ఈ సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు!

శరీరం  మెరుగైన పనితీరుకు కారణమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల  పాలు లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  పాల వల్ల  ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏయే వ్యక్తులు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు  పాలు తాగకూడదు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది. వీరు పాలను తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లాక్టోస్ ప్రతికూలత  ఉన్నవారు పాలు తాగకూడదు. అంటే పాలు తాగడంతో  కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా వాంతులు లేదా విరేచనాలు కలుగుతుంటాయి కొందరికి. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు. పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కొంతమందికి   వికారం లేదా వాంతులు అవుతాయని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి సమస్యలు  ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వీరికి  ఒక సిప్ పాలు తాగిన తర్వాత  వికారం మొదలైపోతుంటుంది. క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం పడటం వంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. అలాగే పాలు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా  పాలు అస్సలు తాగకూడదు.  ఏవైనా చర్మవ్యాధులు ఉన్నా, పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నా పాలు తాగకూడదు.  ఇవి మాత్రమే కాకుండా హృద్రోగులు పాలు తాగకూడదు. పైన చెప్పుకున్న సమస్యలున్నవారు పొరపాటున కూడా పాలు తీసుకోకూడదు.                                                             *నిశ్శబ్ద.

తెలివిని పెంచే ఆహారం

మెదడు కూడా మన శరీరవ్యవస్థలో ఒక భాగమే! దానికీ తగినంత నీరు కావాలి. దానికీ సరిపడా పోషకపదార్థాలు చేరుతుండాలి. అందుకే మనం తీసుకునే ఆహారపు ప్రభావం ఎంతోకొంత మన మెదడు పనితీరు మీరు ఉంటుంది. అంతేకాదు! శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని ఇవిగో...   చాక్లెట్లు చాక్లెట్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేమాట నిజమే! కానీ డార్క్‌ చాక్లెట్లను మితంగా తినడం వల్ల మన గుండెకు, రక్తపోటుకీ మంచిదంటూ ఎన్నో పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందంటున్నారు. డార్క్‌ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల కీడుకంటే మేలే ఎక్కువ. కాకపోతే చాక్లెట్‌ నల్లటిదై ఉండాలి (డార్క్‌), మోతాదు మించకుండా తినాలి.   ఆకుకూరలు పచ్చగా ఉండే ఆకుకూరలు తింటే ఆ ప్రభావమే వేరంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరల వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుందట. వీటిలో ఉండే సి,బి, కె, ఇ వంటి విటమిన్లు.... ఐరన్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆకుకూరలను తరచూ తిన్నవారి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉండటమే కాదు... వారి మెదడులో నిక్షిప్తమై ఉన్న విషయాలు సుదీర్ఘకాలం పాటు చెక్కుచెదరవని అనేక పరిశోధనలలో రుజువైంది.   చేపలు మాంసాహారం గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక. కానీ వాటిలో చేపల గురించి మాత్రం కాస్త మంచి మాటలే వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటుగా Docosahexaenoic acid (DHA) అనే రసాయనం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందట. పిల్లల్లో కనిపించే ADHD వంటి మానసికమైన లోపాలలో సైతం చేపలు తమదైన ప్రభావం చూపుతాయట.   పప్పులు బాదంపప్పులు తింటే మెదడు చురుగ్గా ఉంటుందని తరతరాల నుంచీ వింటూనే ఉన్నాము. ఇక ఈ మధ్యకాలంలో బాదంతో పాటుగా ఆక్రోటుని కూడా తినమని ప్రోత్సహిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటుగా సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ వల్ల మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయట. పైగా వయసుతో పాటుగా వచ్చే మతిమరపు వంటి సమస్యలు కూడా దరిచేరవని ఘంటాపథంగా చెబుతున్నారు.   టమాటాలు మెదడుకి మేత కోసం రూపొందిన జాబితాలో టమాటాలు కూడా ఉండటం ఆశ్చర్యమే! టమాటాలలో ఉండే ‘లైసోపిన్’ అనే రసాయనం మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుందట. దానివలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సైతం దాడి చేసేందుకు వెనకాడతాయట. ఇవే కాకుండా పసుపు, తృణధాన్యాలు, కొబ్బరినూనె, నెయ్యి, బీన్స్‌, అవ్‌కాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటి పదార్థాలు కూడా మెదడు సామర్థ్యాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ సాయపడతాయని సూచిస్తున్నారు.   - నిర్జర.

కంటి శుక్లం రాకుండా ఉండాలంటే ఉసిరికాయలు ఇలా తినాలి..!

  ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతంలో ఉసిరిని అమలకి అని అంటారు. రోజూ ఉసిరికాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని,  బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలోనూ సహాయపడతాయని అంటారు. అయితే ఉసిరికాయలను తినడం వల్ల కంటి శుక్లానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కంటి శుక్లం.. చాలామంది చూపు  కోల్పోవడానికి కంటి శుక్లం కారణం అవుతుంది..  ముఖ్యంగా కంటి చూపు అస్పష్టంగా మారుతుంది.  కాలక్రమేణా పూర్తీగా చూపు పోవడానికి దారితీస్తుంది.  వయసు పెరిగేకొద్ది కంటి శుక్లం సమస్యలు వస్తాయి.  చాలా వరకు వృద్దులలో కంటి శుక్లం సమస్యలు కనిపించేవి. కానీ నేటి కాలంలో చాలా తక్కువ వయసులోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. కంటి శుక్లం రాకూడదన్నా,  కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఉసిరికాయలు తినాలని అంటున్నారు. ఎలాగో ఇది కార్తీక మాసం.. ఈ మాసం మొదలు దాదాపు రెండు, మూడు నెలల వరకు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి.  ఉసిరికాయలు దొరికినన్ని రోజులు వీటిని తినడం.. మిగిలిన రోజులలో తినడానికి వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే ఏడాది మొత్తం క్వాలిటీతో కూడిన ఉసిరికాయ పొడి సిద్దమవుతుంది. ఉసిరికాయలు కంటి శుక్లానికి  ఎలా చెక్ పెడతాయి తెలుసుకుంటే.. కంటి శుక్లం వయసుతో సంబంధం లేకుండా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల కంటి శుక్లం వచ్చి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.  ఇది మాత్రమే కాకుండా కంటికి గాయం, మధుమేహం  వంటి సమస్యల వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది. సాధారణంగా కంటి శుక్లాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అయితే శస్ర్తచికిత్సతో సంబంధం లేకుండా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల  కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చు. దీనికి ఉసిరికాయ బాగా సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు కంటి శుక్లాన్ని నయం చేయడంలో, రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇతర కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఉసిరి సహాయపడుతుంది. ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే విటమిన్-సి దృష్టి సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది.  వృద్దాప్య ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందని అంటున్నారు. ఇది కంటి శుక్లం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలను తినవచ్చు.  దీన్ని పగలకొట్టి కొద్దిగా ఉప్పు వేసి నోట్లో వేసుకుని సుమారు గంట సేపటి వరకు దాని సారాన్ని మెల్లిగా జుర్రుకుంటూ ఉసిరిని తినవచ్చు.  లేదంటే ఉసిరికాయను ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి అందులో తగినంత నీరు జోడించి జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ సీజన్ దాటితే అవి దొరకవు. అందుకే ఉసిరికాయల సీజన్ లోనే ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వేడి నీటిలో కలిపి ఒక 10 నిమిషాల తరువాత గోరువెచ్చగా తాగాలి.                                      *రూపశ్రీ.

