మనసు మార్చుకున్న రచయితలు..

ఈ మధ్య కాలంలో "అవార్డు వాపసీ" పేరుతో పలువురు రచయితలు, ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఏర్పడిన అసహనానికి నిదర్శనంగా దాదాపు 40 మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చి నిరసనను తెలిపారు. అయితే ఇప్పుడు వారిలో కొంత మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. సాహిత్య అకాడమీకి చెందిన పలువురు రచయితలు తమ అవార్డులు వెనక్కి పంపగా ఇప్పుడు తమ మనసు మార్చుకొని అవార్డుల్ని వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పారంట. 40 మందిలో 10 మంది ఇప్పటికే అంగీకరించారని.. మిగిలిన వారు కూడా అంగీకరించే పరిస్థితులే కనిపిస్తున్నాయని చెబుతున్నారు అకాడమీ ప్రతినిధులు. అంతేకాదు తమకు పంపిన అవార్డులను తిరిగి సదరు అవార్డు గ్రహీతలకు పంపుతున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది.  

టీడీపీ ఎత్తుతో బీజేపీ మైండ్ బ్లాక్..

గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఏ పార్టీకి తగ్గ ఎత్తుగడలు ఆ పార్టీ వాళ్లు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు ప్రచారంలో తెగ బిజీగా ఉన్నారు. అయితే అన్ని పార్టీల సంగతేమో కానీ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీల మధ్య సంఘటనలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి పట్టు వల్ల సగానికి పైగా స్థానాలు తీసుకుందామనుకున్న బీజేపీకీకి 150 స్థానాల్లో కేవలం 60 మాత్రమే దక్కాయి. ఈ ఒప్పందానికి బీజేపీ కూడా ఒప్పుకొని సై అంది. కానీ ఇప్పుడు టీడీపీ వేసిన ఓ ఎత్తుగడకి బీజేపీకి దిమ్మతిరిగిపోయిందంట. అదేంటంటే.. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లు టీడీపీ 90 స్థానాలు.. బీజేపీ 60 స్థానాలు తీసుకుంది. దీనిలో భాగంగానే జూబ్లిహిల్స్ డివిజ‌న్‌ను టీడీపీ బీజేపీకి కేటాయించింది. అయితే మిత్రపక్షానికి సీటు కేటాయిస్తూనే టీడీపీ రెబల్‌గా వేసిన ఆకుల వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ బీ- ఫారం ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అభ్యర్థిగా వెంకటేశ్వరరావుకు బీ-ఫారం అందజేయడంతో ఆయన ఖైరతాబాద్‌లో రిటర్నింగ్ అధికారికి అందించారు. దీంతో టీడీపీ ఎత్తుకు బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యిందంట. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్ది చండ్ర మధు బీ-ఫారం అందజేశారు. దీంతో ఇప్పుడు మిత్రపక్ష పార్టీ నేతల మధ్యే పోటీ ఏర్పడింది. ఎలాగైనా సీటు గెలుచుకోవాలన్న బీజేపీకి ఈ రూపంగా ఎదురుదెబ్బ తగిలింది.

రోహిత్ ఆత్మహత్య రాజకీయం చేయోద్దు.. తల్లి శోకాన్ని అర్థం చేసుకోండి..మోడీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు అక్కడికి వచ్చి రోహిత్ ఆత్మహత్యపై మాట్లాడారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాని మోడీ రోహిత్ ఆత్మహత్యపై నోరు విప్పడం జరిగింది. లక్నోలో బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వేముల రోహిత్ ఆత్మహత్య తనను కలచివేసిందని.. అతని ఆత్మహత్యను రాజకీయం చేయకుండా.. తన తల్లి  శోకాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.  రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన పరిస్థితి రావడం దురదృష్టకరమని..  రోహిత్ మృతితో భారత దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. రోహిత్ కుటుంబానికి ప్రధాని మోడీ తన సంతాపాన్ని తెలిపారు.

చెవిరెడ్డి తో ఆడుకుంటున్న పోలీసులు..!

