తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..

తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని హైలైట్స్ * 2016-17 బడ్జెట్ అంచనా 1,30,415.87 కోట్లు * ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్లు * 2015-16 రాష్ట్ర స్ధూల ఉత్పత్తిలో 11.76 శాతం వృద్ది * పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 7,861 కోట్లు * కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 6,286 కోట్లు * బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ. 1,204 కోట్లు * అసరా పెన్షన్లకు రూ. 4, 693 కోట్లు * కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కు రూ. 738 కోట్లు * ఎస్టీ సంక్షేమానికి రూ. 3,752 కోట్లు * సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సింగల్ విండో అనుమతులు * వచ్చే ఖరీఫ్ నుండి రైతులకు 9 గంటల విద్యుత్ * 2016 డిసెంబర్ లోగా 6 వేల గ్రామాలు, 12 పట్టణాలకు తాగునీరు. * సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,152 కోట్లు * రుణమాఫీకి కేటాయింపులు రూ. 3,178 కోట్లు * మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,553 కోట్లు * రహదారులు, భవనాలకు రూ. 3,333 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు * బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు * గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ కు రూ. 10,731 కోట్లు * రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,43,023గా ఉంటుందని అంచనా * జాతీయ తలసరి ఆదాయం కంటే ఇది 50శాతం ఎక్కువ * కేంద్ర నిధులు పన్నుల్లో వాటా తగ్గింది. * కేంద్రం నుండి 450 కోట్లు మాత్రమే వచ్చింది * వాగ్ధానాల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం * ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నాం.

సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు పెద్దపీట..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. బడ్జెట్లోని అంశాలు * రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,43,023గా ఉంటుందని అంచనా * జాతీయ తలసరి ఆదాయం కంటే ఇది 50శాతం ఎక్కువ * 2016-17 బడ్జెట్ అంచనా 1,30,415.87 కోట్లు * ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్లు * కేంద్ర నిధులు పన్నుల్లో వాటా తగ్గింది. * కేంద్రం నుండి 450 కోట్లు మాత్రమే వచ్చింది * వాగ్ధానాల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం * ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నాం.

రెండేళ్ల పాపనీ వదల్లేదు.. అత్యాచారం ఆపై హత్యాయత్నం!

సమాజంలోని పరిస్థితులు ఆడపిల్లల పట్ల ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు, మరో వార్త వెలుగులోకి వచ్చింది. పంజాబులోని లుధియానాలో జరిగిన ఈ ఘటనలో రెండేళ్ల పాప మీద అత్యాచారం చేసి ఆపై గొంతుకోసేశాడో కీచకుడు. ఆడుకోవడానికని వెళ్లిన తమ పాప ఎంతకీ తిరిగిరాకపోయేసరికి, ఆమె తల్లిదండ్రులు పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో తాళం వేసిన ఓ పాడుపడిన గదిలోంచి అరుపులు వినిపించడంతో, దాన్ని బద్దలు కొట్టి వెళ్లినవారికి అక్కడ రక్తపుమడుగులో తమ పాప కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పినట్లైంది. పాపను ఆడుకునేందుకు తీసుకువెళ్లిన ఓ పధ్నాలుగేళ్ల బాలుడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఆ పిల్లవాడు కూడా కనిపించకుండా పోవడంతో, అతని మీద అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త!