అలోవేరలో ఔషద గుణాలు

అలోవేరా నేడు ప్రతి ఇంట్లో పెంచుకుంటున్న ఔషద మొక్క ఈమొక్క ఎక్కువగా గుబురు గా విస్తరిస్తుంది.ఊష్ణ ప్రాంతంలో ఇది ఎక్కువగా పెరుగుతుంది.దీనిని తెలుగులో  కలబందఅని పిలుస్తారు.దీనిని వందల సంవత్సరాలుగా వైద్య పరంగా వినియోగిస్తునే ఉన్నారు. ఈ మోకలో మెత్తగా, వచ్చే గుజ్జు చాలా రకాల చికిత్సలకి నేటికీ వాడతారు.ప్రాచీన కలం నుండి ఇందులో ఉండే రసాయన పదార్ధం, జెల్ వైద్య పరంగా కనేతిక్స్ లో వాడుతున్నారు. అలో వీర ను పూర్తిగా కృష్ చేసి రుబ్బి మొత్తం ఆకును వినియోగిస్తారు.వివిధ పద్దతులలో వాడతారు, దీనుంది వచ్చిన రసాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి అలోవీరా జ్యూస్ గా ఒక సాధారణ ఆహరంమ్గా తీసుకుంటున్నారు. ఇది అల్కరైజర్ గా పనిచేస్తుంది,ఇటీవలి కాలంలో అలోవీరా జ్యూస్ డయాబెటిస్ నివారణకు వినియోగించడం గమనించవచ్చు. అలోవీరా అల్క లైసేర్ మన శరీరామ్ లో ఫై హెచ్ శాతాన్ని సమానంగా ఉంచుతుంది. ఇక డిటోక్షి కేషన్ చేయడం వల్ల  లివర్ పనితీరు మెరుగు పడుతుంది.అలోవీరా జ్యూస్ మీ లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలోవీరా జ్యూస్ లో లివర్ కు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఇందులోఫి టో న్యూట్రి యాంట్స్ ఉండడం వాళ్ళ మల బద్ధకం ఎదుర్కుంటున్న వాళ్ళకి అలోవీరా జ్యూస్ నిత్యం రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీ  పెద్ద పేగులు చిన్న పేగులు లేదా చాతి మంటగా ఉంటె కొంచం అలోవీరా జ్యూస్ తీసుకోండి గుండెల్లో మంతా మాయం కాస్త ఉపసమనం ఇస్తుంది.గ్యా స్టిక్ అల్సర్ ను సమర్ధంగా ఎదుర్కున్ర్ శక్తి అలోవీరా జుఇసుకి ఉంది.అలోవీరా చర్మా సంబందిత గాయాలులేదా తమర గజ్జి వంటి సమస్యకు అలోవీరా లో ఉన్న గుజ్జును కొంచం రాసి చ్చోదండి మంట ఉండదు దెబ్బ తగిలిన ప్రాంతంలో నెప్పి  లేదా మచ్చ ఉండనే ఉండదు ఇన్ని ఔషద గుణాలు ఉన్న అలోవీరాను వినియోగిస్తే ఆరోగ్య పరంగా మేలుజరుగుతుందో. అలోవేర అలంకరానికే కాదు ఆరోగ్యానికి ఉపయోగమే.

టీ బ్యాగ్ లతో టీ తయారు చేసుకుని తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!

  టీ.. భారతీయులకు ఒక ఎమోషన్.  ఒకప్పుడు పట్టణాలలో ప్రజలు,  బయటి షాపులలో మాత్రమే టీ కనిపించేది. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా టీ ఫీవర్ పాకింది.  ఉదయాన్నే కాఫీలు,  సద్ది అన్నం తినే కల్చర్ నుండి ఉదయాన్నే టీ తాగి, టిఫిన్లు తిని పనులు చేసుకునే స్థితికి కాలం మారింది.  ఇప్పుడు భారతదేశంలో నీటి తర్వాత  అత్యధికంగా వినియోగిస్తున్న పానీయం టీ కావడం గమనార్హం.  చాలామంది టీ ఆకులు,  టీ పొడి కొనుగోలు చేసి టీని తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు గ్రీన్ టీ,  బ్లాక్ టీ మొదలైనవి తాగుతారు.  ఇవి కూడా తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందని టీ బ్యాగ్ రూపంలో కొనుగోలు చేస్తారు. అయితే టీ బ్యాగ్ లు ఉపయోగించి తయారు చేసుకునే టీ వల్ల ఆరోగ్యం పాడవుతుందనే విషయాలను వైద్యులు, ఆహార నిపుణులు వెలిబుచ్చుతున్నారు. అసలింతకీ టీ బ్యాగ్ ల వల్ల జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. ఉదయాన్నే వేడి నీటిని ఒక పెద్ద కప్పులో పోసి అందులో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్ వేసి 5 నుండి 10 నిమిషాల తరువాత ఆ పానీయాన్ని తాగడం చాలా మంది చేసే పని.  ఆరోగ్యానికి ఆరోగ్యం,  పని కూడా తక్కువే అనేది వారి భావన. కానీ ఇలా టీ బ్యాగుల ద్వారా తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు. టీ బ్యాగులు ఉపయోగించడం చాలా తేలిక.  కేవలం వేడి నీటిలో ఈ టీ బ్యాగులను కొన్ని నిమిషాలు ఉంచితే ఆరోగ్యకరమైన టీ తయారవుతుందని అనుకుంటారు.  దీనికి తగ్గట్టుగానే మార్కెట్లో కూడా టీ బ్యాగుల అమ్మకం ఎక్కువ.  ముఖ్యంగా టీ బ్యాగులు కూడా వివిధ రకాల ఫ్లేవర్లలో అమ్ముతుంటారు.  టర్మరిక్ టీ,  మందార టీ,  దాల్చిన చెక్క టీ, చమోమిలే టీ వంటి టీలను కూడా అమ్ముతుంటారు.  ఇవన్నీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయని అనుకుంటారు. వీటిలో కెఫీన్ ఉండదు. అయినప్పటికీ ఇవి కూడా డెంజరే.. ఎందుకంటే ఇవి కూడా టీ బ్యాగ్ ల రూపంలో ఎక్కువ వాడతారు. టీ బ్యాగ్ లలో ఉండే రసాయనాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి.  అంతే కాదు వీటిని ప్యాక్ చేసిన తరువాత ఇందులో ఏమున్నాయో గమనించే అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు ఈ టీ బ్యాగ్ లలో కీటకాలు,  చనిపోయిన పురుగులు వంటివి కూడా ఉండవచ్చు.  ఈ కారణంగా ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా టీ బ్యాగులను వేడి నీటిలో ఉంచినప్పుడు  టీ బ్యాగుల నుండి మైక్రో ప్లాస్టిక్ విడుదల అవుతుంది. టీ బ్యాగులలో డయాక్సిన్ లేదా ఎపిక్లోరోహైడ్రిన్ పూత ఉంటుంది. వేడి నీటిలో టీ బ్యాగులను ఉంచినప్పుడు ఈ పూత కరుగుతుంది.  ఇది గ్లాసులోని నీటిలో కలిసిపోతుంది. దీని వల్ల శరీరానికి హాని కలుగుతుంది.  దీర్ఘకాలంగా ఈ టీ బ్యాగులు వాడితే  శరీరానికి మేలు  జరగకపోగా వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.                                                           *రూపశ్రీ.                                                      

చలికాలంలో వాము ఆకులు తప్పక తినాలి.. బెనిఫిట్స్ ఇవే..!

