కేసీఆర్ యాగం వెనుక అసలు కారణం అదా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ చివరి వారంలో చండీయాగం చేయడానికి పూనుకున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ఇంత సడన్ గా చండీయాగం చేయాలనుకోవడానికి గల కారణాలు ఏంటి.? ఆయనకు కొంచం దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ యాగం చేయాలనుకుంటున్నారా? లేక ఏదైన కారణంతో ఈ యాగానికి పూనుకున్నారా? అని ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేసీఆర్ యాగం చేయడానికి పూనుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. కేసీఆర్ కు వచ్చే ఏడాది పదవీ గండం ఉందని.. అది ఏ రూపంలోనైనా రావచ్చని జ్యోతిష్కులు చెప్పారంట.. దీంతో కేసీఆర్ ఈ చండీయాగానికి పూనుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.. దానికి తోటు రీసెంట్ గా సీబీఐ కేసుతో కూడా కొంత సమస్య ఉంది.. అన్ని ఒకత్తైతే అసలు సమస్య రాజకీయంగా ఇంటిపోరు సమస్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేసీఆర్ ఈయాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏంటో కేసీఆర్ కే తెలియాలి.

రాజధానికి ఉచితంగా భవనం.. చంద్రబాబు హ్యాపీ

  ఏపీ రాజధాని అమరాతికి విరాళాలు బాగానే వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు చేపట్టిన నా ఇటుక - నా అమరావతి ద్వారా ఇటుకల రూపంలో విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా  జనచైతన్య గ్రూప్ కూడా ముందుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో భారీ భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని జనచైతన్య గ్రూప్ ఛైర్మన్ మాదాల చైతన్య చంద్రబాబుకు తెలిపారు. తన తల్లి శంకుతల పేరిట.. దాదాపు 26 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడానికి మాదాల చైతన్య ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు జనచైతన్య గ్రూపుని అభినందించారు. ఆంధ్రా నుంచి పుట్టిన కంపెనీలు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే రాజధాని ప్రపంచం గర్వించేలా తయారవుతుందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీ ప్రత్యేక హోదా.. కేంద్రం.. మధ్యలో జయలలిత

ఏపీ ప్రత్యేక హోదా రాకపోవడానికి.. కేంద్రం ప్రత్యేక హోదా గురించి ఏం నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే కారణమా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఏపీ ప్రత్యేక హోదాకి.. జయలలితకు.. కేంద్రానికి మధ్య సంబంధం ఏంటా అనుకుంటున్నారా. అదేంటంటే కేంద్రం కనుక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులుకాని.. పరిశ్రమలు కానీ రావని.. అవి ఏపీకి వెళతాయని.. ఈ ఉద్దేశ్యంతోనే జయలలిత ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగని జయలలితను కాదని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాని ప్రకటించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభలో జయలలిత మద్దతు తప్పనిసరి. అందుకే మోడీ కూడా ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడానికి కారణం. ఇదే విషయాన్ని కేంద్రమంత్రులు చంద్రబాబుకు కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. మీరు కనుకు ఈ విషయంలో జయలలితను ఒప్పించగలిగితే ప్రత్యేక హోదాపై కేంద్రానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని సూచించారట. దీంతో చంద్రబాబు జయలలితను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచనలో పడ్డట్టు సమాచారం. తమిళనాడుకు ఏపీ ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్పి జయలలితను ఒప్పించాలి. మరి ఏ రకంగా చంద్రబాబు జయలలితను ఒప్పిస్తారో చూడాలి

హోదా ఇస్తే వైసీపీ కనుమరుగా?

  ఆంధ్రప్రదేశ్ కి ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే... ఏపీలో అసలు ప్రతిపక్షమే ఉండదని టీడీపీ నేత టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు, స్పెషల్ స్టేటస్ వస్తే క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని, అయినా హోదా అడిగేందుకు బాబు భయపడుతున్నారనడం అర్థరహితమన్నారు. ఒకవేళ ఏపీకి హోదా వస్తే... వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవుతుందని టీజీ వెంకటేశ్ జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ఈశాన్య రాష్ట్రాల కంటే బాగా వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని, లేకపోతే సీమకు మరోసారి దగా జరుగుతుందని టీజీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటే అమరావతిని ఫ్రీజోన్ గా చేయాలని సూచించారు.

దానం, టీఆర్ఎస్ మంత్రి పద్మారావు భేటీ.. ఎందుకు?

