల్ ప‌ట్టుకున్నా.. కేసులు పెట్టేంత‌లా పోలీసులు అధికార వైసీపీకి కొమ్ముకాస్తున్నార‌నే ఆరోప‌ణ బ‌లంగా ఉంది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే.. తాజాగా సుప్రీంకోర్టు సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఇలాంటి పోలీసుల తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ పోలీసుల‌ను ఉద్దేశించి కాక‌పోయినా.. సీజేఐ స్టేట్‌మెంట్స్ అన్నిరాష్ట్రాల ఖాకీల‌కు హెచ్చ‌రిక‌లా, సూచ‌న‌లా ఉన్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.... అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. సస్పెండయిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుతో ఏసీబీ, ఆర్థిక నేరాల విభాగం ఆయన నివాసంలో సోదాలు చేసి.. రాజద్రోహంతో పాటు ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు కేసులు న‌మోదు చేశారు. ఈ కేసుల‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది.  దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయన్నారు జస్టిస్ రమణ. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది కొత్త రకం ధోరణి అని.. దీనిని ఆపాలన్నారు జ‌స్టిస్ ర‌మ‌ణ‌. గుర్జిందర్ పాల్ సింగ్‌‌ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది.  సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులకు స‌రిగ్గా స‌రిపోతాయ‌ని అంటున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌క స్థానాల్లో ఉన్న పోలీస్‌ అధికారుల‌పై కులం, వ‌ర్గం ముద్ర వేసి అప్రాధాన్య పోస్టులకు మార్చేశార‌ని అంటున్నారు. అప్ప‌టి ఐబీ చీఫ్ ఏబీతో ఓ ఆట ఆడుకుంటున్నార‌ని గుర్తు చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం మారితే ప్ర‌స్తుత సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు ఇదే గ‌తి ప‌డుతుంద‌ని అంతా అంటున్నారు. ఇలా పార్టీలు మారిన‌ప్పుడ‌ల్లా.. పోలీసుల తీరు మార‌డం ఏమాత్రం స‌రికాద‌ని.. సీజేఐ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు. అందుకే, ఖాకీలు అధికార పార్టీకి కొమ్ముకాయ‌డం మానుకొని.. నిస్ప‌క్ష‌పాతంగా న‌డుచుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. 

పోలీసు అధికారులను వేధించడమేంటీ! సీజేఐ వ్యాఖ్యలపై ఏపీలో చర్చ.. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల తీరు, ప్రభుత్వాల వైఖరిపై ఈసారి ఆయన తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు.. తర్వాత కాలంలో  ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. దేశంలో  ఇలాంటి పరిస్థితులు ఉండటం చాలా విచారకరమన్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది కొత్త రకం ధోరణి అన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాల్సి ఉందన్నారు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ.  సస్పెండయిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ మౌఖికంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది.  గుర్జిందర్ పాల్ సింగ్‌‌ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది. సింగ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారిమన్, ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ), ఆర్థిక నేరాల విభాగం ఆయనపై జూన్ 29న కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో జూలై 1న సోదాలు చేసి, ఆయనపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు.  సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితులను ప్రస్తావించినట్లయిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో వివిధ పదవులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బాధితుల్లో ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, మరో ఉన్నతాధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారనే టాక్ ఉంది. నిమ్మగడ్డ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఏబీ వేంకటేశ్వర రావు కేసులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఏపీలో నెలకొన్న పరిణామాలను ఉదహరిస్తూనే సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ న్యాయ వర్గాల్లోనూ సాగుతోంది. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ర‌ఘురామ ఫుల్‌ స‌పోర్ట్‌.. సినీ ప‌రిశ్ర‌మ‌ను కాపాడాలంటూ రిక్వెస్ట్..

సీఎం జ‌గ‌న్‌ను, వైసీపీ స‌ర్కారును, సాక్షి మీడియాను ఓ ప‌ట్టాన వ‌ద‌ల‌డం లేదు ఎంపీ ర‌ఘురామ‌. ఏ1 జ‌గ‌న్‌, ఏ2 విజ‌య‌సాయిరెడ్డిల బెయిల్ ర‌ద్దు అయ్యే వ‌ర‌కూ వ‌దిలేలా లేరు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌, విజ‌య‌సాయిల‌పై కేసులు వేసిన ర‌ఘురామ‌.. ఇప్పుడిక సాక్షి మీడియాపైనా పిటిష‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. హోల్‌సేల్‌గా జ‌గ‌న్ అండ్ కో కు చెక్ పెట్టేలా పావులు క‌దుపుతున్నారు.  సీఎం జగన్మోహన్‌రెడ్డిపై తాను వేసిన పిటిషన్ రద్దు అని సాక్షిలో ముందే వార్త రాశారని త‌ప్పుబ‌ట్టారు ర‌ఘురామ‌. ఆ వార్త‌ల వెనుక ఏముందో విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును సంప్రదించాలని న్యాయ నిపుణులకు తెలిపానన్నారు. సాక్షి క్లిపింగ్ కూడా న్యాయమూర్తికి పంపించడం జరిగిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.  అటు త‌న‌పై విమ‌ర్శ‌ల‌కు దిగిన ఎంపీ మోపిదేవిపైనా విరుచుకుప‌డ్డారు ర‌ఘురామ‌. "నేను ఎవరో ఆడిస్తే ఆడుతున్నానని మోపిదేవి అంటున్నారు. 18 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న వారు చెప్తే నేను వింటానా? నేను ఎర్రివాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని నేను గెలిశాను అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్న మీరెందుకు ఓడిపోయారు. జగన్ బొమ్మ మీకు పని చేయలేదా? మన నాయకుడి బొమ్మతోనే కాదు నేను నా బొమ్మతో కూడా నెగ్గాను. పలు కేసుల్లో నింధితుడిగా ఉండి మీరు నాపై కామెంట్ చేయడం మంచిది కాదు." అంటూ స‌హ‌చ‌ర ఎంపీ మోపిదేవిపై మండిప‌డ్డారు ర‌ఘురామ‌.   అటు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాపై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్పుబ‌ట్టారు ర‌ఘురామ‌. పవన్ కళ్యాణ్ న‌టించిన వకీల్‌సాబ్ సినిమా సందర్భంలో మన ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఒక అగ్ర నటుడిపై ఉన్న కోపాన్ని ప్రజలపై తీర్చుకుంటే ఎలా? థియేటర్ల రేట్లను మనం ఫిక్స్ చేస్తే ఎలా నడుస్తాయి. లాభం రాకున్నా సినిమా థియేటర్లను నడుపుతున్నారు. రాష్టంలో టికెట్ల రేట్లకు కారణం ఎవరో డిస్టిబ్యూటర్లు ఆలోచించాలి. ప్రభుత్వం రూ.50కి దొరికే మద్యాన్ని రూ.250కి అమ్ముతోంది. 150 రూపాయల మద్యాన్ని 250 చేస్తే కొనుకుంటున్నారు. మరి 150 సినిమా టికెట్ కొనలేరా? సినీ ప్రముఖులతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలి. సినీ పరిశ్రమను కాపాడండి. హీరోలను హీరోలుగానే ఉండనివ్వండి.’’ అని రఘురామకృష్ణంరాజు సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సూచించారు.  తెలంగాణ ప్రభుత్వం కూడా థియేటర్ల రేట్లను తగ్గించలేదని గుర్తు చేశారు రఘురామ. "ఆలోచించండి సీఎం జగన్మోహన్ రెడ్డి. పక్కా రాష్టాలు చేయని పనిని మీరు ఎందుకు చేస్తున్నారు. సినిమా ప్రేమికుడిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను సినిమ పరిశ్రమను కాపాడండి" అని అన్నారు.   "గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10శాతం వాటా ఉంది. ప్రభుత్వం వాటా ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. గంగవరం పోర్టుపై ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ప్రభుత్వంలో మనకు ఇబ్బందులు తప్పవు. ఒక్కసారి ఆలోచించండి. సమయవనం పాటించండి. పోలీసులు  కావాలని ప్రభుత్వాల మెప్పుకోసం పని చేస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు." అని రఘురామ కృష్ణరాజు అన్నారు.   

