పోరాడి ఓడిన పసికూన ఆప్ఘాన్, సౌతాఫ్రికా గెలుపు

  సౌతాఫ్రికాతో మ్యాచ్ లో 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ పోరాడి ఓడింది. టోర్నీ ఓడిపోయినా, అందరి మనసులూ గెలుచుకుంది. బ్యాటింగ్ లో ఓపెనర్ మొహ్మద్ షాజాద్ ఇరగదీశాడు. కేవలం 19 బంతుల్లో 44 పరుగులతో సఫారీలకు చెమటలు పట్టించాడు. తర్వాత వచ్చిన వాళ్లు కూడా ధాడిగా ఆడటానికి ప్రయత్నించి అవుటయ్యారు. 20 ఓవర్లలో, సౌతాఫ్రికా లాంటి బౌలింగ్ లైనప్ పై 172 పరుగులకు ఆలౌట్ అయింది ఆఫ్ఘాన్ టీం. ఓడిపోయినా, తమ పోరాటంతో అందర్నీ ఆకట్టుకుంది. సఫారీ బౌలర్లలో రబాడా, అబ్బాట్, తాహిర్ లకు తలో రెండు వికెట్లు లభించగా, క్రిస్ మోరిస్ 4 వికెట్లతో రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా క్రిస్ మోరిస్ కే లభించింది.  

పసికూనకు సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్యం, డివిలియర్స్ వీరంగం

  వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో, సౌతాఫ్రికా చెలరేగిపోయింది. వరసగా రెండో సారి ప్రత్యర్ధి టీం కు 200 పైగా స్కోరును నిర్దేశించింది. డివిలియర్స్ (29 బంతుల్లో 64) వీర విహారం చేశాడు. బ్యాటింగ్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ బ్యాట్ ఝళిపించడంతో, టోర్నీలో వరసగా రెండో సారి 200 స్కోరును దాటగలిగింది సౌతాఫ్రికా. ఈ ఘనత సాధించిన మొదటి టీం సౌతాఫ్రికాయే కావడం విశేషం. ఇంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 229/4 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శనతో, సౌతాఫ్రికా ఓడిపోయింది.

భారీగా బరువు తగ్గిపోయిన అంబానీ కొడుకు

భారతదేశానికి కుబేర కుటుంబం అంబానీ ఫ్యామిలీ. దేశంలో అంబానీలు అడుగుపెట్టని రంగమే లేదు. డైరెక్ట్ గానో, ఇన డైరెక్ట్ గానో చాలా వాటిలో వీళ్ల భాగస్వామ్యం ఉంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ల టైం లో మీరు అంబానీ తనయుడిని చూశారా. భారీ కాయంతో ఉన్న ఆ అంబానీ వారసుడి పేరు అనంత్ అంబానీ. చిన్నప్పటి నుంచి అతి గారాబం కారణంగా, కాస్త ఒళ్లు చేశాడు. అతని వెయిట్ గురించి కామెంట్స్ చేయవద్దని, అప్పట్లో ముఖేష్ అంబానీ మీడియాకు రిక్వెస్ట్ లు, ఆర్డర్లు కూడా పాస్ చేశాడు. లేటెస్ట్ గా ఈ అనంత్ అంబానీ 70 కేజీల బరువును తగ్గించేశాడు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో మీరే చూడండి.   అంతకు 140 కేజీలున్న వాడు కాస్తా, ఇప్పుడు 70 కేజీలకు వచ్చేశాడు. తాజాగా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయానికి దర్శనానికి వచ్చిన అంబానీని చూసి, అందరూ షాకయ్యారు. ఒక అమెరికన్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలోనే, కష్టపడి తన బరువును కరిగించాడట అనంత్ అంబానీ. అనంత్ కాకుండా ముఖేష్ అంబానీకి ఆకాశ్ అంబానీ , ఇషా అంబానీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