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు అన్న వార్తలు జోరుగానే ప్రచారం జరిగాయి. అయితే దానం మాత్రం వాటిని ఖండించి.. ఆవార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు.. అని చెప్పారు. అంతేకాదు అప్పుడే ఆయన హైకమాండ్ కు  పార్టీ కోసం పనిచేసే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓ సూచన కూడా చేశారు. అయితే ఇన్ని చెప్పిన దానం నాగేందర్ పై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఇంటికి టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి పద్మారావు వెళ్లారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరు చర్చలు జరిపారు. దీంతో ఇప్పుడు వీరిద్దరూ దేనికి సమావేశమయ్యారు.. దేని గురించి చర్చించారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దానం నాగేందర్ మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్‌కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో దానం కూడా డీఎస్ మాదిరి టీఆర్ఎస్ గూటికి చేరుతారు అనే వార్తలు ఊపందుకుంటున్నాయి. మరి ఈభేటీకి దానం ఏం సమాధానం చెబుతారో..

ఎమ్మెల్యేకి అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్

  పాలమూరులో కరువు తీవ్రతను వివరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వడం లేదని అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని, దీనిపై సీఎంకు విన్నవించాలని ప్రయత్నించానని, అయితే కేసీఆర్ కనీసం అపాయింట్ మెంటే ఇవ్వడం లేదని సంపత్ ఆరోపించారు, గత ఎన్నికల్లో ఆర్డీఎస్ ను చూపించి ఓట్లు సంపాదించుకున్న కేసీఆర్ ఇప్పుడెందుకు దాన్ని పట్టించుకోవడం లేదని సంపత్ ప్రశ్నించారు, పండగల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్... కరువుతో అల్లాడుతున్న ప్రజానీకాన్ని మాత్రం ఆదుకోవడం లేదని సంపత్ మండిపడ్డారు.

బాలయ్య, గల్లాపై వీర్రాజు ఫైర్

  టీడీపీ నేతలు బాలకృష్ణ, గల్లా జయదేవ్ పై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు, కేంద్రంపైనా, మోడీపైనా ఇష్టమొచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోడీపై బాలకృష్ణ, గల్లా జయదేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన... ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిందించొద్దని సూచించారు, టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుందని, అవసరమైతే పదవులను సైతం వదులుకుని టీడీపీ సర్కార్ పై విమర్శలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు, మిత్రపక్షమైనందుకే టీడీపీపై తాము విమర్శలు చేయడం లేదని, అయితే అవినీతి జరిగితే మాత్రం కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు.

చంద్రబాబును కలిసిన రేవంత్, ఎర్రబెల్లి.. ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు

తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతలు సమావేశమవ్వగా ఇరువురి నేతల మధ్య వివాదం తలెత్తి తీవ్రమైనస్థాయిలో విమర్సించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ పరువు తీస్తున్నారని.. వారిని విజయవాడలో ఉన్న తనను కలవమని చెప్పగా ఈ రోజు కలిశారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరర్రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనకు ఏమాత్రం గుర్తింపు లేదని.. తనకు ఏమాత్రం సమాచారం అందిచకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. టీఆర్ఎస్ పై ఉమ్మడి పోరు సాగిద్దామన్నా తనకు ఎవరూ మద్దతు పలకడంలేదని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలస్తోంది. దీంతో చంద్రబాబు సమస్యను పెద్దదిగా చేసుకోవద్దు.. మిగిలిన నేతలతో నేను మాట్లడతానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎర్రబెల్లి మిగిలిన నాయకులు రేవంత్ రెడ్డిది ఒంటెద్దు పోకడని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ సమావేశంలోనే వరంగల్ ఉపఎన్నిక గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం-ఉత్తమ్

  వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు, త్వరలోనే వరంగల్ అభ్యర్ధిని ప్రకటిస్తామన్న ఉత్తమ్... లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు, హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అన్ని రంగాల్లోనూ టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. వరంగల్ అభ్యర్ధి ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఇప్పటికే ఐదుగురి పేర్లను అధిష్టానానికి పంపించామని తెలిపారు, అయితే ఎక్కువమంది పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పైనే మొగ్గుచూపుతున్నారని అన్నారు.

లోకేష్ స్నేహితుడు అభీష్టపై ఆరోపణలు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టార్గెట్ చేశారు, ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరిగిపోతుందని, సెకండ్ పవర్ సెంటర్ గా వ్యవహరిస్తున్నాడని రఘువీరా ఆరోపించారు. చంద్రబాబు ఆఫీస్ లోని ఫైళ్లన్నీ చినబాబు కనుసన్నల్లోనే కదులుతున్నాయన్న విమర్శించిన రఘువీరారెడ్డి... లోకేష్ సన్నిహితుడు అభీష్టను సీఎం పేషీలో ఓఎస్డీగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా అభీష్టను నియమించారని, అసలు అభీష్టకున్న అర్హతలేంటో చెప్పాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ.. నిధులివ్వండి ప్లీజ్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్దికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశయ్యారు.  ఈ భేటీలో ఇద్దరు పలు అంశాల మీద చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్దికి కేంద్రం సాయం చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అభివృద్ధి పథకాలకి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంపుతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాగా అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి రామచంద్రు తేజావత్ లు ఉన్నారు.

