రాజకీయ నేర సంబంధాలకు ముగింపు లేదా? సుప్రీం సీరియస్ తో సీన్ మారేనా.. 

రాజకీయ నేర సంబందాల గురించి మన దేశంలో జరిగినంత చర్చ బహుశా మరే దేశంలోనూ జరిగి ఉండదేమో,కానీ, రాజకీయ నేర సంబందాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 78 మంది సభ్యులుంటే, అందులో 33 మీద, అంటే 42 శాతం మంది మత్రులపై క్రిమినల్ కేసులున్నాయని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్  రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. అందులో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అలాగే, దేశం మొత్తంలో 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై, క్రిమినల్ కేసులున్నాయి. ఇవ్వన్నీ కూడా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫ్ఫిడవిట్ల పరిశీలించిన నిర్ధారించిన నిజాలు. ఇలా, చట్టసభల సభ్యుల నేర చరిత బరువు పెరిగిపోవడానికి ఇంకా కారణలు ఉంటే ఉండవచ్చును, కానీ, నేర విచారణలో , న్యాయ విచారణలో  జరుగతున్న జాప్యం ఒక  మూల కారణం. ఏడీఆర్నివేదిక ప్రకారం, ఎంపీలపై నమోదైన కేసుల సగటు పెండింగ్ వయసు ఏడేళ్ళు, ఎమ్మెల్యేల కేసుల పెండింగ్ వయసు ఆరేళ్ళు. ఇంకా ఆసక్తికర విషయం, తొమ్మిది మంది ఎంపీ, ఎమ్మెల్యేలలపై 25 సంవత్సరాలకు పైగా కేసులు పెండింగ్’లో ఉన్నాయి.   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అయితే, ఇంచుమున్చుగా దశాబ్ద కాలంగా ఆలా సాగుతూనే ఉన్నాయి. ఓడజనుకు పైగా చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయన్ని  సీబీఐ 2012 మే 25 న తొలిసారి అరెస్ట్ చేసింది. ఓ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యేవరకు కనీసం వారానికో సారి, కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదో ఒక సాకున కోర్టు హాజరు నుంచి కూడా మినహాయింపు పొండుతున్నారు. ఇక బైలు రద్దు కోరుతూ సొంత పార్టీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు దాఖలు చేసిన, పిటీషన్విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వస్తుందని అంటున్నారు. అయితే, ఈ కుసు నడత తీరును గమనిస్తే అప్పటికైనా తుడు తీర్పు వస్తుందా అనే విషయంలో ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.   ఈ నేపధ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబదించిన సీబీఐ, ఈడీ కేసుల సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు.  అయితే న్యాయస్థానాలు, న్యాయ మూర్తులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అగ్రాహం ఆవేదన వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు.న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఎప్పుడో దశాబ్దం ముందు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దోషులుగా నిర్థారణ అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఉపాధ్యాయ్ తమ పిటీషన్ లో కోరారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసుల విచారణ వేగంగా జరగడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని  కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే. అయితే సమస్య ఎక్కడుందో, పరిష్కారం ఏమిటో తెలియకుండా, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అసలు సంస్కరణలు ఎక్కడ మొదలు కావాలి ... ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం చిక్కితేనే కాని, చిక్కు ముడి వీడదు ... అంత వరకు  రాజకీయ నేర సంబంధాలు ముగింపులేని టీవీ సీరియల్  లాగా నడుస్తూనే ఉంటుంది.

న బూతో.. న భ‌విష్య‌త్‌! ఏపీ మంత్రుల బాట‌లో గులాబీ లీడ‌ర్స్‌

తెలుగురాష్ట్రాల్లో బూతుల మంత్రి ఎవ‌రంటే ట‌క్కున వినిపించే పేరు కొడాలి నాని. అమ్మ‌నా బూతులు తిట్ట‌డానికి ఆయ‌న ఏమాత్రం సిగ్గుప‌డ‌రు. సిగ్గు లేకుండా.. మ‌ర్యాద పాటించ‌కుండా.. నోటికొచ్చిన తిట్ల‌న్నీ తిట్టేయ‌డానికి ఆయ‌న అస‌లేమాత్రం వెన‌కాడ‌ర‌ని అంటారు. ఎంత తిడితే అంత గొప్ప‌గా ఫీల్ అవుతారు. తానో మంత్రిన‌ని.. ఆ ప‌ద‌విలో ఉన్న‌వాళ్లు కాస్త సంస్కారం పాటించాల‌నే విష‌యాన్ని ఆయ‌న అస‌లేమాత్రం ప‌ట్టించుకోరు. విప‌క్ష నేత‌ల‌పై బండ బూతులతో విరుచుకుప‌డుతూ త‌న మంత్రి ప‌ద‌విని ఎప్ప‌టిక‌ప్పుడు కాపాడుకుంటార‌ని అంటారు. కొడాలి నాని త‌ర్వాత మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కే బూతుల పోటీలో సెకండ్ ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇద్ద‌రు మంత్రులు నోటికి ప‌ని చెబుతూ.. ప్ర‌జ‌ల్లో బాగా చీప్ అయిపోయారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టిన‌ట్టున్నారు ఈ మ‌ధ్య వాళ్ల‌ నోటి దురుసుకు తాళం ప‌డింది. జ‌ల‌జ‌గ‌డంపై తెలంగాణ మంత్రులు వైఎస్సార్‌ను, వైఎస్ జ‌గ‌న్‌ను దొంగ‌, గ‌జ‌దొంగ‌, న‌ర‌రూప‌రాక్ష‌సుడు లాంటి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చినా.. పాపం తేలుకుట్టిన దొంగ‌ల్లా గ‌మ్మున ఊరుకుంటున్నారే గానీ.. త‌మ నోటికి గానీ, బూతుల‌కు గానీ ప‌ని చెప్ప‌డం లేదు ఏపీ మంత్రులు. ఇక‌, ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. ఏపీ మంత్రుల‌ను టీఆర్ఎస్ నేత‌లు బాగానే ఫాలో అవుతున్న‌ట్టున్నారు.  నాని, అనిల్‌ల మాదిరిగానే ప‌లువురు గులాబీ నాయ‌కులు ఇటీవ‌ల త‌మ నోటి దురుసుత‌నాన్ని మీడియా ముఖంగా చాటుతున్నారు. మైకులు ప‌గిలేలా.. వినేవారు చెవులు మూసుకునేలా తిట్ల‌పురాణం అందుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు.. బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను ఆటాడుకుంటే.. తాజాగా మంత్రి మ‌ల్లారెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓ రేంజ్‌లో కుమ్మేశారు. తిట్ల‌నే వాళ్లు ఆయుధాలుగా ప్ర‌యోగించి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై అధికార ప‌క్షం తిట్ల‌తో విరుచుకుప‌డుతూ.. ఏపీ వైసీపీ మార్క్ పాలిటిక్స్‌ను తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ అమ‌లు చేస్తోందా? అనే అనుమానం.  ఇన్నేళ్ల పొలిటిక‌ల్ కెరీర్‌లో మైనంప‌ల్లికి తెలంగాణ‌లో ఎంత పాపులారిటీ ఉందో తెలీదుగానీ.. బండి సంజ‌య్ ఎపిసోడ్‌తో మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో మైనంప‌ల్లి అంటే తెలీని వారే లేర‌ని చెప్పొచ్చు. బీజేపీ కార్పొరేట‌ర్‌పై ఎమ్మెల్యే మ‌నుషులు దాడి చేయ‌డం.. బాధితుడిని బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌రామ‌ర్శించ‌డం.. మైనంప‌ల్లి సంగ‌తి చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. బండి సంజ‌య్ వార్నింగ్‌కు ఎమ్మెల్యే మైనంప‌ల్లి ఇచ్చిన కౌంట‌రే కాంట్ర‌వ‌ర్సీగా మారింది. అరేయ్ బండిగా.. గుండుగా.. లుచ్చా.. మెంట‌ల్‌.. బట్టేబాజ్‌.. రారా చూసుకుందాం.. ఇలా తిట్ల దండ‌కం అందుకున్నారు మైనంప‌ల్లి. ఇదేదో బాగుంద‌నుకున్నారేమో ఏమో.. మంత్రి మ‌ల్లారెడ్డి సైతం మైనంప‌ల్లి బాట‌లో ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీద బూతుపురాణం మొద‌లుపెట్ట‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది.  మూడుచింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన 48 గంట‌ల‌ దీక్ష ముగింపు సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి.. మంత్రి మ‌ల్లారెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పాల మ‌ల్ల‌న్న‌.. జోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. బ్రోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. అంటూ కాస్త నోరుకూడా జారారు. ఆ విష‌యం తెలిసి మంత్రి మ‌ల్లారెడ్డి ఇక త‌న నోటి కంపునంతా బ‌య‌ట‌పెట్టేశారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబ‌ట్లోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్.. ఇలా తిట్లతో గ‌బ్బుగ‌బ్బు లేపారు. అయితే మంత్రి మల్లారెడ్డి బూతుల‌కు స్పందించి రేవంత్‌రెడ్డి త‌న స్థాయిని త‌గ్గించుకోద‌లుచుకోలేదు. కానీ, రేవంత‌న్న అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో మంత్రి మ‌ల్లారెడ్డిని తిట్లు, బూతుల‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. తెలుగు డిక్ష‌న‌రీలో ఉన్నవి, లేనివి అన్నీ కూడేసి మ‌ల్లారెడ్డిని ట్రోల్స్‌తో, కామెంట్స్‌తో, వీడియోల‌తో కుమ్మేస్తున్నారు.  ఇలాంటి తిట్ల దండ‌కంతో అస‌లు మేట‌ర్ ప‌క్క‌కు పోయి.. ప‌నికి రాని, ప‌నికి మాలిన ర‌చ్చంతా జ‌రుగుతోంది. అస‌లు తెలంగాణ‌లో తిట్ల క‌ల్చ‌ర్ తీసుకొచ్చిందే కేసీఆర్‌. ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రోళ్లంటూ ఒక తిట్లు తిట్ల‌లేదు గులాబీ బాస్‌. ఇప్పుడు అధినేత దారిలోనే న‌డుస్తూ.. ఏపీ మంత్రుల‌ను స్పూర్తిగా తీసుకుంటూ.. తిట్లు, బూతు పురాణం మొద‌లుపెట్టిన‌ట్టున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు. మ‌రి, ముందుముందు ఈ బ్యాడ్ క‌ల్చ‌ర్ ఇంకెంత చెత్త‌గా, కంపుగా, ర‌చ్చ‌గా మారుతుందో..