ఈ మధ్య వైసీపీ నేతలు పలు వివాదాలు.. పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి అసలు చెప్పనక్కర్లేదు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇక ఆయనకు తగ్గట్టే పోలీసులు కూడా చెవిరెడ్డిని ఆస్టేషన్ కి.. ఈ స్టేషన్ కి తిప్పుతూ ఆడుకుంటున్నారు. ఓ కేసులో భాగంగా చెవిరెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. పార్టీ అధినేత జగన్ చెవిరెడ్డిని పరామర్శించడానికి వచ్చారు. అయితే జగన్ పరామర్శ అనంతరం.. పోలీసులు చెవిరెడ్డిని పీలేరు తీసుకెళ్లారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో చెవిరెడ్డికి అక్కడ జడ్జి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దాని తరువాత మళ్లీ పోలీసులు అతనిని నెల్లూరు సెంట్రల్ జైల్లో  విడిచి వెళ్లారు. మొత్తానికి కేసులేమో కానీ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ పోలీసులు ఆయనను ఆడుకుంటున్నారు.

రోహిత్ సూసైడ్ లేఖ.. కొట్టేసిన పేరాలో ఏముంది..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ది రోహిత్ ఆత్మహత్య ఇప్పటికే దేశమంతటా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కీలక  పరిణామం చోటుచేసుకుంది. రోహిత్ ఆత్మహత్య చేసుకంటూ ఒక సూసైడ్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో ఒక పేరా కొట్టేసుంది. దీంతో ఇప్పుడు కొట్టేసిన పేరా గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను రాసిన ఒక పేరాను నిండా కొట్టేసి.. అక్షరాలు ఏ మాత్రం కనిపించకుండా ఇంకుతో రుద్దేసి ఉన్న పేరాగ్రాఫ్ పక్కన నేనే కొట్టేస్తున్నాను.. అంటూ రోహిత్ సంతకం ఉంది. దీంతో తాను కొట్టేయాలనుకుంటే ఏదో ఒక అడ్డగీత గీసి కొట్టేయోచ్చు కదా.. కానీ ఇలా ఒక్క అక్షరం కూడా కనపడకుండా కొట్టేయడం వెనుక ఏం ఉద్దేశం ఉంది..? అలా కొట్టేయాల్సిన అవసరం ఏంటని..? ఇలా ప్రశ్నలు వేస్తున్నారు. ఈ అనుమానాల మధ్యే రోహిత్ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. దీంతో ఏ ఫలితాలు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మళ్ళి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..19 మంది బలి

మళ్ళి మరోచోట ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ సారి దానికి 19 మంది బలి అయిపోయారు.సోమాలియా రాజధాని మొగదిషు లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ మీద ఉగ్రవాదులు బాంబు దాడి చేసారు. ఆ సమయం లో రెస్టారెంట్లో సాయంత్రపు భోజనం చేస్తున్న వారిలో కొందరు ఈ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులలో స్త్రీలు, పసి పిల్లలు కూడా ఉన్నారు. అయితే బాంబుదాడి కి పాల్పడ్డ వారిలో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ఒకరిని అరస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వరసగా ప్రపంచం లో ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు ఇలా దాడులకి పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలని హరించటాన్ని ఖండిస్తూ అప్పుడే నిరసనలు వెల్లువెత్తు తున్నాయి.

మహిళలను వేధించినందుకు రెండు జన్మల శిక్ష..

