హెచ్ సీయూ.. నలుగురు విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేత..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తో పాటు మరో నలుగురు స్టూడెంట్స్ ని కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నలుగురు విద్యార్థులు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సంకన్నలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. రోజు రోజుకి రోహిత్ ఆత్మహత్యపై రేగుతున్న దుమారం నేపథ్యంలో విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ ఆత్మహత్య పైన ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ మీడియా ఎదుట గురువారం తొలిసారి స్పందించారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని.. ఏఎస్ఏ విద్యార్థులు తన పైన దాడి చేశారని.. తాను ఆసుపత్రిలో చికిత్స కూడా పొందానని తెలిపారు. ఈ కేసులో బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చోశారు