ఏపీలో వినాయ‌క చ‌వితి సెల‌వు ర‌ద్దు.. హిందు పండ‌గ‌పై జ‌గ‌న్ స‌ర్కారు కుట్ర‌నా?

స‌ర్వ విఘ్నాలు తొల‌గించే దేవుడు వినాయ‌కుడు. అలాంటిది ఆ వినాయ‌కుడి పండుగ‌కే విఘ్నాలు ఎదురైతే? అంత‌కంటే పాపం ఇంకేమైనా ఉంటుందా? ఇంత‌కీ అది పాప‌మా? కావాల‌నే చేస్తున్న ద్రోహ‌మా? ఓ వ‌ర్గంపై జ‌రుగుతున్న కుట్ర‌లా? ఇలా అనేక అనుమానాలు. అందులోనూ, ఇలాంటి ప‌రిస్థితులు ఏపీలోనే జ‌రుగుతుండ‌టం మ‌రింత అనుమానాస్ప‌దం. రెండేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. మ‌త మార్పిడిలు పెద్ద ఎత్తున చేప‌డుతున్నార‌నే ఆరోప‌ణ ఉంది. ఓ వ‌ర్గానికి అధిక ప్రాధాన్యం, ప్రోత్సాహం ఇస్తున్నార‌నే ప్ర‌చార‌మూ ఉంది. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్ ప‌త్రిక.. ది ఆర్గ‌నైజ‌ర్ సైతం జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న‌ మ‌త విధానాల‌పై తీవ్రంగా మండిప‌డింది. ఏపీలో హిందుత్వంపై జ‌రుగుతున్న కుట్ర‌ల‌కు వ్య‌తిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. ఇంత హంగామా జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు మ‌రో బ‌రితెగింపు నిర్ణయానికి పాల్ప‌డటం మ‌రింత దారుణం. వినాయ‌క చ‌వితి పండుగ‌కు ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు సెల‌వును ర‌ద్దు చేయ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.  వినాయ చ‌వితి చిన్నాచిత‌కా పండ‌గేమీ కాదు. దేశవ్యాప్తంగా జ‌రుపుకునే అతిపెద్ద ఫెస్టివ‌ల్‌. ఊరూరా గ‌ణ‌ప‌తి మండ‌పాలు ఏర్పాటు చేసి న‌వ‌రాత్రులు పూజిస్తారు. పోటాపోటీగా వినాయ‌క విగ్ర‌హాలు ప్ర‌తిష్టించి.. అట్ట‌హాసంగా, ఆర్బాటంగా పండ‌గ వేడుక‌లు నిర్వ‌హిస్తారు. ముంబై గ‌ణేష్ ఉత్స‌వాలు, హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ విగ్ర‌హం ఎంతో ఖ్యాతి గాంచాయి. ఏపీలోనూ వినాయ‌క చ‌వితి వేడుక‌లు భారీగా జ‌రుగుతాయి. అలాంటిది.. ఇంత పెద్ద పండ‌గ‌కి.. ఏపీ ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు సెల‌వు ఇవ్వ‌క‌పోవ‌డం ఏంటి? ఏటేటా ఇస్తూ వ‌స్తున్న హాలిడేను.. ఈసారి ర‌ద్దు చేయ‌డం ఎందుకు? దీని వెనుక ఏదైనా దురుద్దేశ్యం ఉందా అని అనుమానిస్తున్నారు హిందుత్వ‌వాదులు.  ఈ ఏడాది సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితికి ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం సెలవు ఇవ్వాలి. గడచిన ఏడాది వరకు ఇది కొనసాగింది. ప‌క్క రాష్ట్ర‌మైన‌ తెలంగాణ స‌ర్కారు ఈ ఏడాది కూడా వినాయక చవితికి సెలవును ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు. దీనిపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు.  బుధవారం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఆ లేఖ‌కు తెలంగాణలో బ్యాంకులు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ను కూడా జత చేసింది. బ్యాంకు యూనియన్స్ రాసిన లేఖపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా, వినాయ‌క చ‌వితికి సెల‌వు కావాల‌ని వేడుకోవ‌డం ఏంటి? ఎప్పుడు ఇచ్చిన‌ట్టుగానే హాలిడే ఇవ్వొచ్చుగా? అభ్యంత‌రం దేనికి? ఉద్యోగులు అడిగే వ‌ర‌కు ఎందుకొచ్చింది? జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇలాంటి అనుమానాల‌కు తావిచ్చే నిర్ణ‌యాలు ఎందుకు తీసుకుంటోంది? విష‌యం ముదిరి వివాదం కాక‌మునుపే ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి బ్యాంకుల‌కు వినాయ‌క చ‌వితి సెల‌వు మంజూరు చేస్తే మంచిది. లేదంటే....

పంజాబ్ లో కాంగ్రెస్ VS కాంగ్రెస్.. రాహుల్ టీమ్ చేతులెత్తేసినట్టేనా..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిజానికి, సింగ్- సిద్ధూల మధ్య ఏనాడూ సయోధ్యత లేదు. నాలుగేళ్ళ క్రితం అమరిందర్ సింగ్ మంత్రి వర్గం నుంచి సిద్ధూ తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి, ఇద్దరి మధ్య యుద్ధం సాగుతూనే ఉంది. ముఖ్యంగా సిద్దూ వర్గం ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ టార్గెట్’గా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం పై, పీసీసీ హోదాలో సిద్ధూ విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.   కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ,పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పలు సందర్భాలలో ఇద్దరి మధ్య సయోధ్యత కుదిర్చేందుకు, ప్రయత్నించారు. చివరకు ఉప్పు – నిప్పుల ఉన్న ఇద్దరినీ కలిపి ఉంచేందుకు, అమరిందర్ సింగ్ అభ్యంతరం చెప్పినా, పట్టించుకోకుండా సిద్దూని పీసీసీ అధ్యక్షునిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఆదిస్థానం ఏమి ఆశించి సిద్దూకు బాధ్యతలు అప్పగించిందో ఏమో, కానీ,ఇద్దరి ద్దరూ, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని నిరూపిస్తున్నారు.  సిద్దూ వర్గానికి చెందిన నలుగురు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్’ను తక్షణం తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరిందర్ సింగే, పార్టీ కెప్టెన్’ని సిద్దూ టీమ్’కి తేల్చి చెప్పింది. అంతే కాదు. పార్టీని ఐక్యంగా ఉంచవలసిన బాధ్యత పీసీసే చీఫ్’గా సిద్దూపై ఉంటుందని, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరిష్ రావత్ గుర్తు చేశారు. అయితే, సిద్దూ పీసీసీ బాధ్యతలు చేపట్టి తర్వాత , దూకుడు మరింతగా పెంచారని, ఎన్నికలకు ముందే  ‘ముఖ్యమంత్రిని  తొలిగించే వ్యూహంతో పావులు కదుపుతున్నారని, అమరిందర్ సింగ్ వర్గం ఆరోపిస్తోంది. సిద్దూ పీసేసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎందుకు ఉపందుకున్నాయో, అధిష్టానం ఆలోచించి, దిద్దుబాటు చర్యలు, తీసుకోవాలని, ముక్ష్యమంత్రి సతీమణి, కాంగ్ర్ఫెస్స్ పార్టీ ఎంపీ ప్రణీత్ కౌర్ సూచించారు.  దిద్దుబాటు చర్యలు అంటే సిద్దూను పీసీసీ పావి నుంచి తప్పించాలని, ఆమె చెప్పకనే చెప్పారు. ఇలా ముఖ్యమంత్రిని కుర్చీదించాలని సిద్దూ వర్గం, సిద్దూను కుర్చీదించాలని అమరిందర్ వర్గం డిమాండ్  చేస్తూండడంతో కాంగ్రెస్ అధిష్టానం  తల పట్టుకుంటోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందేందుకు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అత్యవసరంగా భావిస్తున్న సమయంలో ఇద్దరు అగ్ర నేతల మధ్య తగవు పోరాటంగా మారడం ఆందోళన కలిగించే అంశంగానే చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ అంటున్నారు.