అది శిక్ష ...అలాంటి శిక్ష పడితేనే ..ఆడవారి మీద అకృత్యాలకి తెర పడేది ..అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి అంత నచ్చిన ఆ తీర్పు లో నేరస్తుడు ఓ పోలీస్ అధికారి. డ్యూటీ లో వుండగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణ. అది రుజువు కావడంతో అతనికి శిక్ష విధించింది కోర్టు. ఇందులో చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే 263 సంవత్సరాల జైలు శిక్ష వేసారు. అంటే రెండు జన్మలు ఎత్తినా తీరని శిక్ష అన్నమాట. పైగా తీర్పు మీదపై కోర్టుకు వెళ్ళే అనుమతి  కూడా నిరాకరించారు. ఇదంతా అబివృద్ది చెందిన అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఒక్లహామ నగరంలో విధులు నిర్వహించిన డేనియల్ హాల్ట్ క్లాక్ ఎందరో మహిళలను లైంగికంగా వేదించాడట. పోలీసు అధికారి విధులలో వుండి ఇలా చేయటాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది కోర్టు. మహిళల మీద జరిగే అకృత్యాలు ఆగాలంటే శిక్షలు ఈ తరహాలో వుండాలి. అప్పుడే నేరస్తులు బయపడేది..నేరాలు అదుపులోకి వచ్చేది.

ఢిల్లీలో హై అలర్ట్‌.. హైదరాబాద్ లో నలుగులు అరెస్ట్

దేశంలో ఈ మధ్య ఉగ్రవాదుల చర్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇంకో నాలుగు రోజుల్లో రిపబ్లిక్ డే రానున్న సందర్భంగా దేశ రాజధానిలో ఫుల్ ఎలర్ట్ ను ప్రకటించారు. మరోవైపు పఠాన్ కోట్ నుండి ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీ బయలుదేరినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో క్యాబ్ డ్రైవర్ ని హత్య చేసి అదే క్యాబ్ లో ఢిల్లీకి బయలుదేరినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజధాని ఢిల్లీకి వచ్చే మార్గాలన్నింటిని కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వారు దాడులు జరపవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కార్యక్రమాలను భగ్న చేసేందుకు ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మరో ఐదుగురికి కోసం గాలిస్తున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా 25 మంది ఐసిస్ అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

అత్యంత చెత్త పాస్ వర్డ్ ఇదే..!

పాస్ వర్డ్ ల సంగతి అందరికి తెలిసిందే. ముబైల్ ఫోన్ దగ్గర నుండి ఏటీఎమ్ ల వరకూ.. సోషల్ మీడియాను సంబంధించి ప్రతి ఒక్కదానికి పాస్ వర్డ్ లు పెట్టుకుంటాం. ఇలాంటి పాస్ వర్డ్ లలో కూడా చెత్త పాస్ వర్డ్ లు ఉంటాయని అధ్యయనంలో చెప్పారు పరిశోధకలు. దాదాపు 20 లక్షల సంబంధించి..వారు ఉపయోగించే పాస్ వర్డ్స్ ఆధారంగా జరిగిన ఆధ్యయనంలో మనిషి వాడే పాస్ వర్డ్ లలో ‘‘123456’’ ముందు స్థానంలో నిలిచింది. అంతేకాదు గత మూడేళ్ల నుండి ఈ పాస్ వర్డ్ ముందు స్థానంలో నిలిచి అత్యంత చెత్త పాస్ వర్డ్ గా నిలిచింది. దీంతో పాటు ‘‘స్టార్ వార్స్’’.. ‘‘సోలో’’.. ‘‘ప్రిన్సెస్’’ లాంటి పాస్ వర్డ్ లు కూడా ఉన్నాయి. మరి  ఇక పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

