సంజయ్ దత్ కోసం అభిమాని ఫ్రీ ఆఫర్..

  తమ అభిమాన హీరోపై ఉన్న అభిమానాన్ని ఫ్యాన్స్ ఒక్కోరకంగా చూపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అభిమాని కూడా తన అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన గడువు ముగియడంతో గురువారం ఉదయం ఎరవాడ జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ సందర్బంగా నూర్ మహ్మదీ హోటల్ యజమాని ఖలీద్ హకీమ్ ఫ్రీ ఓ ఆఫర్ ప్రకటించాడు. సంజయ్ దత్ విడుదలయ్యే రోజు  తమ హోటల్ కు వచ్చే వారికి ప్రత్యేక వంటకం 'చికెన్ సంజూ బాబా' ఉచితంగా వడ్డించనున్నామని.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించాడు.   ఖలీద్ హకీమ్ మాట్లాడుతూ తన హోటల్ ను  1986లో ప్రారంభించానని.. దీనికి సంజయ్ దత్ ను ఆహ్వానించానని.. అప్పటినుంచి  తరచుగా తన హోటల్ కు సంజయ్ వస్తుండేవారని వెల్లడించారు.

మరో ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇవ్వనున్నాడా..!

  ఇప్పటికే వైసీపీ అధినేతకు దిమ్మతిరిగిపోయే షాకిస్తూ ఆ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా ఆ దెబ్బ నుండి కోలుకోకముందే మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి మారే యోచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. భూమా ఫ్యామిలీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు టీడీపీ మరో ఎమ్మెల్యేపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతే కాదు ఆ ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు వున్నట్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమా.. లేక రాజకీయ నాటకాలా.. ఇంతకీ టీడీపీలోకి వెళ్లాలనుకునే ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

కేంద్రం నుండి పిలుపు.. ఢిల్లీ బయల్దేరిన సీఎం..

తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. జాట్లు చేపట్టిన ఆందోళనలు పదిరోజులకు చేరింది. మరోవైపు జాట్ల ఆందోళనల వలన ప్రభుత్వానికి 34 వేల కోట్లు నష్టంగా చెబుతున్నారు అధికారులు. ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో జాట్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటంపై కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. దీనిపై చర్చించేందుకు గాను కేంద్ర కబురు పెట్టడంతో.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఇంకా ఇద్దరు మంత్రులతో కలిసి ఢిల్లీ బయల్దేరారు. దీనిలో భాగంగా కమిటీ... ముందుగా హరియాణా ప్రభుత్వ అభిప్రాయాలను సేకరించనున్నట్టు తెలుస్తోంది.

సల్మాన్ ను చంపితే 4 మిలియన్ల డాలర్లు..

  బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీపై ఇరాన్ తన వ్యతిరేకతను చాటుకుంటూనే ఉంది. దీనిలో భాగంగా ఇరాన్ మీడియా గ్రూపు అతనిపై ఓ ఆస్తికర ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. భారత సంతతికి చెందిన సల్మాన్ రష్దీను చంపితే 4 మిలియన్ల డాలర్లు నజరానా ఇస్తామంటూ ప్రకటించింది. దీనంతటికి కారణం రష్దీ రాసిన ద శటానిక్ వర్సెస్ అనే పుస్తకం కారణం. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా రుహోల్లా ఖొమేని ఫత్వా జారీ చేశారు. దీనిలో భాగంగానే ఆయనను చంపిన వాళ్లకు నజరానా ప్రకటించారు.   కాగా గతంలో ఈయనను చంపినందుకు 2.7 మిలియన్ డాలర్లు నజరానా ప్రకటించిన ఇరాన్.. ఆతరువాత అది 3.3 మిలియన్ డాలర్లకి పెరిగింది. మళ్లీ ఇప్పుడు 4 మిలియన్ల డాలర్లకు పెంచారు.

ఇంకొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటా.. చిరంజీవి

సినీనటుడు, రాజ్యసభసభ్యుడు కె చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన తన ఎంపీ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన మూడు సామాజిక భవనాలను ప్రారంభించారు. అనంతరం.. పేరుపాలెం సౌత్‌లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ చేశారు. అంతేకాదు ‘ప్రధానమంత్రి సాంసద్‌ ఆదర్శ గ్రామ యోజన' పథకం క్రింద మొగల్తూరు మండలం తీరప్రాంత గ్రామమైన పేరుపాలెం సౌత్‌ను చిరంజీవి దత్తత తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని  చెప్పారు.

భూమా నాగిరెడ్డి టీడీపీ చేరిక.. చక్రం తిప్పిన బాలకృష్ణ..!

  ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు నిన్న టీడీపీలోకి జంప్ అయ్యారు. వీరిద్దరి పార్టీ మార్పుపై పలు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఆఖరికి టీడీపీలో చేరిపోయారు. అయితే వీరిద్దరూ టీడీపీలోకి అసలు కారణం.. తెరవెనుక ఉన్నది మాత్రం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొంత కాలంగా భూమా వైసీపీ పార్టీ పైన అధినేత జగన్ పైన చాలా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కర్నూల్ జిల్లాలో జరిగిన కో ఆపరేటివ్ ఎన్నికల్లో వైసిపికి చుక్కెదురవ్వడంతో భూమాను జగన్ తప్పుపట్టారు. దీంతో భూమా పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కర్నూలులో చాలా కాలం నుండి  భూమా పార్టీ మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించి భూమాను టిడిపిలోకి లాగేందుకు మంతనాలు జరిపారట. బాలకృష్ణతోపాటు లోకశ్ కూడా భూమాతో మంతనాలు జరిపి ఆయన టిడిపి తీర్థం తీసుకునేలా చేశారని రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

  నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కీలక జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్టీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ బిల్లుతో పాటు రియల్ ఎస్టేట్ బిల్లు, ప్రైవేటు కంపెనీల దివాళా బిల్లు, యాంటీ హైజాకింగ్ బిల్లు, ఎయిర్ క్యారేజీ బిల్లు, ఇన్‌లాండ్ వాటర్‌వేస్ బిల్లు తదితరాలన్నింటిపై చర్చలు జరిపి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదిలా ఉండగా సమావేశాలు సజావుగా సాగే అవకాశం కనిపించడంలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలోకి ఆదినారాయణ.. కంటతడి పెట్టిన లక్ష్మీదేవమ్మ..

ఎన్నో హై డ్రామాల మధ్య వైసీపీ నేతలు టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే అందరి సంగతేమో కానీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాత్రం ఎప్పటినుండో టీడీపీ లోకి చేరాలని చూస్తున్నారు. కానీ ఆయన ఎంట్రీకి రామసుబ్బా రెడ్డి నుండి ఆభ్యంతరాలు రావడంతో చంద్రబాబు కూడా లైట్ తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు ఇన్ని రోజులకు ఆదినారాయణరెడ్డికి టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం.. పార్టీ మారడం జరిగిపోయాయి. అయితే ఆదినారాయణను టీడీపీలోకి చేర్చుకోవడంపై రామసుబ్బా రెడ్డి పెద్దమ్మ లక్ష్మీదేవమ్మ కంటతడి పెట్టారట. తెలుగుదేశం పార్టీ కోసం తమ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, రాజకీయ పోరాటంలో తన భర్తను కోల్పోయానని, మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు చేసిన వారిని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు న్యాయమని చంద్రబాబును నిలదీశారు. దీంతో చంద్రబాబు ఆమెను ఓదారుస్తూ.. ఆదినారాయణ రెడ్డి చేరికను అర్థం చేసుకోవాలని, పార్టీ అభివృద్ధి దృష్ట్యా ఈ చేరిక అవసరమని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే ఆఖరికి వారు ఆదినారాయణ రెడ్డి రావడానికి ఒప్పుకున్న ఒకింత అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం.. ఎంత వరకూ పార్టీలో మనగలరో..

సూపర్ స్టార్ మనవరాలు హాట్ ఫోటోస్.. షారుక్ కొడుకు ఆర్యన్ కూడా..!

  ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అంతా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు ‘నవ్య నవేలి నంద' మీదనే నడుస్తోంది. ఇంతకీ తను ఏదన్నా సినిమాలో నటిస్తుందా అంటే తప్పులో కాలేసినట్టే.. అదేంలేదు.. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల గురించి. ఇంతకీ ఆ ఫోటోస్ లో ఏముందనేగా మీ సందేహం.. అసలు సంగతేంటంటే.. నవ్య నవేలి నంద లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో చదువుకుంటోంది. అయితే ఆమె ఇటీవలే 18వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్బంగా ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ మధ్య పార్టీ చేసుకుందట. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం. గతంలో నవ్య, ఆర్యన్ మీద పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.        

నెలన్నర తరువాత సమంత ట్వీట్..

  టాలీవుడ్ లో అతి తక్కువ టైంలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకొని.. గొల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరంటే సమంత అని ఎవరికైనా గుర్తేచ్చేస్తుంది. ఇక ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆమెకు కూడా అభిమానులంటే అభిమానం ఎక్కువే. ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ ఏదో ఒకటి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసే సమంత దాదాపు నెలన్నరగా తన ట్వీట్టర్ కు పని చెప్పలేదు. దీంతో అభిమానులు కూడా కాస్త నిరాశపడిపోయారు. అయితే ఇప్పుడు సమంత మళ్లీ ట్విట్టర్లోకి వచ్చి  ‘ఐయామ్ బ్యాక్’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు ‘మీతో పాటు ఉన్నప్పుడు నాకు ఒక సైన్యంతో నిలబడినట్లుగా ఉంటుంది’ అని అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్టర్లో పేర్కొన్నారు. మొత్తానికి సమంత అభిమానులను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినట్టు కనిపిస్తుంది.

మోడీతో కేసీఆర్ ఏకాంత సేవ.. కవితకి కేంద్రమంత్రి..!

  తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. ఈ విజయాలకు తోడు.. ప్రతిపక్ష పార్టీల నుండి అనేక మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.. చేరడానికి సిద్దంగా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి కొన్ని సంవత్సరాల వరకూ రాజకీయంగా ఎలాంటి ఢోకా లేదనిపిస్తుంది. ఇక వరుస విజయాలతో కేసీఆర్ ఫ్యామిలీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.   ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్.. మంత్రి పదవిలో కేటీఆర్.. ఎంపీ పదవిలో కవిత..మేనల్లుడు హరీశ్ రావు కూడా మంత్రి పదవిలో ఉండటంతో కుటుంబమే రాష్ట్రాన్ని ఏలుతుందని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు దీనికి తోడు ఎంపీ కవితకు ఎన్డీయే సర్కారులో కేంద్రమంత్రి పదవి దక్కబోతుందా...? అనే సందహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే వారు దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. అయితే వీరిద్దరూ తెరాస ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలనే దానిపై చర్చ జరిపి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే... తెరాసకు కనీసం 3 పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.   ఇదిలా ఉండగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జులైలో ముగుస్తుందని తెలిసిన విషయమే. అయితే మోడీ మాత్రం వెంకయ్యను ఎట్టి పరిస్థితిలో వదలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. మరోవైపు వెంకయ్య నాయుడిని  పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయనను తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  ఈయన తో పాటు మరో కేంద్రం నుంచి మరో ఇద్దరు మంత్రులకు కూడా గవర్నర్లుగా పంపే అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

అమెరికాలోని అలబామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. వివరాల ప్రకారం ట్రాయ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వీరు శనివారం రాత్రి ఓ కారులో ప్రయాణిస్తుండగా.. మరో కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో హైదరాబాద్‌, నాచారంకు చెందిన మాథ్యూస్‌ అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి. నలుగురిలో భరత, వంశీ ఇద్దరూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారు. వీరిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. నిఖిల్‌, యశ్వంత అనే మరో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మరోవైపు అలమాబాలోని బాధితులకు సహాయం చేసేందుకు అట్లాంటా కాన్సుల్‌ జనరల్‌ డీ.వీ.సింగ్‌ అక్కడికి చేరుకుంటున్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు.

భూమా రావడాన్ని వ్యతిరేకిస్తున్నాం..

  భూమా నాగిరెడ్డి టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నామని శిల్పా సోదరులు అన్నారు. భూమా చేరితే మా కార్యకర్తలు ఇబ్బంది పడతారని..కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని.. అందుకే భూమా నాగిరెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అంతేకాదు భూమాతో విబేధాలు ఉన్న మాట వాస్తవమే.. దీనిపై గతంలో కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడాం.. అప్పుడు మేం వ్యతిరేకించాం.. ఇప్పుడు మరోసారి మాట్లాడటానికి రమ్మన్నారు.. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని అశిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు వైసీపీలోకి మేము వెళ్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోంది.. మేం టీడీపీని వీడే ప్రసక్తే లేదు అని అన్నారు.

నాగబాబు కూతురు నిహారిపై మెంటల్ హరాస్మెంట్ కేసు..!

  నాగబాబు కూతురు నిహారిపై మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తారంట. నిహారిక అంతలా ఎవరిని హెరస్ చేసింది.. ఎవరు నిహారికపై కేసు పెడతానన్నారు అనే కదా సందేహం.. అసలు సంగతేంటంటే నిహారిక.. ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్ ద్వారా ముందు బుల్లి తెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ అవ్వబోతుంది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు నిహారిక ప్రధాన పాత్రలో ‘ముద్ద పప్పు ఆవకాయ్' అనే వెబ్ సీరీస్ యూట్యూబులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో దానికి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక..  ‘ముద్ద పప్పు ఆవకాయ్' లో మాత్రం తన నటనతో అందరిని కట్టిపడేస్తుంది. ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్స్ రాగా.. ఎపిసోడ్ ఎపిసోడ్ కి తరువాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రేపుతున్నాయి. దీనిలో భాగంగానే కొందరు వ్యూవర్స్ చేస్తున్న కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. నెక్ట్స్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం లేటయితే మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిహారిక ముద్ద పప్పు ఆవకాయ్ మంచి పేరునే సొంత చేసుకుంది.

పీఏసి పదవికి భూమా రాజీనామా.. కారెక్కి నేరుగా చంద్రబాబు దగ్గరికి..!

  భూమా నాగిరెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భూమా వైసీపీ లో ఉంటారా.. లేక టీడీపీలో ఉంటారా అన్న డైలమాలో ఉండగా.. దీనికి మరింత వేడి పుట్టించేలా.. భూమా నాగిరెడ్డి తన పీఏసి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకా ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసి బయటకు వస్తున్న ఆయన్న పార్టీ మారుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానికి ఆయన మీ సస్పెన్సుకు తెర దించుతాను. గంటల్లోనో, రోజుల్లోనో మీడియా ముందు చెప్పాల్సింది చెప్పేస్తాను అని చెప్పారు.  అంతేకాదు అక్కడ నుండి ఆయన నేరగా కారులో చంద్రబాబు దగ్గరకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈరోజో రేపే ఆయన టీడీపీ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.