వాము ఆకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మందంగా ఆకుల చివర కత్తిరించినట్టుగా  కనిపించే వాము ఆకులు చాలామంది ఇళ్లలోనే పెంచుకుంటారు.దీని వాసన ఘాటుగా ఉంటుంది. దగ్గు, జలుబు చేయగానే చాలామంది  ఈ ఆకులను తినమని సలహా ఇస్తుంటారు కూడా. అయితే ఈ వాము ఆకులు చలికాలంలో చాలా ఉపయోగపడతాయి. చలికాలంలో జలుబు, గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం వీటికే కాకుండా వాము ఆకు మరిన్ని సమస్యలకు అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది. వాము ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. వాము ఆకులలో కాసింత ఉప్పు పెట్టి తాంబూలంలా చుట్టి నమిలి తినాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కడుపునొప్పి సమస్య మంత్రించినట్టు మాయం అవుతుంది. వాము ఆకులలో విటమిన్-ఎ,సి, సెలీనియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణం వల్ల వాము ఆకులను తిన్నప్పుడు కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో యాసిడ్లకు ఇది చికిత్స చేస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బాక్టీరియల్  లక్షణాలు ఉంటాయి. వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటిలోని బాక్టీరియా మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. వాము  ఆకులలో థైమోల్ అనే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదం మహిళలకు వాము ఆకులతో గొప్ప ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటూ ఉంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు అస్సలు నెలసరి నొప్పి సమస్యే ఉండదు. వాము ఆకులలో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు, ముక్కులలో రద్దీని క్లియర్ చేయడంలో సహయపడతాయి. అరచెంచా వాము ఆకులు, అరచెంచా మారేడు ఆకులను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారిలో పాలీయూరియా పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. వాము ఆకులు, తెనె, కాసింత వెనిగర్ మూడూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. విటమిన్-ఎ మెండుగా ఉన్న కారణంగా వాము ఆకులు తినే వారిలో కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత కంటి సమస్యలు అస్సలు రాకుండా చేస్తుంది.                                                    *నిశ్శబ్ద.  

నల్ల ఉప్పు నీటిని ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది.  ఉప్పు లేని వంట ఎవరూ తినలేరు కూడా.  ఉప్పులో చాలా రకాలున్నాయి. వాటిలో రాతి ఉప్పు, సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా కొన్ని రకాల స్నాక్స్ లోనూ, వంటలలోనూ  ప్రత్యేకంగా నల్ల ఉప్పును వాడుతుంటారు.  బ్లాక్ సాల్ట్ అని పిలుచుకునే ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని అంటున్నారు.  నల్ల ఉప్పును, నల్ల ఉప్పు నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఆయుర్వేదంలో చాలా ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు.  నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్,  పొటాషియం,  మెగ్నీషియం,  ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. నల్ల ఉప్పు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందంటే.. నల్ల ఉప్పు నీరు కాలేయాన్ని శుధి చేయడంలో  సహాయపడుతుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా కాలేయం  పనితీరును వేగవంతం చేస్తుంది.  కాలేయానికి పొంచి ఉండే ఇతర  వ్యాధులను నివారిస్తుంది. కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు..  నల్ల ఉప్పు నీరు తాగితే శరీరం కుడా శుద్ది అవుతుంది.  శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నల్ల ఉప్పు నీరు చాలా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది.  చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకం సమస్యను  తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది.   ఒకే రకమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నల్ల  ఉప్పు నీటిలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది.  ఇది ఎసిడిటీని తగ్గించడంలో.. కడుపులో ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది.  గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమం కలిగిస్తుంది.  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు,  కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య మరింత తొందరగా తగ్గుతుంది. జీవక్రియ కూడా బాగుంటుంది.                                                *రూపశ్రీ.

మొలకలు వచ్చిన బంగాళదుంపలతో ముప్పు.. అంతా ఇంతా కాదు!

బంగాళదుంపలు భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా ఇష్టమైన ఆహారం.  తినడానికి రుచిగా,  వండటానికి ఈజీగా ఉండే బంగాళదుంపలను ప్రతి వంటిట్లోనూ చూడవచ్చు. ఏ కూర చేయాలో అర్థం కాని వారికి బంగాళదుంప బంగారంలా కంగారు తగ్గిస్తుంది.  ముక్కలుగా కోసి నూనెలో వేపి కాసింత ఉప్పు, కారం చల్లితే అన్నంలో కలుపుకుని తినడానికి అయినా,  సైడ్ డిష్ కోసం అయినా, రోటీలలోకి అయినా ఇట్టే సెట్ అవుతుంది. ఇక బంగాళదుంపలు కేవలం కూరలాగానే కాకుండా పానీ పూరి నుండి చిప్స్ వరకు ప్రతి ఒక్క చోట తన ట్యాగ్ వేస్తుంది.  ఈ కారణాల వల్ల బంగాళదుంపకు కాసింత క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే చాలా ఇళ్లలో బంగాళదుంపల మీద చిన్నగా మొలకలు రావడం గమనించి ఉంటారు. ఈ మొలకలను తొలగించి హాయిగా కూర వండేసుకోవడమే అందరికీ తెలుసు.. కానీ ఇలాంటి బంగాళదుంపలతో పెద్ద ముప్పేనని ఆహార నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన బంగాళదుంపలు.. మొలకెత్తిన బంగాళదుంపల మీద ఉన్న మొలకలు తొలగించి వండుకునే వారికి పెద్ద షాకే తగులుతోంది.  ఇలా మొలకలు వచ్చిన బంగాళదుంపలను వండుకుని తినడం అంటే విషాన్ని తినడమేనట.. మొలకలు వచ్చిన బంగాళదుంపలు కానీ,  బంగాళదుంపల మీద లేత ఆకుపచ్చ రంగు ఉన్నా కానీ ఇవి మంచివి కాదట. ఇలాంటి బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ వంటివి ఉత్పత్తివి.  ఇవి చాలా విషపూరితమైన సమ్మేళనాలు.  వీటిని తీసుకుంటే కడుపు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపులో తిప్పడం,  విరేచనాలు,  కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి మాత్రమే కాకుండా తల తిరగడం,  తలనొప్పి, నరాల సంబంధ సమస్యలు పెంచుతాయి. బంగాళదుంపలు ఇలా తినకండి.. బంగాళదుంపలు వేయించి తినడం చాలా మందికి ఇష్టం.  ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.  ఈ కారణంగానే బంగాళదుంపల చిప్స్, లేస్,  బింగో, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్నాక్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది ఇప్పట్లో. అయితే ఇలా తినడం అస్సలు మంచిది కాదు. ఇవి రక్తపోటును పెంచుతాయి.  కేలరీలు కూడా ఎక్కువగా అందిస్తాయి.  ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలా తినాలి.. బంగాళదుంపలు తినడానికి సరైన మార్గం వాటిని ఉడికించి తినడం. బంగాళదుంపలు ఉడికించి తిన్నా, వాటిని వివిధ రకాల కూరలలో భాగం చేసి ఉడికించినా మంచిది.  సాంబార్,  కిచిడి, ఉప్మా, కూర్మా వెజిటబుల్ రైస్ వంటి వాటిలో భాగం చేయవచ్చు.                                           *రూపశ్రీ.  