ఇక మీదట దుప్పట్లను రోజూ ఉతుకుతాం... రైల్వే

గత నెల రాజ్యసభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానంగా, ఏసీ బోగీల్లోని దుప్పట్లకు సంబంధించి రైల్వే మంత్రి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. సదరు బోగీల్లో ప్రయాణికులకు అందించే మందపాటి దుప్పట్లను, రెండు నెలలకి ఓసారి ఉతుకుతామని ఆయన చెప్పారు. ఈ విషయమై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు రైల్వేలు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకమీదట రైల్వేలలో కొత్త తరహా దుప్పట్లను అందిస్తామనీ, వీటిని రోజూ ఉతికేందుకు వీలుగా ఉంటాయని రైల్వే మంత్రి తాజాగా ప్రకటించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT) సంస్థ రూపొందించే ఈ దుప్పట్లు వాడకానికి వీలుగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు... త్వరగా నిప్పు అంటుకోవని చెబుతున్నారు. కేవలం దుప్పట్లు మాత్రమే కాదనీ, రైళ్లలో వాడే దిండ్లు, కర్టెన్లు... ఇలా అన్నింటినీ మరింత ఆకర్షణీయంగానూ, ఉపయోకరంగానూ మార్చేందుకు NIFT కంకణం కట్టుకుందట! ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొద్ది రైళ్లలో మాత్రమే ఉపయోగించే ఈ సరంజామా, రాబోయే రోజుల్లో అన్ని రైళ్లలోకీ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతేకాదు! సదరు దుప్పట్లను తక్కువ ధరకి కొనుక్కునే అవకాశం కూడా లభించవచ్చు. అదే కనుక జరిగితే.... మన దేశంలోని ప్రతి ఇంట్లోనూ రైల్వే దుప్పట్లే కనిపిస్తాయేమో!

మళ్లీ తెరపైకి రాహుల్ గాంధీ పౌరసత్వం.. వివరణ ఇవ్వాలని నోటీసులు

కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎప్పటినుండో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తన పౌరసత్వంపై రాహుల్ కు ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మళ్లీ రాహుల్ కు పౌరసత్వంపై చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు సంగతేంటంటే.. రాహుల్ భారతీయుడు కాదని.. తనకి బ్రిటన్ పౌరసత్వం ఉందని ఆరోపణలు వచ్చాయి. రాహుల్ కు బ్రిటన్లో ఓ కంపెనీ ఉందని.. దానికి సంబంధించిన పత్రాలలో రాహుల్ తాను బ్రిటన్ వారసత్వానికి చెందిన వాడినని చెప్పినట్టు..  భాజపా నేత సుబ్రమణ్యస్వామి ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి మహేశ్‌ గిరి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు  ఫిర్యాదు చేయడంతో.. స్పీకర్ ఈ ఫిర్యాదును పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీకి పంపించారు. దీనిపై విచారణ జరిపిన పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ రాహుల్ తన పౌరసత్వంపై వెంటనే విచారణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.   ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ  ఈవ్యవహారంపై మండిపడుతోంది. స్పీకర్ ఫిర్యాదు చేసేముందు రాహుల్ గాంధీని సంప్రదించాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి రాహుల్ కు ఈ వారసత్వం గురించిన తలనొప్పులు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు.

బీ ప్రౌడ్ టు బీ హైదరాబాదీ అంటున్న కెసీఆర్

అసెంబ్లీలో తమపై ప్రతిపక్షం చేసిన ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సిఎం కేసీఆర్. మిషన్ భగీరథను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, అది పూర్తయితే తమకు ఓట్లు రావని కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీకి ఇప్పటికే 700 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే పూర్తి స్థాయి లాభాల బాట పట్టిస్తామని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగం, అధికార పార్టీ ఇచ్చిన వాటితోనే సాగుతుందని, అది టిఆర్ఎస్ మానిఫెస్టోనే అంటూ ఆయన తెలిపారు. డిసెంబర్ కల్లా, 6182 గ్రామాలకు మంచినీరు అందిస్తామని, ఆయన స్పష్టం చేశారు.   సమైక్య రాష్ట్రంలో లాండ్ అసైన్ మెంట్ ను కూడా సరిగ్గా చేయలేదని, ఆ అసైన్ మెంట్స్ అన్నింటినీ సరి చేస్తామన్నారాయన. త్వరలోనే తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తండాలన్నింటినీ పంచాయితీలుగా మారుస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామాలన్నింటికీ సింగిల్ ఫేజ్ విద్యుత్ ను నిరంతరంగా అందిస్తామని, ప్రతీ ఊళ్లోని దళితులకు 3 ఎకరాలు భూమిని కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్లో ఆరోగ్యానికి పెద్దపీట వేయబోతున్నామని, హాస్పటళ్లను అద్భుతంగా, ఆరోగ్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ముప్ఫై నాలుగు వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష ఉద్యోగాలను ఇస్తామన్న దానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.  బీ ప్రౌడ్ టు బీ ఏ హైదరాబాదీ అంటూ మాట్లాడటం విశేషం.