20 మంది టీచర్లు, 50 మంది విద్యార్థులకు కరోనా! ఏపీలో హాట్ స్పాట్లుగా స్కూళ్లు...

భయపడినట్లే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. స్కూళ్లు వైరస్ హాట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా.. ఆగస్టు 16 నుంచి స్కూళ్లను నడుపుతోంది జగన్ సర్కార్. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతందనే విమర్శలు వచ్చాయి. అయినా మొండిగా వ్యవహించింది ప్రభుత్వం. ఇప్పుడు అందరు భయపడినట్లుగానే ఏపీలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.  ఏపీలో స్కూళ్లలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లోని స్కూళ్లల్లో కొందరు టీచర్లు. విద్యార్థులకు కరోనా వైరస్ అంటుకుంది. ప్రకాశం, కృష్ణా , నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో స్కూలులో మొత్తం కలిపి సుమారు 50 మంది విద్యార్థులకు వైరస్ సోకింది.  20 మంది టీచర్లకు కూడా వైరస్ నిర్దారణ అయింది. దీంతో ఆయా స్కూళ్ళను మూసేశారు. టీచర్లు విద్యార్ధులకు కరోనా వైరస్ సోకగానే మిగిలిన టీచర్లు విద్యార్ధులతో పాటు స్కూళ్ళల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం సిబ్బందికి కూడా టెస్టులు చేయిస్తున్నారు. వీళ్లతో పాటు కరోనా సోకిన టీచర్లు, విద్యార్థుల తల్లి దండ్రులు,  కుటుంబసభ్యులకు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించాల్సి రావటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కో స్కూలులో 200 మంది విద్యార్ధులంటారని అనుకున్నా అందరు విద్యార్ధులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా టెస్టులు చేయించాల్సి రావటంతో స్ధానిక అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పదిమంది విద్యార్ధులకు కరోనా సోకడంతో స్కూలును వారం రోజుల పాటు మూసేశారు. తాజాగా ఏ స్కూల్లో అయినా 5 కేసులు బయటపడితే క్వారంటైన్ కోసమని 15 రోజులు స్కూల్ మూసేయాలని విద్యాశాఖ డిసైడ్ చేసింది. గతంలో కూడా కరోనా ఉధృతి తగ్గిందని అనుకోగానే ప్రభుత్వం స్కూళ్ళను తెరిచేసింది. దాంతో వెంటనే విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దాంతో అప్పటికప్పుడు మళ్ళీ అన్నీ స్కూళ్ళను ప్రభుత్వం మూయించేసింది. ఇంత గ్యాప్ తర్వాత స్కూళ్ళను తెరవగానే మళ్ళీ కరోనా వైర్ బయటపడుతోంది. అక్టోబర్ కు థర్డ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుందనే నిపుణుల హెచ్చరికలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. 

రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? కేసీఆర్ బాటలోనే నరుక్కొస్తారా?  

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది.  అధికారమే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ దూకుడు పెంచగా.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చింది. విపక్షాలు యాక్టివ్ కావడంతో గులాబీ బాస్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో తెలంగాణలో తీన్మార్ రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీల నేతల మాటలు శృతి మించుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి నోటికి పని చెప్పారు.  గబ్బుమాటలు మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉంటూ  రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబోకులోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్ వంటి తిట్లతో రెచ్చిపోయాడు మల్లారెడ్డి. అంతేకాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోడే అయితే పిసిసి చీఫ్ పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తాను కూడా తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్లే హీరో అని ఒప్పుకుంటానని, ఒకవేళ తాను ఓడిపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి మల్లారెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్జిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చగా మారాయి. కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డికి తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. రేవంత్ అభిమానులు మల్లారెడ్డిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బూతులు మాట్లాడిన మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లారెడ్డి మాటలపై కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. మంత్రి హోదాలో చిల్లరగా వ్యవహరించారని చెబుతూనే.. ఇది తమకే కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నారట హస్తం నేతలు. అంతేకాదు మల్లారెడ్డి సవాల్ ను అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ బలోపేతానికి కేసీఆర్ వాడిన స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి ఫాలో కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి రాజీనామాలనే అస్త్రంగా చేసుకున్నారు కేసీఆర్. 2006లో, 2008లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. కరీంనగర్ ఎంపీగా తాను కూడా రెండు సార్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి సక్సెస్ అయ్యారు. 2006లో వైఎస్సార్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బయటికి వెళ్లాక కీలక పరిణామాలు జరిగాయి. టీఆర్ఎస్ ను చీల్చేందుకు వైఎస్సార్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో... కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ చేసిన ఓ కామెంట్ కేసీఆర్ కు అస్త్రంగా మారింది. కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఎమ్మెస్సార్.. రాజీనామా చేసి తనతో పోటీ పడాలని సవాల్ చేశారు.  ఇదే అదనుగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ను ఓడించలేకపోయింది. కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికలో  కేసీఆర్ గెలుపు టీఆర్ఎస్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఉద్యమం మరింత ఉధృతమయ్యేందుకు దోహదపడింది. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే మంత్రి మల్లారెడ్డి సవాల్ ను స్వీకరించి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగానే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక నేతలంతా యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. అయినా రేవంత్ రెడ్డి గెలిచారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ చాలా బలపడింది. అదే సమయంలో 2019 లో కంటే ప్రస్తుతం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే బంపర్ మెజార్టీ వస్తుందని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారట. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ , మల్కాజ్ గిరి, కూత్పుల్లాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపడటంతో పాటు రేవంత్ రెడ్డి మేనియా కనిపిస్తోంది. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని సెటిలర్ ఓటర్లంతా గంపగుత్తగా రేవంత్ రెడ్డికి జై కొట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక్కడ రేవంత్ కు ఏకపక్షంగా ఓట్లు వస్తాయని గాంధీభవన్ లెక్క. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోనూ స్థానిక ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ కూడా తమకు మెజార్టీ ఖాయమని అంటున్నారు రేవంత్ అనుచరులు. ఈ లెక్కల మల్కాజ్ గిరి లో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే.. రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.  మంత్రి మల్లారెడ్డి సవాల్ ను స్వీకరించి ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయంపై రేవంత్ రెడ్డి సీరియస్ గానే చర్చలు చేస్తున్నారని తెలుస్తోంది. మల్కాజ్ గిరిలో తిరిగి పోటీ చేస్తే తమకు తిరుగు ఉండదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపును ఇక ఎవరూ ఆపలేదనే భావనలో రేవంత్ రెడ్డి టీమ్ ఉందని తెలుస్తోంది. అయితే రాజీనామా నిర్ణయం సొంతగా తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి... హైకమాండ్ తో మాట్లాడాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కావడంతో పాటు భవిష్యత్ రాజకీయాలకు కేంద్రంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అన్ని మంచి రోజులే కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా తాను చేస్తున్న పోరాటానికి జనాల నుంచి అనూహ్యా స్పందన వస్తుండగా.. తాజాగా ఆయన మరో గుడ్ న్యూస్ అందింది. ఓటుకు నోటు కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి  సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ నెల 31లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఈ కేసులోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు నుంచి తన పేరును తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఈ కేసును విచారించే అధికారం ఏసీబీకి లేదని రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఇటీవల వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.  అయితే ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టులో ఎలాంటి విచారణ చేపట్టవద్దంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా  సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపించారు. 

జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే బిగ్ షాక్.. ఏపీలో అవినీతి పాలనట! 

ఆంధ్రప్రదేశ్ లో అస్తవ్యస్థ, అరాచక పాలన సాగుతుందనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయాలతో ఏపీ అథోగతి పాలవుతోందని, రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెబుతున్నారు. అధికార వైసీపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా జగన్ రెడ్డి పాలనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎంతొ గొప్పగా చెప్పుకునే వ్యవస్థ.. అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.  సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ అవినీతిమయంగా మారిందని అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన 267 మంది వలంటీర్లను తొలగిం​చినట్లు కేతిరెడ్డి చెప్పారు. గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి మెమోలు ఇచ్చినట్టు తెలిపారు. వలంటీర్లు​ ప్రతి​ పథకం అమలులో డబ్బు వసూలు ​చేస్తున్నారని అన్నారు.  అవినీతికి పాల్పడిన వలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని​ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు.  ఒక్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మొదటి నుంచి టీడీపీ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లంచం ఇవ్వనిదే ఏ పని చేయడం లేదని చెబుతున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడం, తమకు డబ్బులు ఇచ్చిన వారికే పథకాలు వర్తించేలా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేయే వాలంటీర్ల పని తీరుపై దారుణమైన కామెంట్లు చేయడం రచ్చగా మారింది. సొంత ఎమ్మెల్యేయే అవినీతి గురించి బయట మీడియాతో విమర్శలు చేయాల్సి వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో అర్ధం చేసుకోవచ్చు.  వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు  అస్త్రంగా మారుతుందని  అంటున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైసీపీలోనే చర్చగా మారాయి. మరోవైపు సీఎం జగన్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తన మానస పుత్రికగా భావిస్తున్నారు జగన్. అలాంటి స్కీంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. 

ర‌ఘువీరా రీఎంట్రీతో జ‌గ‌న్‌కు చిక్కులేనా? సీమ‌లో వైసీపీకి న‌ష్ట‌మేనా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని కొద్ది మంది రాజకీయ నాయకులలో, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి ఒకరు. రాజకీయాలలో ప్రత్యేక స్వరాన్ని వినిపించిన రఘువీర రెడ్డి, ఒక్క ముఖ్యమంత్రి పదవిని తప్ప, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎత్తుపల్లాలు అన్నీ చూశారు. కీలక పదవువులు అనుభవించారు. వ్యవసాయ మంత్రిగా కరవు జిల్లా అనంతపూర్ జిల్లా అభివృద్ధికి చాలా గట్టి ప్రయత్నం చేశారు. జిల్లా రాజకీయలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ్లలోనూ తమదైన ముద్ర వేశారు. అయితే,,2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి కూడా ఓడి పోవడంతో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక అక్కడినుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగింఛి, దైవ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.  అయితే, గత కొంత కాలంగా, రఘువీర పొలిటికల్ రీఎంట్రీపై రాజకీయ, మీడియా వర్గాలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.విభిన్న కోణాల్లో వ్యూహాగానలు వినిపిస్తునాయి. వరస ఓటముల కారణంగా ఒక విధమైన రాజకీయ వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితం వైపుకు మరలిన రఘువీర తమ జీవిత ఆశయంగా భావించిన ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, ఆయన రాజకీయ రీఎంట్రీ గురింఛి, చర్చ సాగుతోంది. అందులో ప్రధానంగా, ఆయన తిరిగి రాజకీయాలలోకి రావదమే నిజం అయితే, ఏ పార్టీలో చేరతారు... మాతృ సంస్థ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, వైఎస్  ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో అధికార వైసీపీలో చేరతారా, లేక వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చేతులు కలుపుతారా? అనే చర్చ అన్ని వర్గాలలోనూ వినవస్తోంది.  అయితే, ఆయన ప్రధానంగా కాంగ్రెస్ వాది. అది నిజం. అందులో మరో అభిప్రాయం లేదు.  ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం అయినా, రాష్ట్ర్రంలో తమిళనాడు తరహ, రెండు పార్టీల వ్యవస్థ బలపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని, ఒకప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన  మిత్రులు కొందరు చెపుతున్నారు. నిజానికి, రఘువీర  కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు, బలోపేతం చేసేందుకు మూడు నాలుగు సంవత్సరాలు చాలా గట్టి ప్రయత్నమే చేశారు.అయినా, ఆశించిన ఫలితం రాలేదు. అందుకే చివరాఖరుకు, చేసేది లేక అస్త్ర సన్యాసం చేశారు. అలిమి కానీ చోట అధికులమన రాదనే విజ్ఞతను చూపి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేకంటే, ఇప్పటిలానీ, ఉండిపోవడమే ఉత్తమమని ఆయన మిత్రులు అంటున్నారు. ఆయనకు అలాంటి ఆలోచన లేదని కూడా, అంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు, ఆ సమావేశానికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేవీపే రామచంద్ర రావు, తదిర నాయకులతో పాటుగా రఘువీరాకు కూడా ఆహ్వానం అందింది. అయినా, ఆయన హాజరు కాలేదు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు మళ్ళీ కాంగ్రేస్ లో చేరే ఆలోచన లేదని అనుకోవచ్చని అంటున్నారు. అదే విధంగా, వైసీపీలో చేరే అవకాశం కూడా లేదని, అలాంటి ఆలోచనే ఉంటే, ఎప్పుడోనే ఆపని చేసేవారని అంటారు. అదీ గాక, ఇప్పటికే రఘువీర, జగన్ కారణంగా ఒక సారి అప్రదిష్ట పాలయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ప్రోద్బలంతో ఆయన్నిముఖ్యమంత్రిని చేయాలని ఇంకెవరో చేపట్టిన సంతకాల సేకరణ, వెనక రఘువీర ఉన్నారని ప్రచారం జరిగింది. నిజానికి, ఆ వ్యవహారంలో రఘువీర ప్రమేయం లేక పోయినా, జగన్ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా అపవాదు భరించవలసి వచ్చింది. అదీ, కాక, జగన్ రెడ్డి అరాచక పాలన చూస్తూ రఘువీర, ఆయనతో చేతులు కలపడం వంటి దుస్సాహసం చేయరని అంటున్నారు.   మరోవంక తెలుగు దేశం పార్టీ, చాలా కాలంగా రఘువీరా రెడ్డితో  వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతోంది. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించిన రఘువీరా రెడ్డిని స్వయంగా అభినందించారు. మరోవంక, తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సోదరుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి, నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి నిర్మించిన దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమ హక్కుల కోసం కలిసిపోరాటం చేసేందుకు కలిసి రావాలని కోరినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు సూచన మేరకే ప్రభాకర్ రెడ్డి, రఘువీరా రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడానికే అక్కడకు వెళ్లారనే చర్చ కూడా సాగుతోంది.  రఘువీరా రెడ్డి కూడా తెలుగు దేశం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.అయితే, ఒకటి మాత్రం నిజం ఆయన తిరిగి రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే, తెలుగు దేశంలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగి, రఘువీర టీడీపీలో చేరితే, ప్రస్తుతం బీజేపీ,జనసేన, వైసీపీలలో ఇతర పార్టీలలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుకలు టీడీపీ తలుపులు తట్టడం ఖాయమని పరిశీలకులు భావిస్తన్నారు. నిజానికి, ఇటీవల కాలంలో వస్తున్న సర్వేలు అన్నీ, రానుంది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ మాజీలు చాలా మంది ఇప్పటికే టీడీపే వైపు చూస్తున్నారని, రఘువీరా చేరికతో జోరు పెరుగుతుందని అంటున్నారు.

జోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. బ్రోక‌ర్ మ‌ల్ల‌న్న‌.. ఓ రేంజ్‌లో రేవంత్‌రెడ్డి ఫైర్‌..

‘‘నేను దీక్ష చేపట్టి 24 గంటలయింది. పాల అమ్మేవాళ్లు రాలేదు. నీళ్లు అమ్మే వాళ్లు రాలేదు. భూములు కబ్జాలు చేసే వాళ్లు రాలేదు. జోకర్ మల్లన్న కూడా రాలే. ఈ భూమ్మీద జోకర్లను చూశాం. బోకర్లను చూశాం. కానీ పాల మల్లిగాడు సగం జోకర్.. సగం బ్రోకర్. వేదికలెక్కితే జోకర్‌లా మాట్లాడతారు. వేదిక దిగితే భూముల బ్రోకర్‌లాగా మాట్లాడుతారు. ఎవరు భూములు అమ్మినా.. కొనుగోలు చేసినా ఈ పాల మల్లిగాడికి కమీషన్ ఇవ్వాల్సిందే.’’ అంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి.. మంత్రి మ‌ల్లారెడ్డిపై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని విమ‌ర్శించారు.  మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దీక్ష ముగింపు సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి మ‌ల్లారెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు రేవంత్‌రెడ్డి. సీఎం కేసీఆర్‌ మాటలు అబద్ధాల మూటలన్నారు. దత్తత గ్రామాలను దగా కేసీఆర్‌ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఒక్క హామీనీ నెరవేర్చలేదని.. ఒక్క హామీ నెరవేర్చినా తన ముక్కు నేలకు రాస్తానని చెప్పానని.. అయినా సీఎం కేసీఆర్‌ తనతో చర్చకు రాలేదన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.  రేవంత్‌రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై మంత్రి మల్లారెడ్డి సైతం అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని తెలిపారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్‌, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నాన‌ని చెప్పారు మంత్రి మ‌ల్లారెడ్డి.  ‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ నా సవాల్‌ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తా. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రేవంత్‌ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అంటూ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. ఇద్ద‌రి మాట‌కు మాట తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ అమాంతం పెంచేసింది.   

జ‌గ‌న్‌తో కౌగిలింత‌లు.. బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌న్న ఎమ్మెల్యే..

సోద‌ర భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాఖీ క‌ట్టారు. ఆమె ఇలా రాఖీ క‌ట్ట‌డం ఇదే మొద‌టిసారి కూడా కాదు. త‌న రాజ‌కీయ గురువుకు ద‌శాబ్దంన్న‌ర‌గా సీత‌క్క రాఖీ కడుతూ ఉన్నారు. టీడీపీని వీడినా.. కాంగ్రెస్‌లో ఉంటున్నా.. చంద్రబాబు త‌న‌కు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తుపెట్టుకొని రాఖీ సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చారు. అడ‌వి బిడ్డ సీత‌క్క‌ను సాన‌బ‌ట్టి.. స్ట్రాంగ్ లీడ‌ర్‌గా, ఎమ్మెల్యేగా చేసినంద‌కు చంద్ర‌బాబుకు సీత‌క్క ఇప్ప‌టికీ కృత‌జ్ఞ‌త‌గా ఉంటున్నారు. ఇటీవ‌ల సీత‌క్క త‌ల్లి కొవిడ్‌తో ఆసుప‌త్రిలో చేరితే చంద్ర‌బాబు వెళ్లి ప‌రామ‌ర్శించారు కూడా. తాజాగా ఆయ‌న‌కు రాఖీ క‌ట్టి.. చంద్ర‌బాబుపై త‌న‌కున్న అభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌. అయితే, సీత‌క్క చంద్ర‌బాబుకు రాఖీ క‌ట్ట‌డంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బానిస రాఖీ కట్టిందంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్‌గా సీత‌క్క ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు.  రాఖీ పండగను కూడా రాజకీయం చేస్తున్నారా అంటూ మొద‌లుపెట్టి.. రోజా, జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు సీత‌క్క‌. పార్టీ మారినందుకో.. ప్రాంతం వేరైనందుకో.. బాబు సీఎం కానందుకో.. రాఖీ కట్టకుండా ఉండాలనుకునే వ్యక్తిని కాదని సీతక్క స్పష్టం చేశారు. సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు.. నన్ను బానిస అంటారా? అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేశారు.  సమ్మక్క సారలమ్మ వారసులం. నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం వారసులం. దొరతనాన్ని తరిమికొట్టిన బిడ్డలం.. బిడ్డా ఖబడ్దార్ అంటూ రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీత‌క్క‌. బానిసత్వానికి బడితెపూజ చేశామని.. కోవర్టులను కోసిన చరిత్ర తమదని సీతక్క అన్నారు. ఆ రోజుల్లో నక్సలైట్‌గా ఉన్నా నిబద్ధతతో పనిచేశానని.. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా అంతే క‌మిట్‌మెంట్‌తో పనిచేస్తామని చెప్పారు. నువ్వు, నీ మంత్రులు ఎక్కడ అధికారముంటే అక్కడ జై అంటారు. నీ అధికారం పోగానే నిన్ను కూడా భౌభౌ అంటారంటూ రోజాను మాట‌ల‌తో కుళ్ల‌బొడిచారు సీత‌క్క‌.  ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సీఎం కేసీఆర్ నెరుపుతున్న‌ సంబంధాలపైనా ఘాటైన‌ విమర్శలు చేశారు సీతక్క. కేసీఆర్‌ తిరుపతిలో రోజమ్మ ఇంట్లో అన్నం తిని రావొచ్చు.. రాయలసీమ పోయి నీళ్తు ఇస్తామని చెప్పి రావొచ్చు కానీ.. పోతిరెడ్డిపాడు నుంచి జగన్ నీళ్లు తీసుకుపోతుంటే కండ్లప్పగించి చూస్తూ ఉండి.. ఇప్పుడు జ‌గ‌న్‌ నీళ్లు తీసుకుపోతున్నాడంటూ తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ మండిప‌డ్డారు సీతక్క. సీఎం జగన్‌ను కౌగిలించుకుని.. వంగి వంగి దండాలు పెట్టి.. ఇప్పుడు గొడవపడుతున్నట్లు మోసం చేస్తున్నారని కేసీఆర్‌ను గ‌ట్టిగా విమ‌ర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.   

కేటీఆర్‌ని సీఎం చేస్తే ప్రగతిభవన్ ముందు ప్రాణం తీసుకుంటానన్న‌ కవిత..!

క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో ఫ్యామిలీ వార్‌. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది ప్ర‌చారం. ఇది ప్ర‌చారం కాద‌ని.. అదంతా నిజ‌మ‌ని ఈ రాఖీ పండుగ‌తో తేలిపోయింది. ఏటేటా అన్న కేటీఆర్‌కు రాఖీ క‌ట్టే చెల్లి క‌విత‌.. ఈసారి మాత్రం రాఖీ క‌ట్ట‌కుండా ముఖం చాటేసింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఫ్యామిలీ గొడ‌వ‌లున్నాయ‌నే వాద‌న‌కు ఓపెన్‌గా బ‌లం చేకూరింది. కేటీఆర్‌, సంతోష్‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవడం లేద‌నేది క‌విత అక్క‌స్సు.  అంతేకాదు, కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను క‌విత తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ముఖ్య‌మంత్రి పీఠమే క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింద‌నే వారూ ఉన్నారు. ఇక‌, ఆస్తుల‌న్నీ మీరే పోగేసుకుంటారా.. మాకేమీ ఛాన్స్ ఇవ్వ‌రా అంటూ కూడా క‌విత‌మ్మ అలిగింద‌ని కూడా అంటున్నారు. నిజ‌మేంటో బ‌య‌టి వారికి తెలీకున్నా.. కేసీఆర్ ఫ్యామిలీలో వార్ జ‌రుగుతోంద‌నే సంగ‌తి మాత్రం రాఖీతో తేలిపోయింది. అన్న‌-చెల్లికి అస్స‌లు ప‌డ‌టం లేద‌ని.. తండ్రి త‌న‌యుడికే స‌పోర్ట్ చేయ‌డం ఇష్టం లేక‌నే కూతురు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో అడుగుపెట్ట‌లేద‌ని అంటున్నారు.  కేటీఆర్‌-క‌విత గొడ‌వ‌ల‌పై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల‌ మధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. అందుకే ఆమె రాఖీ కట్టేందుకు కూడా రాలేదని అన్నారు. కేటీఆర్‌ని సీఎం చేస్తే ప్రగతి భవన్ ముందు ప్రాణం తీసుకుంటానని కవిత చెప్పిందంటూ ఎమ్మెల్యే సీత‌క్క చేసిన కామెంట్స్ తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆ.. నిజ‌మా? క‌విత అంత మాటందా? కేటీఆర్‌ను సీఎం చేస్తే.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముందు సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిందా? అంటూ ఇటు కాంగ్రెస్ నాయ‌కుల‌తో పాటు టీఆర్ఎస్ వ‌ర్గాలు సైతం చ‌ర్చించుకుంటున్నాయి. ఎప్పుడూ కాస్త మౌనంగా ఉండే సీత‌క్క‌.. ఇంత‌టి ఆరోప‌ణ చేసిందంటే అందులో నిజం ఉండే ఉంటుంద‌ని అంటున్నారు.   