అశ్వగంద గురించి ఈ నిజాలు విన్నారా?

  అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ముఖ్య ఔషధం.  ఇది మొక్క వేరు నుండి లభించే పదార్థం. అశ్వగంధ వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు.  అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా  టాబ్లెట్లు,  లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు చాలా  రకాల జబ్బులకు అశ్వగంధను సిఫారసు చేస్తారు.  ముఖ్యంగా మానసిక ఒత్తిడి,  ఆందోళన,  నరాల సమస్యలు, నిద్రలేమి  వంటి సమస్యలకు అశ్వగంధను సిఫారసు చేస్తారు.   అనారోగ్యంతో బాధపడే చాలామందికి అశ్వగంధను కూడా ఔషదంల బాగం చేస్తారు.   ఇది ఇతర ఔషధాలు సమర్థవంతంగా పని చేయడంలో సహకరిస్తుంది. అంటే మందులను కాంబినేషన్ రూపంలో ఇస్తారు.  కాబట్టి ఏవైనా మందులు వాడేవారు సొంతంగా అశ్వగంధ మాత్రలు లేదా పొడి తీసుకోకూడదు. అశ్వగంద నేరుగా తీసుకోవడం కంటే పాలతో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. లేకుంటే వేడి నీటితో అయినా తీసుకోవచ్చు. అశ్వగందను ఏ రూపంలో తీసుకున్నా జ్ఞాపకశక్తి, శ్రద్ద,  ఆలోచనలు మెరుగుపడటం,  మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వంటి వాటిలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా అశ్వగంధ బాగా పనిచేస్తుంది.  అశ్వగంధను తీసకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఈ కారణంగా శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో కండరాలు బలంగా మారడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుంది. మహిళలకు కూడా అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. మహిళలు సాధారణంగా హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు.  అలాంటి వారికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది.  హార్మోన్ సమస్యలు తగ్గిస్తుంది. నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళలలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.   పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కునే పురుషులలో పునరుత్పత్తి హార్మోన్లను మెరుగు పరచడంలో అశ్వగంధ సహాయపడుతుంది. స్పెర్మ్ కౌంట్ మెరుగ్గా ఉండేలా, స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.                                            *రూపశ్రీ.

జీర్ణ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ కూరగాయ తినాలి..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.  ఆహారం సరిగా జీర్ణం అవుతుంటే ఆహారంలో పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. అదే ఆహారం సరిగా జీర్ణం  కాకుంటే శరీర వ్యవస్థ దెబ్బ తింటుంది.  అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  అలా కాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా,  ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా ఆహారంలో ఒక కూరగాయను జోడించుకుంటే సరిపోతుంది. అదేంటో తెలుసుకుంటే.. గుమ్మడికాయ.. గుమ్మడికాయను చాలామంది రెగ్యులర్ కూరగాయలతో సమానంగా ఉపయోగించడంలో వెనుకబడి ఉంటారు.  చాలా వరకు గుమ్మడికాయను హోటల్స్, పెళ్లిళ్ళు,  అన్న వితరణ వంటి చోట్ల మాత్రమే చూస్తుంటారు.  వంటల్లో గుమ్మడి కాయ వినియోగాన్ని పెంచితే జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది.  అంతే కాదు పైబర్ ఉండటం మూలాన గుమ్మడికాయను తింటే   ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. పదే పదే ఆకలి వేయకుండా అరికడుతుంది. కేవలం పొట్ట ఆరోగ్యం మాత్రమే కాదు..  గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. కేవలం గుమ్మడికాయ మాత్రమే కాదు.. గుమ్మడి గింజలు కూడా జీర్ణక్రియకు మేలు చేస్తాయి. గుమ్మడి గింజలను వేయించి తినవచ్చు.  లేదా వీటిని సలాడ్ లలోనూ జోడించుకోవచ్చు. స్నాక్స్ తీసుకునే సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తొలగించి   గుమ్మడి గింజలు తీసుకోవచ్చు. గుమ్మడికాయను వంటల్లో ఉపయోగించలేక పోతే వాటిని సూప్,  వెజిటబుల్ సలాడ్, స్మూతీ వంటివి తయారుచేసి తీసుకోవచ్చు.                                                    *రూపశ్రీ.  

దీపావళికి ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ తినండి.

దీపావళికి షుగర్ మిఠాయిలు తినకుండా ఇంట్లోనే ఈ షుగర్ ఫ్రీ స్వీట్‌లను తయారు చేసి ఆరోగ్యంగా ఉండండి. ఖర్జూర లడ్డూలు: ఖర్జూరం సహజ స్వీటెనర్. డ్రై ఫ్రూట్స్,  నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలు షుగర్ పేషంట్లు మంచి ఎంపిక. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. ఫ్రూట్ చాట్: వివిధ తాజా పండ్లు, చాట్ మసాలాతో చేసిన ఫ్రూట్ చాట్ ఒక సంతోషకరమైన ఎంపిక. చక్కెర అవసరాన్ని తొలగిస్తుంది. ఈ డెజర్ట్ డయాబెటిస్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, బరువు చూసేవారికి కూడా గొప్ప ఎంపిక. బాదం పాలతో తక్కువ కార్బ్ పాయాసం: దీపావళి సమయంలో పాయసం ఒక ప్రసిద్ధ తీపి వంటకం. అధిక కేలరీల ఆహారాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. కేలరీలను తగ్గించడానికి సాధారణ పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్‌లను జోడించడం వల్ల డెజర్ట్ యొక్క పోషక విలువను పెంచుతుంది. షుగర్ ఫ్రీ గులాబ్ జామూన్: చక్కెర స్థానంలో ఖర్జూరం వంటి సహజమైన స్వీటెనర్‌లతో గులాబ్ జామూన్‌ను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవచ్చు. ఫైబర్,  అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గించే ఆహారంలో ఉన్నవారు తినవచ్చు. గోధుమ బెల్లం కేక్: గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన కేక్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది.  ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికతో సహజ స్వీటెనర్. రక్తంలో చక్కెర స్థాయిలు, కేలరీల తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది.  