నా భర్త వేధిస్తున్నాడు : సింగర్ మథుప్రియ

  గత అక్టోబర్లో పెద్దల్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది సింగర్ మధుప్రియ. శ్రీకాంత్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ తో ప్రేమలో పడి, ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లను ఎదిరించి, మథుప్రియ తన సన్నిహితుల సమక్షంలో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హుమయూన్ నగర్ పి ఎస్ లో తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది మథుప్రియ. వరకట్నం కోసం వేధించడమే కాక, అనుమానిస్తున్నాడని, ఫోన్ కూడా తీసేసుకుని ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదని ఫిర్యాదులో పేర్కొంది. కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధిస్తున్నారని, పెళ్లైన నాలుగు నెలల్లో తనకు నరకం చూపించాడని, అతని నుంచి తనకు రక్షణ కల్పించాలని కంప్లైంట్ లో పేర్కొంది. భర్త వేధింపులను తట్టుకోలేక మధుప్రియ ఏడుస్తూ పుట్టింటికి చేరుకుందని సమాచారం. తాజాగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హుమయూన్ నగర్ పి ఎస్ లో ఫిర్యాదును నమోదు చేసింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి విచారిస్తున్నారు

లండన్ పర్యటనలో బిజీ బిజీగా చంద్రబాబు.. ఎక్స్ క్ల్యూజివ్ ఫొటోస్

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడి టాప్ 20 కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్టు తెలస్తోంది. ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు ఏపీ రాష్ట్ర పరిస్థితులు.. నూతన రాజధాని అయిన అమరావతి గురించి చర్చిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్‌సిటీ నిర్మాణంపై అక్కడ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకా నిర్మాణాలు, సౌకర్యాలు గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు అమరావతికి నిధుల సమీకరణలో సాయం అందించేందుకు లండన్ స్టాక్‌ఎక్సేంజ్ అంగీకరించింది. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దీంతో మొత్తానికి  వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.     ఇదిలా ఉండగా థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పర్యాటక సంస్థ లండన్ ఐని చంద్రబాబు బృందం సందర్శించింది. థేమ్స్ నది అందానికి ముగ్దులైన చంద్రబాబు నవ్వుతూ అక్కడ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. థేమ్స్ నదిలో బోటు షికారు చేశారు.  

విజయ్ మాల్యాపై వర్మ కామెంట్లు.. క్యాలెండర్‌ గర్ల్స్‌ను ఇస్తే సరిపోతుంది..

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటేనే రాంగోపాల్ వర్మ.. టాపిక్ ఏదైనా కానీ.. వ్యక్తి ఎవరైనా కానీ ఏదో ఒకటి అననది రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తాజాగా ఆయన దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న విజయ్ మాల్యాపై కూడా నాలుగు కామెంట్లు విసిరారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్‌ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వాలని, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నాడు. అక్కడితో ఆగాడా.మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్‌ గర్ల్స్‌ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే మరి వారు రుణం తీర్చాలి కదా.. అని మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. కాని బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలేశారు.

నారాయణ సంచలన వ్యాఖ్యలు.. విజయ్ మాల్యాను చంపబోయి మాగంటిని చంపారు

సిపిఐ నాయకుడు నారాయణ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం పరిపాటే. ఇప్పుడు తాజాగా విజయ్ మాల్యా వ్యవహారంలో కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌మాల్యాకు, మాగంటి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని.. నక్సలైట్లు విజయ్ మాల్యాను చంపాలని ప్రయత్నించి వీలుకాక మాగంటి సుబ్బిరామిరెడ్డిని చంపారని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల బాణాలు సంధించారు. బ్యాంకర్లకు, విజయ్‌మాల్యాకు మధ్య గతంలో కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నడిపిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారని ఆరోపించారు. 

ఐశ్వర్యరాయ్ ది గుంటూరు జిల్లానా..!

ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటారు అది సహజం.. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకంది. హెల్త్ కార్డు ఒక ఫ్యామిలీ ఫొటోకు బదులు బాలీవుడ్ నటి అందాల తార ఐశ్వర్యరాయ్ ది వచ్చి చేరింది. వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవల హెల్త్ కార్డు ఇస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన బాణావత్ బాద్యుకు కూడా హెల్త్ కార్డు మంజూరైంది. కాకపోతే తమ ఫ్యామిలీ ఫొటోకి బదులు ఐశ్వర్యరాయ్ ఫొటో రావడం చూసి ఖంగుతిన్నారు. దీంతో ఆ కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇదే నిదర్శనమని అంటున్నారు.

కొరియాను కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం చిక్కబడుతోంది. ఈ ఏడాది మొదట్లో ఉత్తర కొరియా అణ్వాస్త్రాన్ని పరీక్షించడంతో మొదలైన ఈ ఉద్రక్తత ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా దూకుడుని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి పలు ఆంక్షలను విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్‌ మరిన్ని సవాళ్లకు సిద్ధపడుతున్నారు. తరచూ పలు క్షిపణులను పరీక్షించడమే కాకుండా, ఆ క్షిపణులకి అణ్వాస్త్రాలను మోసుకుపోయే శక్తి కూడా ఉందంటూ కవ్విస్తున్నారు. దాంతో దక్షిణ కొరియాకు మిత్రరాజ్యమైన అమెరికా రంగంలోకి దిగింది. తన యుద్ధ విమానాలు కొన్నింటిని ఇప్పటికే దక్షిణ కొరియాకు పంపింది అమెరికా. ఆ ప్రాంతంలో ఇరు దేశాల బలాన్ని చాటేందుకు ఇప్పడు దక్షిణ కొరియా తీరంలో తన నౌకలను కూడా మోహరించింది. ఈ నౌకలు మరో రెండు నెలల పాటు దక్షిణ కొరియా తీరంలో కవాతుని నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తరకొరియా కూడా తాను యుద్ధానికి సదా సిద్ధం అంటోంది. తమ నేత కిమ్ జోంగ్‌ ఆదేశాలివ్వడమే ఆలస్యం, ప్రత్యర్థుల మీద విరుచుకుపడిపోతామని ఆ దేశ సైన్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తమ అణ్వాయుధాలన్నీ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా వాటిని ఉపయోగిస్తామని అంటున్నారు.

భర్త చేసినా అత్యాచారమే.. వారిని శిక్షించాలి..

రేప్ ఎవరు చేసినా అది రేప్ అవుతుంది.. అది భర్త అయినా ఇంకెవరయినా కానీ.. అలాంటి వారికి శిక్ష వేయాల్సిందే అంటున్నారు జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు రేఖా శర్మ. భారతీయుల విషయంలో భార్యాభర్తల సంబంధాలను అత్యాచారంగా పరిగణించడం సరికాదని.. భార్యాభర్తల మధ్య అత్యాచార ఘటనగా పరిగణించలేమని రాజ్యసభలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంపై ఆమె స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. కనీసం జంతువుల సంరక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి.. అలాంటిది ఆడవాళ్లకు రక్షణ వద్దా.. వివాహాం అనే ముసుగులో భార్యను భర్త చిత్ర హింసలు పెట్టడం అమానుషం.. ఎవరు అత్యాచారం చేసినా అత్యాచారమే. భర్త అయినా మరొకరయినా ఒకే శిక్ష వేయాలి' అని రేఖా శర్మ ట్వీట్ చేశారు.

యువతిని వేధిస్తున్న కేసులో జనసేన పార్టీ సభ్యుడి అరెస్ట్..

ఓ యువతిని వేధిస్తున్నాడు అంటూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వైనం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ సాకేటి సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఫేస్ బుక్ లో  హైదరాబాదు నగరానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో హైదరబాద్ వచ్చినప్పుడల్లా చంద్రశేఖర్ ఆమెను కలిసేవాడు. అయితే ఆ అమ్మాయి చనువును అవకాశంగా తీసుకున్న అతను మొదట ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో చంద్రశేఖర్ వారిద్దరూ కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలు, అసభ్యకరమైన మెసేజ్ లు.. కామెంట్లు పోస్ట్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని పట్టుకున్నారు.