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. తీన్మార్ మ‌ల్లన్న ఆఫీసుపై మ‌ళ్లీ పోలీసుల దాడి...

సీఎం కేసీఆర్‌, తెలంగాణ స‌ర్కారును తీన్మార్ మ‌ల్ల‌న్న ఓ ప‌ట్టాన వ‌ద‌ల‌డం లేదు. అలాగే, పోలీసులు సైతం చింత‌పండు న‌వీన్‌ను వ‌ద‌ల మ‌ల్ల‌న్నా అంటూ వెంట‌బ‌డుతున్నారు. గ‌తంలో ఓసారి ఆయ‌న ఆఫీసుపై దాడి చేసిన పోలీసులు.. తాజాగా మ‌రోసారి క్యూ-న్యూస్ ఆఫీసుపై అటాక్ చేశారు. భారీ సంఖ్య‌లో వ‌చ్చిన పోలీసులు ఒక్క‌సారిగా మ‌ల్ల‌న్న కార్యాల‌యాన్ని చుట్టుముట్టారు. సిబ్బంది అంద‌రినీ క‌ద‌ల‌కుండా క‌ట్ట‌డి చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. బ‌య‌టి వారినెవ‌రినీ లోనికి అనుమ‌తించ‌డం లేదు. లోని వారిని బ‌య‌ట‌కు పంపించ‌డం లేదు. కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్క్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. మంగ‌ళ‌వారం టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా వింగ్‌.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బుధ‌వారం పోలీసులు క్యూ-న్యూస్ ఆఫీసుపై దాడి చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. గ‌తంలోనూ ఓ యువ‌తి ఫిర్యాదు మేర‌కు ఇలానే అటాక్ చేశారు పోలీసులు. క్యూ-న్యూస్ ఛానెల్‌పై మూకుమ్మ‌డి దాడి చేసి కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వ‌దిలేశారు. అంతే. అంత‌కుమించి ఏమీ చేయ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత మ‌ల్ల‌న్న కోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. తాజాగా ఇప్పుడు మ‌రోసారి పోలీసులు క్యూ-న్యూస్ ఆఫీసుపై రైడ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పోలీసుల దాడి విష‌యం తెలిసి.. మ‌ల్ల‌న్న అభిమానులు పెద్ద సంఖ్య‌లో క్యూ-న్యూస్ కార్యాల‌యానికి త‌ర‌లివ‌స్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది.   

తీన్మార్ మ‌ల్లన్న‌కు టీఆర్ఎస్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. ఇంకోసారి తిడితేనా....

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఇప్పుడిది పేరు మాత్ర‌మే కాదు. ఓ ప‌వ‌ర్‌. కేసీఆర్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిత్యం చెడుగుడు ఆడుకునే మాస్ మ‌ల్లన్న. యూట్యూబ్ ఛానల్‌తో గులాబీ గ్యాంగ్‌ను ఆటాడుకోవ‌డ‌మే చింత‌పండు న‌వీన్ ప‌ని. ఆ ప‌నిలో ఆయ‌న తెగ బిజీగా ఉంటారు. ముఖ్య‌మంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఇలా త‌ర‌త‌మ భేదం లేకుండా రోజు ఉద‌యాన్నే అంద‌రినీ ఓ రౌండ్ వాయించేస్తుంటారు. నిత్యం ప్ర‌జ‌ల్లో త‌మ‌ను బ‌ద్నాం చేసే మ‌ల్ల‌న్న నోటికి, యూట్యూబ్ ఛానెల్‌కి ఎలాగైనా తాళం వేయాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది కేసీఆర్ స‌ర్కారు. అయితే, సోష‌ల్ మీడియా కావ‌డంతో న‌వీన్‌ను ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల ఓ యువ‌తి ఫిర్యాదుతో ఒక్క‌సారిగా పోలీసులంతా క‌లిసి క్యూ-న్యూస్ ఛానెల్‌పై మూకుమ్మ‌డి దాడి చేసి కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వ‌దిలేశారు. అంతే. అంత‌కుమించి ఏమీ చేయ‌లేక‌పోయారు. మ‌ల్ల‌న్నా..మ‌జాకా... రోజూ మ‌ల్ల‌న్న నోటి నుంచి తిట్ల దండ‌కం విని త‌ట్టుకోలేక‌.. టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా విభాగం ఈసారి నేరుగా రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై టీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం మండిపడింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్మోహన్ రావు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే చిలకలగూడ పీఎస్‌లో ఓ కేసు దర్యాప్తు జరుగుతోందని, దాంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఆయన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని వార్తలు చదువుతున్నాడా.. తిడుతున్నాడా? అన్న అనుమానం వచ్చేలా ఆయన వీడియోలు ఉంటున్నాయని, కేసీఆర్‌పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. జర్నలిజం అంటే బూతులు తిట్టడమేనా? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.  ఇప్పటికైతే ఫిర్యాదుతో ఊరుకుంటున్నామని, ఆయన మళ్లీ కేసీఆర్‌ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సోషల్‌మీడియాలో సీఎంపై అనుచిత పోస్టులు పెడితే పోలీసులు అరెస్టులు చేశారని, తీన్మార్ మల్లన్న ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు టీఆర్ఎస్ నాయ‌కులు. మ‌రి, ఇలాంటి బెదిరింపుల‌కు తీన్మార్ మ‌ల్ల‌న్న భ‌య‌ప‌డ‌తారా?   

కేటీఆర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై తిరుగుబాటు త‌ప్ప‌దా?

హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోతే, ప్రభుత్వం ఏమీ కూలీపోదు, పార్టీ ఆవిర్భావం నుంచి అనేక ఎన్నికలు జరిగాయి, అందులో ఇదొకటి, అంటూ, అధికార తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం, పార్టీ కార్యవర సమావేశం వివరాలను మీడియాకు వివరించే సమయంలో  చేసిన వ్యాఖ్యలు, పార్టీలో రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, ఓ వంక పార్టీ, ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎలగైనా హుజూరాబాద్’లో గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న సమయంలో, కేటీఆర్, అదే హుజూరాబాద్ ఉప ఎన్నికను, ఇంతలా డౌన్ ప్లే చేసే ప్రయత్నం ఎందుకు ఎందుకు చేశారు, అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కొందరు ముఖ్య నాయకులు  అయితే, ఇప్పటికే ముదిరి పాకన పడినట్లు కనిపిస్తున్న ఫ్యామిలీ పాలిటిక్స్’లో ఇది మరో అంకం ఆరంభానికి సంకేతమా, అన్న సదేహలు వ్యక్తపరుస్తున్నారు.  కేటీఅర్ మంగళవారం జరిగిన తెరాస కార్యవర్గ సమావేశం తాలూకు  మీడియా బ్రీఫ్’లో హుజూరాబాద్ ఉప ఎన్నికని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. చివరకు, అయన ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో ఏమో కానీ, హుజూరాబాద్’లో తెరాస అభ్యర్ధి ఓడిపోయినా, పెద్దగా ఫరక్ పడదని చెప్పుకొచ్చారు. ఒక్క నియోజక వర్గంలో ఒడి పోయినంతమాత్రాన రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూలిపోదని, ఒక వేళ గెలిచిన కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాదని అన్నారు. అయితే, కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? హుజూరాబాద్’ ఉప ఎన్నికకు హైప్ క్రియేట్ చేసింది, ముఖ్యమంత్రి కేసీఆర్, అందులో భాగంగానే హరీష్ రావు  మళ్ళీ మరోమమారు ప్రాధాన్యత పెరిగింది. ఒక విధంగా ఆయన, హుజూరాబాద్ ఉప ఎన్నికను అడ్డుపెట్టుకుని, వ్యూహాత్మకంగా అడుగులు వేసి, ఒక విధంగా ఏకు మేకై కూర్చున్నారనే అభిప్రాయం పార్టీలోనే వినిపిస్తోంది.అందుకే, కేటీఆర్, ఈవ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదలా ఉంటే, అదేమీ లేదు, నిధుల విడుదలకు, పదవుల పంపకానికి సంబంధించి హుజూరాబాద్ నియోజక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్న ఆందోళలను దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు విశ్లేషిస్తునారు.  అదెలా ఉన్నా, ఉప ఎన్నిక జరుగుతున్నహుజూరాబాద్’కు వరదలా నిధులు పారుతున్నా,  మిగిలిని నియోజక వర్గాల్లో కనీసం, నియోజక వర్గ అభివృద్ధి నిధులకు కూడా దిక్కు లేదు. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు,ఒక్క సంవత్సరం కూడా నియోజక వర్గం అభివృద్ధి నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఇలా అయితే ఎలా. ప్రజలకు ఏమి సమాధానం చెపుతామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తేనే నిధులు వస్తాయనే అభిప్రాయంతో ఎమ్మెల్యేలు రాజీనామ కోసం ప్రజల నుంచి వత్తిడి వస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు నాయకత్వం వద్ద ఆందోళన వ్యక్త పరుస్తున్నది మాత్రం నిజం.  ఈ నేపధ్యంలోనే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక  శాఖ మంత్రి కేటీఆర్’ వద్దకు ఎమ్మెల్యేలు క్యూకడుతున్నారు. ప్రజల నుంచి వత్తిడిని, తమ బాధలను వెళ్ళబోసుకుంటున్నారు. తమ నియోజక వర్గ‌ పరిధిలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతిపత్రాలు అందిస్తున్నారు. నిధులు విడుదల చేసినా చేయక పోయినా, ఒక వినతి పత్రం ఇచ్చి, ఓ ఫోటో దిగి, సోషల్  మీడియాలో పోస్ట్ చేస్తే, ప్రజల ముందు తలెత్తుకోవచ్చని ఎమ్మెల్యేలు ఆశ పడుతున్నారని, అందుకే కేటీఆర్ ప్రతి రోజు కొందరు ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రలను స్వేకరిస్తున్నట్లు సమాచారం. ఇలా కలిసిన సమయంలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో హుజూరాబాద్ నియోజక వర్గం ఒక్కటే ఉన్నదా, ఆ ఒక్క నియోజక వర్గం ఓటర్లు మాత్రమే ఓటర్లా, మిగిలిన నియోజక వర్గాల ఓటర్ల ఓట్లు పార్టీకి అవసరం లేదా, అని ప్రజలు తమపై వత్తిడి తెస్తున్నారని, చెప్పుకుని వాపోతున్నారు. అందుకే కావచ్చును కేటీఅర్ మంగళవారం జరిగిన తెరాస కార్యవర్గ సమావేశం తాలూకు  మీడియా బ్రీఫ్’లో హుజూరాబాద్ ఉప ఎన్నికని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారని, అంతకు మించి ఏమీ లేదని, తెరాసలో అసలు విబేధాలే లేవని, కూడా  కొందరు నమ్మపలుకుతున్నారు. అయితే, ఇందులో ఏది నిజం ఏది కాదు, అనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న అంటున్నారు.  

ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌నార్‌.. సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర‌.. కేసీఆర్ లెక్క ఏంటంటే...

తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు స‌మ‌ర్థులైన ఐపీఎస్ అధికారుల‌ను రెండు కీల‌క పోస్టుల్లో నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ సైబ‌రాబాద్ సీపీగా ఉన్న స‌జ్జ‌నార్‌ను ఆర్టీసీ ఎండీగా నియ‌మించ‌గా.. డైన‌మిక్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా పేరున్న స్టీఫెన్ ర‌వీంద్ర‌ను సైబరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది తెలంగాణ స‌ర్కారు. సైబ‌రాబాద్ సీపీగా స‌జ్జ‌నార్ మూడేళ్ల‌కు పైగా ప‌ని చేస్తున్నారు. స‌జ్జ‌నార్ హ‌యాంలోనే దిశా హ‌త్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. దీంతో ఆయ‌న పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగిపోయింది. స‌జ్జ‌నార్‌కు ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా గుర్తింపు వ‌చ్చింది. సైబ‌రాబాద్ సీపీగా ఆయ‌న ప‌నితీరు అంద‌రి ప్ర‌శంస‌లు పొందింది. ఇలాంటి స‌మ‌యంలో కీల‌క‌మైన టీఎస్‌ఆర్టీసీకి ఎండీగా పంపించి ఆయ‌నకు మరింత ఉన్న‌త స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది. ఆర్టీసీ ఎండీగా చేసిన ప‌లువురు ఆ త‌ర్వాత డీజీపీ కావ‌డం ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఆ లెక్క‌న నెక్ట్స్ తెలంగాణ డీజీపీ స‌జ్జ‌నారే అవుతారా? ఇక డైన‌మిక్ ఆఫీస‌ర్‌ స్టీఫెన్ ర‌వీంద్ర‌కు.. సైబ‌రాబాద్ సీపీగా కీల‌క పోస్ట్‌ క‌ట్ట‌బెట్టారు. గ‌తంలో న‌క్స‌ల్స్ ఏరివేత‌లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంతో ఉద్య‌మ‌కారుల‌పై ఉక్కుపాదం మోపార‌నే విమ‌ర్శ కూడా ఆయ‌న‌పై ఉంది. జ‌గ‌న్ ఏపీ సీఎం కాగానే.. స్టీఫెన్ ర‌వీంద్ర‌ను డిప్యూటేష‌న్‌పై ఏపీకి ర‌ప్పించాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. ఆయ‌న‌ను ఏపీకి తీసుకొచ్చి ఐబీ చీఫ్‌ను చేస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఏపీకి పంపించ‌డానికి కేంద్ర హోంశాఖ‌ ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ డిప్యూటేష‌న్ సాధ్యం కాలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ‌లో హైద‌రాబాద్ రీజియ‌న్ ఐటీగా ఉన్నారు. అలాంటి స్టీఫెన్‌ను సైబ‌రాబాద్ సీపీగా నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ‌ధ్య ద‌ళిత అధికారుల‌కు కేసీఆర్ స‌ర్కారు స‌రైన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు బాగా వినిపిస్తున్నాయి. ఆ నేప‌థ్యంలో స్టీఫెన్ ర‌వీంద్ర‌కు ముఖ్య‌మైన సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారా? అనే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. కార‌ణం ఏదైనా.. ఇద్ద‌రు స‌మ‌ర్థులైన ఐపీఎస్ అధికారుల‌కు.. రెండు కీల‌క‌మైన పద‌వులు క‌ట్ట‌బెట్ట‌డాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు.   

ఎమ్మెల్యేలు, ఎంపీలపై 147 కేసులు.. సుప్రీంకోర్టుకు జాబితా.. యాక్ష‌న్‌ త‌ప్ప‌దా?

హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తివేత కుదరదంటూ ఇటీవ‌ల‌ సుప్రీంకోర్టు ఆగ్ర‌హించింది. ఆ మేర‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేక కోర్టుల జడ్జిల పేర్లు, ఎన్ని కేసులు పరిష్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే సమాచారం అందించాలని సుప్రీం ఆదేశించ‌డంతో ప‌లు రాష్ట్రాల హైకోర్టులు అల‌ర్ట్ అయ్యాయి. తాజాగా ఆ వివ‌రాలు సుప్రీంకోర్టుకు అంద‌జేశాయి.  తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానంలో 147 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు, అభియోగాల నమోదు, నిందితుల విచారణ, 313 సీఆర్‌పీసీ కింద నిందితుల విచారణ, వాదనలు, హైకోర్టు స్టేల దశలో ఈ కేసులున్నాయని తెలిపింది.  ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన 14 కేసులు ఉపసంహరించాలని తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిందని అఫిడవిట్‌లో తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానం 2020 అక్టోబరు 7 నుంచి ఈ ఏడాది ఆగస్టు 3లోపు 14 కేసులను ఉపసంహరించిందని తెలిపారు.  ప్రత్యేక కోర్టులకు నలుగురు జడ్జీలు ఉన్నారని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఈ న్యాయాధికారులను రిజిస్ట్రీ బదిలీ చేయదని తెలిపారు.   