క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్... బెయిల్ పై రిలీజ్

  భారత క్రికెటర్, స్పిన్నర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. యువతిపై దాడి కేసులో సుమారు మూడు గంటల పాటు అమిత్ మిశ్రాను ప్రశ్నించిన పోలీసులు... అనంతరం అరెస్టు చేశారు. అయితే మిశ్రా లాయర్లు బెయిల్ పేపర్లు దాఖలు చేయడంతో వెంటనే రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 25న బెంగళూరులో తానుంటున్న హోటల్ గదికి వచ్చిన ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు మిశ్రాపై కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును ఆమె ఉపసంహరించుకున్నట్లు కథనాలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే మంగళవారం దాదాపు మూడు గంటలపాటు మిశ్రాను ప్రశ్నించి వదిలిపెట్టారు, అయితే అమిత్ మిశ్రాపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద కేసు నమోదైందని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని బెంగళూర్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.

జగన్ కు కేంద్రం వార్నింగ్? అందుకే వెనక్కి తగ్గారా?

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అటు కేంద్రానికి వ్యతిరేకంగా.. ఇటు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి.. పాపం ఆ ఆందోళనలకు సరైన రెస్పాన్స్ రాక చివరికి.. నిరాహార దీక్ష చేసినా పట్టించుకునే వారు లేక దీక్ష మధ్యలోనే విరమింపచేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆఖరికి ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా తన వ్యతిరేకతను ప్రదర్శించారు. అయితే శంకుస్థాపన అనంతరం జగన్ ఇంకా రెచ్చిపోయి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపడతారని అందరూ అనుకున్నారు. అంతేకాదు జగన్ కు కాంగ్రెస్ పార్టీ కూడా తోడై చంద్రబాబుకు, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతారని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.. అందుకు భిన్నంగా ఇప్పుడు జగన్ ఈ విషయంలో కొంచం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కారణం జగన్ కు కేంద్రం నుండి ఫోన్ రావడమేనట.. ఈవిషయాన్ని కూడా స్వయంగా పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవేళ జగన్ ప్రత్యేక హోదా అంటూ మళ్లీ దీక్షలు మొదలుపెడితే అది ఒక్క చంద్రబాబుకే కాదు కేంద్రానికి కూడా సమస్యే అని భావించి.. ఈ విషయంలో జగన్ ను ఎలాగైనా కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీనిలో భాగంగానే కేంద్రం జగన్ కు ఫోన్ చేసి ప్రత్యేక హోదా గురించి  ఉద్యమాలు అంటూ మొదలుపెడితే అనవసరంగా ఇబ్బందులు పడతావని.. ఎలాంటి గొడవలు చేయోద్దని హెచ్చరించారట. అందుకే జగన్ వెనక్కి తగ్గారట. మొత్తానికి జగన్ ఇబ్బందులు పడే అంశాలేంటో అందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు..

వావ్ బాలయ్య.. వాట్ ఏ రెస్సాన్స్

  ఏపీ ప్రత్యేక హోదా గురించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య పై అందరూ ప్రశంసలు కురిపించేస్తున్నారు. ఆదివారం నాడు ఆయన కాన్సర్ పై అవగాహన పెంచేందుకు గాను పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల కోరిక అని.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా కనుక ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని.. ప్రజలంతా కలిసి ఏకమై ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని హెచ్చరించారు. అంతే దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు.. చాలా బాగా మాట్లాడారని.. కొంతమంది నేతలు తన మద్దతును కూడా తెలుపుతున్నారు. అంతేకాదు మీడీయాలో సైతం బాలయ్య వ్యాఖ్యలపై పోల్ నిర్వహించగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తెలుగు తముళ్లు సంగ్ధిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎవరు ఎన్నిరకాలుగా వ్యాఖ్యలు చేసిన తాము మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేవారు కాని ప్రత్యక్షంగా కేంద్రాన్ని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలకు వచ్చిన రెస్పాన్స్ చూడగా తప్పకుండా తాము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినట్టయింది. అంతేకాదు బాలయ్యలా మిగిలిన నేతలు కూడా ముందుకు రావాలని.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు.