రాగి పాత్రలో నీళ్లు తాగండి.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!

  వంటింట్లో చాలా వరకు స్టీల్ సామాన్లు ఉంటాయి.  స్టీల్ బిందెలు, స్టీల్ జోడాలలో తాగడానికి నీరు పోసి పెట్టుకుంటారు.  మరికొందరు మట్టి కుండలలో నీరు  తాగుతుంటారు. అయితే ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగుతుంటారు.  అసలు రాగి పాత్రలో నీరు ఎందుకంత శ్రేష్టం. రాగి పాత్రలలో నీరు తాగితే ఆరోగ్య కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. రాగి పాత్రల వాడకం.. రాగిపాత్రలలో నీరు నిల్వ చేసి నీటిని తాగడం ఇప్పుడు కొత్తగా పుట్టిన అలవాటు ఏమీ కాదు..  దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాగి పాత్రలలో నీరు తాగడం ప్రజల జీవనశైలిలో భాగం. ముఖ్యంగా రాగి పాత్రల వినియోగం, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం  ఆయుర్వేదంలో ప్రాచుర్యం చెందింది.  రాగి పాత్రలను ఆహారం వండుకోవడానికి,  ఆహారం నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం, రాగి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజాలలో రాగి ప్రధానమైనది.  ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రాగి పాత్రలలో నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు రాగి పాత్రలలో నీరు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాగిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు  మెరుగ్గా ఉంటాయి.  ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. రాగి పాత్రలలో నీరు తాగితే శరీరం శుద్ది అవుతుంది. చాలామంది ఉదయాన్నే రాగి పాత్రలలో నీటిని తాగుతుంటారు.  దీని వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అయితే రాగి పాత్రలలో నీటిని ఎక్కువ సేపు నిల్వ చేయకూడదు.  ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నీటిని నిల్వచేస్తే ఆ నీరు వేడి గుణం అధికంగా అవుతాయి.  అంతేకాదు.. రాగి పాత్రలలో నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా తాగకూడదు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ రాగి పాత్రలలో నీటిని తాగకూడదు. శరీరంలో  రాగి ఎక్కువైనా హాని కలుగుతుంది. ముఖ్యంగా గర్భవతులు,  ఎసిడిటీ,  కిడ్నీ సమస్యలు ఉన్నవారు,  గుండె జబ్బులు ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగాలంటే మొదట వైద్యుల సలహా తీసుకోవాలి. లేదంటే తీవ్ర నష్టాలు సంభవిస్తాయి.                                                    *రూపశ్రీ.

చిలకడదుంపలను క్రమం తప్పకుండా తింటే ఏమవుతుందో తెలుసా..?

  చిలకడదుంపలు చాలామందికి ఇష్టమైన ఆహారం. చాలామంది వీటిని ఉడికించి తినడానికి ఇష్టపడతారు. మరికొందరు నిప్పుల మీద కాల్చి తింటారు.  ఫుడ్ లవర్స్ అయితే చిలకడ దుంపలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు.  వీటితో టిప్స్,  టిక్కీ, పూర్ణం బూరెలు,  భక్ష్యాలు కూడా చేసుకుని తింటారు.  అయితే చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయట.  అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. చిలగడదుంపలు ఒక పోషకాల గని అని చెప్పవచ్చు.  అవి మన శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో,  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  కొల్లాజెన్ ఉత్పత్తి,  చర్మ ఆరోగ్యంలో దాని పాత్రకు ప్రసిద్ధి చెందిన విటమిన్ సి కూడా ఉంటుంది.  ఒక మధ్యస్థ-పరిమాణ చిలగడదుంప  అంటే సుమారు 130 గ్రాముల చిలకడదుంపలో పోషకాలు ఇలా ఉంటాయి. విటమిన్ ఎ..  రోజువారీ అవసరమైన దానికంటే  400% కంటే ఎక్కువ విటమిన్-ఎ ఉంటుంది.  విటమిన్ సి.. రోజువారీ అవసరమైన దానిలో  25% లభిస్తుంది ఫైబర్.. 4 గ్రాములు ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది పొటాషియం.. గుండె ఆరోగ్యానికి,  రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం మెగ్నీషియం..  ఒత్తిడిని తగ్గించడానికి,  కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇంకా ఇందులో ఐరన్,  బి విటమిన్లు ఉంటాయి. ఇది  మొత్తం శరీర శక్తి స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీటా-కెరోటిన్ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం లో విటమిన్ ఎ గా రూపాంతరం చెందుతుంది. ఇది చిలగడదుంపలలో సమృద్ధిగా ఉంటుంది.   ఈ విటమిన్ కంటి చూపు మెరుగ్గా ఉండటానికి  రేచీకటి వంటి  వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇప్పట్లో చాలామంది  కంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  ఇలాంటి వారు స్వీట్ పొటాటోను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.  శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు ఏదైనా సెల్యులార్ దెబ్బతినకుండా శరీరం  రక్షణను బలోపేతం చేస్తాయి. స్వీట్ పొటాటోను తరచుగా తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుుతంది. స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ ఉంటుంది.  జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేస్తుంది.  మలబద్దకం సమస్య రానీయదు. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.                                 *రూపశ్రీ.

ఈ డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తింటే చాలు.. శరీరానికి ప్రాణం పోస్తాయి..!

  డ్రై  ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. మాంసాహారం తినని వారికి  ప్రోటీన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కొద్దో గొప్పో ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.   కొన్ని డ్రై ప్రూట్స్ ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే పోషకాహారంతో బలహీనంగా ఉన్న శరీరానికి తిరిగి ప్రాణం పోస్తాయి.  శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.  రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. బాదం.. ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది  రాత్రి నానబెట్టిన బాదం పప్పును ప్రతి రోజూ ఉదయం తీసుకుంటూ ఉంటారు. బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  ఇంకా ఇందులో ప్రోటీన్, పైబర్ కూడా ఉంటాయి.  బరువును అదుపులో ఉంచుతుంది. ఎండుద్రాక్ష.. ప్రతిరోడూ ఎండుద్రాక్ష తింటే శరీరానికి అమితమైన బలం లభిస్తుంది.  ఎండుద్రాక్షను కూడా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.  మలబద్దకాన్ని నివారిస్తుంది.  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. వాల్ నట్స్.. వాల్ నట్స్ కండరాలను బలపరుస్తుంది.  వాల్ నట్స్ మీద సన్నని పొర ఉంటుంది.  దీన్ని తీసేసి తినాలి. అందుకే వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే సన్నని పొర తీసేసి తినాలి. కనీసం రోజుకు ఒక వాల్ నట్ తీసుకుంటే మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తి వంతమైన డ్రై ప్రూట్స్.  అంజీర్ పండ్లు తాజాగా కూడా లభ్యమవుతాయి.  కానీ తాజా పండ్ల కంటే డ్రై అంజీర్ చాలా మంచివి.  అంజీర్ పండేకొద్ది తీపిదనం పెరుగుతుంది.  డ్రై అంజీర్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.  ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఎముకలు,  కండరాలు బలపడతాయి.  ఎముకలు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఖర్జూరం.. ఖర్జూరం కూడా శక్తి వంతమైన డ్రై ప్రూట్.  ఖర్జూరాలు తక్షణ శక్తిని ఇస్తాయి.  వీటిని నేరుగా తీసుకోవచ్చు.  ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  శరీరానికి ఐరన్ ను అందించడం ద్వారా  హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. పై డ్రై ప్రూట్స్ ను రాత్రి నానబెట్టి  ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం లేదా.. స్నాక్స్ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిండికి బదులు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారుతుంది.                                             *రూపశ్రీ.