ఆస్తుల ఆమ్మకం కాంగ్రెస్ చేతికి బ్రహ్మస్త్రమా! మోడీ గ్రాఫ్ తగ్గినా మార్చుకోలేరా.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం  విపక్షాలకు మరో పదునైన అస్త్రాన్ని అందించిందా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్, ప్రకటించిన, జాతీయ మానెటైజేష‌న్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ’) ఇప్పటికే దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్న మోడీ ప్రతిష్టను మరింతగా దిగజారుస్తుందా? జనవరిలో 66 శాతంగా వెలిగిపోయిన మోడీ గ్రాఫ్, కొవిడ్ కాలమ్లో ఆర్థిక వ్యవస్థ మిస్ మేనేజిమెంట్ పుణ్యాణ, ఏకంగా ఒకేసారి 26 శాతానికి పడిపోయిన మోడీ ఇమేజిని ఎన్ఎంపీ మరింత డ్యామేజి చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు.  నిజానికి మోడీ తమ  కార్పొరేట్  మిత్రుల ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని, కాంగ్రెస్ అగ్ర నేత్ర రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అయినా, ఎందుకనో దేశ ప్రజలు ఆయన్ని విశ్వసించలేదు. కానీ, ఇప్పుడు, మోడీ ప్రభుత్వం రానున్న నాలుగేళ్లలో ప్రభుత్వ అస్తులను కుదువ పెట్టి/విక్రయించి లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల ఉపసంహరణ ద్వారా  ఆరు లక్షల కోట్ల రూపాయలు సంకుర్చుకునేందుకు, జాతీయ మానెటైజేష‌న్ పైప్‌లైన్ ప్రణాళికను ప్రకటించడంతో రాహుల్ గాంధీ ఆరోపణలకు బలం చేకూరింది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కొమ్ము కాస్తోందన్నఆరోపణలలో నిజముందని జనం నమ్ముతున్నారు.  ప్రభుత్వం అందించిన అస్త్రాన్ని అందుకుని, ప్రతిపక్ష పార్టీలు మోడీ సర్కార్’ పై కత్తులు దూస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో, ప్రభుత్వాలు అభివృద్ది చేసిన ప్ర‌తిష్టాత్మ‌క ఆస్తుల‌ను మోడీ ప్రభుత్వం తెగ‌న‌మ్ముతోందని, విపక్షాలు ద్వజ మెత్తుతున్నాయి. కొద్ది మంది కార్పొరేట్ల‌కు దోచిపెట్టేందుకే తాజా ప్రణాళికలని రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. కోట్లాదిమంది పౌరులకు ఉపయోగకరంగా ఉండే రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే అదే సమయంలో ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని, రాహుల్ , చిదంబరం స్పష్టం చేశారు.  మరోవంక బీజేపీ ఎదురుదాడికి సిద్దమైంది.  అమేథిలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని, కమల దళం రంగంలోకి దింపింది.దేశంలో ప్రైవేటీకరణ, మోనిటైజేషన్  శ్రీకారం చుట్టిందే  కాంగ్రెస్ పార్టీ  అంటూ  రాహుల్  గాంధీ ఆత్మవంచనకు పాల్పడుతున్నారని,ఆమె ఆరోపించారు. నిజమే, దేశంలో  రైల్వేలు, విమానాశ్రయాలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ పీవీ, మన్మోహన్ జోడీతో ప్రారంభమైంది. మన్మోహన్ సింగ్ చిదంబరం జోడీ దాన్ని మరింత ముందుకు తీసుకుపోయింది. మన్మోహన్ పీఎం గా, చిదంబరం దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లోనే విమానాశ్రయాల ప్రైవేటీకరణ మొదలైంది, అలాగే, ముంబై పూణే జాతీయ రహదారి మోనిటైజేషన్’కూడా మన్మోహన్, చిదంబరం హయాంలోనే జరిగింది. దేశ రాజధాని  ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రైవేటు పరం చేసింది కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే.. ఇవి గాక, బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు ఇతరత్రా రంగాల్లోనూ ప్రైవేటీకరణకు ఎంట్రీ పాస్ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమే.  కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం అందుకు మూల్యం కూడా చెల్లించింది. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పుల మెట్లు ఎక్కే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయం అంటే సామాన్య ప్రజలు, సొంత ఆస్తుల అమ్మకంగా భావిస్తారు. బాధ పడతారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనం.అందుకే, మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను భారీ మూల్యం చెల్లించడమే కాదు, రాజకీయంగా బీజేపీకి అంతకు మించిన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు.

రాజకీయ నేర సంబంధాలకు ముగింపు లేదా? సుప్రీం సీరియస్ తో సీన్ మారేనా.. 

రాజకీయ నేర సంబందాల గురించి మన దేశంలో జరిగినంత చర్చ బహుశా మరే దేశంలోనూ జరిగి ఉండదేమో,కానీ, రాజకీయ నేర సంబందాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 78 మంది సభ్యులుంటే, అందులో 33 మీద, అంటే 42 శాతం మంది మత్రులపై క్రిమినల్ కేసులున్నాయని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్  రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. అందులో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అలాగే, దేశం మొత్తంలో 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై, క్రిమినల్ కేసులున్నాయి. ఇవ్వన్నీ కూడా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫ్ఫిడవిట్ల పరిశీలించిన నిర్ధారించిన నిజాలు. ఇలా, చట్టసభల సభ్యుల నేర చరిత బరువు పెరిగిపోవడానికి ఇంకా కారణలు ఉంటే ఉండవచ్చును, కానీ, నేర విచారణలో , న్యాయ విచారణలో  జరుగతున్న జాప్యం ఒక  మూల కారణం. ఏడీఆర్నివేదిక ప్రకారం, ఎంపీలపై నమోదైన కేసుల సగటు పెండింగ్ వయసు ఏడేళ్ళు, ఎమ్మెల్యేల కేసుల పెండింగ్ వయసు ఆరేళ్ళు. ఇంకా ఆసక్తికర విషయం, తొమ్మిది మంది ఎంపీ, ఎమ్మెల్యేలలపై 25 సంవత్సరాలకు పైగా కేసులు పెండింగ్’లో ఉన్నాయి.   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అయితే, ఇంచుమున్చుగా దశాబ్ద కాలంగా ఆలా సాగుతూనే ఉన్నాయి. ఓడజనుకు పైగా చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయన్ని  సీబీఐ 2012 మే 25 న తొలిసారి అరెస్ట్ చేసింది. ఓ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యేవరకు కనీసం వారానికో సారి, కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదో ఒక సాకున కోర్టు హాజరు నుంచి కూడా మినహాయింపు పొండుతున్నారు. ఇక బైలు రద్దు కోరుతూ సొంత పార్టీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు దాఖలు చేసిన, పిటీషన్విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వస్తుందని అంటున్నారు. అయితే, ఈ కుసు నడత తీరును గమనిస్తే అప్పటికైనా తుడు తీర్పు వస్తుందా అనే విషయంలో ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.   ఈ నేపధ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబదించిన సీబీఐ, ఈడీ కేసుల సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు.  అయితే న్యాయస్థానాలు, న్యాయ మూర్తులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అగ్రాహం ఆవేదన వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు.న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఎప్పుడో దశాబ్దం ముందు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దోషులుగా నిర్థారణ అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఉపాధ్యాయ్ తమ పిటీషన్ లో కోరారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసుల విచారణ వేగంగా జరగడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని  కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే. అయితే సమస్య ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో తెలియకుండా, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అసలు సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి ... ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చిక్కితేనే కాని, చిక్కు ముడి వీడదు ... అంత వరకు  రాజకీయ నేర సంబంధాలు ముగింపులేని టీవీ సీరియల్  లాగా నడుస్తూనే ఉంటుంది.