నన్ను కొట్టారు.. మా అమ్మను అవమానించారు.. రాహుల్..కేజ్రీవాల్ అప్పుడు మాట్లాడలేదేం..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలసిందే. అయితే ఈ వివాదానికి సంబంధమున్న అత్యంత కీలకమైన వ్యక్తి ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ రాహుల్ గాంధీ.. కేజ్రీవాల్ పై మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ సంఘానికి చెందిన 30 మంది వచ్చి నన్ను కొట్టారని.. నాచేత బలవంతంగా క్షమాపణలు చెప్పించారని అన్నారు. తనపై దాడి చేసిన వారిపై కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే నువ్వు ప్రత్యక్షంగా చూశావా అని ప్రశ్నించారని.. లేదని చెప్పటంతో నాపై  దాడి జరగలేదని తేల్చారని వాపోయాడు.  మరో విద్యార్ది సాక్ష్యం చెప్పడంతో విద్యార్థులపై ఆర్నెల్లు సస్పెన్షన్ విధిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయాన్ని సుశీల్ వెల్లడించారు. అంతేకాదు తనపై దాడి చేసిన ఉదంతానికి సంబంధించి ఆధారాలు.. సాక్ష్యాలు ఉన్నాయని.. సుశీల్ కుమార్ చెప్పారు. తనపై దాడి జరిగిన విషయంపై మా అమ్మ ఫిర్యాదు చేయడానికి వెళితే.. వీసీ ఛాంబర్ లోనే అవమానించారని.. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించాలని కోరారు. తన కులం ఓబీసీ అని ఒక ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి భావస్వేచ్ఛను హరించినప్పుడు కేజ్రీవాల్, సీతారాం ఏచూరి ఎక్కడికి వెళ్లారు? నన్ను కొట్టినప్పుడు వాళ్లేందుకు మాట్లాడలేదు..మా అమ్మకు వీసీ ఛాంబర్ లోనే అవమానం జరిగింది. దానికి ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడింది లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అమెరికాకు అంత సీన్ లేదు.. ఎక్కడో నాలుగో స్థానం..

ప్రపంచంలో అత్యంత అభివృద్ది చెందిన.. అత్యుత్తమ, గొప్ప దేశం ఏదంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు అగ్రరాజ్యం అమెరికా. కానీ ఇప్పుడు అలా చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తాజాగా వచ్చిన జాబితాను చూస్తే అలానే అనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ అండ్ గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్లు ప్రపంచంలో అత్యుత్తమ దేశాల జాబితాను తయారు చేస్తూ ఉంటాయి. అలా వాళ్లు తాజాగా తయారు చేసిన జాబితా ప్రకారం అమెరికా అత్యుత్తమ దేశం కాదని తేలిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా స్థానాన్ని జర్మనీ ఆక్రమించింది. కనీసం జర్మనీ తరువాత స్థానంలో కూడా  అమెరికా లేకపోవడం దురదృష్టకరం. ముందు ప్లేస్ లో జర్మనీ.. తరువాత కెనడా, బ్రిటన్.. ఆ తరువాత నాలుగో స్థానంలో అమెరికా నిలిచింది. మొత్తానికి అన్ని దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యమైన అమెరికాకు ఈ విషయం పెద్ద షాకింగ్ న్యూసే.

బెంగళూరు టెక్కి దారుణ హత్య.. ల్యాప్‌టాప్‌ వైరుతో..

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం కుసుమ్‌ సింగ్లా(31) అనే యువతి బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే ఆమెకు సుఖ్‌బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచమయ్యాడు. కాగా మంగళవారం సుఖ్‌బీర్‌ని తన ఇంటికి రావాల్సిందిగా కుసుమ్‌ కోరగా అతను ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లిన సుఖ్‌బీర్‌  కుసుమ్‌ సింగ్లాను రూ.50వేలు ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. కనీసం రూ.5వేలు ఇవ్వాల్సిందిగా అడిగినా ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఉన్న సుఖ్‌బీర్‌ ల్యాప్‌టాప్‌ వైరుతో కుసుమ్‌ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా, తర్వాత ఆమె సోషల్‌మీడియా ఖాతా ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు హర్యానాలో సుఖ్‌బీర్‌ని పట్టుకున్నారు.

హెచ్ సీయూ.. నలుగురు విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేత..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తో పాటు మరో నలుగురు స్టూడెంట్స్ ని కూడా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నలుగురు విద్యార్థులు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సంకన్నలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. రోజు రోజుకి రోహిత్ ఆత్మహత్యపై రేగుతున్న దుమారం నేపథ్యంలో విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ ఆత్మహత్య పైన ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ మీడియా ఎదుట గురువారం తొలిసారి స్పందించారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని.. ఏఎస్ఏ విద్యార్థులు తన పైన దాడి చేశారని.. తాను ఆసుపత్రిలో చికిత్స కూడా పొందానని తెలిపారు. ఈ కేసులో బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చోశారు

బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. సొంత పార్టీ నేతలే..