టీం ఇండియా బోణీ, చితగ్గొట్టిన కోహ్లీ

  టి20 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్ధి పాక్ పై కష్టమైన పిచ్ మీద కూడా అద్భుతంగా రాణించాడు కోహ్లీ. తనను ఛేజింగ్ కింగ్ అని ఎందుకంటారో ప్రూవ్ చేసుకున్నాడు. తనకు అలవాటైన చివరి బాల్ సిక్స్ బదులు, లాస్ట్ బట్ వన్ బంతిని సిక్స్ కొట్టి ధోని లాంఛనాన్ని పూర్తి చేశాడు. నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా నిలిచి గెలిచింది.18 ఓవర్లలో 119 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 6 వికెట్లతో గెలుపొందింది. విరాట్ పోరాటం అతని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుంది. కష్టమైన పిచ్, పాకిస్థాన్ తో మ్యాచ్, పెవిలియన్ కు క్యూ కడుతున్న సహచరులు, ఇలాంటి సమయంలో టీం కు ఇరుసులా నిలిచి 37 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు కోహ్లీ. ఒకానొక టైం లో, న్యూజిలాండ్ మ్యాచ్ రిపీట్ అవుతుందని భారత అభిమానులు భయపడినా, కోహ్లీ ఉన్నంత వరకూ ఏం కాదులే అన్న భరోసాతో ఉన్నారు. నిజంగానే కోహ్లీ తనకు అలవాటైన రీతిలోనే మళ్లీ ఇండియాను గెలిపించాడు. 18 ఓవర్ల ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారత అద్భుత బౌలింగ్ వల్ల 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ లో అహ్మద్ షెహజాద్ (25), షోయబ్ మాలిక్ (26), ఉమర్ అక్మల్ (22) రాణించారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, జడేజా, రైనా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. టీం ఇండియా ఇన్నింగ్స్ లో రోహిత్ (10, 11 బంతుల్లో) అనవసర షాట్ కు అవుటైతే, ధావన్ (6, 15 బంతుల్లో) పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ ఎప్పటిలాగే, తన ఛేజింగ్ కింగ్ పేరును నిలబెట్టుకున్నాడు. అతని 55 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. యువరాజ్(24, 23 బంతుల్లో) ఫామ్ లో ఉన్నట్టే కనిపించినా, త్వరగా గేమ్ ను ముగించే ప్రయత్నంలో అవుటయ్యాడు. చివర్లో వచ్చిన ధోనీ (13, 9 బంతుల్లో) నాటౌట్ గా నిలిచాడు. ఓవరాల్ గా పాయింట్స్ పట్టికలో అకౌంట్ ఓపెన్ చేసిన టీం ఇండియా,రెండు మ్యాచ్ ల్లో, ఒక గెలుపు, 2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్ లూ గెలిచిన న్యూజిలాండ్ టాప్ లో ఉండగా, రెండు మ్యాచ్ లాడి ఒకటే గెలిచి పాయింట్లలో ఇండియాతో సమానంగా ఉన్నా, మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది పాకిస్థాన్. నాలుగు ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ రెండు టీమ్ లు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు.

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా

  వరల్డ్ టి20లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో టీం ఇండియా టాస్ గెలిచింది. బహుశా డ్యూ గురించిన ఆలోచన ఉందో ఏమో గానీ, ఛేజింగ్ నే ఇష్టపడ్డాడు ఇండియా సారధి. మొదట బౌలింగ్ తీసుకున్నాడు. మరో వైపు తమ టీం బాగా ఆడుతుందనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు ఆఫ్రిది. తన టీం మీద విశ్వాసముంచాడు ధోనీ. ఏ మార్పులు చేయకుండా అదే టీంతో బరిలోకి దిగుతున్నాడు. పాకిస్థాన్ కూడా గత మ్యాచ్ లో గెలిచిన టీం లో స్పిన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం ను తప్పించి మొహమ్మద్ సమీని తీసుకుంది.కాసేపట్లోనే మ్యాచ్ మొదలుకానుంది. మ్యాచ్ ను 18 ఒవర్లకు కుదించారు.