ఏ1, ఏ2ల‌ బెయిల్ ర‌ద్దుపై ఒకేసారి తీర్పు.. సెప్టెంబ‌ర్ 15న జ‌డ్జిమెంట్ డే..

జంట‌గా అక్ర‌మ ఆస్తులు పోగేశారు. జంట‌గా జైలుకెళ్లారు. జంట‌గా బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. జంట‌గా అధికారం అనుభ‌విస్తున్నారు. మొద‌టి నుంచీ అన్ని విష‌యాల్లోనూ జంట‌గా ఉన్న ఏ1 జ‌గ‌న్‌రెడ్డి, ఏ2 విజ‌య‌సాయిరెడ్డిల‌పై ఎంపీ ర‌ఘురామ సింగిల్‌గా అటాక్ చేశారు. వారిద్ద‌రి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ వేరువేరుగా సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే, ఆ ఇద్ద‌రి బెయిల్ ర‌ద్దు తీర్పును ఒకేసారి వెల్ల‌డిస్తామంటూ సీబీఐ కోర్టు నిర్ణ‌యించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సెప్టెంబ‌ర్ 15న జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుపై తుది తీర్పు వెల్ల‌డిస్తామని సీబీఐ కోర్టు ప్ర‌క‌టించింది. దీంతో.. దొందు దొందులిద్ద‌రి బెయిల్ ఒకేసారి ర‌ద్దు అవుతుందా? ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ జంట‌గా జైలుకు వెళ్తారా? అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో జగన్‌కు జైలా.. బెయిలా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కోర్టు తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఆ ఉత్కంఠ మ‌రింత కంటిన్యూ అయ్యేలా కోర్టు నిర్ణ‌యం వ‌చ్చింది. అదే కోర్టులో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుపై కూడా విచార‌ణ జ‌రిగింది. ఆ వాద‌న‌లు పూర్త‌వ‌డంతో.. ఇటు జ‌గ‌న్‌, అటు విజ‌య‌సాయి.. ఇద్ద‌రి బెయిల్ ర‌ద్దుపై జ‌డ్జిమెంట్‌ను ఒకేసారి వ‌చ్చే నెల 15న వెల్ల‌డిస్తామ‌ని సీబీఐ కోర్టు తెలిపింది.  వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజ‌యసాయిరెడ్డిపైనా ఇలాంటి ఆరోప‌ణ‌లే చేస్తూ ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. ఈ రెండు కేసులు ఒకేలా ఉండ‌టంతో.. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిల బెయిల్ ర‌ద్దు తీర్పులను ఒకేసారి వెల్ల‌డిస్తామంటూ సీబీఐ కోర్టు విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 15కు వాయిదా వేసింది.   

మ‌రింత ట్రాప్‌లో కేసీఆర్! అంద‌రి'బంధు'వ‌య్యేనా? పులిమీద స్వారీ!

పులి మీద స్వారీ. ద‌ళిత బంధుతో సీఎం కేసీఆర్ పులి మీద స్వారీ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత క‌డియం శ్రీహ‌రి చేసిన కామెంట్లు అక్ష‌రస‌త్యం అంటున్నారు. ఇప్ప‌టికే ధ‌నిక‌రాష్ట్రం దివాళా అంచున‌కు చేరింది. జీతాలకు క‌ట‌క‌ట ఏర్ప‌డింది. తెలంగాణ‌లో ఒక్కొక్క‌రి నెత్తిపై ల‌క్ష‌కు పైగా అప్పు ఉంది. ఇప్ప‌టికే కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోస‌మంటూ ఉన్న‌దంతా ఊడ్చేశారు. డ‌బ్బులు లేక డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అట‌కెక్కించేశారు. నిరుద్యోగ భృతి అమ‌లు చేసే ధైర్యం రావ‌డం లేదు. ఖ‌జానా ఖాళీ కావ‌డంతో ప్ర‌భుత్వ భూములు తెగ‌న‌మ్ముకుంటోంది కేసీఆర్ స‌ర్కారు. ఇంత‌టి ద‌య‌నీయ ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలోనూ ఈట‌ల రాజేంద‌ర్ భ‌యానికి హ‌డావుడిగా ద‌ళిత‌బంధును ప్ర‌క‌టించేశార‌ని అంటున్నారు. ముందు నియోజ‌క‌వ‌ర్గానికి 100 మందికి మాత్ర‌మే అన్నారు. ఆ త‌ర్వాత ద‌ళితులంద‌రికీ అని ప్ర‌క‌టించేశారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం హుజురాబాద్‌ను పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారు. వేలది కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల చొప్పున ద‌ళిత‌బంధు పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు సీఎం కేసీఆర్‌. ఒక్క హుజురాబాద్‌కే 2000 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని తేల్చేశారు. ఆ డ‌బ్బులే ఒకేసారి ఇవ్వ‌లేక‌.. అప్పుడింత అప్పుడింత చొప్పున‌.. ద‌ఫ‌ద‌ఫాలుగా జ‌మ చేస్తున్నారు. ఆ డ‌బ్బులూ ల‌బ్దిదారుల‌కు ఇచ్చేది లేదు. ఏవేవో సాకులు చెబుతూ.. హుజురాబాద్ ఎన్నిక ముగిసేదాక కాల‌యాప‌న చేసేలా క‌నిపిస్తోంది స‌ర్కారు.  ఒక్క హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధు అమ‌లుకే కేసీఆర్ స‌ర్కారు ఇంత‌లా స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఇక రాష్ట్ర‌మంతా ద‌ళితుల‌కు ఆర్థిక సాయం చేయాలంటే ఇంకెంత క‌ష్టం? ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే.. ల‌క్షా 70వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని సీఎం కేసీఆరే చెప్పారు. ఏటేటా 40వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల‌లో ద‌ళితులంద‌రికీ ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. మాట‌లైతే చెప్పారు కానీ, దాని అమ‌లుపై తెలంగాణ‌లో ఎవ‌రికీ న‌మ్మ‌కం లేదంటున్నారు. ద‌ళిత‌బంధునే ఇంత క‌ష్ట‌మైతే.. భ‌విష్య‌త్తులో బీసీ బంధు, మైనార్టీ బంధు, అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌బంధు.. ఇస్తామంటూ కేసీఆర్ చెప్ప‌డం రాజ‌కీయ ఎత్త‌గ‌డ మిన‌హా మ‌రేమీ కాద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. చెప్పింది చెప్పిన‌ట్టు చేస్తే.. ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రిస్తే.. ద‌ళిత బంధు కంప్లీట్ చేయ‌డానికే నాలుగేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. ఇక మిగ‌తా వ‌ర్గాల‌కూ ఆర్థిక సాయం ఇప్ప‌ట్లో అయ్యే ప‌నేనా అంటున్నారు.  ఖాళీ ఖ‌జానాను ఎంత ఊడ్చినా జీతాల‌కే స‌రిపోవ‌డం లేదు.. ఉన్న భూములూ అమ్మేస్తున్నా.. మిగ‌తా సంక్షేమ ప‌థ‌కాల‌కు స‌ర్దుబాటు చేయ‌డ‌మే చానా క‌ష్ట‌మైపోతోంది. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట స‌మ‌యంలో ఏళ్ల త‌ర‌బ‌డి ద‌ళిత‌బంధు అమ‌లు చేయ‌డం మాట‌లు చెప్పినంత సులువు కానేకాదు. అలాంటిది.. ద‌ళితుల‌తో పాటు బీసీ, మైనార్టీ, అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కూ బంధు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్ప‌డం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మేనంటున్నారు. ద‌ళిత‌బంధు ప్ర‌క‌ట‌న త‌ర్వాత మిగ‌తా వ‌ర్గాల నుంచి త‌మ‌కూ బంధు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌స్తున్నాయి. వారికి 10 ల‌క్ష‌లు ఇస్తే.. మాకూ ఇవ్వాల్సిందేన‌ని కులాల వారీగా కుంప‌టి రాజుకుంది. ఈ ప‌రిణామాన్ని సీఎం కేసీఆర్ అస్స‌లు ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. ద‌ళిత‌బంధు వ‌ల్ల క‌లిగే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కంటే.. మిగ‌తా వ‌ర్గాల నుంచి వ‌స్తున్న ఒత్తిడే ఎక్కువ‌గా ఉంది. వారంద‌రికీ 10 ల‌క్ష‌ల సాయం చేయ‌లేరు.. అలాగ‌ని ద‌ళితుల‌కు మాత్ర‌మే బంధు అంటే.. మిగిలిన వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి దూర‌మ‌వ్వ‌డం ఖాయం. అందుకే, సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అంద‌రినీ బంధు అంటూ మాట‌ల గార‌డీ చేశార‌ని అంటున్నారు. ఆయా వ‌ర్గాల‌ను మాట‌ల‌తో మోసం చేయ‌డ‌మేనంటూ విమ‌ర్శిస్తున్నారు. కేసీఆర్ మాట‌ల‌ను న‌మ్మే వారెవ‌రూ తెలంగాణ‌లో లేరంటూ మండిప‌డుతున్నారు.    