న బూతో.. న భ‌విష్య‌త్‌! ఏపీ మంత్రుల బాట‌లో గులాబీ లీడ‌ర్స్‌

తెలుగురాష్ట్రాల్లో బూతుల మంత్రి ఎవ‌రంటే ట‌క్కున వినిపించే పేరు కొడాలి నాని. అమ్మ‌నా బూతులు తిట్ట‌డానికి ఆయ‌న ఏమాత్రం సిగ్గుప‌డ‌రు. సిగ్గు లేకుండా.. మ‌ర్యాద పాటించ‌కుండా.. నోటికొచ్చిన తిట్ల‌న్నీ తిట్టేయ‌డానికి ఆయ‌న అస‌లేమాత్రం వెన‌కాడ‌ర‌ని అంటారు. ఎంత తిడితే అంత గొప్ప‌గా ఫీల్ అవుతారు. తానో మంత్రిన‌ని.. ఆ ప‌ద‌విలో ఉన్న‌వాళ్లు కాస్త సంస్కారం పాటించాల‌నే విష‌యాన్ని ఆయ‌న అస‌లేమాత్రం ప‌ట్టించుకోరు. విప‌క్ష నేత‌ల‌పై బండ బూతులతో విరుచుకుప‌డుతూ త‌న మంత్రి ప‌ద‌విని ఎప్ప‌టిక‌ప్పుడు కాపాడుకుంటార‌ని అంటారు. కొడాలి నాని త‌ర్వాత మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కే బూతుల పోటీలో సెకండ్ ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇద్ద‌రు మంత్రులు నోటికి ప‌ని చెబుతూ.. ప్ర‌జ‌ల్లో బాగా చీప్ అయిపోయారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టిన‌ట్టున్నారు ఈ మ‌ధ్య వాళ్ల‌ నోటి దురుసుకు తాళం ప‌డింది. జ‌ల‌జ‌గ‌డంపై తెలంగాణ మంత్రులు వైఎస్సార్‌ను, వైఎస్ జ‌గ‌న్‌ను దొంగ‌, గ‌జ‌దొంగ‌, న‌ర‌రూప‌రాక్ష‌సుడు లాంటి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చినా.. పాపం తేలుకుట్టిన దొంగ‌ల్లా గ‌మ్మున ఊరుకుంటున్నారే గానీ.. త‌మ నోటికి గానీ, బూతుల‌కు గానీ ప‌ని చెప్ప‌డం లేదు ఏపీ మంత్రులు. ఇక‌, ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. ఏపీ మంత్రుల‌ను టీఆర్ఎస్ నేత‌లు బాగానే ఫాలో అవుతున్న‌ట్టున్నారు.  నాని, అనిల్‌ల మాదిరిగానే ప‌లువురు గులాబీ నాయ‌కులు ఇటీవ‌ల త‌మ నోటి దురుసుత‌నాన్ని మీడియా ముఖంగా చాటుతున్నారు. మైకులు ప‌గిలేలా.. వినేవారు చెవులు మూసుకునేలా తిట్ల‌పురాణం అందుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు.. బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను ఆటాడుకుంటే.. తాజాగా మంత్రి మ‌ల్లారెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓ రేంజ్‌లో కుమ్మేశారు. తిట్ల‌నే వాళ్లు ఆయుధాలుగా ప్ర‌యోగించి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై అధికార ప‌క్షం తిట్ల‌తో విరుచుకుప‌డుతూ.. ఏపీ వైసీపీ మార్క్ పాలిటిక్స్‌ను తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ అమ‌లు చేస్తోందా? అనే అనుమానం.  ఇన్నేళ్ల పొలిటిక‌ల్ కెరీర్‌లో మైనంప‌ల్లికి తెలంగాణ‌లో ఎంత పాపులారిటీ ఉందో తెలీదుగానీ.. బండి సంజ‌య్ ఎపిసోడ్‌తో మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో మైనంప‌ల్లి అంటే తెలీని వారే లేర‌ని చెప్పొచ్చు. బీజేపీ కార్పొరేట‌ర్‌పై ఎమ్మెల్యే మ‌నుషులు దాడి చేయ‌డం.. బాధితుడిని బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌రామ‌ర్శించ‌డం.. మైనంప‌ల్లి సంగ‌తి చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. బండి సంజ‌య్ వార్నింగ్‌కు ఎమ్మెల్యే మైనంప‌ల్లి ఇచ్చిన కౌంట‌రే కాంట్ర‌వ‌ర్సీగా మారింది. అరేయ్ బండిగా.. గుండుగా.. లుచ్చా.. మెంట‌ల్‌.. బట్టేబాజ్‌.. రారా చూసుకుందాం.. ఇలా తిట్ల దండ‌కం అందుకున్నారు మైనంప‌ల్లి. ఇదేదో బాగుంద‌నుకున్నారేమో ఏమో.. మంత్రి మ‌ల్లారెడ్డి సైతం మైనంప‌ల్లి బాట‌లో ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీద బూతుపురాణం మొద‌లుపెట్ట‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది.  మూడుచింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన 48 గంట‌ల‌ దీక్ష ముగింపు సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి.. మంత్రి మ‌ల్లారెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పాల మ‌ల్ల‌న్న‌.. జోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. బ్రోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. అంటూ కాస్త నోరుకూడా జారారు. ఆ విష‌యం తెలిసి మంత్రి మ‌ల్లారెడ్డి ఇక త‌న నోటి కంపునంతా బ‌య‌ట‌పెట్టేశారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబ‌ట్లోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్.. ఇలా తిట్లతో గ‌బ్బుగ‌బ్బు లేపారు. అయితే మంత్రి మల్లారెడ్డి బూతుల‌కు స్పందించి రేవంత్‌రెడ్డి త‌న స్థాయిని త‌గ్గించుకోద‌లుచుకోలేదు. కానీ, రేవంత‌న్న అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో మంత్రి మ‌ల్లారెడ్డిని తిట్లు, బూతుల‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. తెలుగు డిక్ష‌న‌రీలో ఉన్నవి, లేనివి అన్నీ కూడేసి మ‌ల్లారెడ్డిని ట్రోల్స్‌తో, కామెంట్స్‌తో, వీడియోల‌తో కుమ్మేస్తున్నారు.  ఇలాంటి తిట్ల దండ‌కంతో అస‌లు మేట‌ర్ ప‌క్క‌కు పోయి.. ప‌నికి రాని, ప‌నికి మాలిన ర‌చ్చంతా జ‌రుగుతోంది. అస‌లు తెలంగాణ‌లో తిట్ల క‌ల్చ‌ర్ తీసుకొచ్చిందే కేసీఆర్‌. ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రోళ్లంటూ ఒక తిట్లు తిట్ల‌లేదు గులాబీ బాస్‌. ఇప్పుడు అధినేత దారిలోనే న‌డుస్తూ.. ఏపీ మంత్రుల‌ను స్పూర్తిగా తీసుకుంటూ.. తిట్లు, బూతు పురాణం మొద‌లుపెట్టిన‌ట్టున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు. మ‌రి, ముందుముందు ఈ బ్యాడ్ క‌ల్చ‌ర్ ఇంకెంత చెత్త‌గా, కంపుగా, ర‌చ్చ‌గా మారుతుందో..