మీరు లివర్ లేదా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా... అయితే మీరు  ప్రమాదం లో ఉనట్టే 

  లివర్ వ్యాధి మిమ్మల్ని మెల్లగా చంపేస్తుంది.అని ఒక పరిశోదనలో గుర్తించారు.లివర్ వ్యాధి సహజంగా  హెపటైటిస్ లేదా ఆల్కాహాల్ కు సంబంధం ఉంది.ఊబకాయం.డయాబెటిస్ వల్ల మీ లివర్ పాడై పోతుంది. వాస్తవానికి ఫ్యాటి లివర్ వ్యాధి పెరిగితే వ్యక్తులు చనిపోతారు.అని ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఫ్యాటి లివర్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ మెల్లగా మిమ్మల్ని సైలెంట్ గా చంపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటి లివర్ వల్ల నష్టం కావడమే కాదు మీరు దీర్ఘకాలం పాటు సమస్యలు తప్పవని ఈ అంశం పై అమెరికాకు చెందిన డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెన్ని క్లార్క్ హక్కిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ బాల్టి మోర్ ఎం డి   బృందం జరిపిన  పరిశోదనలు లివర్ వ్యాధి వృద్ధి చెందుతూఉంటుంది.లివర్ వ్యాధి ఒక్క సారి వస్తే కొన్ని  ఏళ్ల పాటు  వృద్ధి చెందు తూనే ఉంటుంది.  లివర్ పై వచ్చే చారలు,మచ్చల వల్ల చాలామంది చనిపోతున్నారని డాక్టర్ క్లార్క్  అన్నారు. శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పెరిగి పోయి లివర్ లో నిల్వ ఉంటుందో దీనికారణం గానే ఇంఫ్లామేషణ్ తో పాటు స్కార్స్ వస్తాయని క్లార్క్ అన్నారు. కొవ్వు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకోవడమే గీస కూడా కావచ్చని క్లార్క్ పేర్కొన్నారు.అధికంగా కార్బో హైడ్రేడ్స్ తీసుకోవడం వాళ్ళ మేతాబాలిక్ సిస్టం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని.అది ఫ్యాట్ ను పెంచుతాయాని అన్నారు. ప్రపంచం లో ప్రతి నలుగురిలో ఒకరు  ఫ్యాటి లివర్ సమాస్యతో బాధ పడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  లో ఒక నూతన పరిశోదన ద్వారా అధునాతన ఫ్యాటిలివర్ వ్యాధి వల్ల హెపటైటిస్ సి ప్రాధాన కారణ మనిపేర్కొన్నారు.  కివేర్ పై స్కార్ మచ్చ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందేన.... మానవులలో ఫ్యాటి లివర్ డిసీజ్ కు మేతాబాలిక్ సిండ్రోం అని డాక్టర్ స్క్రత్ ఫ్రైడ్ మెన్ డేఒన్ హేపటిస్ట్ అన్నారు. లివర్ పై ఒక్కసారి సచార్ వాస్తే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిందే. మెటా బాలిక్ సిండ్రోం కు అనారోగ్య సమాస్యలకు  మూలమని తేల్చారు.దీనివల్ల హార్ట్ డిసీజ్,స్ట్రొక్,టైప్ 2 డయాబెటిస్ దీనివల్ల బిపి,హై బ్లడ్ షుగర్,వీటి వల్ల కొవ్వు  అదనంగా చేరి,కొలస్ట్రాల్ లో హెచ్చుతగ్గులు,పొట్ట పెరగడం.వంటివి ఉంటాయి. లివర్ పెరుగుతున్నాయి అంటే ఊబ కాయం టైపు 2 డయాబెటిస్ మేతాబాలిక్ సిండ్రోం లివర్ డిసీజ్ కు కారణంగా  చెప్పవచ్చు. ఈ అంశం పై పరిశోదనలు జరిపిన డాక్టర్ల బృందం 18౦౦ ఫ్యాటి లివర్ తో సంబంధం ఉన్న వారిని పరిశీలించారు.  నాలుగు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. లివేర్ లో  స్కార్రింగ్  అభివృద్ధి చెందడానికి కారణం లివర్ వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నట్లు అధ్యయనం లో తెలుసుకున్నారు.  అంతర్గతంగా రక్త  శ్రావం  అదనపు రాసాయనాలు మానసికంగా గందరగోళం గాఉంటుంది .శరీరంలో రక రకాల రాసయనాలు మెదడు  పై ప్రభావం చూపుతాయి.ఫ్యాటి లివర్ ఉంటె టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.కిడ్నీ పనితీరులో మార్పు వస్తుంది. అని పరిశోదనలో తెలిపారు.లివర్ సమస్యల వాళ్ళ ఫ్యాటిలివర్ వల్ల 7% మరణాలాను ఈ బృందం గుర్తించింది. ఊబకాయం,డయాబెటిస్,ఉన్నవారిలో ఫ్యాటిలివేర్ 2౦%  నుండి 3౦ % స్కారింగ్ వృద్ధి చెందుతోంది.కొందరికి ఫ్యాట్ మాత్రమే  ఉంటె కొందరిలో ఇంజురీస్ ఉంటాయి.ఫ్యాటి లివర్ కు వెయిట్ లాస్ చికిత్స తో నియంత్రిన్చాగాలిగారు.  అయితే ఫ్యాటి లివర్ నియంత్రణకు లోని ఫిబ్రోనోర్ మందును ఎక్కువ మోతాదులో వాడినట్లు తెలుస్తోంది. బెల్జియంకు చెందినా బ్రొకుఒ పియర్  ఈ అంశాన్ని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాధమిక స్థాయిలో ఫ్యాటి లివర్ లక్షణాలు వస్తే తక్షణం నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఊబాకాయం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పాడడం కార్బో హైడ్రేడ్స్ తగ్గించడం వాళ్ళ కొవ్వు పెరగకుండా జాగ్రత్తలు  తీసుకుంటూ నిర్లక్ష్యం చేయవదని మరణానికి గురికవద్దని వైద్యులు సూచించారు.                                               

చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులు వాడితే అంతే సంగతులు!