వర్షం కారణంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లేట్

  కోల్ కతా లో దాయాదుల పోరు ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంటే, వర్షం ఆ ఎదురుచూపులను మరింతగా పెంచింది. టాస్ తో పాటు మ్యాచ్ ను కూడా అరగంట ముందుకు జరిపారు. గుడ్ న్యూస్ ఏంటంటే, నిజంగా ఎనిమిదింటికల్లా మ్యాచ్ మొదలైపోతే, ఫుల్ కోటా ఓవర్లతో మ్యాచ్ జరగడం కన్ఫామ్. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయింది. కోల్ కతా వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ మ్యాచ్ గురించే చర్చ వినిపిస్తోంది.   కేవలం దాయాదుల పోరు మాత్రమే కాక, ఈ మ్యాచ్ గెలవడం భారత్ కు అత్యావశ్యకం కూడా. అందుకే ఇది టీం ఇండియా అభిమానులకు చాలా ఉత్కంఠ కలిగించే మ్యాచ్ గా మారింది. పిచ్ బ్యాటింగ్ ట్రాక్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ ను ఎంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరో వైపు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా పాకిస్థాన్ విమెన్ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డొచ్చాడు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్ టీం 2 పరుగులతో గెలుపొందింది. మెన్ ఇన్ బ్లూ మాత్రం, ఆ ఫలితాన్ని ఇక్కడ రానివ్వకుండా జాగ్రత్త పడతామంటున్నారు. కాసేపట్లోనే సమరానికి తెరలేవనుంది.

మ్యాచ్ జరుగుతుందోచ్.. దేశ వ్యాప్తంగా పూజలు..

టీ 20 భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ జరుగుతుందా.. లేదా అన్న అనుమాలకు తెర పడింది. అయితే అలాంటి సందేహాలు ఏం వద్దు.. మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సిబ్బంది తెలిపారు. ఈరోజు ఉదయం కోల్ కతాలో భారీ వర్షం కురవడంతో ఈ అనుమానాలు తలెత్తాయి. మరోవైపు ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా ఈ మ్యాచ్ ఫీవర్ పీక్స్ కి వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. కొంత మంది ఏకంగా ఇండియా గెలవాలని పూజలు కూడా చేసేస్తున్నారు. మరి ఇంకో రెండు గంటల్లో జరగబోయే మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరు విజయ కెరటం ఎగరేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇక రెండో హరిత విప్లవం- మోదీ

  వ్యవసాయంలో అనూహ్య మార్పులు వచ్చేందుకు రెండో హరిత విప్లవం రానున్నదని మోదీ తెలిపారు. అయితే మొదటి హరిత విప్లవం సాగు నీరు మీద ఆధారపడితే, రెండో హరిత విప్లవం సాంకేతికతతోనే సాధ్యమని పేర్కొన్నారు. దిల్లీలో జరుగుతున్న ‘కృషి ఉన్నతి మేళా’లో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మార్పు రావాలంటే అది గ్రామస్థాయిలోనే సాధ్యమనీ, అలాంటి మార్పు ఒక్క రైతుల వల్లే జరగుతుందనీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకోసం వ్యవసాయ పద్ధతులలో సమూలమైన మార్పులు రావాలని సూచించారు. వ్యవసాయానికీ, పేదలకూ, గ్రామీణాభివృద్ధికీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే... ఈ ఏడాది బడ్జెట్‌ను అందరూ మెచ్చుకుంటున్నారని మోదీ అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ‘కృషి ఉన్నతి మేళా’లో రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాల గురించి పలు శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. అంతేకాకుండా దాదాపు 500 కంపెనీలు, తమ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శిస్తున్నాయి.

ఇండియా గెలిస్తే ముందు.. అఫ్రిదీ సెంచరీ కొడితే వెనుక చూపిస్తానంటున్న మోడల్..

ఈ మధ్య క్రికెటర్లకు మోడళ్లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. మొన్ననే పాకిస్థాన్ మోడల్ ఒకామె.. భారత్-పాక్ మ్యాచ్లో పాక్ కనుక గెలిస్తే స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆఫర్ల జాబితాలో మరో మోడల్ చేరిపోయింది. ముంబై మోడల్ అర్షి ఖాన్.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే తన శరీరం వెనుక భాగాన్ని చూపిస్తానంటూ పేర్కొంది. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ షాహిది అఫ్రిదీ సెంచరీ సాధిస్తే తన శరీర ముందు భాగాన్ని చూపిస్తానంటూ ట్విట్టర్‌లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు. కాగా టోర్నీలో భాగంగా ఈరోజు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-పాకిస్ధాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో ఎవరూ గెలుస్తారో..?