20 మంది టీచర్లు, 50 మంది విద్యార్థులకు కరోనా! ఏపీలో హాట్ స్పాట్లుగా స్కూళ్లు...

భయపడినట్లే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. స్కూళ్లు వైరస్ హాట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా.. ఆగస్టు 16 నుంచి స్కూళ్లను నడుపుతోంది జగన్ సర్కార్. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతందనే విమర్శలు వచ్చాయి. అయినా మొండిగా వ్యవహించింది ప్రభుత్వం. ఇప్పుడు అందరు భయపడినట్లుగానే ఏపీలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.  ఏపీలో స్కూళ్లలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లోని స్కూళ్లల్లో కొందరు టీచర్లు. విద్యార్థులకు కరోనా వైరస్ అంటుకుంది. ప్రకాశం, కృష్ణా , నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో స్కూలులో మొత్తం కలిపి సుమారు 50 మంది విద్యార్థులకు వైరస్ సోకింది.  20 మంది టీచర్లకు కూడా వైరస్ నిర్దారణ అయింది. దీంతో ఆయా స్కూళ్ళను మూసేశారు. టీచర్లు విద్యార్ధులకు కరోనా వైరస్ సోకగానే మిగిలిన టీచర్లు విద్యార్ధులతో పాటు స్కూళ్ళల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం సిబ్బందికి కూడా టెస్టులు చేయిస్తున్నారు. వీళ్లతో పాటు కరోనా సోకిన టీచర్లు, విద్యార్థుల తల్లి దండ్రులు,  కుటుంబసభ్యులకు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించాల్సి రావటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కో స్కూలులో 200 మంది విద్యార్ధులంటారని అనుకున్నా అందరు విద్యార్ధులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా టెస్టులు చేయించాల్సి రావటంతో స్ధానిక అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పదిమంది విద్యార్ధులకు కరోనా సోకడంతో స్కూలును వారం రోజుల పాటు మూసేశారు. తాజాగా ఏ స్కూల్లో అయినా 5 కేసులు బయటపడితే క్వారంటైన్ కోసమని 15 రోజులు స్కూల్ మూసేయాలని విద్యాశాఖ డిసైడ్ చేసింది. గతంలో కూడా కరోనా ఉధృతి తగ్గిందని అనుకోగానే ప్రభుత్వం స్కూళ్ళను తెరిచేసింది. దాంతో వెంటనే విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దాంతో అప్పటికప్పుడు మళ్ళీ అన్నీ స్కూళ్ళను ప్రభుత్వం మూయించేసింది. ఇంత గ్యాప్ తర్వాత స్కూళ్ళను తెరవగానే మళ్ళీ కరోనా వైర్ బయటపడుతోంది. అక్టోబర్ కు థర్డ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుందనే నిపుణుల హెచ్చరికలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. 

రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? కేసీఆర్ బాటలోనే నరుక్కొస్తారా?  

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది.  అధికారమే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ దూకుడు పెంచగా.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చింది. విపక్షాలు యాక్టివ్ కావడంతో గులాబీ బాస్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో తెలంగాణలో తీన్మార్ రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీల నేతల మాటలు శృతి మించుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి నోటికి పని చెప్పారు.  గబ్బుమాటలు మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉంటూ  రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబోకులోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్ వంటి తిట్లతో రెచ్చిపోయాడు మల్లారెడ్డి. అంతేకాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోడే అయితే పిసిసి చీఫ్ పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తాను కూడా తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్లే హీరో అని ఒప్పుకుంటానని, ఒకవేళ తాను ఓడిపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి మల్లారెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్జిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చగా మారాయి. కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డికి తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. రేవంత్ అభిమానులు మల్లారెడ్డిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బూతులు మాట్లాడిన మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లారెడ్డి మాటలపై కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. మంత్రి హోదాలో చిల్లరగా వ్యవహరించారని చెబుతూనే.. ఇది తమకే కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నారట హస్తం నేతలు. అంతేకాదు మల్లారెడ్డి సవాల్ ను అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ బలోపేతానికి కేసీఆర్ వాడిన స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి ఫాలో కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి రాజీనామాలనే అస్త్రంగా చేసుకున్నారు కేసీఆర్. 2006లో, 2008లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. కరీంనగర్ ఎంపీగా తాను కూడా రెండు సార్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి సక్సెస్ అయ్యారు. 2006లో వైఎస్సార్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బయటికి వెళ్లాక కీలక పరిణామాలు జరిగాయి. టీఆర్ఎస్ ను చీల్చేందుకు వైఎస్సార్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో... కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ చేసిన ఓ కామెంట్ కేసీఆర్ కు అస్త్రంగా మారింది. కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఎమ్మెస్సార్.. రాజీనామా చేసి తనతో పోటీ పడాలని సవాల్ చేశారు.  ఇదే అదనుగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ను ఓడించలేకపోయింది. కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికలో  కేసీఆర్ గెలుపు టీఆర్ఎస్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఉద్యమం మరింత ఉధృతమయ్యేందుకు దోహదపడింది. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే మంత్రి మల్లారెడ్డి సవాల్ ను స్వీకరించి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగానే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక నేతలంతా యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. అయినా రేవంత్ రెడ్డి గెలిచారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ చాలా బలపడింది. అదే సమయంలో 2019 లో కంటే ప్రస్తుతం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే బంపర్ మెజార్టీ వస్తుందని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారట. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ , మల్కాజ్ గిరి, కూత్పుల్లాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపడటంతో పాటు రేవంత్ రెడ్డి మేనియా కనిపిస్తోంది. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని సెటిలర్ ఓటర్లంతా గంపగుత్తగా రేవంత్ రెడ్డికి జై కొట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక్కడ రేవంత్ కు ఏకపక్షంగా ఓట్లు వస్తాయని గాంధీభవన్ లెక్క. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోనూ స్థానిక ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ కూడా తమకు మెజార్టీ ఖాయమని అంటున్నారు రేవంత్ అనుచరులు. ఈ లెక్కల మల్కాజ్ గిరి లో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే.. రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.  మంత్రి మల్లారెడ్డి సవాల్ ను స్వీకరించి ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయంపై రేవంత్ రెడ్డి సీరియస్ గానే చర్చలు చేస్తున్నారని తెలుస్తోంది. మల్కాజ్ గిరిలో తిరిగి పోటీ చేస్తే తమకు తిరుగు ఉండదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపును ఇక ఎవరూ ఆపలేదనే భావనలో రేవంత్ రెడ్డి టీమ్ ఉందని తెలుస్తోంది. అయితే రాజీనామా నిర్ణయం సొంతగా తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి... హైకమాండ్ తో మాట్లాడాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కావడంతో పాటు భవిష్యత్ రాజకీయాలకు కేంద్రంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అన్ని మంచి రోజులే కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా తాను చేస్తున్న పోరాటానికి జనాల నుంచి అనూహ్యా స్పందన వస్తుండగా.. తాజాగా ఆయన మరో గుడ్ న్యూస్ అందింది. ఓటుకు నోటు కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి  సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ నెల 31లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఈ కేసులోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు నుంచి తన పేరును తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఈ కేసును విచారించే అధికారం ఏసీబీకి లేదని రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఇటీవల వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.  అయితే ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టులో ఎలాంటి విచారణ చేపట్టవద్దంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా  సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపించారు. 

జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే బిగ్ షాక్.. ఏపీలో అవినీతి పాలనట! 

ఆంధ్రప్రదేశ్ లో అస్తవ్యస్థ, అరాచక పాలన సాగుతుందనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయాలతో ఏపీ అథోగతి పాలవుతోందని, రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెబుతున్నారు. అధికార వైసీపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా జగన్ రెడ్డి పాలనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎంతొ గొప్పగా చెప్పుకునే వ్యవస్థ.. అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.  సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ అవినీతిమయంగా మారిందని అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన 267 మంది వలంటీర్లను తొలగిం​చినట్లు కేతిరెడ్డి చెప్పారు. గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి మెమోలు ఇచ్చినట్టు తెలిపారు. వలంటీర్లు​ ప్రతి​ పథకం అమలులో డబ్బు వసూలు ​చేస్తున్నారని అన్నారు.  అవినీతికి పాల్పడిన వలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని​ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు.  ఒక్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మొదటి నుంచి టీడీపీ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లంచం ఇవ్వనిదే ఏ పని చేయడం లేదని చెబుతున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడం, తమకు డబ్బులు ఇచ్చిన వారికే పథకాలు వర్తించేలా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేయే వాలంటీర్ల పని తీరుపై దారుణమైన కామెంట్లు చేయడం రచ్చగా మారింది. సొంత ఎమ్మెల్యేయే అవినీతి గురించి బయట మీడియాతో విమర్శలు చేయాల్సి వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో అర్ధం చేసుకోవచ్చు.  వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు  అస్త్రంగా మారుతుందని  అంటున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైసీపీలోనే చర్చగా మారాయి. మరోవైపు సీఎం జగన్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తన మానస పుత్రికగా భావిస్తున్నారు జగన్. అలాంటి స్కీంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. 

ర‌ఘువీరా రీఎంట్రీతో జ‌గ‌న్‌కు చిక్కులేనా? సీమ‌లో వైసీపీకి న‌ష్ట‌మేనా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని కొద్ది మంది రాజకీయ నాయకులలో, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి ఒకరు. రాజకీయాలలో ప్రత్యేక స్వరాన్ని వినిపించిన రఘువీర రెడ్డి, ఒక్క ముఖ్యమంత్రి పదవిని తప్ప, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎత్తుపల్లాలు అన్నీ చూశారు. కీలక పదవువులు అనుభవించారు. వ్యవసాయ మంత్రిగా కరవు జిల్లా అనంతపూర్ జిల్లా అభివృద్ధికి చాలా గట్టి ప్రయత్నం చేశారు. జిల్లా రాజకీయలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ్లలోనూ తమదైన ముద్ర వేశారు. అయితే,,2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి కూడా ఓడి పోవడంతో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక అక్కడినుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగింఛి, దైవ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.  అయితే, గత కొంత కాలంగా, రఘువీర పొలిటికల్ రీఎంట్రీపై రాజకీయ, మీడియా వర్గాలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.విభిన్న కోణాల్లో వ్యూహాగానలు వినిపిస్తునాయి. వరస ఓటముల కారణంగా ఒక విధమైన రాజకీయ వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితం వైపుకు మరలిన రఘువీర తమ జీవిత ఆశయంగా భావించిన ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, ఆయన రాజకీయ రీఎంట్రీ గురింఛి, చర్చ సాగుతోంది. అందులో ప్రధానంగా, ఆయన తిరిగి రాజకీయాలలోకి రావదమే నిజం అయితే, ఏ పార్టీలో చేరతారు... మాతృ సంస్థ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, వైఎస్  ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో అధికార వైసీపీలో చేరతారా, లేక వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చేతులు కలుపుతారా? అనే చర్చ అన్ని వర్గాలలోనూ వినవస్తోంది.  అయితే, ఆయన ప్రధానంగా కాంగ్రెస్ వాది. అది నిజం. అందులో మరో అభిప్రాయం లేదు.  ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం అయినా, రాష్ట్ర్రంలో తమిళనాడు తరహ, రెండు పార్టీల వ్యవస్థ బలపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని, ఒకప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన  మిత్రులు కొందరు చెపుతున్నారు. నిజానికి, రఘువీర  కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు, బలోపేతం చేసేందుకు మూడు నాలుగు సంవత్సరాలు చాలా గట్టి ప్రయత్నమే చేశారు.అయినా, ఆశించిన ఫలితం రాలేదు. అందుకే చివరాఖరుకు, చేసేది లేక అస్త్ర సన్యాసం చేశారు. అలిమి కానీ చోట అధికులమన రాదనే విజ్ఞతను చూపి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేకంటే, ఇప్పటిలానీ, ఉండిపోవడమే ఉత్తమమని ఆయన మిత్రులు అంటున్నారు. ఆయనకు అలాంటి ఆలోచన లేదని కూడా, అంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు, ఆ సమావేశానికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేవీపే రామచంద్ర రావు, తదిర నాయకులతో పాటుగా రఘువీరాకు కూడా ఆహ్వానం అందింది. అయినా, ఆయన హాజరు కాలేదు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు మళ్ళీ కాంగ్రేస్ లో చేరే ఆలోచన లేదని అనుకోవచ్చని అంటున్నారు. అదే విధంగా, వైసీపీలో చేరే అవకాశం కూడా లేదని, అలాంటి ఆలోచనే ఉంటే, ఎప్పుడోనే ఆపని చేసేవారని అంటారు. అదీ గాక, ఇప్పటికే రఘువీర, జగన్ కారణంగా ఒక సారి అప్రదిష్ట పాలయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ప్రోద్బలంతో ఆయన్నిముఖ్యమంత్రిని చేయాలని ఇంకెవరో చేపట్టిన సంతకాల సేకరణ, వెనక రఘువీర ఉన్నారని ప్రచారం జరిగింది. నిజానికి, ఆ వ్యవహారంలో రఘువీర ప్రమేయం లేక పోయినా, జగన్ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా అపవాదు భరించవలసి వచ్చింది. అదీ, కాక, జగన్ రెడ్డి అరాచక పాలన చూస్తూ రఘువీర, ఆయనతో చేతులు కలపడం వంటి దుస్సాహసం చేయరని అంటున్నారు.   మరోవంక తెలుగు దేశం పార్టీ, చాలా కాలంగా రఘువీరా రెడ్డితో  వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతోంది. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించిన రఘువీరా రెడ్డిని స్వయంగా అభినందించారు. మరోవంక, తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సోదరుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి, నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి నిర్మించిన దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమ హక్కుల కోసం కలిసిపోరాటం చేసేందుకు కలిసి రావాలని కోరినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడానికే అక్కడకు వెళ్లారనే చర్చ కూడా సాగుతోంది.  రఘువీరా రెడ్డి కూడా తెలుగు దేశం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.అయితే, ఒకటి మాత్రం నిజం ఆయన తిరిగి రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే, తెలుగు దేశంలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగి, రఘువీర టీడీపీలో చేరితే, ప్రస్తుతం బీజేపీ,జనసేన, వైసీపీలలో ఇతర పార్టీలలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుకలు టీడీపీ తలుపులు తట్టడం ఖాయమని పరిశీలకులు భావిస్తన్నారు. నిజానికి, ఇటీవల కాలంలో వస్తున్న సర్వేలు అన్నీ, రానుంది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ మాజీలు చాలా మంది ఇప్పటికే టీడీపే వైపు చూస్తున్నారని, రఘువీరా చేరికతో జోరు పెరుగుతుందని అంటున్నారు.

జోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. బ్రోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. ఓ రేంజ్‌లో రేవంత్‌రెడ్డి ఫైర్‌..

‘‘నేను దీక్ష చేపట్టి 24 గంటలయింది. పాల అమ్మేవాళ్లు రాలేదు. నీళ్లు అమ్మే వాళ్లు రాలేదు. భూములు కబ్జాలు చేసే వాళ్లు రాలేదు. జోకర్ మల్లన్న కూడా రాలే. ఈ భూమ్మీద జోకర్లను చూశాం. బోకర్లను చూశాం. కానీ పాల మల్లిగాడు సగం జోకర్.. సగం బ్రోకర్. వేదికలెక్కితే జోకర్‌లా మాట్లాడతారు. వేదిక దిగితే భూముల బ్రోకర్‌లాగా మాట్లాడుతారు. ఎవరు భూములు అమ్మినా.. కొనుగోలు చేసినా ఈ పాల మల్లిగాడికి కమీషన్ ఇవ్వాల్సిందే.’’ అంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి.. మంత్రి మ‌ల్లారెడ్డిపై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని విమ‌ర్శించారు.  మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దీక్ష ముగింపు సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి మ‌ల్లారెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు రేవంత్‌రెడ్డి. సీఎం కేసీఆర్‌ మాటలు అబద్ధాల మూటలన్నారు. దత్తత గ్రామాలను దగా కేసీఆర్‌ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఒక్క హామీనీ నెరవేర్చలేదని.. ఒక్క హామీ నెరవేర్చినా తన ముక్కు నేలకు రాస్తానని చెప్పానని.. అయినా సీఎం కేసీఆర్‌ తనతో చర్చకు రాలేదన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.  రేవంత్‌రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై మంత్రి మల్లారెడ్డి సైతం అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని తెలిపారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్‌, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నాన‌ని చెప్పారు మంత్రి మ‌ల్లారెడ్డి.  ‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ నా సవాల్‌ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తా. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రేవంత్‌ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అంటూ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. ఇద్ద‌రి మాట‌కు మాట తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ అమాంతం పెంచేసింది.   

జ‌గ‌న్‌తో కౌగిలింత‌లు.. బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌న్న ఎమ్మెల్యే..

సోద‌ర భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాఖీ క‌ట్టారు. ఆమె ఇలా రాఖీ క‌ట్ట‌డం ఇదే మొద‌టిసారి కూడా కాదు. త‌న రాజ‌కీయ గురువుకు ద‌శాబ్దంన్న‌ర‌గా సీత‌క్క రాఖీ కడుతూ ఉన్నారు. టీడీపీని వీడినా.. కాంగ్రెస్‌లో ఉంటున్నా.. చంద్రబాబు త‌న‌కు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తుపెట్టుకొని రాఖీ సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చారు. అడ‌వి బిడ్డ సీత‌క్క‌ను సాన‌బ‌ట్టి.. స్ట్రాంగ్ లీడ‌ర్‌గా, ఎమ్మెల్యేగా చేసినంద‌కు చంద్ర‌బాబుకు సీత‌క్క ఇప్ప‌టికీ కృత‌జ్ఞ‌త‌గా ఉంటున్నారు. ఇటీవ‌ల సీత‌క్క త‌ల్లి కొవిడ్‌తో ఆసుప‌త్రిలో చేరితే చంద్ర‌బాబు వెళ్లి ప‌రామ‌ర్శించారు కూడా. తాజాగా ఆయ‌న‌కు రాఖీ క‌ట్టి.. చంద్ర‌బాబుపై త‌న‌కున్న అభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌. అయితే, సీత‌క్క చంద్ర‌బాబుకు రాఖీ క‌ట్ట‌డంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బానిస రాఖీ కట్టిందంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్‌గా సీత‌క్క ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు.  రాఖీ పండగను కూడా రాజకీయం చేస్తున్నారా అంటూ మొద‌లుపెట్టి.. రోజా, జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు సీత‌క్క‌. పార్టీ మారినందుకో.. ప్రాంతం వేరైనందుకో.. బాబు సీఎం కానందుకో.. రాఖీ కట్టకుండా ఉండాలనుకునే వ్యక్తిని కాదని సీతక్క స్పష్టం చేశారు. సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు.. నన్ను బానిస అంటారా? అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేశారు.  సమ్మక్క సారలమ్మ వారసులం. నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం వారసులం. దొరతనాన్ని తరిమికొట్టిన బిడ్డలం.. బిడ్డా ఖబడ్దార్ అంటూ రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీత‌క్క‌. బానిసత్వానికి బడితెపూజ చేశామని.. కోవర్టులను కోసిన చరిత్ర తమదని సీతక్క అన్నారు. ఆ రోజుల్లో నక్సలైట్‌గా ఉన్నా నిబద్ధతతో పనిచేశానని.. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా అంతే క‌మిట్‌మెంట్‌తో పనిచేస్తామని చెప్పారు. నువ్వు, నీ మంత్రులు ఎక్కడ అధికారముంటే అక్కడ జై అంటారు. నీ అధికారం పోగానే నిన్ను కూడా భౌభౌ అంటారంటూ రోజాను మాట‌ల‌తో కుళ్ల‌బొడిచారు సీత‌క్క‌.  ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సీఎం కేసీఆర్ నెరుపుతున్న‌ సంబంధాలపైనా ఘాటైన‌ విమర్శలు చేశారు సీతక్క. కేసీఆర్‌ తిరుపతిలో రోజమ్మ ఇంట్లో అన్నం తిని రావొచ్చు.. రాయలసీమ పోయి నీళ్తు ఇస్తామని చెప్పి రావొచ్చు కానీ.. పోతిరెడ్డిపాడు నుంచి జగన్ నీళ్లు తీసుకుపోతుంటే కండ్లప్పగించి చూస్తూ ఉండి.. ఇప్పుడు జ‌గ‌న్‌ నీళ్లు తీసుకుపోతున్నాడంటూ తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ మండిప‌డ్డారు సీతక్క. సీఎం జగన్‌ను కౌగిలించుకుని.. వంగి వంగి దండాలు పెట్టి.. ఇప్పుడు గొడవపడుతున్నట్లు మోసం చేస్తున్నారని కేసీఆర్‌ను గ‌ట్టిగా విమ‌ర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.   

కేటీఆర్‌ని సీఎం చేస్తే ప్రగతిభవన్ ముందు ప్రాణం తీసుకుంటానన్న‌ కవిత..!