చంద్రబాబుకు చెప్పలేరు..టీజీకి మద్ధతు

  ఏపీ రాజధాని అమరావతిని ఎంత తొందరగా నిర్మించాలా.. ఎంత త్వరగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలా అని చంద్రబాబు చూస్తున్నారు. అయితే రాజధాని అమరావతి వల్ల రాష్ట్రా అభివృద్ధి సంగతేమో కానీ తాము మరీ వెనుకబడిపోతామేమో అని కొందరు నాయకులు అనుకుంటున్నారంట. రాష్ట్రం విడిపోవడం ఒక సమస్య అయితే విడిపోయిన తరువాత రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా కూడా రాయలసీమ అభివృద్ధికి స్పెషల్ గా ప్యాకేజీ ఇవ్వాలని అప్పుడే భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.. ఇప్పుడు కూడా తెలెత్తుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది నేతలు బహిరంగంగా వ్యక్తపరిచినా .. కొంతమంది వ్యక్తపరలేని పరిస్థితి. అమరావతి మీద చంద్రబాబు నాయుడు విపరీతమైన శ్రద్ధను కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి భయం. కాని కర్నూలుకు చెందిన నాయకుడు టీజీ వెంకటేష్ మాత్రం ఎడాపెడా తన డిమాండ్లను వినిపించేస్తున్నారు. ఎందుకంటే తనకు పదవి లేదు కనుక.. ఎలా మాట్లాడినా జరిగే నష్టం ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు టీజీ అవి. * రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని * అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కావాలని * అమరావతిని ఫ్రీజోన్ చేయాలని అయితే ఒక రకంగా చెప్పాలంటే టీజీ చేసిన డిమాండ్లు సమంజసంగానే ఉన్నా వాటి గురించి మాట్లాడే ధైర్యం పదవిలో ఉన్న నేతలకు లేదు. కాని కొసమెరుపు ఏంటంటే టీజీ చేసిన డిమాండ్లు బానే ఉన్నాయని.. సరైన సరైన అంశాలను లేవనెత్తారని ఆయనకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారట సీమ నేతలు. మరి టీజీ డిమాండ్లు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాలి.

అమరావతి.. 9 నగరాలు.. 9 రంగులు

ఏపీ రాజదాని అమరావతి శంకుస్థాపన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఇంక రాజధాని నిర్మాణం శరవేగంగా జరగడమే తరువాయి భాగం. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా  ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ ‘పింక్‌ సిటీ'గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాజధాని అమరావతిలో టూరిజం, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్‌, విద్య, ప్రభుత్వ పాలన, జస్టిస్‌, స్పోర్ట్స్‌, ఆధ్యాత్మిక, ఆర్థిక నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని పింక్ సిటీ మాదిరి రాజధానిలోని తొమ్మిది నగరాలకూ  ఒక్కో రంగును ప్రత్యేకించి, తొమ్మిది రంగులతో నిర్మించాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం.. దానికి వేసే రంగులు.. రోడ్లు.. నీటి సదుపాయాలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ అమరావతిలో ఒక్కో నగరాన్ని నిర్మించిన తరువాత మరొకటి నిర్మించాలంటే చాలా సమయం వృధా అవుతుందని.. కాబట్టి అలా కాకుండా ఒక్కో విభాగాన్ని ఒక్కో సంస్థకు ఇస్తే పనులు త్వరగా అవుతాయని కూడా చర్చించినట్టు సమాచారం. మొత్తానికి ఏడు రంగులు ఇంద్రధనస్సు అన్నట్టు.. 9 రంగుల అమరావతిని త్వరలో చూస్తామన్నమాట.

అహం తగ్గించుకోండి.. కేసీఆర్ జూనియర్ అయినా పిలిచా.. చంద్రబాబు

  సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ పీకారంట. ఏ విషయంలో అనుకుంటున్నారా.. నేతల్లో అహంకారం పెరుగుతోందని పెద్ద క్లాసే పీకారంట. అంతేకాదు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారంట. రాష్ట్రం విడిపోవడం వల్ల కొంత మందికి నష్టం కలిగిందేమో కాని దాని వల్ల కొంతమంది నేతలకు మంచే జరిగింది. ఎందుకంటే నూతన రాజధాని పుణ్యమా అని అక్కడ భూములు ఉన్న వారికి రేట్లు బాగా పెరిగాయి. దీంతో నేతలకు అహంకారం బాగా పెరగిపోయిందట. ఈ నేపథ్యంలో సోమవారం తన క్యాంపు కార్యలయంలో చంద్రబాబుని కలవడానికి వచ్చిన కృష్ణా, గుంటూరు నేతలకు కొంతమంది పార్టీ నేతలకు అహంకారం పెరిగిపోతోంది.. అహంకారం పెరిగితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని అన్నారట. భూములు రేట్లు పెరుగుతున్నాయి కదా అని అహంకారం కూడా పెరిగితే మంచిది కాదని సూచించారట. అంతేకాదు నాకంటే కేసీఆర్ జూనియర్ అయినా రాజధాని శంకుస్థాపనకు ఇంటికెళ్లి ఆహ్వానించాను.. అహంకారం తగ్గితే వ్యక్తిగతంగా మీకూ మంచిదే'' అని చంద్రబాబు హితవు పలికారు.