మొన్న కేంద్ర‌మంత్రి.. నిన్న ఎస్సీ క‌మిష‌న్‌.. జ‌గ‌న్‌తో అంట‌కాగుతున్నారా?

వాళ్లు వ‌చ్చిన ప‌నేంటి? చేస్తున్న‌ది ఏంటి? వాళ్ల‌ను ఏపీకి ర‌ప్పించింది ఎందుకు? రాష్ట్రానికి వ‌చ్చి వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్న‌ట్టు? ఏపీ బీజేపీ బాధ‌లు అన్నీఇన్నీ కావు. రాష్ట్రాంలో వైసీపీతో వార్‌కు దిగుతున్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తుగా కేంద్రం నుంచి స‌హాయం కోరుతున్నారు. ఢిల్లీ నుంచి ప‌లువురు పెద్ద‌ల‌ను ర‌ప్పిస్తున్నారు. తీరా వ‌చ్చాక‌.. మేముమేము ఒక్క‌టే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో రాష్ట్ర బీజేపీ కంగుతింటోంది. వ‌రుస ప‌రిణామాలు ఏపీ బీజేపీకి త‌ల‌నొప్పిగా మారుతున్నాయి.  మొన్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఏపీలో జ‌న ఆశీర్వాద యాత్ర చేశారు. దాని ల‌క్ష్యం కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప‌నితీరును వివ‌రిస్తూ ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్ట‌డం. పెద్ద టార్గెటే పెట్టుకొని వ‌చ్చిన కిష‌న్‌రెడ్డి.. చిన్న ప్ర‌భావం కూడా చూపెట్ట‌లేక‌పోయార‌ని అంటున్నారు. ఏపీ స‌ర్కారును పైపైన విమ‌ర్శ‌లు చేసి.. అంత‌లోనే ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఇంటికి కుటుంబ స‌మేతంగా వెళ్లి.. క‌డుపునిండా భోంచేయ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. బీజేపీ మంత్రి, వైసీపీ ముఖ్య‌మంత్రి ఆతిథ్యం స్వీక‌రించాక‌.. ఇక బీజేపీ-వైసీపీ దొందు దొందేన‌నే ప్ర‌చారం జ‌రిగిపోయింది. ఇంత మాత్రానికి జ‌న ఆశీర్వాద యాత్రతో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి గానీ, బీజేపీ గానీ సాధించింది ఏముంద‌ని అంటున్నారు. అదే తెలంగాణ‌లో మాత్రం కిష‌న్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ‌టం.. ఏపీలో మాత్రం సీఎం జ‌గ‌న్ ఆతిథ్యం స్వీక‌రించ‌డం.. రెండిటినీ పోలిస్తే వైసీపీతో బీజేపీ అంట‌కాగుతోంద‌నే విష‌యం అర్థ‌మైపోతోంది. తాజాగా, ఏపీలో జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న సైతం అలానే జ‌రిగిందంటున్నారు. ర‌మ్య మ‌ర్డ‌ర్‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు మేర‌కే క‌మిష‌న్ ఏపీలో ప‌ర్య‌టించింది. సాధార‌ణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం వారికి అనుకూలంగా ఉన్న‌వారినే ఇలాంటి క‌మిష‌న్ల‌లో నియ‌మిస్తుంద‌ని అంటారు. కొంద‌రి విష‌యంలో ఇలాంటివి పున‌రావాస కేంద్రాలుగా మారాయ‌నే ఆరోప‌ణ కూడా ఉంది. ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. తాజాగా జాతీయ ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు ర‌మ్య ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు వ‌చ్చారు. అంటే, ఈ కేసులో ప్ర‌భుత్వ స్పంద‌న‌, తీసుకున్న చ‌ర్య‌లపైనా ఎంక్వైరీ జ‌రుగుతుంది. ఏపీ పోలీసుల డైరెక్ష‌న్‌లో విచార‌ణ పూర్తి చేసేసి.. స‌ర్కారుకు క్లీన్‌చీట్  ఇచ్చేసి.. పోలీసుల ప‌నితీరుకు ప్ర‌శంస‌లు కూడా ఇచ్చారు క‌మిష‌న్ స‌భ్యులు. ఆ త‌ర్వాత సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. శాలువా క‌ప్పించుకున్నారు. ఇక్క‌డే తేడా వ‌స్తోంది. ఇదే జాతీయ ఎస్సీ క‌మిష‌న్ అంత‌కుముందు రోజు తెలంగాణ‌లోనూ ప‌ర్య‌టించింది. ఎమ్మెల్యే మైనంప‌ల్లి ద‌ళిత బీజేపీ మ‌హిళా నాయ‌కుల‌పై దాడి చేశార‌నే ఆరోప‌ణ‌పై విచారించింది. గాంధీ ఆసుప‌త్రిలోనూ ఎంక్వైరీ చేసింది. కానీ, ప్ర‌గ‌తిభ‌వ‌న్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌లేదు. ఏపీలో మాత్రం అందుకు విరుద్దంగా తాడేప‌ల్లి వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిసింది ఇదే జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌.  మొన్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.. నిన్న జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌.. ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖులంతా సీఎం జ‌గ‌న్ ఆతిథ్యం స్వీక‌రించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్రం ఏపీ స‌ర్కారుతో అంట‌కాగుతోంద‌నుకోవాలా? రాష్ట్ర బీజేపీ వైసీపీతో ఉత్తుత్తి పోరాటం చేస్తుంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ వైసీపీకి ద‌న్నుగా నిలుస్తోంద‌ని భావించాలా? వ‌రుస ప‌రిణామాలు దేనికి సంకేతం? ఏదో తేడాగా ఉందంటున్నారు విశ్లేష‌కులు.   

ఏపీలో ‘రివర్స్ బడ్జెటింగ్’.. లంక దిన‌క‌ర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు...

లంక దిన‌క‌ర్‌. ప్ర‌ముఖ చార్టెడ్ అకౌంటెంట్‌. లెక్క‌ల్లో ఎక్స్‌ప‌ర్ట్‌. మాట‌ల్లో ప‌ర్‌ఫెక్ట్‌. ఆయ‌న ఆరోపించారంటే.. అందులో వాస్త‌వం ఉండే ఉంటుంది. ఏపీ స‌ర్కారు బ‌డ్జెట్ లెక్క‌ల్లో లొసుగులు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారంటే.. ఉన్నాయ‌న్న‌ట్టే. అంత ప‌క్కాగా ఉంటాయి లంక లెక్క‌లు. అంతే సూటిగా, ఘాటుగా కూడా ఉంటాయి ఆరోప‌ణ‌లు. తాజాగా ఆయ‌న ఏపీలో "రివర్స్ బడ్జెటింగ్"  గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి.. కొత్త చ‌ర్చ లేవ‌నెత్తారు. ఏపీలో ఆర్థిక నిర్వాహణ "రివర్స్ బడ్జెటింగ్" లా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ నుండి కార్పొరేషన్లకి కేటాయింపులుంటాయని.. కానీ, ఏపీలో కార్పొరేషన్ అప్పుల నుంచి బడ్జెట్‌లో పేర్కొన్న వ్యయానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు.  కార్పొరేషన్ అప్పులను బడ్జెట్ కేటాయింపుల వ్యయం కోసం చెల్లింపులు చేయడం ఆర్థిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని లంక దిన‌క‌ర్‌ తెలిపారు. బడ్జెట్ వ్యయాన్ని బడ్జెట్ వసూళ్ల నుండి మాత్రమే కన్సలిడేటెడ్ ఫండ్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. బడ్జెట్ అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో చేయాలని.. కాని కార్పొరేషన్‌లో బడ్జెట్‌లో ఆదాయాన్ని చూపి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఫండ్ డైవర్షన్ చేస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ అప్పులు కూడా బడ్జెట్‌లోని అప్పులకు కలిపి ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో ఉన్నాయో లేదో చూడాలని లంకా దినకర్ అన్నారు.