ఈ మధ్య పార్టీ నేతలకు తమ సొంత పార్టీ కార్యకర్తల చేతిలోనే దెబ్బలు తీనే పరిస్థితి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. ఇటీవలే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ నేతకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ పై బీజేపీ కార్యకర్తలే దాడి చేశారు. ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ లో పర్యటిస్తున్న ఆయన కారును కార్యకర్తలు అడ్డుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ నాయకుడికి టికెట్ ఇవ్వలేదని దాడి చేశారు. ఆయన కార్యకర్తలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ విషయంపై సీరియస్ గా ఉన్న ప్రభాకర్ ఇప్పటికే కేంద్రంలోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం.

జీహెచ్ఎంసీ.. ముగిసిన నామినేషన్ల గడువు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగిసింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నుండి రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అన్ని పార్టీల సంగతేమో కాని అధికార పార్టీ టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్ధుల బెడద ఎక్కువైంది. దీంతో ఉదయం వీరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా లేదా అన్న సందేహం నెలకొంది. అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండి 450 నామినేషన్లు ఉపసంహరణ జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా రెబల్స్ ఉపసంహరించుకోకపోయినా నామమాత్రపు పోటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. టీఆర్ఎస్ మాత్రం బరి నుండి రెబల్స్ తప్పుకుంటారని ధీమా వ్యక్తం చేస్తుంది.

హెచ్ సీయూలో అసదుద్దీన్ ఓవైసీ.. ఈసారి కులం గురించి..

రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నేతలు హెచ్ సీయూ వెళ్లి విద్యార్ధులకు మద్దతు పలికారు. ఇప్పుడు వారి ఖాతాలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరిపోయారు. ఎప్పుడూ మతం గురించి.. హిందుత్వం గురించి మాట్లాడే ఓవైసీ ఇప్పుడు కూడా అదే తరహాలో మాట్లాడారు. కాకపోతే ఈ సారి మతం గురించి కాకుండా కులం గురించి మాట్లాడారు.  బ్రాహ్మణ అగ్రకుల అహంకారమే ఎంతో భవిష్యత్తు ఉన్న మేధావి ఆత్మహత్యకు కారణమని..  కేంద్రంలో ఉన్న బీజేపీ భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని.. ఇతరులు ఉండకూడదని భావిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ అందరిదని..విద్యాసంస్థల్లో రాజకీయ నాయకులు ప్రమేయం సరికాదని అన్నారు. అయితే అంతా చెప్పిన అసద్ తాను మాత్రం రాజకీయ నాయకుడు కాదా.. తాను ఎందుకు యూనివర్సిటీలోకి వెళ్లాడు అని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

మహిళా ప్రొఫెసర్ అనుచిత వ్యాక్యలు.. ముస్లింలు మహిళలను బానిసలుగా వాడుకోవచ్చు..

ఇప్పటికే మత వివక్షాలతో ఎన్నో వివాదాలు జరుగుతుంటే ఇప్పుడు ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఈజిప్ట్ రాజధాని కైరోకు చెందిన అల్-అజర్ యూనివర్శిటీకి చెందిన మహిళా ఇస్లామిక్ ప్రొఫెసర్ సువాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ "ముస్లిం పురుషులు ఇతర మతానికి చెందిన మహిళలను లైంగిక బానిసలుగా చూసుకోవచ్చని అది అల్లా దృష్టిలో చట్ట సమ్మతమేనని ఈ ప్రొఫెసర్ గారు సెలవిచ్చారు". దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇన్ క్విస్టర్ రిపోర్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ఈజిప్ట్ ముస్లింలు ఇజ్రాయిల్ మహి ళలను లైంగిక బానిసలుగా వాడుకోవచ్చని అత్యాచారాలు చేయవచ్చని ప్రచురించింది. అంతే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు తెలత్తుతున్నాయి. పలువురు ముస్లింలే ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తుండటంతో ఈవ్యవహారం పెద్ద దుమారంగా మారింది.