మళ్లీ రాజకీయాల్లోకి మోహన్ బాబు.. ఏపార్టీలోకి.?

  ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఈరోజు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఓ పత్రికా ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన తన రాజకీయ ఎంట్రీపై మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో మోహన్ బాబు టీడీపీ లో ఉండేవారు. అయితే పార్టీనుండి బయటకు వచ్చిన తరువాత మాత్రం మోహన్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. దీంతో ఇప్పుడు బీజేపీలో చేరుతారా..? లేక వైసీపీ లో చేరుతారా అన్న సందేహాలు వస్తున్నాయి.   ఇదిలా ఉండగా ఈ మధ్యనే కాపు ఐక్య గర్జన కోసం ఉద్యమం చేపట్టిన ముద్రగడను విష్ణు కలవడంతో అప్పుడే దీనిపై చర్చ జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం తమకు చిరకాల మిత్రుడని, విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడని, తన సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు. మరి తాను ఏ పార్టీలో చేరతారో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే

జుకెర్ బర్గ్ పై విమర్శలు.. ట్యాంకులతో తొక్కించిన ప్లేస్ లో పర్యటిస్తావా..?

ఫేస్ బుక్ పై చైనాలో నిషేదం విధించిన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ అధినేత జుకెర్ బర్గ్ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జుకెర్ బర్గ్ పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జుకెర్ బర్గ్  ప్రపంచ దేశాల్లో రోజుకో మైలు చొప్పున పరుగెత్తడం వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకున్నారు.  దీనిలో భాగంగానే.. ఆయన తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించారు. అయితే అక్కడ పెరిగెత్తిన దృశ్యాన్ని అక్కడి నుండే పోస్ట్ చేయడంతో విమర్శలు తెలెత్తుతున్నాయి. ఆ విమర్శలు ఏంటంటే.. * ఫేస్‌బుక్‌ను నిషేధించిన దేశంలో దాని అధిపతి పర్యటించడమా? *  26 ఏళ్ల క్రితం వేలాది మంది విద్యార్థులను ట్యాంకులతో తొక్కించిన తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించడం ఏమిటి *  ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ప్రజలను కస్టమర్లను చేసుకోవడం కోసం జుకర్‌బర్గ్ చైనా ప్రభుత్వం గడ్డికరుస్తున్నారు. *  ప్రపంచ కాలుష్య నగరాల్లో నెంబర్ వన్‌గా నిలిచినా బీజింగ్‌లో ముఖానికి మాస్క్ కూడా లేకుండా తిరుగుతున్నావా? అంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు.

రైతుల కష్టాల్లో తోడుగా మేమున్నాం.. మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో నిర్వహిస్తున్న కృషీ ఉన్నతి మేళాను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..రైతుల కష్టాల్లో త‌మ ప్ర‌భుత్వం పాలుపంచుకుంటుంద‌ని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగువేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అంతేకాదు సాంకేతికతను కూడా రైతులు ఉపయోగించుకునేలా అందరికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని.. ఆ సాంకేతిక‌త అందరికీ చేరవేస్తామ‌ని అన్నారు. తాము రైతులకు ఏం చేయాలని పూనుకున్నామో అవన్నీ తప్పక చేస్తామని.. రైతులు ఆనందంగా ఉండాలంటే వేస‌విలోనూ నీరు పుష్కలంగా ఉండాలన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధిని వారే చేసిన‌ట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టారు కానీ రైతులకు మాత్రం నీరందలేదని విమ‌ర్శించారు.