క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో ఫ్యామిలీ వార్‌. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది ప్ర‌చారం. ఇది ప్ర‌చారం కాద‌ని.. అదంతా నిజ‌మ‌ని ఈ రాఖీ పండుగ‌తో తేలిపోయింది. ఏటేటా అన్న కేటీఆర్‌కు రాఖీ క‌ట్టే చెల్లి క‌విత‌.. ఈసారి మాత్రం రాఖీ క‌ట్ట‌కుండా ముఖం చాటేసింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఫ్యామిలీ గొడ‌వ‌లున్నాయ‌నే వాద‌న‌కు ఓపెన్‌గా బ‌లం చేకూరింది. కేటీఆర్‌, సంతోష్‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవడం లేద‌నేది క‌విత అక్క‌స్సు.  అంతేకాదు, కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను క‌విత తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ముఖ్య‌మంత్రి పీఠమే క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింద‌నే వారూ ఉన్నారు. ఇక‌, ఆస్తుల‌న్నీ మీరే పోగేసుకుంటారా.. మాకేమీ ఛాన్స్ ఇవ్వ‌రా అంటూ కూడా క‌విత‌మ్మ అలిగింద‌ని కూడా అంటున్నారు. నిజ‌మేంటో బ‌య‌టి వారికి తెలీకున్నా.. కేసీఆర్ ఫ్యామిలీలో వార్ జ‌రుగుతోంద‌నే సంగ‌తి మాత్రం రాఖీతో తేలిపోయింది. అన్న‌-చెల్లికి అస్స‌లు ప‌డ‌టం లేద‌ని.. తండ్రి త‌న‌యుడికే స‌పోర్ట్ చేయ‌డం ఇష్టం లేక‌నే కూతురు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో అడుగుపెట్ట‌లేద‌ని అంటున్నారు.  కేటీఆర్‌-క‌విత గొడ‌వ‌ల‌పై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల‌ మధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. అందుకే ఆమె రాఖీ కట్టేందుకు కూడా రాలేదని అన్నారు. కేటీఆర్‌ని సీఎం చేస్తే ప్రగతి భవన్ ముందు ప్రాణం తీసుకుంటానని కవిత చెప్పిందంటూ ఎమ్మెల్యే సీత‌క్క చేసిన కామెంట్స్ తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆ.. నిజ‌మా? క‌విత అంత మాటందా? కేటీఆర్‌ను సీఎం చేస్తే.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముందు సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిందా? అంటూ ఇటు కాంగ్రెస్ నాయ‌కుల‌తో పాటు టీఆర్ఎస్ వ‌ర్గాలు సైతం చ‌ర్చించుకుంటున్నాయి. ఎప్పుడూ కాస్త మౌనంగా ఉండే సీత‌క్క‌.. ఇంత‌టి ఆరోప‌ణ చేసిందంటే అందులో నిజం ఉండే ఉంటుంద‌ని అంటున్నారు.   

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. తీన్మార్ మ‌ల్లన్న ఆఫీసుపై మ‌ళ్లీ పోలీసుల దాడి...

సీఎం కేసీఆర్‌, తెలంగాణ స‌ర్కారును తీన్మార్ మ‌ల్ల‌న్న ఓ ప‌ట్టాన వ‌ద‌ల‌డం లేదు. అలాగే, పోలీసులు సైతం చింత‌పండు న‌వీన్‌ను వ‌ద‌ల మ‌ల్ల‌న్నా అంటూ వెంట‌బ‌డుతున్నారు. గ‌తంలో ఓసారి ఆయ‌న ఆఫీసుపై దాడి చేసిన పోలీసులు.. తాజాగా మ‌రోసారి క్యూ-న్యూస్ ఆఫీసుపై అటాక్ చేశారు. భారీ సంఖ్య‌లో వ‌చ్చిన పోలీసులు ఒక్క‌సారిగా మ‌ల్ల‌న్న కార్యాల‌యాన్ని చుట్టుముట్టారు. సిబ్బంది అంద‌రినీ క‌ద‌ల‌కుండా క‌ట్ట‌డి చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. బ‌య‌టి వారినెవ‌రినీ లోనికి అనుమ‌తించ‌డం లేదు. లోని వారిని బ‌య‌ట‌కు పంపించ‌డం లేదు. కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్క్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. మంగ‌ళ‌వారం టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా వింగ్‌.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బుధ‌వారం పోలీసులు క్యూ-న్యూస్ ఆఫీసుపై దాడి చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. గ‌తంలోనూ ఓ యువ‌తి ఫిర్యాదు మేర‌కు ఇలానే అటాక్ చేశారు పోలీసులు. క్యూ-న్యూస్ ఛానెల్‌పై మూకుమ్మ‌డి దాడి చేసి కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వ‌దిలేశారు. అంతే. అంత‌కుమించి ఏమీ చేయ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత మ‌ల్ల‌న్న కోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. తాజాగా ఇప్పుడు మ‌రోసారి పోలీసులు క్యూ-న్యూస్ ఆఫీసుపై రైడ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పోలీసుల దాడి విష‌యం తెలిసి.. మ‌ల్ల‌న్న అభిమానులు పెద్ద సంఖ్య‌లో క్యూ-న్యూస్ కార్యాల‌యానికి త‌ర‌లివ‌స్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది.   

తీన్మార్ మ‌ల్లన్న‌కు టీఆర్ఎస్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. ఇంకోసారి తిడితేనా....

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఇప్పుడిది పేరు మాత్ర‌మే కాదు. ఓ ప‌వ‌ర్‌. కేసీఆర్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిత్యం చెడుగుడు ఆడుకునే మాస్ మ‌ల్లన్న. యూట్యూబ్ ఛానల్‌తో గులాబీ గ్యాంగ్‌ను ఆటాడుకోవ‌డ‌మే చింత‌పండు న‌వీన్ ప‌ని. ఆ ప‌నిలో ఆయ‌న తెగ బిజీగా ఉంటారు. ముఖ్య‌మంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఇలా త‌ర‌త‌మ భేదం లేకుండా రోజు ఉద‌యాన్నే అంద‌రినీ ఓ రౌండ్ వాయించేస్తుంటారు. నిత్యం ప్ర‌జ‌ల్లో త‌మ‌ను బ‌ద్నాం చేసే మ‌ల్ల‌న్న నోటికి, యూట్యూబ్ ఛానెల్‌కి ఎలాగైనా తాళం వేయాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది కేసీఆర్ స‌ర్కారు. అయితే, సోష‌ల్ మీడియా కావ‌డంతో న‌వీన్‌ను ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల ఓ యువ‌తి ఫిర్యాదుతో ఒక్క‌సారిగా పోలీసులంతా క‌లిసి క్యూ-న్యూస్ ఛానెల్‌పై మూకుమ్మ‌డి దాడి చేసి కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వ‌దిలేశారు. అంతే. అంత‌కుమించి ఏమీ చేయ‌లేక‌పోయారు. మ‌ల్ల‌న్నా..మ‌జాకా... రోజూ మ‌ల్ల‌న్న నోటి నుంచి తిట్ల దండ‌కం విని త‌ట్టుకోలేక‌.. టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా విభాగం ఈసారి నేరుగా రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై టీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం మండిపడింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్మోహన్ రావు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే చిలకలగూడ పీఎస్‌లో ఓ కేసు దర్యాప్తు జరుగుతోందని, దాంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఆయన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని వార్తలు చదువుతున్నాడా.. తిడుతున్నాడా? అన్న అనుమానం వచ్చేలా ఆయన వీడియోలు ఉంటున్నాయని, కేసీఆర్‌పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. జర్నలిజం అంటే బూతులు తిట్టడమేనా? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.  ఇప్పటికైతే ఫిర్యాదుతో ఊరుకుంటున్నామని, ఆయన మళ్లీ కేసీఆర్‌ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సోషల్‌మీడియాలో సీఎంపై అనుచిత పోస్టులు పెడితే పోలీసులు అరెస్టులు చేశారని, తీన్మార్ మల్లన్న ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు టీఆర్ఎస్ నాయ‌కులు. మ‌రి, ఇలాంటి బెదిరింపుల‌కు తీన్మార్ మ‌ల్ల‌న్న భ‌య‌ప‌డ‌తారా?