ఇప్పట్లో అనారోగ్యాలు ఎక్కవ అవ్వడమే కాదు ఆరోగ్య స్పృహ కూడా ఎక్కవగానే ఉంది అందరిలో. చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తగ్గట్టు ఆహారం దగ్గర నుండి అన్ని విషయాలలో మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అవుతున్నామని అనుకుంటూ చాలామంది  పొరపాట్లు చేస్తున్నారు. వాటిలో చక్కెరను నియంత్రించడం, దాని స్థానంలో కృత్రిమ చక్కెరలు ఉపయోగించడం ప్రధానమైనది. తీపిని ఇష్టపడని వారు ఉండరు. కానీ తీపి తింటే లావు అవుతామని, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని చాలామంది అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీన్ని వల్ల చక్కెరను నియంత్రించామని, ఆరోగ్యం  బాగుంటుందని అనుకుంటారు. పైపెచ్చు తీపి తిన్నామనే  తృప్తి కూడా కలుగుతుంది. అయితే ఇలా కృత్రిమ చక్కెరలు తీసుకోవడం  చాలా ప్రమాదమని తెలుస్తోంది. అసలు కృత్రిమ చక్కెరలు శరీరానికి ఎంత చేటు చేస్తాయి? దీని వల్ల కలిగే ప్రమాదాలేంటి తెలుసుకుంటే దీని నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినవి కృత్రిమ చక్కెరలు. సాధారణంగా వీటిని డయాబెటిక్ రోగులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.  చక్కెర తింటే లావు అవుతాం అనే అపోహ ఉన్నవారు కూడా దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల బరువు పెరగమని, ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటారు. అయితే ఇది చాలా అవాస్తవం.  సాధారణంగా కృత్రిమ చక్కెరలుగా అస్పర్టమే, సాచరిన్. సుక్రలోజ్, మాంక్ ప్రూట్, స్టెవియా, సార్చిటాల్, జిలిటాల్, ఎంథ్రిటాల్ వంటి పదార్థాలు ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా కృత్రిమ చక్కెరలను  సాచరిన్ అనే పదార్థంతోనే ఎక్కువ తయారుచేస్తారు. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. తీపి తిన్న అనుభూతిని ఇస్తుంది. కానీ.. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. ఈ కారణంగా ఉబకాయం కూడా ఎదురవుతుంది. ఇకపోతే ఈ కృత్రిమ చక్కెరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఆహారం తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది బరువును పెరగడానికి దారితీస్తుంది. అంతే కాదు ఎప్పుడైనా స్వీట్లలో అధికంగా కృత్రిమ చక్కెరలను వినియోగించడం వల్ల విరేచనం, వికారం, అపానవాయువు వంటి సమస్యలు ఏర్పడతాయి. కృత్రిమ చక్కెరగా ఉపయోగించే అస్పర్థమే అధిక ఉష్ణోగ్రత వద్ద పార్మిక్ ఆమ్లంగా  విచ్చిన్నమవుతుంది. స్వీట్ల తయారీలోనూ, కాఫీ, టీ లలోనూ వేడి మీద వీటిని జోడించడం ప్రమాదం. ఈ కారణంగా ఇది అలర్జీలకు కారణమవుతుంది. అలాగే అధికమొత్తంలో అస్పర్థమేను తీసుకోవడం వల్ల పెద్దలలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఒకటిన్నరెట్లు  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రొమ్ము క్యాన్సర్, ఉబకాయం చాలా సులువుగా వస్తాయి. ఫినైల్కెటోనూరియా అనే సమస్య ఉన్న వ్యక్తులు అస్పర్టమేకు దూరంగా ఉండాలి, వీరు అస్పర్టమేలో ఉండే  ఫెనిలాలనైన్  అనే అమైనో ఆమ్లంను జీవక్రియ చేయలేరు. ఫెనిలాలనైన్ అధికంగా ఉండటం వల్ల మెదడులో మూర్ఛలు వస్తాయి. ఇలా కృత్రిమ చక్కెరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా.. చెడు చేసే అవకాశమే ఎక్కువ.                                                               *నిశ్శబ్ద.  

పూల టీలతో భలే ఆరోగ్యం..

పువ్వులు మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చాలామంది పువ్వులను ఇంటి అలంకరణ కోసం,  దేవుడి పూజ కోసం వాడతారు. ఇక ఆడవాళ్లకు పూలు తెచ్చిపెట్టే అందం అంతా ఇంతా కాదు.. అయితే పువ్వులు మగువల అందాన్ని, ఇంటి అందాన్ని, దేవతామూర్తుల చెంత చేరి దేవతామూర్తుల రూపాన్ని మెరిపించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.  జపనీస్, చైనా ప్రజలు పువ్వులను ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఎప్పటి నుండో వాడుకలో ఉంది. భారతీయ ఆయుర్వేదంలో కూడా చాలా రకాల పువ్వుల ను ఔషదంగా  వాడతారు. అయితే  కొన్ని రకాల  పువ్వలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యం భేష్ గా ఉంటుంది. ఇంతకీ ఆరోగ్యం చేకూర్చే ఆ టీలు ఏవో తెలుసుకుంటే.. మందార టీ.. మందారలో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్,  విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. చాలా అధ్యయనాలలో  మందార సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తేలింది.  ఇప్పటికే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్‌లో ఉన్నవారు  మందార టీని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. చమోమిలే టీ.. ఎండిన చమోమిలే లేదా చేమంతి పువ్వులను వేడి నీటిలో వేసి చమోమిలే టీని తయారుచేస్తారు. ఫలితంగా సున్నితమైన రుచితో సువాసన కలిగిన టీ చాలా ప్రశాంతతను ఇస్తుంది. చమోమిలే టీ మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. "కెఫిన్ టీలకు బదులు చమోమిలే  రాత్రిపూట  తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది. బ్లూ టీ.. బ్లూ టీని శంఖు పుష్పాలతో తయారుచేస్తారు. దీని కోసం తాజా శంఖు పుష్పాలు అయినా వాడవచ్చు లేదా.. ఎండిన శంఖు పుష్పాలు అయినా ఉపయోగించవచ్చు. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి యవ్వనంగా మారుస్తాయి. బ్లూ టీలో ఉండే ప్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బ్లూ టీలో ఉండే క్యాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజ్ టీ.. సాధారణంగా వాడే టీలో ఎండిన గులాబీ రేకులను జోడించుకోవచ్చు. లేదంటే తాజా గులాబీ రేకులను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ రేకులను నేరుగా సాధారణ నీటిలో ఉడకబెట్టడం ద్వారా గులాబీ టీని తయారు చేసుకోవచ్చు.  గులాబీ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీ గుణాలు ఉంటాయి.  రోజ్ టీ కూడా జీర్ణప్రక్రియను ప్రోత్సహిస్తుంది.   లావెండర్ టీ.. లావెండర్ టీ సాధారణంగా సోపులు, పెర్ప్యూమ, ఎయిర్ ఫ్రెషనర్ మొదలైన వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.  కానీ లావెండర్ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లావెండర్ మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. నరాలకు స్వాంతన చేకూరుస్తుంది. మంచి నిద్రకు, చర్మ ఆరోగ్యానికి  చాలా మంచిది.                                                   *రూపశ్రీ.

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?

  శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని అవయవాలకు మెరుగైన రక్త ప్రసరణ అవసరం.  చాలామందికి శరీరంలో రక్తం తక్కువ ఉందని అంటుంటారు. నిజానికి రక్తం తక్కువ ఉండటం అంటూ ఏమీ ఉండదు. కానీ రక్తంలో హిమెగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉంటాయి.    రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడాన్ని రక్తహీనత అంటారు.   రక్తహీనత అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా మగవారిలో కంటే ఆడవారిలోనే ఈ సమస్య ఎక్కువ.  భారతదేశంలో అధిక శాతం మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని వైద్య పరిశోధనలు, సర్వేలు  వెల్లడిస్తున్నాయి. అందుకే రక్తహీనత ప్రమాదం భారతీయ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది మన ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. దాని లోపం కారణంగా అవయవాలకు ఆక్సిజన్ ప్రసరణ లోపిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్  దీర్ఘకాలంగా లోపిస్తే  రక్తహీనతకు కారణమవుతుంది, ఇది వివిధ రకాల ఆరోగ్య దుష్ప్రభావాలను కలిగిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆహారంలో పోషకాలు లేకపోవడం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, మహిళల్లో రుతుక్రమం వంటి కారణాల వల్ల కూడా  హిమెగ్లోబిన్ తగ్గడానికి కారణం అవుతుంది. అయితే హీమోగ్లోబిన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే.. హిమోగ్లోబిన్ లెవల్.. పురుషులు,  స్త్రీలలో హిమోగ్లోబిన్  సాధారణ స్థాయి భిన్నంగా ఉంటుంది. పురుషులకు 14.0 నుండి 17.5 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి.  మహిళలకు  12.3 నుండి 15.3 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి. పురుషులలో 13 గ్రా/డిఎల్ కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా,  మహిళల్లో 12 గ్రా/డిఎల్ కంటే తక్కువగా ఉన్నా  హానికరంగా పరిగణిస్తారు. శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల అలసట, బలహీనత,  తలనొప్పి సమస్య తరచుగా ఉంటుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా  అలసిపోయినట్లు,  బలహీనంగా ఉన్నట్లు  అనిపించవచ్చు. తేలికపాటి శారీరక శ్రమ చేసినా  బలహీనంగా అనిపిస్తుంది. రక్తహీనత ఉన్నవారిలో    తలనొప్పి చాలా  సాధారణ సమస్యగా ఉంటుంది. ఇవి దీర్ఘకాలం ఉండటం ప్రమాదం. శరీరంలోని కణజాలాలకు,  అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడంలో,  కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపడంలో హిమోగ్లోబిన్  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . శరీరంలో హిమోగ్లోబిన్ సాధారణం కంటే తక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యం  ప్రభావితమవుతుంది. హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు హృదయ స్పందన రేటు సక్రమంగా లేకపోవడం, హృదయ స్పందనలు సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వంటి సమస్యను ఎదుర్కొంటారు. హృదయ స్పందన రేటు సక్రమంగా లేకుంటే అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ శరీరంలోని కణజాలాలకు అవయవాలకు సరిగా చేరదు. వాస్తవానికి, తక్కువ స్థాయి హిమోగ్లోబిన్ కారణంగా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే  సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా ఏ కొద్దిగా పనిచేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి రక్తహీనత కారణంగా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కేవలం శరీరంలో రక్తహీనత కారణంగానే సంభవిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఐరన్ ట్యాబెట్లు,  సిరప్ లు కూడా తీసుకోవచ్చు.                                                          *రూపశ్రీ.

నిద్రలోనే గుండెపోటు ప్రమాదాలు.. దీని లక్షణాలు ఏంటంటే..

ప్రపంచంలో ఎక్కువమంది ప్రాణాలు తీసే జబ్బు గుండెపోటు. కరోనా తరువాత ఈ గుండె సంబంధ సమస్యలు మరింత పెరిగాయి. గుండె బలహీనం కావడం, తొందరగా అలసిపోవడం, ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలు చాలామందిలో ఎక్కువయ్యాయి.  ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, చక్కని ఆహారపు అలవాట్లు కలిగినివారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అది కూడా సైలెంట్ అటాక్ లో చిక్కుకుంటున్నారు. గుండె ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఇది  గుండె శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు వచ్చే పరిస్థితి.  హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా రావచ్చు.  ఎందుకంటే అప్పటికి  గుండె బలహీనమై ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్  లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. నేటికాలంలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని అన్ని సమయాలలో గమనించుకోవడం ఎంతో ముఖ్యం.  రాత్రి నిద్రపోతున్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి సమస్యలు కొన్ని వస్తుంటాయి. వీటి లక్షణాల గురించి తెలుసుకుంటే.. శ్వాస వేగంగా ఉండటం..  శ్వాస వేగంగా ఉండటం అనేది హార్డ్ ఫెయిల్యూర్ కు దారితీసే లక్షణం. దీన్ని రాత్రి నిద్రించే సమయాల్లో గమనించవచ్చు.  దీనిని పార్క్సిస్మల్ నాక్టర్నల్ డిస్‌ప్నియా (PND) అంటారు. ఇది సాధారణంగా గాఢ నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల తర్వాత జరుగుతుంది.ఈ సమస్య ఉన్న వ్యక్తి ఉబ్బరంతో మేల్కొంటాడు.  ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు  ఊపిరి పీల్చుకోవడానికి కూర్చోవడం లేదా నిలబడటం చాలా ముఖ్యం.  నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు.  అది కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం . గుండెదడ.. భయంగా ఉన్నప్పుడు గుండె దడగా ఉంటుంది. ఆ పీలింగ్ చాలామంది జీవితంలో ఒక్కసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. అయితే  గుండె ఆగిపోయేముందు వ్యక్తుల హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని టాచీకార్డియా అంటారు. ఇది ఒక నిమిషంలో గుండె 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకునే పరిస్థితి . ముఖ్యంగా నిద్రలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకూడదు. దగ్గు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. హార్ట్ ఫెయిల్యూర్  ప్రాధమిక దశ శ్వాసలో గురక ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, బ్రోన్కియోల్స్ వాటిని దూరంగా ఉంచే ప్రయత్నంలో కుంచించుకుపోతాయి.  దగ్గుతో పాటు గురక కూడా వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ సమస్య అనుభవంలోకి వస్తుంటుంది.  ఈ పరిస్థితిని కార్డియాక్ ఆస్తమా అని పిలుస్తారు, దీనిలో ఒక వ్యక్తి నోటి నుండి నురుగు, గులాబీ రంగులో ఉండే కఫం కూడా బయటకు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే , అది గుండె వైఫల్యం యొక్క లక్షణం. హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి, దిండు సహాయం తీసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ పరిస్థితిని ఆర్థోపెనియా అంటారు. ఇప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అకస్మాత్తుగా మెలకువ రావడం.. రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొలపడం కూడా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్  ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఎదురవుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో చికిత్స ఆలస్యం మరణానికి కూడా దారితీస్తుంది. ఎవరైనా సరే నిద్రిస్తున్నప్పుడు పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు ఎదుర్కొంటుంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.హార్ట్ ఫెయిల్యూర్ అనేది అత్యవసర సహాయం అవసరమయ్యే పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెడుతుంది.                                                  *నిశ్శబ్ద.