పవన్ కల్యాణ్ కంటే ప్రభాసే గొప్ప.. వర్మ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల రేపు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా రాంగోపాల్ వర్మ పవన్ కు ఓ సలహా ఇచ్చారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయడంపై మరోసారి ఆలోచించాలని చెప్పాడు. అంతేకాదు.. బాహుబలి సినిమాతో ఈ సినిమాని ముడిపెట్టి సహహాలు అంటూనే బాగానే కామెంట్లు విసిరారు. బాహుబలి సినిమాలో విషయం ఉంది కాబట్టి..విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ అని.. అలాంటి సినిమాకి తగ్గ విషయం సర్దార్ గబ్బర్ సింగ్ లో ఉండాలని సూచించాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్  స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు.. బాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కంటే ప్రభాసే గొప్ప అని.. ఆఖరికి 'బాహుబలి'తో పోలిస్తే 'సర్దార్ గబ్బర్ సింగ్' గొప్ప సినిమా కాదని తేల్చిచెప్పాడు. మరి ఇప్పటికే పవన్ పై అనేక సార్లు కామెంట్లు విసిరిన వర్మ పై ఫ్యాన్స్ కోపంతో రగలిపోతున్నారు.. మరి ఈ మాటలకు ఎలా స్పందిస్తారో.. ముఖ్యంగా పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అసదుద్దీన్‌కు గాంధి మనవడి మద్దతు

‘నా పీక మీద కత్తి పెట్టినా కూడా భారత్‌ మాతాకీ జై అనను’ అంటూ మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే! దేశంలోని పార్టీలన్నీ ఏకతాటిన అసదుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించాయి. జావేద్‌ అక్తర్‌, షబానా ఆజ్మీ, తస్లీమా నస్రీన్‌..... ఇలా ఒకరి తరువాత ఒకరు ఆయన వ్యాఖ్యలను తూర్పారపట్టారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అసదుద్దీన్‌కు ఓ అనుకోని మద్దతు లభించింది. జాతిపిత గాంధి మనవడైన రాజ్‌మోహన్‌ గాంధి ‘దేశభక్తి నినాదాలను చేయాలని ఒకరిని బలవంత పెట్టలేమంటూ’ వ్యాఖ్యానించారు. అంతేకాదు! అలా బలవంత పెట్టే శక్తులను వ్యతిరేకించకపోతే గాంధి, ఆచార్య కృపలానీ, సర్దార్‌ పటేల్‌ వంటి పెద్దల సిద్ధాంతాలను అగౌరవపరిచినట్లే అని చెప్పుకొచ్చారు. నిన్న గుజరాత్‌లో ఆచార్య కృపలానీ స్మారక ఉపన్యాసాన్ని ఇస్తూ రాజ్‌మోహన్‌ ఈ వ్యాఖ్యలను చేశారు. ఇప్పడు రాజ్‌మోహన్‌కు ఎవరు బదులు చెబుతారో మరి!

అబ్బాయి కడుపులో గర్భసంచి.. ఎక్కడ..?

  కొన్ని కొన్ని సార్లు కొన్ని సంఘటనలు వింటే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అయితే వినడానికి అవి విచిత్రంగా ఉన్న.. నిజం కాబట్టి నమ్మక తప్పదు. అలాంటి విచిత్రమైన ఘటనే తెలంగాణలో జరిగింది. సాధారణంగా గర్బసంచి అనేది ఆడవారిలో ఉంటుంది..కాని ఇక్కడ సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఓ అబ్బాయి కడుపులో గర్భసంచి అభివృద్ధి చెందింది. వివరాల ప్రకారం.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపెల్లి గ్రామానికి చెందిన కుర్ర శేఖర్, భారతిలకు వేణు కొడుకు. అయితే వేణుకు చిన్నప్పటి నుండి ఆడపిల్లల లక్షణాలు కనిపించాయి. దీంతో వేణు తల్లి దండ్రులు అతనిని పలు ఆస్పత్రులకు తిప్పేవారు. ఈక్రమంలోనే ఇటీవల ముస్తాబాదులోని పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ వేణు  కడుపులో గర్భసంచిని గుర్తించారు. హిమోప్రోడిజం అనే వ్యాధి వల్ల వేణులో ఆడ, మగ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయని శంకర్ అనే వైద్యుడు తేల్చారు. ఆ తర్వాత వేణుకు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గర్భసంచిని తొలగించారు.